Sunday, May 6, 2018

మేలుకొలుపు 1-5


మేలుకొలుపు
సంపుటి 1                                                                        సంచిక 5 / 1-7-1991
జ్ఞాన పీఠము - ఒక పరిశీలన
  ఆర్యులారా! గత నాలుగు సంచికలలోనూ ప్రతి వ్యక్తి జీవితంతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడియున్న కొన్ని అంశాలను పరిశీలించాము. ఈ సంచికలోనూ అట్టిదే మరో ప్రముఖాంశం వివరిస్తాను. మానవ జీవితాన్ని గమనించితే, అది రెండు ప్రధాన విభాగాలుగా గోచరిస్తుంది. [1] అనుకోవడం (జ్ఞానభాగం), [2] అనుకున్న దానికి తగినట్లు ప్రవర్తించడం (కర్మ విభాగం) ఈ రెంటి సమాహారమే [కూడికే] జీవితమని చెప్పుకోవచ్చు. ఒకరకంగా. ఈ సంచిక జ్ఞానభాగానికి చెందినదిగా నున్నది. జ్ఞానాధారంగానే ఆలోచనల పైనాధారపడే మనిషి జీవిస్తున్నాడన్నది. ఒక వాస్తవము. అయితే ఆజ్ఞానం-ఒప్పుజ్ఞానమూ, తప్పు-బ్రమ-జ్ఞానమూనని రెండు ప్రకారములుగ నుంటున్నది. ఈ రెండు విషయాలన్నూ స్పష్టంగా గమనింపబడవలసి ఉంది. ఈ విషయాన్ని కావలసినంత స్పష్టంగానూ గమనించాడనుకోండి వ్యక్తి, అప్పుడతడు తన జ్ఞానము ఏ కారణం వలనగానీ. (ఉదా:- పెద్దలు చెప్పారు గనుక సరిచూడ వలసిన పని లేదనో తొందర పాటువలననో, మరో విధంగానో కూడా బ్రమపొందవచ్చు) బ్రమాత్మకమైనచో ఆజ్ఞానంతోనే తాను ఆయా కర్మలు చేస్తాడు గనుక అట్టి పనులన్నీ ఇటు తనకూ, అటు తనతో ఓ సంబంధాలున్న సమాజానికి కూడా నిరుపయోగంగానో, దురుప యోగంగానో మారగలవనీ గమనించగలుగుతాడు. బ్రమజ్ఞానం వలన ఎంత నష్టం రావడానికి వీలుందో గమనింపబడినగానీ, వాస్తవ జ్ఞానం యొక్క ఆవశ్యకతను సరిగా గుర్తించలేడు. అట్లు గుర్తించిన గాని వ్యక్తి నిజంగా సత్యజ్ఞానార్థనకు యత్నించడు. ఇట్లు జీవన యాత్రలో మేథస్సు (జ్ఞానం) యొక్క పాత్రను గూర్చి స్పష్టత తగినంతగా ఏర్పడినగాని సత్యజ్ఞానార్జన యవసరమూ, విలువా గమనింప బడవు. అట్లు గమనింపబడినగాని జ్ఞానార్జనయందు నిజమైన శ్రద్ధ ఏర్పడదు. చెప్పినదే చెప్పినట్లనిపిస్తున్నది కదూమీకు. అవును. దీని కంత ప్రాధాన్యత ఉంది. మరి ఆయా సందర్భాలలో మేము ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రతివారూ దీనికెంత చెప్పాలా! ఈ విషయం ఎవరికి తెలియదు అన్న భావాన్ని వ్యక్తం చేశారు. అయినా అట్లు పదే పదే హెచ్చరింపబడ్డవాళ్ళూ, మాకు ముందే తెలుసన్న వాళ్ళూ కూడా యిప్పటికీ మేమనుకున్న స్పష్టత అన్న స్థాయికి చేర లేదు. వాస్తవంగా. ఆ విషయం ప్రత్యక్ష ప్రయోగాలద్వారానే వారికి తెలి సేట్లు చేయడం జరిగింది చాలచోట్ల. ఆస్తు.
వ్యక్తివికాసం గురించి చెప్పవలసివస్తే అది నిజంగా వ్యక్తి మానసిక, శారీరక సామర్థ్యముల పెంపు ఆన్న దగ్గర నుండే ప్రారంభమవుతుంది. చివరకు మరల దానితోనే ముగుస్తుంది కూడా. ఈ విషయం వెనుకటి వాళ్ళూ స్పష్టంగానే గమనించారనడానికి, వ్యవస్థలోనే మిళితం చేయబడ్డ ఒక అంశాన్ని ఉటంకిస్తాను. అది ఉపనయన సంస్కారమే. ఆయా కర్మలు చేయడాని కధికారి ఉపనయనం చేయబడినవాడేనన్నారు వాళ్ళు. ఆచారంగా నేడది వికృత రూపంలో నున్నా దాని భావం "ఉపసమీ పేనయనం ప్రాపణి" అన్నవ్యుత్పత్తిని బట్టి ఏర్పడింది. దాని సమీపానికి కన్ను చేరడం, ఆందే ఆయా విషయాలత చెందిన జ్ఞానం పొందబడడం అన్న భావం పడుతోంది. ఆ భావాన్ని స్వీకరించడం కూడా ఉపయోగకరంగా కూడా ఉంది. ఉండగలదు. ఒక పని చేయడాని కధికారెవరు కాగలరు? దానిగూర్చి - తెలిసినవాడే, అనడం సబబేకదా! సరే ప్రస్తుతాంశానికి వస్తాను.
