Thursday, March 23, 2017

కమ్ముకొస్తున్న యుద్ద మేఘాలు - కిం కర్తవ్యం

ఈ దేశంలో ఏనాడు ముస్లిం లీగ్‌ పురుడుపోసుకుందో, ఆనాడే ఈ దేశ భవిషత్తుకు అభద్రతా పురుడుపోసుకుంది. భారతీయులుగ, ఆంగ్లేయుల్ని ఇటనుండి వెళ్ళగొట్టి అన్నదమ్ములుగ కలిసి ఉండాల్సిన ఈ దేశస్తులు మత ప్రాతిపదికన రెండుగా చీలిపోయారు. ముస్లింలు ఈ దేశంలోని వివిధ దైవ విశ్వాసాలలో, ఒక విశ్వాసానికి చెందిన వారుగా మిగిలిన వారిలా ఇక్కడ కలసి ఉండలేకపోయారు. పైగా ఆనాటికి ఇక్కడున్న ముస్లింలందరూ దాదాపుగా మతం మార్చుకుని ముస్లింలైనవారే. ఈ దేశాన్ని సొంత దేశంగా తలచిన వాళ్ళే కదా! మరెందులా జరిగింది?. కారణమేమిటి? ఈ దేశంలో ఏకేశ్వరారాధకులున్నారు. బహుదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో ఒక నిర్ణయానికిరాని, రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ ఉన్నారు. వారిలో ఎవ్వరికీ, తమ విశ్వాస మూలకంగా వేరు దేశంగా విడిపోదామన్న ఆలోచన పుట్టనేలేదెన్నడూ. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే వివిధ పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన అట్టి రాజ్యాలు ఏర్పడడంగానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడంగానీ జరగనేలేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావనిగానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని అనిగాని తలుస్తుండేవాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ, జీవితానికి అవసరంలేనివి అనే దృష్టికల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. అత్యంత ప్రధానమూ, ప్రాధమికమూ అయిన ఈ నిజాన్ని మొదట గుర్తించాలి మనమంతా.

సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళమధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులు - గానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు.

ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది. ఏనాడైతే ఈ దేశంలో క్రైస్తవం అడుగుపెట్టిందో ఆనాటి నుండే 1) అటు క్రైస్తవంలోకి పోయినవారూ, వీరిని అటు లాక్కెళ్ళిన వారూ 2) తమ నుండి క్రైస్తవంలోకి వెళ్ళిన వారిని మతం మార్చుకున్న వారినిగానూ, విదేశీ మతాన్ని స్వీకరించిన వారినిగా, తలంచుతున్న ఇక్కడి నానా విశ్వాసాల వారూ కూడా పరస్పరం పరాయిభావనతో తమవారు, పరాయివారు అన్నదృష్టితో చూసుకోవడం ప్రారంభించారు. అందుకు బలమైన కారణం క్రైస్తవ్యానికి ఆధార గ్రంథంగా ఉన్న బైబిలు వాక్యాలలోనే, స్వజనులు - అన్యజనులు అన్న భావన బలంగా ప్రతిపాదింపబడి ఉండడమే. పైగా అందులో ఎహోవాను తప్ప అన్యులను ఆరాధించరాదన్న ఆదేశాలూ, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు అవిశ్వాసులుగానూ, సాతాను పక్షం వారిగనూ, శతృవులుగానూ చూడాల్సిందే నన్న ఆదేశాలూ ఉండడం వల్లనూ, బైటికి ఇరుగుపొరుగుగా కొనసాగుతున్నా, లోలోపల మాత్రం బైబిలు విశ్వాసం ఎంత బలంగా ఉన్నదన్న దాన్ని బట్టి అంతగానూ క్రైస్తవేతరుల పట్ల వ్యతిరేకత పేరుకుంటూనే వచ్చింది. అయినా, అప్పట్లో, క్రైస్తవులు తమకంటూ ప్రత్యేక రాజ్యం ఉండాలన్న వైఖరిని కనబరచలేదు. ఈ నిజాన్ని చాలా స్పష్టంగా గమనించారు కనుకనే ఒక హిందువు మతం మార్చుకోవడమంటే హిందువు ఒకడు తగ్గడం కాదు. హిందూ వ్యతిరేక - శతృవు - ఒకడు పెరగడమని అర్ధం. అన్నాడు వివేకానంద.

ఇదంతా ఒక అంకం కాగా, భారత స్వతంత్ర పోరాటం ఒక ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ముస్లింలంతా వేరుగా ఉండడానికే - ముస్లింలలోని బలమైన వర్గం సిద్దపడడం, అన్నది మరో స్వభావం కలిగిన ఇంకో అంకం. వారెందుకని అలాటి నిర్ణయం తీసుకున్నట్లు...?!

ద్విజాతి సిద్దాంతం అంటే రెండు మతాలననుసరించి, రెండు సమూహాలుగా దేశ ప్రజలను విడదీసే సిద్దాంతం - తెరపైకి బలంగా ముందుకొచ్చి, ఆ ప్రాతిపదికనే, ఒక్కటిగా ఉండాల్సిన దేశం రెండుగా విడివడింది అదీ ఎలా?

