Sunday, May 6, 2018

మేలు కొలుపు 1-3

మేలు కొలుపు
సంపుటి 1                                    సంచిక 3                     15-5-1991
ఉత్తిష్టత! జాగ్రతః ప్రాప్యవరాన్ని బోధత !
మేలుకొలుపు అవసరం ?.                                    మేలుకోవలసిన అవసరం?
అమానుషమూ, పశు ప్రవృత్తికి ప్రత్యక్ష తార్కాణమూ నైన సంఘటన ద్వారా దుష్ట శక్తి మన కళ్ళముందే మరోసారి వీరవిహారం చేసింది. సమాజంలో, వ్యక్తుల దృక్పధాల్లో రాదగిన మార్పు రాకుంటే, యిలాటి సంఘటనలు సాధారణమై, సాధారణ వ్యక్తికి నిత్యానుభవ సంఘటనలుగా రూపొందుట నిశ్చయము. ఆట్టిస్థితే ఏర్పడితే అధర్మప్రతిఘటనోధ్యమానికి ఆయువు మూడినట్లే. ఎందుకంటే ఏ ఉద్యమానికైనా భౌతికశ క్తిగా రూపొందవలసియున్న ప్రజానీకంలో ఉదాసీనత చోటుచేసుకుంటుది కనుక. ఇది భవిష్యత్తులో సంఘ శ్రేయస్సునాకాంక్షించే వారల ఎదుటనున్న, ఎదురవనున్న మౌలిక సమస్య.
పోతే బలి అయింది. ఏవర్గం వారు అన్న దృష్టి నుండి ఈ సంఘటన ఆయావర్గాలవారిచే స్వీకరించబడి తదనుగుణంగా, అన్యాయం జరిగిపోయింది ప్రతీకారం తీర్చుకోవాలియనో, తగిన శాస్తి జరిగింది పీడ విరగడైందంటూనో వ్యాఖ్యానాలు, ఉదేకాలు, విసుర్లూ ప్రారంబింప బడతాయి. సంఘటనకు అనుకూలవర్గాలు సంబరాలుచేసుకోవడం, మద్యస్తులు (ఉదాసీనులు) పట్టనట్లుండడమో (ఈవర్గంవారికి సమాజంలో జరగకూడనిది, మానవసంఘం అంగీకరించరానిది అయిన సంఘటన జరిగింది అన్న సృహ కూడా ఉండదు ఆశ్చర్యము కదా!) ప్రతి కూలవర్గాలు (బలైనవారి అనుమాయులూ సానుభూతి పరులు) ప్రతిక్రియకై మరో విధ్వంస కాండకు ప్రణాళికల నేర్పరచుకుంటుండడమో, యిప్పటికే ప్రారంభింపబడి ఉండవచ్చు. ఈమూడు వర్గాలుకాక సంఘ విద్రోహశక్తులూ, అవకాశవాదులూ దోపిడీలకూ, విధ్వంసానికి పూనుకోవడం వరిపాటిగాకూడా అయిందన్నది మనందరి అనుభవంలోని సంగతే.
అయితే పై నాలుగు విధములైన సంఘాల వ్యక్తులలోనూ మౌలికంగా ఒకేధృక్పధం ఉందన్నదే అసలు గమనించవలసిన సమస్య. ఏవరేమైతేనేమీ మనమూ, మన స్వార్ధపూరిత  ఎదుగుదలా, అధికారమూ భద్రంగాఉంటే చాలునన్నదే ఆదృక్పధం. ఎందుకలా యనగలిగానంటే, బలై పోయిన వర్గం తమనష్టాన్ని పూడ్చుకోవడానికి ఎంచుకుంటున్న మార్గం ఏదో రూపంలో మరొక వర్గాన్ని బలిచేయుటయే. పైకి ఎంతమంది నాయకులు (ఐదాపు అన్ని పోరాలవారు)  ప్రశాంతంగా ఉండండి, ప్రతి క్రియాత్మక చర్యలూ, విద్వంసకాండా విడనాడండి అని చెపుతున్నా, జరిగేది మాత్రం మరో పాశవిక కార్యక్రమానికి నాందీవాచకమే. ఎందుకిలా జరుగుతోంది?
