మేలుకొలుపు
సంపుటి - 1
సంచిక
– 2 / 15-5-1991
ఆశ్రమాధిపతుల
కర్తవ్యమూ-ఆశ్రమ భవిష్యత్తు:- ఒక పరిశీలన.
ఆర్యులారా,
శ్రీ విద్యానంద (వ్యాసాశ్రమం) వారితో ఉత్తర ప్రత్యుత్తర రూపంలో
సాగిన ఒక నాటి రేఖాంశమే ఈ వ్యాసరూపంగా పునః ప్రకటితము. ప్రస్తావితాంశము
సార్వకాలీనమైన విలువ కలిగి యున్నదగుట చేతనూ, ప్రతి సంఘ నిర్వాహకులూ (యదార్ధంగా
సామాజిక శ్రేయస్సు కలిగించుద్దేశము కలిగి యున్న ఎడల) అవశ్యం-వారికే స్పురించిగానీ,
మరొకరి నుండి స్పూర్తిని పొందిగానీ-గమనించి అమలు పరచదగిస దగుట చేతనూ,
శ్రీ విద్యానందులవారికి ముందుగా దీని ముద్రణ గూర్చి తెలుపకపోయిననూ
దీని ఔచిత్యమునూ, అవసరాన్ని వారు శంకించరని భావించుట చేతను,
ఒకనాటి, స్వామి వారికి వ్రాసిన లేఖను కొద్ది
మార్పులతో మీ ముందుంచుతున్నాను. మౌలికంగా సామాజిక సృహను కలిగియున్న మీరందరూ చిన్న పెద్ద
సంఘాల రూపంలో ప్రకటితమౌతున్నా, తులనాత్మక దృష్టితో దీనిని పరిశీలించగలరని
ఆశిస్తాను.
గమనిక :-
ఆశ్రమాలు అన్న పదం వెనుక నా భావం సామాజిక శ్రేయస్సును
కోరి
సమాజంలో ప్రవ ర్తిస్తున్న సంఘాలు-అవి నాస్తిక, ఆస్తిక , హేతువాదాది ఏ రూపంలో
నైనా ఉండొచ్చు-అని మాత్రమే. ఎందుకలా వివరించవలసి వచ్చింది? ఆర్థిక
సంఘాల పట్ల విరోధాన్ని, వైముఖ్యతనూ,
అట్లే ఒక సంఘం మరియొక సంఘము ఎడ చిన్న చూపునూ కలిగి యుండడమూ, నిష్పాక్షికంగా ఆయా సంఘాల స్థాపకుల హృదయాన్ని తట్టి చూడగలిగినప్పుడు అంత
చిన్న చూపు చూడదగిననిగా అవి లేకుండడమూ మాకు ఎదురైన యనుభవం. ఉదా : నాస్తిక కేంద్రం
అన్న పేరున నెలకొన్న గోరాగారి యత్నరూపాన్ని మేము చూసాము. లోపాల విషయమట్లుండనిండు
పార్టీ సిద్దాంతరూపం వాసవ్య-అన్న మాటలో యిమిడ్చినారు—వాస్తవికత,
సంఘదృష్టి, వ్యక్తి నిర్మాణము. ఆయన ఈ మూడు
మాటన్ని ప్రతిపాదించడాన్ని ఒక చూస్తే ఆయన జ్ఞానమున్నూ తాత్విక వేదిక కలిగియున్నదని
చెప్పి తీరాలి. ఆయా ప్రతిపాదనలు ఏ సంఘం పేరున ప్రతిపాదింపబడ్డాయి అని గాక, ఎంత విలువను కలిగియున్నవి అన్నది వాస్తవిక దృష్టి నుండి గమనించవలసిన
యంశము. ఆ దృష్టి నుండి నిష్కర్షగా చెప్పవలెనంటే వారున్నూ ఋషితుల్యులే, ఋషియే. అసందర్భం కాకపోవుటే గాక సత్య శోధకుల తులనాత్మక దృష్టికి కొంతబలం
చేకూర్చగల యంశముగా ఈ విషయాన్ని నేను భావించుటచే ఇట ఉటంకించాను. ప్రస్తుతాంశానికి
వస్తాను.