ఒక విషయాన్ని గూర్చి తెలిసికొనగోరినా, తెలుపగోరినా తెలిసికొనువారూ, తెలుపువారూ ఆవశ్యం పాటింపదగిన తప్పనిసరి యంశముల సంపుటియే ఈ జ్ఞాన పీఠమను శీర్షికని చెప్పబడుచున్నది. గమనించగలరు. దీనిని నాలుగు పాదములుగా సౌలభ్యం కొరకు చేయడమైనది.
 1. చక్కగా వినడము:- ఈ వినగలగడమన్నది ఒక కళ. వినడమూ,  చెప్పడమూనన్న విషయములను కడు జాగరూకతతో అభ్యాసము చేసినగాని యలవడదు. అన్ని కాలములందునూ ఆయా విషయ పరిశీలన, విషయ గ్రహణం యందలి పొరపాటులకూ, యనవసర వాగ్వివాదాలకూ చాలావరక సరిగా వినక పోవడమన్నది కారణంగా యుంటున్నది. మరియు చెప్పేవారిని గూర్చి చదువుచున్న గ్రంధాన్ని గ్రంథ రచయితను గూర్చి మనకున్న యభిప్రాయాన్ని బట్టి చెప్పబడ్డ విషయానికి విలువలనాపాదించి చూడడంతరచుగా జరుగుతున్న పొరబాటు. అంటే ముందుగనే ఒక యభిప్రాయాన్నేర్పరచుకుని (రాగద్వేష రూపంగా) చూడడం అవుతున్నదన్న మాట. ఇది అసలు విషయాన్ని సంపూర్ణంగా చూడనివ్వక పోవడమో ఆలోచనలను అన్యదృష్టికి మరల్చడమో చేస్తుంది. దీనివలన చెప్పిన విషయానికి చెందిన వక్త (రచయిత) యభిప్రాయాన్ని సరిగా గ్రహించలేక పోవడమో, అన్యధా గ్రహించడమో జరుగుతుందన్న మాట. ఆ పై మన మెంత విశ్లేషణ చేసినా యది దుష్టార్దన్యంజకమే యవుతుంది.
ఇక్కడ దీనికి ముందుగా జాగ్రత్త వహించవలసిన మరో ప్రముఖాంక ముందీ. అది ఎదుటివారు చెపుతున్నప్పుడు, [గ్రంధాన్ని పఠిస్తున్నప్పుడు] శ్రద్దలోనూ, ఏకాగ్రతతోనూ ఆపదాలను - వాక్యాలను వినాలి. అలాగే మనం చెప్పదలచుకున్నప్పుడున్నూ, చెప్పదలచుకున్న భావాన్ని సక్రమంగా వ్యక్తం చేయగల పదాలను చెప్పడం, చెప్పిన విషయాన్ని ఎదుటి వారు యధాతధంగా గ్రహిస్తున్నారో - గ్రహించినారో లేదో గమనించడం చేయాలి. ఈ విషయంలో వినేవాళ్ళూ, అనే వాళ్ళూ ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆక్షణంలో కొంతభాగం వినలేకపోవడమో, వినని భాగాన్ని విన్నామనుకని ఆ వినని భాగాన్ని మనస్సునుండి పూరించడమో జరుగుతుంది. అట్టి సందర్భం ఏర్పడిందే యనుకుందాం. అప్పుడేమవుతుంది? అన్న వారు తానన్నది, ఫలానా యనుకుని తన పక్షాన్ని కొనసాగిస్తే విన్న వారు మరో విథంగా గ్రహించి యున్నారు గనుక ఆ దృష్టినుండి పరిశీలన ప్రారంభిస్తారు. ఆపై వారి వారి వేరువేరైన దృష్టుల నుండి పరిశీలనలూ, చర్చలు సాగుతాయి. ఎంత సేపటికీ తెగవు. నేను చెప్పింది సరిగనే యున్నది కదా? ఎందుకంగీకరించరు. అని అన్న వారూ, ఇంత దోషమున్నా దాన్నే పట్టుకుని, ఊగులాడతారేమాయని విన్న వారూ అనుకుంటూయుంటారు. ఇక ఆ పరిశీలన ముగింపు పరస్పర యసమర్థతలనూ, దోషాలనూ ఎత్తి చూపుకొనుటతోనో అసంపూర్ణంగానో ముగుస్తుంది. లేదా ఎప్పటికోగాని అసలు పొరబాటు ఎక్కడ జరిగిందో గమనింపబడడు. ఈ విషయాన్ని గమనిస్తే చెప్పాలనుకున్న వారూ, వినాలనుకున్న వారు ప్రారంభం నుండే మెలకువగా నుండవలసిన ఉండి తీరవలసిన యగత్యం ఎంతుందో గోచరిస్తుంది.