ససుగ్ర దృష్టి నుండి చెప్పాలంటే.1, వివేకం లోపించడం 2. సంఘ శ్రేయోదాయ కులం అన్న ముసుగువెనుక (ప్రస్తుతం వారే వర్గంలో ఉంటున్నా) స్వార్ధపరత్వమేఅధికారం చెలాయించడం 3. మానవత్వం మంటగలిసిపోయి ఉండడం 4. ప్రజలు అజ్ఞానులు, ఉద్రేకపరులూనై యుండడం ఇవన్నీ కలివిడిగా, ముడిపడి అటవిక-జంతు-న్యాయం వాస్తవంగా అసలు లోఉంది. గనుక ఈ విషయం యింత విపులంగా తెలియకపోయినా సమాజంలోని అన్నివర్గాల ప్రజలలోను ఈభావన కనీసస్తాయిలోనైనా ఉంది. కనుకనే ఎవరికివారు మన కెందుకులేయన్న అభిప్రాయానికి వస్తున్నారు. సామాజిక మంచి చెడులతోను, వాటివలన ఏర్పడుస్థితుల తోనూ ప్రతి వ్యక్తీముడిపడి ఉన్నాడన్న ఉపజ్ఞత నేడులుప్తమై ఉంది.
ఎవరినేమనగలం? ఒక వేళ అన్నా ఆన్నంతమాత్రాన ఒరిగేదేముంది? వ్యవస్థమారాలి. అది వ్యక్తి దృక్పదం మారడం అన్న మౌలిక ప్రాతిపదికపై నాధారపడి ఉందన్నవాస్తవం  అందరూ గమనించడమూ, నిజాయితీగాను, నిక్కచ్చిగాను ఆత్మ సంస్కరణకై యత్నించడమూ చేయాలి. మిగిలిన ప్రక్రియలన్నీ తాత్కాలికమే. ప్రస్తుత వికృతరూపం ఏ కొందరి వల్లనో, కొద్దికాలంలో ఏర్పడింది కాదు. వాస్తవంగా బహుకాలం, భిన్నవర్గాల అజ్ఞానజనిత స్వార్థపూరిత, కుటిలయత్నాల ఫలమిది. రోగం దీర్ఘకాలిక మైనదై సామాజిక శరీర జీవనాడుల్లో సైతం వ్యాపించి ఉంది. దీనికి కాయకల్ప చికిత్స జరుగవలసియుంది. అనగా సమాజంలోని ప్రతి భాగమూ సంస్కరింపబడాలన్నమాట.
మేలుకొలుపు  పిలుపు :- ఓ మేధావులారా ! స్వర్గాన్ని ఆ ప్రదానం చేసుకొండి మేల్కోండి. మేలుకొలపండి. పిలుపివ్వండి. దృఢమైన,నిత్యాభ్యాసరూపమైన కార్యక్రమాన్ని ఇంటింటికీ, వ్యక్తివ్యక్తికీ అందివ్వడం ద్యారామాత్రమే పైకాయకల్ప చికిత్స జరుగుతుంది. నాదిగొప్ప, నేనుగొప్పయన్న భావనవిడువండి. బ్రతికినన్నాళ్ళు బ్రతుకబోమన్న వాస్తవాన్ని గమనించండి. పశువులు పాశవికంగా ఉండడం అసాధారణం కాదు. మనిషి పాశవికంగా ఉండడమే అసాధారణమూ, అసహజమూను. అది నిజoగా పశుత్వం కంటే క్రింది స్థాయి వ్యవహారంకూడా. జరిగినదానిని గూర్చి విచారిస్తునో, మూర్ఖంగా సంబరపడుతునో-అది పైశాచికంకూడా - కాలంగడుపక సరైన మార్పుకైన యత్నారంభం చేయండి. అన్ని వర్గాలలోని , మంచివాళ్ళంతా కలపడమొక్కటే నేడు-ఏనాడైనా దుష్టశక్తుల నణచడానికి ఉపాయం. ఆలోచించండి! ఆలోచింపజేయండి. కదలండి! కదిలించండి.