1.
ఉత్తరాధికారిని నియమించే విషయంలో ఆయా అశ్రమాధిపతుల సరైన సమగ్రమైన
యోచనచేయక పోవుటచేత ఆశ్రమ స్థాపకులయనంతరం - ఆశ్రమాలూ, నిర్వహణా, సమాజంలో ఆశ్రమాల
బాధ్యత అన్న నిషయాలు శోచనీయ స్థితిని పొందుతున్నాయి. ఈ విషయాన్ని కూడాక్లుప్తంగా
ప్రధమ సంచికలో మీ ముందుంచాను.
2. సన్యాసులకు,
ఆధ్యాత్మిక సంఘాలకూ, ఆశయాలకూ గురుతరమైన యనితర
సాధ్యమైన బాధ్యత ఉంది సహజంలో, వారూ, అవీ
సోమరితనానికి స్థానాలు కాకూడదు. ఉదా–మళయాళ స్వామి వారి యోజనలోనున్న
అత్యంత విశిష్ట విషయం కూడా యిదే. సోమరులకెచ్చటా చోటులేదనీ, నియమానికి
మించి శేయస్సు నిచ్చునది లేదని, ఈ రెండువిషయాలూ తు.చ. తప్పకుండా తానాచరిస్తూ,
ఆశ్రమవాసులచే, అసుయాయులచే–ఆచరింపజేస్తూ,
సమాజాన్ని కూడా తమ వెంట నడిపించవలసిన బాధ్యత వీరి-వీటి- పైన ఉంది.
ప్రస్థుతం ఆధ్యాత్మిక సంఘాల లోనూ, తదితర సామాజిక సంఘాలలోనూ ఈ
బాధ్యత విషయమైన లోటును మేము గమనించాము. ఎప్పుడైనా ఎవ్వరైనా-వారు ఇరు యధార్ద సాధకులూ,
సత్యశోధకులూనై యుండిన చాలు—పరీక్షించి చూచు
కోవచ్చు ఈ విషయాన్ని.
3. ఎట్టి విషయమైన
జ్ఞానాన్ని - వివేకాన్ని, తదనుగుణ్యాచరణనూ – సమాజాని అందించే
బాధ్యత, కర్తవ్యమూ ఆశ్రమాల పైనా, తాత్వికుల
పైనా ఉన్నదో, అట్టే విషయంలో ప్రస్తుత ప్రచారకులు ఎక్కువమంది వల్లే వేసే విధానాన్ని
కేవల వారా మాత్రంగా అనుసరిస్తున్నారన్నది సత్యదూరం కాదు. వారికి తాము చెపుతున్న
విషయంలో స్వానుభవ జ్ఞాన మేది? ఎంతమందిలో ఉంది. అంతా దాదాపుగా
వ్యపదేశ జ్ఞానమేకదా! - అంతవరకైనా వారి స్థాయి శోత్రియుడు అనడానికి అర్హమైన స్దాయిలో వాస్తవంగా
ఉంటున్నదా? అవునని ఘంటాపధంగా మాత్రం – చెప్పలేము. ఏదో
కొద్దికాలం ఒకటీ రెండు గ్రంధాలు చదివీ, కొన్ని శ్లోకాలు
కంఠతా పట్టీ, కొద్దిపాటి నామజపమో, ధ్యానమో,
యోగా భ్యాసమో, మత పునశ్చరణమో జరిపి దానిని
శోత్రియత్వంగానూ, దీనిని బ్రహ్మనిష్టగానూ, చేస్తున్నది విచారణ గానూ భావిస్తే అది భారతీయ తాత్విక మార్గాన్ని నిజంగా
అనుసరిస్తున్నట్లు అవుతుందా? భారతీయ తాత్విక శిల్పానికి
మెరుగులు దిద్దినట్లు గానీ, కనీసం దానిని చెడకుండా కాపాడి
భావితరానికి అందించినట్లు గానీ కాగలదా? తులనాత్మకంగా,
సత్యదృష్టితో ఆలోచించండి. వాస్తవాన్ని గుర్తించినా, గుర్తించక పోయినా అంగీకరించినా యంగీకరింపక పోయినా వాస్తవం వాస్తవమే.