ముస్లింలు ఒక్కరూ ఒక జాతి, భారత దేశంలో మిగిలిన వారందరూ ఒక జాతి. హిందూ - ముస్లిం అన్న పేరున్నే, ద్విజాతి సిద్దాంతం ప్రబలంగా ముందుకొచ్చింది. ఇదెంతటి విడ్డూరం? విషాదకరం? అవివేక జనితం? ఆనాటి ఆ స్వార్ధపరులైన మేధావుల తప్పుడు నిర్ణయం యొక్క ఫలితాలను గత డెబ్బై ఏండ్లుగా అనుభవిస్తూనే వచ్చిందీ దేశం. ఈనాటి ఉద్రిక్త పరిస్థితీ, ఆ ద్విజాతిలోని ముస్లిలంతా ఒకేజాతి అన్న ప్రాతిపదికనుండే తన్నుకొచ్చింది. ఈనాడున్న జనాభాను బట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ''జనాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) ప్రకారం నిర్ణయించుకుందాం'' అన్న కుట్రపూరిత వాదాన్ని ముందుకు తెస్తోంది పాకిస్తాన్‌. దానికి ఈ దేశంలోని మతిమాలిన అదోరకం మేధావి వర్గం (అమ్ముడుపోయిన అందామా?) వంతపాట పాడుతూ వస్తోంది.

నిజానికిది పాక్‌ భారత్‌ దేశాల సమస్య కానే కాదు. కాశ్మీర్‌ - భారతీయుల అంతర్గత సమస్య మాత్రమే. అయితే రష్యా, అమెరికా, చైనాలు వాటిమధ్య నెలకొనిఉన్న వాస్తవ పరిస్థితులు దృష్ట్యా, భారత్‌ - పాక్‌లతోనూ, అలాటి మరికొన్ని దేశాలతోనూ రాజకీయ ప్రయోజనాల రీత్యా, తమ ప్రాబల్యం నిలుపుకోవడానికి కొరకై శత్రుమిత్ర, అలీన వైఖరిని అవలంభిస్తూ వచ్చాయి. వస్తున్నాయి. భారత్‌ - పాక్‌ సరిహద్దు సమస్య ఒక కొలిక్కి రాకుండా, రావణ కాష్టంగా రగులుతుండడానికి అంతర్జాతీయ సంబంధాలు న్యాయ బద్దంగా లేకపోవడమూ ఒక కారణమేనన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఒక ప్రాంతంలో అధిక జనాభాగా ఉన్నవారు కోరితే (దేశాన్ని ముక్కలు చేయవచ్చన్నమాట! చేయాల్సిందేనన్నమాట! క్రైస్తవులంతాగానీ, సిక్కులంతాగాని అధికాధికంగా ఒక ప్రాంతానికి చేరి మైనారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం తాము అఖండ భారత్‌ నుండి విడిపోతామంటే, అంగీకరించి వారినీ వారి ప్రాంతాన్ని విడగొట్టి ఉండండనాలన్న మాట. ఎంత వికృతమైన ఆలోచన ఇది? భారత్‌ రాజ్యాంగ స్ఫూర్తికి ఎంత విరుద్దమైన మాట ఇది?! ఎంత మంది కోరినా దేశాన్ని ముక్కలు మాత్రం చేయనేకూడదు.

ఈ దేశంలోని క్రైస్తవులకుగాని, ముస్లింలకుగానీ, తెగ ఎదిగిన వాళ్ళమంటుండే అనుకుంటుండే వామపక్ష, నాస్తిక, హేతువాద మేధావులకుగానీ ఇంత ప్రమాదకర సమస్య నెత్తిమీది కొచ్చికూర్చున్నా, అసలు సమస్యగానే కనపడదెందుకని? ఈ దేశ ముస్లింలు భారతీయులుగారా? వారికి ఈ దేశం పట్ల ప్రేమ, దేశ భద్రత పట్ల ఆందోళన ఉండక్కర లేదా? వారెందుకని ఏ కోన్ముఖంగా హమారా భారత్‌ మహాన్‌ అని ఎలుగెత్తి నినదించరు? జాతీయ పతాకానికి నమస్కరించడం తమ మత విశ్వాసానికి విరుద్దమంటూ ఏవేవో అడ్డగోలు వాదనలు చేయడమెందుకు?

దేశాన్ని ప్రేమించడానికీ, జాతి ప్రతీకలను గౌరవించడానికీ, ''అల్లా తప్ప ఆరాధ్యుడు లేడు'' అన్న సూక్తిని తెచ్చి అడ్డుపెట్టుకోవడమెందుకు? తండ్రికి నమస్కరించమా? తల్లికి నమస్కరించమా? పెద్దలకు నమస్కారమనమా? యజమానికీ, మిత్రులకు సలామనమా? ఇందరికి సలామనగాలేంది, దేశానికి, దేశ ప్రతీకలకు సలాం అనడం దగ్గరే 'అల్లా' ఎందుకు అడ్డొస్తున్నాడు? దేశాన్ని, పెద్దలను, దేశ ప్రతీకలను గౌరవించడాన్ని, అల్లాకంటే వేరైన వాటిని ఆరాధించడం అన్న తప్పుడు వివరణతో వ్యతిరేకించడమెందుకు? ప్రేమించడాన్ని - ఆరాధించడంగా తప్పుడు అర్ధాన్ని పులమడమెందుకు? ఒక ముస్లిం మక్కాను పవిత్ర స్థలంగా చూస్తాడా? లేదా? దానిని ప్రేమిస్తాడా, లేదా? అక్కడున్న నల్లబండను ఇతర బండలకంటె వేరుగా తలచుతాడా లేదా? అలాగే ప్రవక్తను ఇతర మనుషుల కంటె వేరుగా చూస్తాడా, లేదా? అతణ్ణి కుటుంబీకుల కంటె అధికంగా ఇష్టపడతాడా, లేదా? గౌరవిస్తాడా లేదా? విధేయత కనపరుస్తాడా, లేదా? నా కంటె ఈ లోకంలో నీకు అధిక ఇష్టుడుండరాదన్న ప్రవక్త మాటనేమి చేద్దాం? కనుక అల్లాను, ఖురానును చూపించి, రాజ్యాంగం పట్లా, ఈ దేశం (ఉంటూ, తింటూ) పట్లా; దేశ ప్రతీకల పట్లా విధేయతను కనపరచకపోవడం తప్పుడు పోకడే అవుతుందెవరికైనా.