వ్యక్తి నిర్మాణమే సకల సమస్యలకూ పరిష్కారం కాగలదు. ఉత్తిష్టత! జాగ్రత! ప్రాపపరాన్ని బోధత! | మేలుకొలుపు పిలుపంచుకోండి! మిమ్ము మీరు సంస్కరించుకోండి. మనలను మనమే సరిచేసుకుందాం రండి. ఉంటాను.   శలవ్.  సురేంద్ర                                                                      
                     ఆరోగ్యమూ       -        ఒక పరిశీలన
ఆర్యులారా 1
మానవ జీవితాన్ని లోతుగా అవలోకించిన మేధావులెందరో ఈ జీవితం అనేక కోణముల నుండి అధ్యయనం చేయదగినదిగానూ, చేయవలసినదిగాను గమనించారు. ఆ విశ్లేషణల నుండి ఉద్భవించినవే శాఖోపశాఖలుగ నున్న ఆస్థిక, నాస్థిక పోకడలన్నియూ. ఇప్పటికీ, సరికొత్తవీ, పాత కొత్తల మేలు కలయిక నుండి ఏర్పడినవీ అయిన ధృక్పధాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆయా దృష్టులకు సమగ్రత ఉన్నా లేక పోయినా కనీస వేదిక (సంఘ శ్రేయోదృష్టి) మాత్రం ఉన్నదనే యనుకోవాలి. అట్లనక పోయిన అవి ఆద్యంతమూ లోపభూయిష్టాలన్నట్లవు తుంది. అది యంత తులనాత్మక దృష్టి యనుకోను. మా పరిశీలనలో గమనింప బడినంత వరకు ప్రతి సిద్ధాంత రూపములోనూ ఎంతో కొంత అనుసరణీయత కొంత అసమగ్రత, కదాచిత్ లోపమూ కనబడుతూ వచ్బాయి. సమాజంలోని ఆయా పోకడల అధ్యయనం వల్లనూ, స్వీయ జీవితానుభవ విశ్లేషణల నుండి జనించిన యవగాహన వల్లనూ కొన్ని సార్వత్రికాంశములు గమనింపబడ్డవి. అట్టివే ఒక క్రమంలో ఒక్కొక్కటిగా మీముందుంచే యత్నం చేస్తున్నాను. సమీచీనమూ, హితకారకమూ, సత్యమూనైన యంశములు ఎటు నుండి వచ్చినా అవశ్యం సమాదరణీయమే నన్నది మీరందరున్నూ ఎరిగిన విషయమే ననుకొందును. మా కందిన సమాచారాన్ని బట్టి మేమెరిగిన సాధుమూర్తులలో వివేకపరంగా మీకూ సముచిత స్థానం మా మనస్సులో ఉండుట వల్లనూ, సమాజంలోకి కదలాలి, మేధావులను కదిలించాలి అన్న సదుద్దేశంలో భాగంగానూ ఈ లేఖా సముదాయాన్ని  క్రమంగా మీకందజేస్తున్నాను. ఇందుపై మీరందరూ సముచితంగానే స్పందించగలరని భావిస్తాను.
 బ్రాహ్మీకర్మ (తాత్విక జీవిత అధ్యయనాధ్యాపనములు) స్వధర్మంగా విధిగాస్వీకరించిన వారెల్లరి యాశయమూ, ఆదర్శమూ లోక హితమనుట నిర్వివాదము. అయితే ఇచ్చట లోకహిత మనునదేమి? అదెట్లు సిద్ధిస్తుంది? అన్నయంశాన్ని నిశితంగానూ, ఆచరణాత్మకంగానూ పరిశీలించి నిర్ణయించుకోవాలి. అటు వంటి పరిశీలనాంశాన్నే నా దృష్టి కోణం నుండి మీ ముందుంచే యత్నం చేస్తాను పరిశీలించండి.
Note: - పరికరంలేని పనియన్నది మన అనుభవంలో లేదు. ప్రతి పనికి ఎదో ఒక పరికరం తప్పనిసరి. ఒక సాధ్యాన్ని పొందుటకై యత్నించునప్పుడు సాధనంగా పరికరాన్ని , పద్దతినీ కూడా కలిపి స్వీకరించాలి (అసాధారణ కారణం కరణమవుతుంది. అది పరికరానికి పద్దతికి వర్తిస్తుంది )
పరిణామ శీలమైన ప్రకృతిలోని సమస్తమూ, క్రియావంతమై యున్నప్పటికీ చేతన పదార్దము నందలి జ్ఞాన వైశిష్ట్యము వల్ల యిచ్చ ఏర్పడి, తత్సిద్దికై ప్రయత్న రూపకర్మ ఏర్పడింది. ఇచ్చ సర్వమానవాళికిన్నీ దుఃఖ వియోగమూ, ఆనంద ప్రాప్తి నుద్దేశించియే ఉంటున్నది. అలాగే అర్ధ కామములు ఆనంద ప్రాప్తికి అధార భూతము లనునది యందరకూ అనుభవములోని విషయమే. అందువల్లనే ప్రతి వారూ వారి వారి జ్ఞాన క్రియాశక్తుల సామర్థ్యము ననుసరించి అర్దకామము పొంద యత్నించుచున్నారు. జీవితాన్ని (దాని స్వరూప స్వభావాలను సమగ్రంగా బోధపరచు కన్న తాత్వికులు, బుషులున్నూ, పురుషార్ధములను పేర అర్ధ కామముల నంగీకరించియే యున్నారు వారంగీకరించినారనియేగాక, అది యందరి యనుభవంలో నున్న విషయం కూడా. కాకుంటే కామముల యందలి వైవిథ్యమూ, దానిని సాదంచు వనరుల-ఆర్డము--యందలి వైవిధ్యమూ బహుగా గోచరిస్తున్నది. అంత మాత్రమే తేడా.