సత్యమేవజయతేనానృతం. అస్తు. మరియు “స్వయం తీర్త్వా పరాం
స్థారయతి” అని గదా ఆర్యోక్తి. ఈనాటి ప్రచారకులలో ఎందరు
దీనిని గమనించారనీ, అనుగుణ్యంగానే వ్యవహరిస్తున్నారనీ
చెప్పగలం.
4. ప్రతి
ఆశ్రమాధిపతి, సంఘస్థాపకుడూ అనివార్యంగా ఏదోనాడు తమ..తమ
సంస్థలను మరోకరికి అప్పగింపక తప్పదు. ఈ విషయంలో ప్రస్తుత యాజమాన్యము - చేయబోయే
నిర్ణయం ధనుర్విముక్త శరం వంటిది. ముక్త శరం పై ధానుష్కని అదుపు వుండదు. ఒక వేళ ఆశ్రమాల
విషయంలో కొంత అదుపు పూర్వాధిపతుల కుంటుందని మనస్సుకు నచ్చనిప్పుకున్నా అది
ఆశ్రమవ్యవహారాలు అదుపు తప్పినప్పుడు సరిదిద్దగల స్థాయిలో మాత్రం ఉండదు. ఇక్కడ మరొక
వాస్తవం కూడా గమనించవలసి ఉంది. ఎక్కడైనా భావితరం ఆధిపత్యానికి వచ్చాక వెనుకటి తరం
వారిని అదుపు చేయడమో, పట్టించుకోక పోవడమో సమాజంలోని కుటుంబాల
నుండి ప్రతి సంఘాలలోను అనుభవంలో చూస్తున్నాము.
5. అధ్యాత్మిక
సంఘాలలో ధన ప్రభావం ప్రభలమవడం కూడా అనుభవంలో ఎదురవుతున్న సత్యమే అయితే, తాత్వికునికి ధనం ప్రధానం కాకుండా ఉండడం, ఆయాచితంగా
సమాజం నుండి లభించిన దానిని సమాజ శ్రేయస్సు కే వినియోగించగలగడం స్వభావంగా ఉండాలి.
ఉంటుందికూడా. వ్వక్తిగతంగా తనదంటూ ఏమీ లేని వారు గాను , సమిష్టిపరంగా
తనది కానిదేదీ లేనివాడుగానూ ఎవడుండగలడో, ఎవనికిట్టిభావన
స్వభాపంగా ఉంటుందో అతడే నిజమైన తాత్వికుడనాలి. అతడే వేత్త, సన్యాసి,
సాధువు, లోకహితుడున్నూ, ఆతడే జగానికి మార్గోపదేష్ట
(జగద్గురువు కావడానికి యర్హుడు. అయితే స్వభావరీత్యా అర్హుడైన యట్టి వానిచెంత
మార్గోపదేశం చేయగల ప్రణాళికా జ్ఞానం -అనుభవ ధారుడ్యంతో ఉన్నచో, అప్పుడు మాత్రమే సమాజానికి తాత్వికులయొక్కా, ఆధ్యాత్మిక
సంఘాలయొక్కా, ప్రయోజనం వాస్తవంగా అందివ్వబడుతుంది.