ఈ దేశంలో పుట్టి, ఇక్కడే, పెరుగుతూ ఉన్న ఎవరికైనా ఈ దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉందా? లేదా? అది వారి విధి కాదా? కర్తవ్య కర్మ కాదా? ఈ దేశం కంటే మక్కానో, ఈ దేశంకంటే బెత్లహాంనో, రోంనో, మరో దాన్నో అధికంగా ప్రేమించే వారినేమనాలి? ఏమనుకోవాలి. వాటి యందలి వీరాభిమానం వల్ల, ఈ దేశానికి అపకారం చేయడానికీ వెనకాడని, సిద్దపడే వారిని, ఈ దేశస్ధులుగా ఎలా చూడాలి? అట్టి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి? మిత్రులారా! నా ఈ మాటలు ఆవేశాన్ని రేకెత్తించేందుకు వాడుతున్నవికావు. ఆవేశంతో లోలోపల శివాలెత్తిపోతున్న వారి ఆవేశాలను అదుపులోకి తేవడానికి ఉద్దేశించినవి మాత్రమే.

రాజ్యాంగ ప్రస్తావనలో దేశం సమైక్యంగా, అఖండంగా, సమానత్వం లక్ష్యంగా ముందుకు సాగాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామో? అదంతా పుస్తకాలకు పరిమితమైందేనా? ప్రతి భారత పౌరుడూ, కుల, మత, ప్రాంత, లింగ, వర్గాలకతీతంగా పై లక్ష్యసాధనకు త్రికరణ శుద్దిగా తనవంతు విధిని నిర్వర్తించాలావద్దా? ఎట్టి గుంజులాటలూ లేకుండా తెల్చి చెప్పాల్సిన అంశమిది.

దేశం ఏమైపోయినా పరవాలేదు అనుకునే వారి పట్ల రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించాల్సి ఉంది? అలాటివారిని, ఉంటే దేశం పట్ల, రాజ్యాంగ నిర్ధేశాల పట్లా విధేయత కలిగి ఉండండి. లేకుంటే మీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళిపోండి. అదిన్నీ ఇప్పటి వరకు దేశం నుండి మీరు పుచ్చుకున్న దాన్ని లెక్క చూసుకుని తిరిగి ఇచ్చేసి వెళ్ళండి. ఒక వేళ మీలో ఎవరు గానీ దేశానికే అదనం ఇచ్చి ఉంటే అదంతా తీసుకునే వెళ్ళవచ్చు అంతేకాని, దేశాన్ని ఇష్టపడకుండా, దేశం పట్ల మీ వంతు కర్తవ్యాన్ని స్వీకరించకుండా, మరో దేశాన్ని ఇష్టపడుతూనో, మరో దేశపు ఆదేశాలను పాటిస్తూనో ఇక్కడే ఉండడం తిన్న, తింటున్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం లాటిదే. ఆ వైఖరి దేశభక్తి లేకపోవడాన్ని మాత్రమేకాక, దేశద్రోహి లక్షణం కలిగుండడాన్నీ సూచిస్తుంది. దేశ ద్రోహులుండడాన్ని ఏ దేశమూ సహించదు. సహించకూడదు.

ఈ సందర్భంలో మరొక్కమాట చెప్పుకుంటేనే ఈ వ్యాసానికి నిస్పాక్షికత సిద్దిస్తుంది. తమ తమ మత విశ్వాసాలను వ్యక్తిగతమైనవిగా భావించి, దేశం విషయంలో, దేశానికిగాని రాజ్యాంగాశయానికి గానీ, దేశ ప్రజలకుగానీ, ఎటువంటి ఆపద వచ్చినా లేదా వస్తుందనుకున్నా ఆ సందర్భాలలో దేశ రక్షణకు, భద్రతకు ప్రధమ గణ్యతనిచ్చి దేశం కోసం, దేశం కోసమే స్ధిరంగా నిలబడే వాళ్ళు, దేశం పక్షాన మాట్లాడే, పనిచేసేవాళ్ళు అన్ని మతాల, ధోరణుల వారిలోనూ కొద్దిమంది ఉన్నారు. అలాటి వారు ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. మనం అట్టి వారిని చూపి సమస్య వాస్తవ పరిస్థితిని, తీవ్రతను చిన్నది చేసే పని చేయనే కూడదు. ఆయా సమూహాలలో సింహభాగం - మెజారిటీ - వైఖరి ఎలా ఉందన్నదే పరిగణనలోకి తీసుకుంటుండాలి. కనుక ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికి సిద్దంగా ఉండే, ముస్లిం, క్రైస్తవాది సకల ధోరణులలోని అతికొద్ది మందిని ఆధోరణికి ప్రతీకంగా చూడనేకూడదు. అట్టి వారి ప్రవర్తనను, ఆ ధోరణి వారి ప్రవర్తనకు రుజువుగా చూపనేకూడదు. నిజానికి ఆ రకం కొద్ది మంది ఆ మత ధోరణికి చెందిన మనస్సుకంటే, ఉన్నత మానసిక స్థితిలో ఉన్నవారే. కనుక వారిని హిందువు కనక దేశభక్తుడు, ముస్లిం కనక దేశభక్తుడు, క్రైస్తవుడు కనక దేశభక్తుడు అనో అననే కూడదు. అట్టి వారంతా మత విశ్వాసాలకతీతంగా 'దేశభక్తులు' అన్న నిజాన్ని మనం గమనించాలి. ఈ వ్యాసం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది 130 కోట్ల భారతీయులు తమ తమ మతాల, విశ్వాసాలకతీతంగా, దేశభక్తులుగా ఉండాలని, ఉండి తీరాలన్న ఒకే ఒక్క వాస్తవాన్నే. నిజానికి ''దేశానికన్నమిన్న లోకాన లేదురా'' అన్న ఓ కవి అద్భుత భావన ఈ దేశస్తులకు మాత్రమే వర్తించేది కాదు. కాకూడదు. నిజానికి, ఆ భావన సార్వత్రకమైన విలువ కలిగినది అంటే ఏ కాలంలో, ఏ దేశంలో ఉన్న ఎవరికైనా సమానంగా వర్తిస్తుంది. అంత విలువైన మాట అది. దాని అన్వయాన్నిలా చెప్పుకోవచ్చు.

అమెరికా పౌరసత్వాన్ని పొందిన ఏ మతస్థుడు గానీ, గతంలో అతడెక్కడున్నవాడైనా, ఎక్కడనుండి అమెరికా చేరి పౌరసత్వం పొందిన వాడైనా, పౌరుడైన నాటి నుండి ప్రపంచంలోని మిగిలిన ఏ దేశం కంటేనూ అమెరికానే అధికంగా ఇష్టపడాలి. అమెరికా అభివృద్దికీ కృషి చేయాలి. అమెరికా తరఫునే నిలబడాలి. అమెరికాను కాదని మరే దేశానికీ అనుకూలంగా ప్రవర్తించనేకూడదు. ముఖ్యంగా అమెరికా ప్రతికూల - శత్రు- సంబంధాలున్న దేశాలతో. ఇది నిజమా? కాదా?

ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో ఉండే ఒక హిందువు అంటే హిందూమతంలోని ఏదో విశ్వాసాన్ననుసరిస్తున్న వాడు, పాకిస్తాన్‌కు - భారత్‌కు విభేదాలు పొడచూపితే పాకిస్థాన్‌ తరపునే నిలబడాలి. పాకీస్థానీగానే అతడు తన బాధ్యతలు నిర్వర్తించాలి. పాకీస్ధాన్‌ను ప్రేమించాలి. దానికి విరుద్దంగా ఆ దేశంలోని ఎవరు ప్రర్తించినా అది దేశ వ్యతిరేకమైనదీ దేశ ద్రోహ చర్యే అవుతుంది. అట్టి వైఖరిని మేధావులెవరు అంగీకరించరు. అంగీకరించకూడదు. ఏ దేశమూ తన దేశ పౌరసత్వం కలిగిన వ్యక్తులు, తనకు వ్యతిరేకంగా, మరో దేశానికి అనుకూలంగా ఉండే వైఖరిని అంగీకరించదు, సహించదు, అంగీకరించకూడదు. సహించకూడదు.

సర్వ సాధారణమైన ఈ సూత్రం అర్ధమైతేనే గాని అదే సరైనదని అంగీకరించితేనే గాని ఈ దేశంలోని, ఏ దేశంలోని- ఎవరు గాని ప్రవర్తిస్తున్న తీరు సరైందో కాదో నిర్ణయించడం సాధ్యపడదు.

ఈనాడు ఒక వ్యక్తి, అతడే దేశానికి చెందినవాడైతే, మునుముందుగా అతడా దేశపౌరుడు. అతనిపై ఆ పౌర బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతల్లో, విధులను నిర్వర్తిస్తుండడం, హక్కులను పొందుతుండడం - కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తుండడం అన్న మూడు చేరి ఉంటాయి. (హక్కులు - విధుల, బాధ్యతలు అన్న మూటినీ కర్తవ్య కర్మల క్రింద పేర్కొనీ వాస్తవాన్ని అర్ధం చేసికోవచ్చు. ఇక్కడ వివాద పడాల్సినంత అవసరం లేదు) ఆ తరవాతనే మిగిలిన ఏ విషయాలను గానీ పరిగణనలోకి తీసుకుంటుండాలి. అది - ఆ వైఖరిని - వ్యక్తులు స్వీయ నియంత్రణ కలవారై (స్వతంత్రులై) అనుసరించగలిగితే అట్టి సమాజాన్ని ఉత్తమ (వివేకవంతమైన) సమాజం అంటాము. అట్టి స్థాయిలేని వ్యక్తులున్న సమాజంలో వ్యక్తులు పరనియంత్రణ వల్లనైనా (వ్యవస్థ అదుపులో నుండైనా) అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడే సమాజం ఒక క్రమంలో ప్రశాంతంగా, అలజడులు లేని వాతావరణంలో సాగగలుగుతుంటుంది.

అత్యంత ప్రాథమికమూ, ఏ దేశానికైనా వర్తించే సర్వ సాధారణమూ అయిన ఈ సూత్రాన్ని, మన ప్రస్తుత దేశ సమస్యకు వర్తింప జేస్తే దాని ఆచరణ రూపంఎలా  ఉండాలి?