అయితే మెలకువగా ఉండడం అంటే ఏమిటి? వినువారూ, చదువువారూ మనస్సులో మరో భావం లేకుండగ ఉన్న విషయాన్ని ఉన్నట్లు వినడమో, చదవడమో మొదట చేయాలి. చాల వరకు అలానే జరుగుతున్నది యనుకుంటారే గానీ అలా జరగడం లేదన్నది మా పరిశీలనలో అనేక సందర్భాలలో రుజువైంది. ఉదా:- రాయామణం, మహారాభతం అన్న పదాలు వ్రాసిచదువమన్నపుడు చదువరులు వాటిని రామాయణ మహాభారతాలుగా చదివారు. అయితే యిక్కడేమిజరిగింది? పైన చెప్పిన పొరబాటే. ఈ విషయాన్ని చెప్పడంతో ఇలాటి ప్రయోగాలు మీరు చేసి చూడండి. ప్రమాదం ఎక్కడుందో ఆలోచించండి. ఇదంతా రామాయణంలో పిడకల వేటలాగుంది కదూ! మొట్టమొదట శ్రోత ఈ దోషాన్ని తొలగించుకుని వినాలి. అది మరీ ప్రాముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయమైనచో అన్న వారిని మరల యిదేనా మీరన్నది యని అడిగితెలుసుకోవాలి. నిర్ధారించుకోవాలి. ఇంతా క్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఉన్న వారినుండి-గ్రంథమునుండి-విన్న వారికీ, - పఠితకూ ప్రతిపాదన చేరిందన్నమాట. యధాతథంగా చేరిందో లేదో నిర్ధారించుకోవాలన్నది మరలా గుర్తు చేస్తున్నాను. దానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా. ఇప్పటికి పద ప్రత్యక్షం దోషరహితంగా జరిగిందన్న మాట. ఈ విషయమున్నూ వేనుకటి తాత్వికులలో కొందరకైనా తెలిసేఉంది అనడానికొక ఆధారాన్ని ఉటంకిస్తాను. ఒక వంక నాయమాత్మా - ప్రవచనేనలభ్య: అంటూనే మరో వంక ఆశ్చర్యో వక్తాకుశలో స్యలాబ్ద్వా ఆశ్చ్యర్యోజ్ఞతా కుశలాను శిష్ట: అంటూ పై విషయాన్ని సూచించినారు. ఇక అర్ధబోధ. జరుగవలసియుంది. అది జ్ఞాన పీఠంలో రెండవ పాదంగా ఉంది.
       చక్కగా వినడం జరిగిన పిదప, విన్నదానికి అన్న వారినుండే యర్ధాన్ని గ్రహించడం రెండవ పాదస్థ విషయంగా ఉంది. భాషకున్న శక్తి పరిస్థితుల దృష్ట్యా విన్న పదానికి అర్ధాన్ని ఆన్న వారి (ప్రయోక్త) నుండే గ్రహించడం అవశ్యానుసరణీయమై ఉంది. నిజం చెప్పాలంటే పరిశీలకునికీ అంతకంటే గత్యంతరం కూడా లేదు. ఈ యర్ధ గ్రహణ విషయంలో ఏ మాత్రం అవసవ్యత - అన్యదా గ్రహణకానీ, భిన్నార్ధారోపణకానీ జరిగినా ఆపైనంతా గందరగోళమే. ఇది జరిగిన పిదప పరిశీలకుని మేధస్సూ, నిజాయితీ, తీక్షణత, అన్ని నిరుపయోగాలుగనో కదా చిత్ దురుపయోగాలుగనో మారగలవు. చూడడానికంత ప్రాధాన్యత కల విషయంగా గోచరింపకపోయినా తరచుగా జానార్ధనలోనూ, పరిశీలనలోనూ ఆటంకాలనూ, అపమార్గాలను ఏర్పరుస్తున్న ప్రధాన విషయమిది. ఈ విషయం మాయనుభవంలో మేము తరచుగా -ప్రతి సారీ ఏదో సందర్భంలో అనొచ్చు కూడా - ఎదుర్కొన్నాము, ఆయనుభవ పరంపరనుండే జ్ఞాన పీఠాన్ని ఏర్పరచుకున్నాము. మీరూ మీయనుభవాలను దీనీ నేపధ్యం నుండి యవలోకించినా, యిప్పుడు ప్రయోగం చేసి చూసినా వీటి విషయంలేని వాస్తవాన్ని-విషయ పరిశీలనలోనూ, మనం తీసుకునే నిర్ణయాలలోనూ తరచుగా జరుగుతున్న ప్రమాదాల్ని గమనించగలరు. పైన చెప్పినట్లు, అతనన్నదీ యిదీ యనున్నా, దానర్ధం యిదై ఉంటుంది యను ఈన్నా. కథ అడ్డం తిరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా విషయ పరిశీలన "సత్యాసత్యాలు నిర్ణయించేదిగా ఉన్న సందర్భంలో దీని విలువ యపారంగా యుంటున్నది. ఎందుకనగా ఆవతలివారు చెప్పినదేమిటి? దాని విషయంలో యుద్దేశ ముమిటి? యన్నది యధాతథంగా స్వీకరింపబడిననే గాని అసలు యదార్ధ పరిశీలన, సత్యా సత్య నిర్ణయమూ అన్నది. పొసగదు ఆయితే అనేకానేక సందర్భాలలో యిచ్చటనే ఎంతో కొంతమేర లోపం ఏర్పడుతూ యుంటున్నది. భాషద్వారా - గ్రంధములద్వారా వ్యక్తం చేయబడలచుకున్న యితరుల యనుభవ పరంపరలను విశ్లేషించి వాటి బాగోగులను సమీక్షించాలనుకునే వారికి పై విషయాలు స్పురణలో యుండడం చాలా యవసరము. ఏతావాతా యిప్పటికీ తేలిన సారాంశమేమంటే.
     అన్నీ విషయాన్ని ఆన్నట్లుగనే వినడం (గ్రహించడం) విన్న దానికి ఉన్న అర్ధాన్ని అన్న వారి నుండే గ్రహించడం జ్ఞానార్జనలోనూ, ప్రధానంలోనూ ప్రాధమిక అవసరంగా గుర్తించడం, అట్లు జరుగనప్పుడు పరిశీలనా, జ్ఞానార్జనా, ఆపై చేయు సత్యాసత్య నిర్ణయాలూ, అన్నీ యవక తవకలు గానే యుంటాయనీ గుర్తించడం ఇదీ సారాంశం.
       ఇప్పటికి జ్ఞానపీఠంలో యర్ధ భాగాన్ని యవలోకించినట్లయినది. ఇంతవరకున్న క్రమాన్ననుసరించినచో రచయిత - వక్త – వుద్దేశాన్ని, పఠిత – శ్రోత - యథాతథంగా స్వీకరించినదైనది. యింతా జరిగిన గానీ యదార్ధమైన పరిశీలన యన్నది నిజంగా ప్రారంభం కావడం లేదు. ఇక మరో పాద విషయంగా పైన లభించిన విషయాన్ని రెండు కోణాలనుండి పరిశీలించడం ప్రారంభిస్తాము.
1) చర్చా సందర్భమైతే ప్రయోక్త ప్రతిపాదన యనుభవజన్య జ్ఞానం నుండి పవృతమైనదా? అనుభవ రహితంగానా? అనగా తెలిసియా? లేక యనుసరణశీలమైన విశ్వాసం నుండియా? అన్నది పరిశీలించవలసి యున్నది.
2) ప్రయోగింపబడిన పద-వాక్య-సముదాయమును ఒక సమర్థవంతమైన పద్దతి ద్వారా అర్థనిర్ధారణ చేయుటకు యత్నించడం. తద్వారా లభించిన యర్థము సబబై నదా కాదా యని సత్య నిర్ధారణకై యత్నించడం చేయవలసి ఉంటుంది.
ఇందులో ప్రథమపక్షమైన యనుభవ జన్యజ్ఞానం కాదు విశ్వాసమే- పెద్దల వాక్కు అని చెప్పినాడను కోండి వక్త. అప్పుడతడు విషయనిర్ధారణ చేయుటకు తగిన యర్హ స్థానంలో లేడన్న మాట. ఆ విషయాన్ని గమనించి, యతడు కూడా గమనించునట్లు చేయాలి.
Note: - ఇదే విషయాన్ని మనమేదైనా ప్రతిపాదన చేసేటప్పడు కూడా నియమంగానే స్వీకరించాలి. ఎందుకంటే ప్రతిపాదించినది మనమైనా, మరొకరైనా ప్రతిపాదిత విషయంలో విశ్వాసమే గాని, జ్ఞానం లేనట్లు యంగీకరించి నట్లైనది గనుక, ఇది యంతే యని చెప్పడం ఆయా విషయాలలో జ్ఞానం-అనుభవజన్యత్వం-ఉన్నవారి విషయంలోనే సాధ్యము. తదితరుల-విస్వాసుల విషయంలో విశ్వాసం విశ్వాసమే ఔతుంది. జ్ఞాన స్థాయిలేని వారి పక్షం నిజనిర్ధారణలో నిలచుట కష్టము, జ్ఞానినః తత్వదర్శినః అనియు శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నదియు ఈ విషయాన్నే.