6. ఈ రోజు లోక కళ్యాణమే పరమార్థంగా పెట్టుకున్న ఋషి,
సాంప్రదాయానికి తగిన కార్యకర్తలు కావాలి. కార్యకర్త యనగా ప్రణాళికకు
వ్యక్త రూపమైన జీవిక కలిగి, తనలాంటి వారిని తయారు చేసికోగల
వ్యక్తి. ఇదొక్కటే మిగిలిన సామాజిక అవసరాల
నన్ని టినీ క్రమంగా పూరించగలదు. 7. ఆధ్యాత్మిక
సంఘాలు, సామాజిక సేవా సంస్థలూ అవి ఏ వర్గానికి చెంది,
ఏ, యే, పేరులతో
పిలవబడుతున్నా మానవుని భౌతిక, మానసిక యభివృద్ధికి ఆరోగ్య
ప్రధమైన శిక్షణాలయాలు కావాలి. సమర్ధులూ, సుశిక్షితులూ అయిన
మానవ యంత్రాలను నిర్మించే పరి శ్రమలు కావాలి. ఒక బ్రహ్మచారి, ఒక సాధకుడు, ఒక యతి, యిలా భిన్న
ప్రాయాలలో, భిన్న స్థితులలో ఉండి సాధనలు చేస్తున్న వారిలో ఎవరిని సమాజం చూసినా వినమ్ర
మవక తప్పని స్థితి, వీరిలో ప్రకటమవ్వాలి. ఇదే సమాజహితైషులూ, లోక
కళ్యాణ - కాంక్షులూ నైన తాత్వికులెల్లరి ఎడల నున్న గురుతరమూ, అనితర సాధ్యమూనైన బాధ్యత. దానిని నెరవేర్చాలి. అందుకై తగిన యోచన చేయాలి. ఆ
యోచన కార్యరూపం పొందడాని కొరకే జీవించ గలగాలి. ఇదే ధర్మపక్షానికి చెందిన
వాస్తవ-తాత్విక --రూపానికి హృదయం కాగలదు.
8.
ఏ నిర్ణయం తీసికోవడానికి గానీ క్షణం పట్టదు. కానీ అది ఉచితమా కాదా అన్నది
తేల్చుకోవడానికే ఎంతో యోచన చేయాల్సి ఉంటుంది. నిర్ణయానికి ముందే ఆ యోచన చేయడం
మరింత కష్టమైన విషయం. ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా మనందరి మీదా ఏదో కోణం నుండి
అట్టి బాధ్యత ఉంటున్నది. కొద్దిగా చూడగలిగినా తెలియగల యంశమే. సమయం
గడిచిపోతున్నదన్నదియూ, త్వరపడ వలసిన
అవసరం ఏర్పడిన దన్నదియూ,అందరం ముఖ్యంగా గమనించవలసిన యంశము.
ఎంతో కాలం, ఎంతో పరిశ్రమ తపస్సులు-శారీరకంగాను, మానసికంగాను కూడా - చేసిన ఫలితంగా ప్రస్తుత స్థితులలో నున్న ఆయా సంస్థలు
నిజంగా ఏ ఒక్కరి శ్రమా ఫలితాలు కావు. ఎందరో విశ్వాసంతో ఆశ్రమాలకూ, ఆయా సంస్థలకూ ఆలంబనగా తమతమ శక్తియుక్తుల్ని ధారపోయగా, ఏర్పడిన ఆయా సంస్థల ప్రస్తుత భౌతిక రూపము, సాధనా
వివేచనా రూపమైన మానసిక రూపము, మరింత ప్రవృద్దమై సమాజానికి భౌతికంగానూ,
మానసికంగానూ, మార్గదర్శనం చేయుటలోనూ, చేయగలిగేట్లు చూడడం లోనూ మాత్రమే వ్యక్తం కావాలి మనందరి. బాధ్యతా నిర్వహణ,
ఔచిత్యమూ. నిష్కర్షగా చెప్పాలి గనుక ఆశ్రమాలు, ఆయా సంస్థలు, భౌతికంగా ప్రబలమై
నంతగా, మానసికంగాను, భౌద్ధికంగానూ,
ఎదగలేదన్నది ఒక వాస్తవము. ఈ విషయమున్నూ మనలో పరిశీలనా
దృష్టికలవారందరూ గమనించగల యంశమే.