మును ముందుగా ఈ దేశంలోని 130 కోట్ల మందీ ఈ దేశ పౌరులు. అంటే భారతీయులు. అలాగే, ఈ దేశం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య విధానాన్ననుసరించి ఈ దేశ సంపద విషయంలోనూ, వ్యవహారాల విషయంలోనూ యజమానులు, యాజమాన్యపు భాగస్వాములు. సొంతదారులన్న మాట. యజమానితనానికి మూడు ప్రధాన లక్షణాలుంటాయి. సంపదపైనా, అది పుట్టించే ఫలితాల విషయంలోనూ -1) నిర్ణయాధికారము 2) పర్యవేక్షణాధికారము 3) లాభనష్టాలకు బాధ్యుడైయ్యుండడము.

గమనిక  : ఈ సందర్భంలో భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించిన, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారి మాటలు నిరంతరం స్మరించదగినవిగా, స్పురణలో ఉంచుకోదగినవిగ నా కనిపించాయి. ''40 సం|| కాలం స్వాతంత్య్ర యోధులు చేసిన త్యాగాల మూలంగా మనకు స్వతంత్రం వచ్చింది. వారు మనకు చిరస్మరణీయులు. వారు సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని నిలబెట్టడం మన ప్రథమ కర్తవ్యం. గతంలో మనలో జాతీయ భావమూ, సమైక్యతా లేని కారణం చేత స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుని అష్టకష్టాలను అనుభవించాము. భవిష్యత్తులో మనకు, మన దేశానికీ, అలాటి ప్రమాదం లభించకుండేట్లు మనమూ, భావితరములవారూ ప్రవర్తించడం అవసరం. నా గ్రంధం మూలంగా మనం నేర్చుకొనవలసిన గుణపాఠం ఇదే. ఇందుకుగానే, నేనీ గ్రంధాన్ని వ్రాశాను.

మిత్రులారా! ఇదే ఈవ్యాసం ద్వారా నేను చెప్పాలనుకున్నదీ. జాతీయ భావము, దేశ సమైక్యత అన్నదే దేశభద్రతకూ దేశాభివృద్దికీ ఆధార శ్రోతస్సులు. ఆ రెండూ ఉన్న వారే ఇక్కడ ఉండడానికి అర్హులు, ఈ దేశ సంపద విషయంలో న్యాయ బద్దమైన భాగస్వాములూ కాగలరు.

గతాన్ని తవ్వుకోవడం అనవసరం. అయితే, గతాన్ని యథాతధంగా గుర్తించకున్నా, గుర్తుంచుకోలేకున్నా, సరైన భవిష్యత్తుకు దారులు వేసుకోలేము. ఈ దేశంలో మతం ఆధారంగా ఏర్పడ్డ ద్విజాతి సిద్దాంతం, దాని వల్ల ఇక్కడ జరిగిన దారుణ మారణ కాండలను గమనికలోకి తీసుకోకుంటే, వర్తమాన పరిస్థితుల్లో అంటే మళ్ళీ మతం - రాజకీయంతో కలసి వికృత వేషాలు వేయడానికి ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో, ఏ నిర్ణయం, ఎలాటి నిర్ణయాలు భారత దేశ శ్రేయస్సుకు సరళమైన దారి చూపించగలుగుతాయో అలాటి నిర్ణయాలు తీసుకోలేము. నాకు తెలిసి ఆ పనిని సమర్ధవంతంగా చేయగలిగింది, జాతీయ భావనొక్కటే. మనమంతా ఎంతో ప్రమాదకరమైన మతపరమైన జాతి భావన నుండి బైటపడి, దేశపరమైన అంటే రాజ్యాంగ బద్దమైన జాతీయ భావన, సమైక్యభావన దగ్గర నిలబడి, ముక్త కంఠంతో, ఒకే గొంతుతో మేమంతా భారతీయులం, మా జాతి భారత జాతి, మా దేశం సమైక్య భారతదేశం అని కట్టకట్టుకుని నినదించాలి. కటిబద్దులమై ఒక్కటిగా నిలవాలి. అదొక్కటే మన మధ్యనున్న అంతర్గత వ్యత్యాసాల ప్రభావం నుండి మనల్ని నిలువరించి సమైక్యంగా ఉంచగలుగుతుంది.

అంబేద్కర్‌ - వాల్యూం - 8 (భారత దేశ విభజన)లో, జాతీయ నిస్పృహ అన్న వ్యాసంలో ''మీ దేశానికి ఎలాటి మహోన్నత భవితవ్యం ఉండాలని కోరుకుంటావు? అని ఏ భారతీయుణ్ణి అయినా అడిగారనుకోండి. జవాబు ఏమై ఉంటుంది?

ఈ ప్రశ్న ముఖ్యమైనది. జవాబు ఉద్బోధకంగా ఉండకతప్పదు.

ఇతర విషయాలన్నీ సమతూకంగా ఉండి, తన దేశమంటే గర్వపడే నికార్సయిన భారతీయుడు ''సమైక్య స్వతంత్ర భారత దేశమే నా ఆదర్శం, అదే భారత భవిష్యత్‌కి కావాలి'' అని అంటాడు. (ఇదెంతనిజమో) హిందువులూ, ముస్లింలూ ఉభయులూ కూడా ఇలాటి భవితవ్యమే ఉండాలని అనుకుంటే తప్ప ఈ ఆదర్శం ఒక పవిత్ర కామనగానే మిగిలిపోతుందన్న మాటా అంతే నిజం. అలా తప్ప దీనికి కార్యరూపం కార్యరూపం ఎన్నటికీరాదు. ఇది ఏదో కొందరి పవిత్రాశయం మాత్రమేనా లేక యావన్మందీ నడుం కట్టి సాదించాల్సిన లక్ష్యమా? 1993 ముద్రణ పే. 259 - సంపు(8)

నిజం చెప్పాలంటే బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్య్రం సాధించడంతోనే (మనపని) అయిపోదు. ఆ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడమనేకర్తవ్యం ఇంకా ముఖ్యమైనది (మిగిలే ఉంటుంది.) అయితే ఈ ముఖ్యమైన కర్తవ్యం మ్మీదే ఏకాభిప్రాయం ఉన్నట్లులేదు. ఏమైనా, ఈ విషయానికి సంబంధించి ముస్లింల వైఖరి అంత నమ్మకం కలిగించేట్లులేదు. భారత దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని తమనెత్తిన మోపుకోమని ముస్లిం నాయకులు శతదా చేస్తున్న ప్రకటనల ద్వారా విశదమవుతూనే ఉందీ విషయం.