ఇక రెండవ విషయాన్ని బట్టి ప్రతిపాదిత విషయం - అనుభవజన్య జ్ఞానమే – తెలిసే చెపుతున్నాను యనినచో దానిని ఒక క్రమంలో విశ్లేషించాల్సి యుంటుంది. అదెలాగంటే భాష సాంకేతిక రూపై యున్నది. అనగా ఒక్కొక్క పదమూ ఒక్కొక్క నిర్దిష్టార్దాన్ని, సంకేతిని కలిగియున్నది. పద పదార్థాలకు సంజ్ఞా సంజ్ఞ సంబంధమన్న మాట, ఆయా పదాలను స్వయం సత్తాకాలూ, సంబంధ జనితాలూ నన్న రెండు వర్గాలుగా విభజించవచ్చు. మరలయవన్ని నామవాచకాలుగానో, ! కియావాచకాలుగానో, గుణవాచకాలుగానో అర్థాన్ని కలిగి యుంటాయి. యింతవరకు గమనించినట్లేనచో యిక ప్రయోక్త ప్రయోగించిన పదాన్ని గుర్తించి దాని భావాన్ని గమనించుటకై యత్నించాలి. ఉక్త పదం ఒక నామీని తెలుపుతుందా? అవునన్నచో దాని గుణమేమి? క్రియలేమి? అని విచారించాలి. అ గుణ వాచక మైనచో అది దేని గుణము,ధాని క్రియలేమిటి ఆనియూ, క్రియయైనచో ఆది దేని క్రియ దానిగుణ మేమి యనియూ విచారించి సమాధానం రాబట్టాలి. వక్తవు నీవైనా యిదే విధానము. మనచే ప్రయోగింపబడ్డ పదముల విషయంలోనూ పైప్రశ్నావళికి సమాధానం చెప్పగలిగి యుండడమూ, చెప్పవలసిన బాధ్యత ప్రయోక్త పై నున్నదన్న విషయాన్ని గమనించి బాధ్యతా యుతంగా వ్యవహరించడమూ యిరు పక్షాలు చేయ వలసి యుందన్న మాట.
 Note: వస్తువు, ద్రవ్యము, గుణము, క్రియ, అన్న నాలుగు రూపాలలోనే మనకు కలిగే జ్ఞానమంతా యిమిడి ఉంటుంది. ప్రాచీనులున్నూ యీ విషయాన్ని గమనించారు అయితే వస్తువునూ, ద్రవ్యాన్ని కలిపి ద్రవ్యంగానే పరిగణించారు. ఉదా :- మృద్దవ్యం, ఘఠద్రవ్య మన్న పదములు . కార్య దవ్యం, కారణ ద్రవ్యం అన్న మాటలూ, ఈయర్ధాన్నే సూచిస్తున్నాయి. ఇంతదనుక చెప్పుతున్న విషయాలు మనచే గ్రహింపబడిన పిదప జిజ్ఞాసువు (పరిశీలకుడు) మూడవ కోణం నుండి పరిశీలన ప్రారంభించాలి. గుణరహితములైన వస్తు దవ్యములు గానీ ద్రవ్యాధారం లేని గుణక్రియలు గానీ మన యనుభవంలో లేవు. కనుక తెలిసి మాట్లాడుతున్నానన్న వాని యవగాహన ఎటువంటిదో, లేక తెలిసికొనగోరి యత్నించు వాని గ్రహణ ఎట్టిదో పరిశీలించు కోవడం సర్వధా సమీచనం కాగలదు. గుణ జ్ఞానము కలిగిందా? గుణి తెలీయబడకుండగనా? తెలియబడుతూనా? గుణగుణి సంబంథము వీడ దీయదగనా! ఆ గుణ మును విడదీసిన ఆ గుణి యుండునా? ఉండునన్నచో ఆగుణికి యాగుణి యన్న పేరేట్లు వచ్చింది? ఇలా పరిశీలించాలి. ఆ గుణమును విడచి గుణి యుండదన్నచో గుణము గ్రహింపబడ్డ తావులెల్ల గుణి యస్తిత్వాన్ని యంగీకరించాల్సి యుంటుంది. అట్లే క్రియవిషయమున్నూ. అయితే క్రియ ఉన్న చోటు ద్రవ్యం ఉండి తీరుతుంది. గానీ, ద్రవ్యం ఉన్న చోటులెల్ల క్రియ ఉండి తీరాలన్న నియమం లేదు. మొత్తం మీద జ్ఞానపీఠం మూడవ పాద విషయంగా గుణ గుణి సంబంధాలు తెలిసి ఆవివేకంతో తెలియబడుతున్న వాటినీ, తెలియాలను కుంటున్న వాటినీ, గూర్చి యవగాహన చేసికోవలయునన్నదే నే చెప్పదలచుచుకున్న యంశముగా నున్నది.