9. నియమ బద్ధతకు వెసులు బాటు ఏర్పడిన మరుక్షణం మనిషి
ప్రవర్తనలో అలసత్వం, భోగలాలసత్వం చోటుచేసుకుంటాయి. ఇందుకు
బౌద్దారామాలూ, అనేక అధ్యాత్మిక కేంద్రాలు గత చరిత్రలో మనకు
నిదర్శనాలు. మన మన యభిప్రాయముల నన్నిటినీ కేవలం లేఖల ద్వారానే వ్యక్త పరచుకోవడం
కాలహరణకూ, అచ్చటచ్చటా సంధిగ్దానికీ కారణమవచ్చు. కనుక
యధావకాశం మనం కలవగలిగిన శుభప్రదం కాగలదు. సమాజానికో మార్గదర్శినీ, శిక్షణాలయాన్నీ అందివ్వగలిగిననాడు ఎవరికి వారుగా తమ బాధ్యతను
పూర్తిచేసినట్లు కాగలదు.
10. గమనిక; - (ఆశ్రమాల, కేంద్రాల
నిర్వాహకులకు మాత్రం) ఇంత కాలంగా ఆశ్రమాధిపత్యాన్నీ నిర్వహణా
భారాన్నీ మోసి అలసిన మీరు ఆ యలసట వలన ఏది
ఏలా జరగాలనుంటే అలా జరుగు తుందనో, అనుకున్నది జరుగదు,
తనకున్నది తప్పదు అనో , మనం నిమిత్తమాత్రులం
అనో, యనుకునే అవకాశం ఉంది. అయితే తాత్విక హృదయం కలిగినఎవ్వరూ
అట్టినిర్ణయానికి రారనియే నా అభిప్రాయము. నేనెరిగిన, నా
యనుభవాలనుండి ఎదురైన విచారకర ఫలితాల వలన ఏర్పడ్డ ఆవేశ పూరిత వేదనా హృదయం వల్ల ఈ
లేఖలలో అచ్చ టచ్చటా ఒకింత తీవ్రత వ్యక్తపరుపబడుతుండవచ్చు. కానీ యవి సత్య దూరాలు
మాత్రం కావు. చక్కగా పరిశీలించి—విషయాన్ని (పఠించడం గాకుండా)
అధ్యయనం చేసి మీ స్పందనలను (అభిప్రాయాలు, సూచనలు, విమర్శలు, సందేహాలు] తెలియ పరచిన వాటినన్నీ ఒక
క్రమంలో ప్రకటింపగలము. వారి వారి స్థానాలకు మమ్మా హ్వానించిన సంతోషముగా రాగలము. మా
స్థానానికి రాదలచిన ఇదే మా యాహ్వానము. గమనించగలరు.
వ్యక్తి
నిర్మాణము ప్రస్తుత కర్తవము. అందుకుగానూ వ్యక్తులూ, వ్యక్తుల కొరకు సంస్థలూ అవశ్యం స్వీకరింపదగిన ఒక
కార్యక్రమ ప్రణాళిక సూచిస్తున్నాను. మీరూ పరిశీలించండి.
1. నియమిత
కాలాలలో మేల్కాంచుట, నిద్రించుట, కాలకృత్యములు
నెరవేర్చుకొనుట.
2. విధిగా
అందరూ శరీర దారుఢ్యాన్నివ్వగలా, ఆరోగ్యదాయకమైన వ్యాయామం
చేయడం (శారీరకంగా దుర్భలు లైన వారు క్రియాశీలంగా ఉండడం అరుదు.]
3. గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం,
సమయానికి వినియోగించుకోవడం అన్నవి జ్ఞాన సామర్థ్యానికి చెందిన
అంశాలు. వాటికై నిత్యమూ అభ్యాసరూపంగా మానసిక పరిశ్రమ కూడా అందరూ విధిగా చేయడం.
4. సమాజంలో
తన పాత్ర అన్న విషయంలో ఆశ్రమ వాసుల సాధకుల| కందరకూ విపులమైన,
స్పష్టమైన, గాఢమైన యవగాహన కలిగియుండగల నేర్పను,
వివేకాన్ని కలిగించడం.
5.ప్రతివ్యక్తీ-అతనే
స్థాయిలోనున్నా,తెలియవలసింది తెలుసుకోడానికి, తెలిసింది తెలుపడానికీ, సర్వ సన్నద్ధంగా ఉండే
స్వభావాన్ని నిర్మాణం చేయడం.
6. విద్య,
వివేకమూ, దేహదారుఢ్యమూ నన్నవి వ్యక్తిలోని
శక్తిరూపాలు. - అవి బలహీనులకు అందివ్వడానికీ, అన్యాయాన్ని
ఎదిరించడానికి, వ్యష్టి సమిష్టి అభివృద్ధికి ఉపయుక్తం
కావాలి. ఈ విషయం నేర్పేవారికీ, నేర్చుకునే వారికన్నీ జీర్ణం
కావలసి ఉంది.
7. పై
శక్తులు తనలో ఎదుగుతున్న కొద్దీ వివేక బలంచే వినయమూ, సేవాభావము
(బాధ్యతా స్వీకరణము) ఎదుగవలసి ఉంది. అప్పుడే యవి తమదైన సత్ఫలితాన్ని
యివ్వగలుగుతాయి.
8. నిరంతరం
ప్రవాహగతితో కార్యకర్తలు – సుశిక్షితులైన వ్యక్తులు--సృష్టింపబడాలన్నదే
అసలు రహస్యం. ఈ వివేకాన్ని ప్రతి సాధకుని లోనూ దృఢంగా నాటుకునేట్లు చేయగలగాలి.
9.కర్తవ్యపాలనలో తానే యితరులకు మార్గదర్శకుడిగా
ఉండగలగాలి - అన్న బాధ్యతా యుతమైన యోచనను, మనస్తత్వాన్నీ సాధన
- దశనుండే అందరిలో కలిగించ గలగాలి.
10. అహంకారమూ, డాంబికతా, స్వౌర్ధ పరత్వమూ, ఆధిక్యతాభావమూ, యివ్వడంకంటే. పుచ్చుకోవడం వేపే అధికంగా మొగ్గు చూపడమూ, అన్న యవాంఛనీయ లక్షణాలు తమ దరి చేరకుండా అనుక్షణం ప్రతి ఒక్కరూ జాక రూకత
వహించాలి. ఈ విషయంలో ఒక పర్యవేక సంఘము–ప్రధానంగా ఆయా
సంస్థలలోని యనుభవజ్ఞులు–అందరినీ పర్యవేక్షించే బాధ్యతను
స్వీకరించాలి. ఇది " అత్యంత ప్రధానమైన యంశము,
11. సత్యశోధన
యన్నది. ఈ సాధనా క్రమానికంతటికీ ఆయువు పట్టు, | అంతిమ
లక్ష్యంగా ఉండగలగాలి, ఈ విషయం అందరకూ స్పురణలో ఉండాలి.
12. నిరంతరం
సమాజములోనికి, సమాజానికి మార్గదర్శనం చేయగల వ్యక్తులను పంపడం
ఆశ్రమ-సంస్థల-ప్రధమ కర్తవ్యంగా భావించి తగిన రీతిలో కార్యక్రచూన్ని మలచుకోవాలి.
13.