సిల్హేట్‌లో 1939 జనవరి 27న మౌలానా అజాద్‌ శోభానీ చేసిన ఉపన్యాసంలోని భావాలు కూడా శ్రద్దగా గమనించదగినవి. ఒక మౌలానాగా రడిగిన ప్రశ్నకు జవాబుగా శోభాని ఇలా అన్నారు.

''ఈ దేశం నుంచి ఇంగ్లీషు వాళ్ళను తరిమెయ్యాలని చెప్పే ప్రముఖ నాయకుడెవరన్నా ఉన్నాడనంటే అది నేనే. అయినా ముస్లింలీగు నుండి ఇంగ్లీషు వాళ్ళతో పోరు ఉండకూడదని నా అభిప్రాయం. మనం చెయ్యాల్సిన పెద్దయుద్దం 22 కోట్ల హిందూ శత్రువులతోనే... వాళ్ళుగాని శక్తి సంపన్నులైతే ముస్లిం భారత్‌ని, క్రమేపీ ఈజిప్టుని, టర్కీని, కాబూల్‌ మక్కాల్ని, మదీనాని, యాజూజ్‌ మాజూజ్‌ లాటి ఇతర ముస్లిం మతాల్ని కబళించేస్తారు. (ఖురాన్‌లో ఉంది ప్రపంచ ప్రయళయం సంభవించడానికి ముందు వాళ్ళు భూమ్మీద ప్రత్యక్షమై దొరికిందాన్ని దొరికినట్లు మింగేస్తారట)

''ఇంగ్లీషు వాళ్ళు రాను రాను శుష్కించిపోతున్నారు. వాళ్ళురేపోమాపో భారతదేశం నుండి వెళ్ళిపోతారు. అందుచేత మనం ఇస్లాంకి బద్ద శత్రువులైన హిందువులతో పోరాడి వాళ్ళని బలహీన పరచకపోతే వాళ్ళు భారతదేశంలో రామరాజ్యం స్థాపించడమేకాదు, క్రమేపీ భూమండలమంతా వ్యాపిస్తారు. హిందువుల్ని బలోపేతుల్ని చేయడమో లేక నిర్వీర్యులను చేయడమో అనేది 9 కోట్ల మంది ముస్లింల మీద ఉంది. అంచేత హిందువులు ఇక్కడ స్థాపితం కాకుండా, ఇంగ్లీషువాళ్ళు నిష్క్రమించిన వెంటనే ముస్లిం పాలన స్థాపితమయ్యేందుకుగాను, ముస్లింలీగులో చేరి పోరాడడం ప్రతి పవిత్ర ముస్లింకీ తప్పనిసరి కర్తవ్యం.

''జాగ్రత్త! కాంగ్రేసులో ఉన్న మౌల్వీల వలలో పడకండి. ఏమంటే 22 కోట్ల హిందు శత్రువుల చేతిలో ముస్లిం ప్రపంచం ఎన్నటికీ భద్రంగా ఉండలేదు.'' ఇది మౌలానా అజాద్‌ శోభాని ఇచ్చిన ఉపన్యాసంలోని భావాలు.

శ్రీమతి అనిబిసెంట్‌ ముస్లిం సమస్యపై ఇలా అంటున్నారు.

''ఖిలాఫత్‌ ధర్మయుద్దాన్ని ప్రోత్సహించడం వల్ల భారతదేశానికి పెద్ద దెబ్చే తగిలింది'' విశ్వాస రహితులకు వ్యతిరేకంగా ముస్లింల మనోగత భావాలలో ద్వేషం ఉబికింది. గడచిన సంవత్సరాలలో మాదిరే లజ్జారహితంగా, నగ్నరూపంలో ఉందా ద్వేషం. ప్రత్యక్ష రాజకీయాలలో చోదకంగా పాత ముస్లిం కరవాలం మళ్ళీ ఊపిరి పోసుకోవడం చూశాం... జాజిరుత్‌ - అరబ్‌ అంటూ, అరేబియా ద్వీపాన్ని పవిత్ర భూమిగా చాటడం చూశాం... ఆఫ్ఘన్లు గనక భారత దేశం మీదికి దాడిచేస్తే, తమ మతస్తులు వాళ్ళతో చేతులు కలిపి, ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా దేశరక్షణకు పోరాడే హిందువుల్ని హతమారుస్తామని ముస్లిం నాయకులు చాటడం విన్నాం.

ముసల్మాన్లు మౌలికంగా తమ మాతృదేశానికి కాక, ఇస్లాం దేశాలకు విధేయంగా ఉంటారన్న దాన్ని చూడక తప్పలేదు. వాళ్ళకు ప్రాణప్రదమైంది దేవుని రాజ్యాన్ని స్ధాపించడం అని మనకు తెలియవచ్చింది. ఆ దేవుడు లోకపితగా సర్వప్రాణుల్ని ప్రేమించే దేవుడు కాదు. ప్రవక్తల ఆదేశాల ద్వారా ముసల్మాన్‌ కళ్ళద్దాల గుండా కనిపించే దేవుడు.