ఇహ నాలుగవ పాదస్థ విషయంగా, గమనించవలసిన యంశము. జీవిత గమ్యమూ, గమన పద్ధతులను బట్టి మరింత ప్రాముఖ్యతను కలిగి యున్నది. మునిషి కదలిక యన్నదే కావలసిన దానిని సాధించుకొనుటకూ, యక్కరలేని దానిని పోగొట్టు కొనుటకుగా జరుగుచున్నది. అట్టిచో కార్య సాఫల్యతను కోరువారు పైరెండు సాధ్యముల విషయమైన          (కావలసినవి తెచ్చుకొనుటకూ, అక్కరలేనివి పోగొట్టు కొనుటకూ) కావలసినవి ఎందుకు రావడం లేదో గమనించి యారాక పోవడానికి గల కారణాన్ని తొలగిస్తే గాని యది రాదనియు, ఆపై యక్కరలేనిది పోక పోవడానికి గల కారణనాన్నెరిగి దానిని తొలగిస్తే గాని యదిపోదనియూ గమనించాలి. ఆపై తగిన రూపంలో కారణ నాశాన్ని చేయగలిగిన గాని కామితార్ధ ఫలసిద్ది జరుగదు. నేటి ఆయా సాంప్రదాయాలు సిద్దాంతాల యనుయాయులు అభీష్టసిద్ది నందక పోవడానికి ఇది ప్రబల కారణముగ నున్నది కనుక, కారణాన్నెరిగి అదెందుకుంటున్నదో గమనించినట్లు కారణ నాశాన్ని చేయాలో గమనించి యట్లొనరించిన గాని యనుకున్నది జరుగదు. ఈ కార్య కారణ నియమాన్ని యెం త సమగ్రంగా యవగాహన చేసి కుని యమలు పరుపగలరో యంత మేర జీవితం జయావహంగానూ; పురోగామి పదంలో నూ ఉంటుంది. ఇది ప్రతి సంఘటనలోనూ ఎంతో కొంత మేర సంబంధం కలిగి ఉంది. విశ్వమంతా కార్య కారణ నియమాన్ననుసరించే కదులుతున్నది. పరిణామం పొందుతోంది. ఏతావాతా తేలినదేమంటే.
1) చక్కగా వినగలగడం అనగా రాగద్వేషాలు లేకుండగనూ, అన్యమనస్కత లేకుండగనూ, పూర్వ నిశ్చిత యభిప్రాయాలు లేకుండగనూ వినడంయనీ యర్ధము.
2) వినిన మాటలకు, వాక్యములకు అర్థాన్ని యన్న వారి నుండే గ్రహించడం. (గ్రహించు విధానం పైన వివరింపబడ్డది) ఆట్లే అన్ని మాటలకు ఆర్థాలు చెప్పుటలో బాధ్యత వహించడం,
3) గుణ, గుణి, అవయవ, అవయవి అన్న వాటి విషయాలను, సంబంధాలను చక్కగా యవగతంచేసి కొని ఆవివేకంతో తెలియబడిన, తెలియగోరిన దానిని యవలోకించడం.
4), కార్య కారణ నియమాన్ని యర్థం చేసికొని ఆసామర్థ్యంతో అక్కర లేనిది ఉండడానికి కారణాన్ని, అలానే అక్కరైనది లేక పోవడానికి గల కారణాన్ని గ్రహించి కారణ నాశం చేయడం ద్వారా కావలసిన దానిని పొందడం, అక్కరలేని దానిని విడవడం చేయవలసి యుంటుంది. ఈ నాలుగు యంశాల్ని జ్ఞానార్జనా, ప్రధానమూ యన్న రెండు వైపుల నుండే అనగా చెప్పువాడూ, వినువాడు చక్కగా గ్రహించి వాటి యాధారంతోనే చెప్పడంగానీ, వినడం గానీ జరుపవలయును. అట్లు సాధించుకున్న జ్ఞానమే సత్యజ్ఞానం కాగలదు, మరోసారి మరో యంగాన్ని ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి సెలవు. నమస్సులతో
Note: కనీసం మరోక్కసారి పరిశీలించండి దయచేసి.
సత్యాన్వేషణలో. మీ సురేంద్ర.
స్పందన - ప్రతి స్పందన.