వేదాంతమూ, వేదాంత సాధన యన్నవి సోమరితనానికి,
డాంబికతకూ అహంభావానికీ, వాచాలతకూ, ఉత్పాదకాలుగా కాక, కియాశీలతకూ, వినమ్రతకూ, నిరాడంబరమూ, నిరహంకార
పూరితమూ, ఆర్ధ్రమూ నైన స్వభావానికీ జనక స్థానాలుగా మలచబడాలి.
14. సమాజంలో
ప్రవృద్ధములౌతున్న ఆయా సంస్థలన్నీ ప్రస్తుత, భావిసమాజాలకు
కరదీపికలు కాగల ఆచరణాత్మకమైన ప్రణాళికను కూడా కలిగి యుండగలవనీ. అట్టి శ్రేయస్సును
ఓసగూర్చగల నిర్ణయాలను తీసికోగలరనీ ఆశిస్తూ నమస్సులతో.
సత్యాన్వేషణలో
మీ సురేంద
పత్రికను
పంపబడుతున్న వారి పేర్లు :- 1. శ్రీ
పెంచలయ్యగారు (వెంకటగిరి), 2. శ్రీ విద్యానంద స్వామి
వ్యాసాశ్రమం, 3. శ్రీ బోధ చైతన్య వ్యాసాశ్రమం, 4. శ్రీ నిర్వికల్పానందస్వామి. గుడివాడ, 5. శ్రీమతి B.
పద్మావతి– B. H. E. L., 6. శ్రీ K. శ్రీనివాసులు. తిరుపతి, 7. శ్రీ దయానంద సరస్వతి ఆర్షవిద్యాపీఠ్, 8. J, M. కృష్ణస్వామి, విజయవాడ, 9. A. L. K. R. రాజకుమార్, కాకినాడ,
10.సత్యసాయిబాబా, పుట్టపర్తి, 11
, త్రిదండి శ్రీమన్నా నారాయణ చినజీయరు స్వామి సీతానగరం, 12.
C. పాములేటి – నంద్యాల, 13. K. రామకృష్ణ, జిల్లెళ్ళమూడి, 14. K. చిన్మయి, నెల్లూరు, 15.
డా. వేదపారాయణ, తిరుపతి, 16. ప్రమోద- చైతన్య, హైద్రాబాద్
17. శ్రీ S. సోం ప్రకాష్,
తిరుపతి, 18. బ్రహ్మచారి గోపాల్, తిరుపతి, 19. శుకబ్రహ్మాశమం, శ్రీకాళహస్తి,
20. S. K. అక్బర్ బాదుషా, శ్రీకాళహస్తి,
21.S. మహేశ్వర్, హైద్రాబాద్, 22.
A. శ్రీనివాసులు, పుల్లం పేట, 23. G. విజయం, విజయవాడ, 24.
R. వెంకటాద్రి, చీరాల, 25. K. హనుమంతరావు, విజయవాడ, 26. శ్రీమతి
T. ఇందిరమ్మ, నెల్లూరు, 27. శ్రీ G. బాబూరావు, గుడివాడ, 28.ఓం ప్రకాష్, హైద్రాబాద్ 29. V. గోపాల కృష్ణశాస్త్రి, రాజమండ్రి, 30. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, సికింద్రాబాద్, 31.పండిట్ C.H. పాన్సిస్, వేటపాలెం,
32. A. పుల్లారావు, విశాఖపట్నం, 33.Y. రాంబాబు హైద్రాబాద్, 34.సుందర చైతన్యానంద ధవళేశ్వరం, 35. స్వామి రంగనాథానంద్,
హైద్రాబాద్, 36. పండిట్ గోపదేవ్, కూచిపూడి, 37. సేవాభారతి,38. శాంతి
సత్సంగ మండలి, 39. U. N. రెడ్డి, మదనపల్లి.
40. శ్రీరామ్ గారు, ఉయ్యూరు.
BOOK - POST From:
........... మేలుకొలుపు
సీతానగరం, పోల్కంపాడు, గుంటూరు జిల్లా, Pin 522515.
No comments:
Post a Comment