''తాము వశిస్తూ ఉన్న రాజ్యచట్టాన్ని మించి ఆఫలాన ప్రవక్త బోధనల్ని మన్నించాలని ముసల్మాను నాయకులు చేసే ప్రతిపాదన పౌరక్రమ శిక్షణకు, రాజ్య స్థిరత్వానికీ నాశనకరం (భంజకం) దాని వలన వారు దుష్ట పౌరులవుతారు. ఏమంటే వాళ్ళ భక్తి ప్రపత్తులు దేశం వెలుపట ఉన్నవాటి పట్ల ప్రదర్శితమవుతాయి.''

''భారతదేశంగనక స్వతంత్య్రమైతే, జనాభాలో ముస్లిం విభాగం భారతదేశ స్వాతంత్య్రానికి ప్రత్యక్షంగా ప్రమాదకరమవుతుంది. ఎందుకంటే, అజ్ఞానులైన ముస్లిం జనసమూహం ప్రవక్త పేరుతో తమకు విజ్ఞప్తి చేసేవాళ్ళ వెనకాలే పడిపోతుంది గనుక.... వారంతా భారతదేశాన్ని ఇస్లాం పాలన క్రిందికి తేవడానికే ఉద్యుక్తులవుతారు.

''యథార్ధానికి చాందస ముస్లింలు పాలించే దేశాల్లో ముస్లిం శాఖీయులకీ భద్రత లేదు. షియాలు, సున్నీలు, సూఫీలు, బాహేలు బ్రిటీషు రాజ్యంలోనే హాయిగా ఉండగలరు.''

2) లాలాలజపతిరాయ్‌ సి.ఆర్‌.దాస్‌కు రాసిన లేఖలోని అంశాలు.

''ఈ మధ్య హిందూ ముస్లిం జోక్యం అన్న అంశం నన్ను అతిగా కలవరపెడుతోంది. గత ఆరు నెలలుగా ముస్లిం చరిత్ర, ముస్లిం ధర్మశాస్త్రం అధ్యయనానికే ఎక్కువ వ్యవధిని ఖర్చుపెట్టాను... వాళ్ళ మతం ఐక్యానికి గట్టిగానే అడ్డంగా ఉంటుందని పిస్తోంది. హాకింసాబ్‌ కంటె మంచి మహమ్మదీయుడు హిందూస్తాన్‌లో ఎవరూలేరు. కానీ ఏ మహమ్మదీయుడైనా ఖురాన్‌ను ఎదిరించగలడా? ఇస్లాంమతన్యాయం నాకర్దమైన పద్దతి తప్ఫైతే బాగుండుననినేనాశిస్తున్నాను... హిందూస్థాన్‌ని ప్రజాస్వామ్య పద్దతిలో పాలించడానికి మనం ఐక్యంకాలేము. మరైతే దీనికి మందేమిటి?...

హిందూ ముస్లింల మధ్య ఐక్యత అవసరం లేదా వాంఛనీయం అని నేను మనస్ఫూర్తిగా, గుండె మీద చేయి వేసుకుని విశ్వసిస్తున్నాను.... కానీ ఖురాన్‌, హజీలు విధించే అనుశాసనాల మాటేమిటి? ముస్లిం నాయకులు వాటిని కాదనలేరు.

3) 1924లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌తో జరిపిన ఇంటర్వ్యూలో...

హిందూ ముస్లిం ఐక్యత అసంభవం అని కవిగారి అభిప్రాయం. మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని పరిమితం చేయలేరు అన్నదే ఠాగూర్‌ బలమైన అభిప్రాయం.

ఏ మహమ్మదీయ రాజ్యమైనా భారతదేశంపై దండయాత్ర చేస్తే, ఆ సందర్భంలో తమ ఉమ్మిడి భూమిని రక్షించుకునేందుకు మహమ్మదీయులు హిందువులకు తోడుగా నిలుస్తారా? అని నిర్మొగమాటంగా అడిగాడు... ఓ మహమ్మదీయుడి దేశం ఏదైనా కానీ, అతడు మరో మహమ్మదీయునికి వ్యతిరేకంగా పోరాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ముహమ్మద్‌ ఆలీ లాటివారే చాటారు.''

పాఠక మిత్రులారా! ఈ ఉట్టంకింపుల సందర్భంలో ఈ అభిప్రాయాలు వెళ్ళడించింది ఆషామాషీ వ్యక్తులు కారు అంటూ అంబేద్కర్‌ ఇలా రాశారు.

''ఈ భయాలు వెళ్ళడి చేసిన వాళ్ళు ఉచితానుచితాలు తెలియని వాళ్ళనుకునేరు. కాదు సరి కదా వాళ్ళు ముస్లిం నాయకులతో బాగా సంబంధాలుండి, తమ అభిప్రాయాల్ని వెళ్ళడించగల ఉచితజ్ఞత కలవాళ్ళు.

కనుక అంబేద్కర్‌ కాలంనాటికే అంబేద్కరే కాకుండా, ఆస్థాయి మేధావులని అంబేద్కర్‌ ప్రస్తావించిన వాళ్ళూ ఖురాన్‌ మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది? దాని ఆదేశాల విషయంలో ఒక ముస్లిం వైఖరెలా ఉంటుంది అన్న విషయంలో వారు తమని ప్రత్యేకించుకుని తీరతారని, హిందువులను, ఇస్లామేతరుల్ని అన్యులుగానే భావిస్తారని స్పష్టంగా ప్రకటించారు. సంస్కరణవాదులైన ముస్లింలెవరైనా ఖురానుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాందస ముస్లింలు వారిని చంపేయవచ్చనీ అన్నారు.