మిత్రులు శ్రీసురేంద్రగార్కి, మీరాశించే మౌలికమైన మార్పుల విషయంలో నాకు ఆశ లేదు ఆధ్యాత్మరంగం కూడా ఒక జీవనోపాయంగా మారిపోయింది. Survival Instinct కి బలైపోయింది. ప్రజలకు అనుకూలంగా విషయాలు చెప్పకుంటే నా ఆదరణ, గర్తింపు పోతుందనే భయం ఆంధ్రదేశపు ప్రచారకుల్లో ఉcది. ఎక్కువ మంది ప్రచారకులకు శాస్త్రజ్ఞానంగానీ, వైజ్ఞానిక జ్ఞానంగానీ లేదు. తడబడకుండ గట్టిగా ఒక ధారగా మాట్లాడగలగడం ప్రసంగాల మధ్యలో కొన్నిఉపమానాలూ, కొన్ని పిట్టకధలూ, కొన్ని పాటలు, పద్యాలూ, నామసంకీర్తన వగైరా హంగులతో మాట్లాడితేచాలు అతనికిక ఢోకాలేదు. ఇది వ్యక్తుల విషయం. ఇక ఆశ్రమాలకు సంఘంలో ఉన్న పరపతిద్వారా ఆ ఆశ్రమాలకు చెందిన ప్రచారకులకు సంఘంలో - ఆవ్యక్తులు ఏసరకూ లేనివారైనా సరే - ఒక మంచి గుర్తింపూ, ఆదరణ లభిస్తున్నాయి. వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడినా, వ్రాసినా చెల్లిపోతుంది. సంఘంలో బాగా పరపతి సంపాదించిన ఆశ్రమాల్లో ఉండేవాళ్ళక ఒకరకమైన ఆధిక్యతాభావం అహంభావం, సంపన్న శైలి జీవిత విధానం వగైరా చోటు చేసికున్నాయి. ఇక వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ సంపాయించుకున్నారా, వాళ్ళు ఆ Routine లోనే ప్రయాణం చేస్తారుగానీ, ఆత్మ పరిశీలన వగైరాలకు యిష్టపడరు. తాము మూర్యత్వాన్ని పెంచి పోషించే కార్యక్రమం చేపట్టామని అసలే గుర్తించదు. ఇలాంటి వాళ్ళకు మీరు చెప్పేది తలకెక్కుతాయా?
   వేదాంతోపన్యాసాలు కూడా హరికధల క్రింద మన ప్రచారకులు మార్చి వేశారు. ఇక మన మూర్ఖప్రజలు, ఆధ్యాత్మక జీవనం గడిపేవాళ్ళు తమకన్నా చాల భిన్నంగా ఉండాలని ఆశిస్తారు. ఆ భిన్నత్వం చూపడానికే సాధువుల్లో డంబాచారం ఎక్కువైపోయింది. ఈ మధ్య ప్రజల్లో అక్షరాస్యత పెరగడం వల్ల ఎవరికి వారే స్వయంగా కొన్ని భూటకపు ఆధ్యాత్మ గ్రంధాలు చదవడం వల్ల తాము ఆన్నీ గ్రహించేశామనే ఒక మిధ్యా భావాన్ని పెంచుకున్నారు. ఈ రకం వారిని చాలా Hopeless కేసుగా నేను పరిగణిస్తాను. మీకు వినే వోపిక ఉండాలేగాని ఈ రకం మనుషులు గంటల తరబడి బోధ చేస్తారు.
        మీరన్నట్లు మనకు సరియైన దారి చూపగల సత్తా మన ప్రాచీన శాస్త్ర గ్రంధాలో ఉంది. నిక్షిప్తమై ఉంది. ముఖ్యంగా వేయ్యేళ్ళ పూర్వగ్రంధాల్లో వెయ్యేళ్ళుగా మన శాస్త్ర గ్రంధాలో దిగజారుడుతనం గోచరిస్తూంది. ఆ దిగజారుడే యిప్పుడు ప్రచారంలో ఉండేది. ఆ గ్రంధాలనుండి మేలు పొందాలంటే ఎంతో శ్రమ పడాలి. సంస్కృతం బాగా రావాలి. అవి చాల ఆధునిక భావాలు కనుక, ఆధునిక భావజాలం తోనూ చక్కని పరిచయం ఉండాలి. లేకుంటే ఆ గ్రంధాలు వట్టి భాషా పండితునికీ దిగజారుడు శాస్త్ర పండితునికీ అర్థంకావు. సామాన్య ప్రజలు ఇంత శ్రమ పడలేరు కనుక ఆధ్యాత్మరంగంలో నున్న నాయకులీ పనికి పూనుకోవాలి. కానీ ఈ యహంభావులు మూఢాత్ములు, చచ్చు సాంప్రదాయదాసులు ఇందుకు పూనుకోరుగదా! ఇట్లు గుప్త లేఖకుడు.
ప్రతి స్పందన---            ఆధ్యాత్మికరంగంలో బహుకాలం (దాదాపు 25, 30 సం) నుండి ఉంటూ అనేక బృహత్సంస్దలలో అనేక బాధ్యతలు నిర్వహించి, యిప్పటికీ ఆమార్గంలోనే అథ్యయనాద్యాపనములు సాగిస్తున్న ఒక మేధావి, సంఘ హితైషి, నిష్కర్ష విమర్శనా శీలుడునైన ఒకసాధకుని సుదీర్ఘ లేఖయిది. యదార్ధ వాదీలోక విరోధియన్న వచనం సర్వదా ప్రమాణంగానే సాగుతున్న నేటి రోజుల్లో, ఆయనున్న తీరునుబట్టి ఆయన పేరు గుప్త లేఖకుడు అని ప్రకటించడమైనది. ఆయన లేఖాంశములను మాయనుభవాల నుండి సరిచూసినప్పుడవి కఠిన పదజాలముల ద్వారా వ్యక్త పరుపబడినా అక్షర సత్యము అనియే - నాయభిప్రాయము ఎందుకంటే.
జీవిత దృక్పధాలు- జీవన విధానములు- రెండురకములు, వెనుకటి వాళ్ళు వాటిని లౌకిక జీవనము, పారమార్థిక జీవనముగా వ్యక్తీకరించారు. లౌకిక జీవన మన్నది ప్రధానంగా మూడు మూల్యములు-విలువలు కలిగి ఉంటుంది [1] స్థిర, చర ఆస్తులు పెంచుకోవడమూ [2] యితరులేమయితేనేమి వీలయినంత భోగము పొందాలనుకోవడమూ, [3] గుర్తింపు స్వభావము వెర్రితలలు వేసి కీర్తి ప్రతిష్టలే ప్రధానమనుకోవడమూ. వ్యక్తి ఏ ఆశ్రమంలోనున్నా, ఏ సంఘంలో నున్నా ఏ దేశీ యుడైనా, ఏ వేషభాషలు కలిగివున్నా పై మూడంశములకు చెందిన వాడైతే అతను లౌకికుడు ప్రేయోమార్గగామీ అన్న మాటే దానికి విరుద్దంగా పారమార్థిక జీవనము ధర్మాన్ని ఆధారం చేసికుని, అర్థకామాలను పొందాలన్న దృక్పధం కలిగి ఉంటుంది. ఆ మార్గము పైమూడు విషయాలలోనూ పరిమితాలను విధిస్తుంది. దీనిని , శ్రేయో మార్గమంటా ము. ఈ కొలతలలో నుండి చూస్తే ఆశ్రమాలూ సంఘాలలోని 75% వ్యక్తులు లౌకిక జీవనులుగానే ఉంటున్నారన్న మాట నిజాయితీగా పరిశీలించి నా వాక్యాలు (గుప్తలేఖకుని యభిప్రాయాలు) వాస్తవమో, అవాస్తవమో నిర్ణయించండి.
ముఖ్య గమనిక :- 1) సంచిక 6 నుండి మేలుకొలుపు మాసపత్రికగా రూపొందుతోంది. స్పందన, ప్రతిస్పందనతో పాటు, అభ్యాసక్రమము - (సాధన విధానము) అన్న అధ్యాయం కూడా ప్రారంభింపబడుతోంది. 2) జూలై 21, 22, 23 - 3 రోజులు సమాలోచన కొరకుగా సమావేశము జరుప బడుతాయి. ఔత్సాహికలు, మేలుకొలుపు పాటకులు ఆనాటి సమావేశమునకు రావలసి ఉంటుంది. ఇందు పై ఉత్తర ప్రత్యుత్తరములు జరుపగోరు వారు లేఖలు వ్రాయ వచ్చు. పూర్వ సత్సంగ మిత్రులు తప్పక రావలసి ఉంటుంది. ఇదే ఆహ్వానముగా స్వీకరించగలరు. 3) మీమీ యభిప్రాయములనూ, సూచనలను, విమర్శలు మేలుకొలుపుకే పంపిన క్రమంగా ప్రచురించగలము. (సశేషం)
 66. డా. సి హెచ్. గోవింద రాజులు వరంగల్, 67. సి హెచ్. కృష్ణమూర్తి వరంగల్, 68. డా. సి హెచ్. సుదర్శన్ వరంగల్, 69. వై. కే. శర్మకర్నాటక, 70. డా. వేద పరాయణి తిరుపతి, 71. జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ – హైదరాబాద్, 72. కె. సచ్చితానందమూర్తి, 73.స్వామి రామకృష్ణానంద, 74. డా. సి. సుధ, C/o. పిన్నమనేని పాలీక్లీ నిక్ విజయవాడ, 75. కొలిదిండి అప్పల సూర్యనారాయణ ఆకివీడు, 78. యం. యస్. రాజు చేరుకునిల్లి.
Book-Post
మా చిరునామా : మేలుకొలుపు C/o :సత్యాన్వేషణ మండలి,  సీతానగరం, పోలకంపాడు (పోస్ట్), తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. పిన్ 522515.
-

No comments:

Post a Comment