ఇస్లాంలోని అంతర్గత బలహీనతల్ని గురించీ డా|| అంబేద్కర్‌ 8 వాల్యూం - సామాజిక స్తబ్దత అన్న శీర్షిక క్రింద చాలా విలువైన, ప్రామాణిక సమాచారాన్ని రాశిపోశారు. వివరంగా తెలుసుకోదలచిన వాళ్ళు 8వ సంపుటిని ఆ సాంతం శ్రద్దగా అధ్యయనం చేయండి. ఒక్కమాట చెప్పి దీనిని ముగిస్తాను.

సత్యాన్వేషణ మండలి ద్వారానూ, ఐక్యవేదిక ద్వారానూ నేను పౌరులకు సంబంధించిన ఒక అభిప్రాయాన్ని సూత్రరూపంలో బలంగా చెపుతూ వస్తున్నాను.

భారతదేశంలో ఉన్న భారత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా, ముందుగా తాను భారతీయునిగా త్రికరణ శుద్దిగా తలంచాలి. ఆ రకంగానే ప్రవర్తిస్తుండాలి. ఆ తరవాతనే తానేదో ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి, పార్టీకి చెందిన వాణ్ణని తలంచాలి, ఆ రకంగానే ప్రవర్తించాలి. భారతదేశము, భారత రాజ్యాంగము, భారతీయులు అన్న భావన అన్నిటికంటే ముందుది, ముఖ్యమైందిగా అనుకుంటూ ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట.

విషయం అర్ధమవుతుందనుకుంటాను. నీవు మొదట భారతీయుడివి. పిదపే హిందువులి మొదట భారతీయుడివి, పిదపనే క్రైస్తవుడివి, మొదట భారతీయుడివి, పిదపనే ముస్లింవి... ఇలాగన్న మాట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, 70 ఏండ్లకు పూర్వమే, అంబేద్కరూ ఈ విషయాన్ని ముఖ్యమైనదిగ తలంచడమేగాక, ఈ విషయంలో వివేకవంతుడైన పౌరుడేలా ఉండాలో ఉంటాడో సుస్పష్టంగా ప్రకటించాడు. ఆ మాటలు ఇవిగో,

దేశంలో కొందరు సంఘహితైషులైన మేధావులు, మొదట భారతీయుడివి తరవాతే హిందువైనా, ముస్లిమైనా క్రైస్తవుడైనా అన్న దృష్టి కలిగి ఉండాలనంటుంటారు. నా దృష్టిలో అది సరికాదు. సరిపడినంత వివేకం ఉన్నవారైతే, నేను మొదటా భారతీయుణ్ణేతరవాతే భారతీయుణ్ణే, చివరకూ భారతీయుణ్ణే అంటారు అనాలి, అనన్నారు.

ఎంతటి ఉదాత్తభావన ?! రాజ్యంగ పీఠికలోని ఆశయాలు నెరవేరాలంటే పౌరుల మానసిక స్థితి ఎలా ఉండితీరాలని ఆయన విచక్షణ నిర్వింద్వంగా ప్రకటిస్తొందో గమనించారా? ఆ వైఖరే ఉత్తమోత్తమమైనది. నిజమైన జాతీయ భావనను నెలకొల్పగలిగింది.

నా వరకు నేను అక్కడే ఉన్నాను. నాకు ఏ మతమూలేదు. ప్రాంతల పట్టింపూలేదు కేవలం భారతీయుణ్ణి మాత్రమే. ఇంకే సంకుచిత భావనకు తలొగ్గడానికి నేను సిద్దంగా లేను ఈ ఉన్నత భావాన్ని అంగీకరిస్తూనే నేను, కనీసం మొదట భారతీయుణ్ణి తరవాతే ఫలాన మతస్ధుణ్ణి, ప్రాంతం వాణ్ణి వగైరాలన్నీ అనుకొమ్మని చెప్పాను. ఈ నాప్రతిపాదన అంబేద్కర్‌ ప్రతిపాదనతో పోలిస్తే మధ్యమ స్థాయి కలిగింది మాత్రమే.

వివిధ మత, ప్రాంతాలకు చెందిన వారిగా తలంచుతుండే పౌరులారా! మీరేక్కడున్నారో ఎక్కడికి రావాలనుకుంటున్నారో తేల్చుకుని, ఆ రకంగా నిజాయితీగా ప్రవర్తించండి. 1) నేనన్నదానికంటే అంబేద్కర్‌ చెప్పింది ఉన్నతమైనది. నేను మనిషిని, మానవ సమాజం మంతా ఒక్కటే అన్నది మరింత ఉన్నతమైనది, ఆదర్శప్రాయమైనది ఆలోచించండి.

ఇస్లాం మత స్వేచ్చను అంగీకరించదనడానికింత కంటే రుజువేం కావాలి? విధిలేక మాత్రమే వారు మరొకరితో కలిసి ఉంటారు.

1) ఇస్లాం పద్దతి అమలయ్యే పరిస్థితి ఉంటే, అక్కడ ఇస్లామేతరులు స్వేచ్ఛగా ఉండడం అసంభవం. షరతులతోకూడిన, అదిన్నీ అవిశ్వాసిగా ఉన్నందుకు గాను విధించిన షరతులతో, ఉండనిచ్చినందుకు గాను విధించిన పన్ను చెల్లించే ఉండాలి.

No comments:

Post a Comment