అయితే యిక్కడే సామాన్యులా, మేధావులా దృష్టులందు చాల వ్యత్యాసము కానుపించుచున్నది. పై మూటినీ (1. దుఃఖ వియోగమూ, ఆనంద ప్రాప్తి, 2. అర్థమూ, 3. కామము) సామాన్యులు యధేచ్చగా సాధించుకొన యత్నించుచుండ మేధావులు వాటిని సాధించుకొనుట ఈ పూర్వమే నీవు సాధించదగినది మరొకటి కలదనియూ, అది సాధింపబడి తద్వారా మిగిలినవి సాధింపబడినగానీ సమాజమున (వ్యష్టికీ, సమిష్టికి) భద్రత ఉండదనీ బోధించినారు. ధర్మమనునదే వారు ముందుగా సాధించదగినదిగా సూచించినది. ఇది ప్రధమ పురుషార్థము. దీని విషయమై ఏ సంప్రదాయస్తుల మధ్యనూ భిన్న దృష్టి లేదు. నాస్తికులు దానిని సామాజిక సంబంధాల పేరిట అంగీకరిస్తే, ఆస్తికులు కర్మసిద్దాంతం పేరిట స్వీకరిస్తారు.
ఎవరేవ రేయే కోణం నుండి చెప్పినా ధర్మం (చేయవలసింది చేయవలసినంతా చేయుట, తీసికొనవలసింది తీసికొనవలసినంతే తీసికొనుట అన్నదే ధర్మ స్వరూపం) అనవసరమని మాత్రం ఎవరూ చెప్పరు, చెప్పలేరు కూడా. ఆస్తికు లందలి అజ్ఞాతవాదాన్ని చెప్పే వారు (సృష్టి ఏర్పడలేదు అనే పక్షంవారు) కూడా వ్యవహారిక సత్తా అంటూ, ఒక భూమికను ఏర్పాటు చేసి ధర్మాన్ని అంగీకరిస్తారు. వేదం కూడా విధినిషేధాత్మకమైనదే. ఆస్థిక సంప్రదాయ మందలి అవతార ప్రసక్తిన్నీ ధర్మరక్షణతగా నేర్పడినదిగానే చెప్పబడింది. కనుక ధర్మమన్న పేరున చెప్పబడుతున్న కర్మ (వ్యకి చేయదగినవి, చేయకూడనివి, పొందదగినవీ, పొంద కూడనివి అన్నవి) అందరకూ వారి వారికి తగిన రీతిని అవశ్యమూ సమాదరణీయమై యున్నది.
పనికి పరికరం ఉండడం సార్వత్రిక నియమం అనుకున్నాముకదా! కనుక ధర్మ కర్మకున్నూ తగిన సాధనం ఉండి తీరాలి. దీనిని గమనించే పెద్దలుశారీర మాద్యంఖలు ధర్మ సాధనమ్" అని సూత్రీకరించినారు. మన యనుభవంలో కూడా అభీష్ట సిద్దికి వలయు యత్నం (ధర్మాధర్మ రూపాలలోనైనా) ఈ శరీరం ద్వారానే చేయబడుతుంది. కనుక అన్ని పురుషార్ధ ముల సాధనకూ, భోగానికిన్నీ ఆలంబనమైన ధర్మ కాయాన్ని సాధించుకొనడం ప్రస్తుతమూ, ప్రాథమికమూనని నిర్ధారణౌతున్నది. ఇది మూడు స్థాయిలలో సాదింపబడవలసి యుంది. 1. భౌతికం- స్తూల దేహం, 2. మానసికం-సూక్ష్మ దేహం ఇది ఇచ్చాశక్తి రూపంలో ఉంటుంది. 3. బౌద్ధికం. (విచక్షణా జ్ఞానం దీని రూపం) దీనినే కారణ దేహం అంటారు. వీటినే వెనుకటి వాళ్ళు దేహత్రయంగా పేర్కొన్నారు.
ఈ మూడు శరీరాలనూ ప్రస్తుతమున్న తీరునుండి ఉండవలసిన తీరు, సరిచేసినగాని సక్రమంగానూ, సమగ్రంగానూ పురుష సిద్దికి ఉపయోగింపబడజాలవు. అంతిమ పురుషార్ధ సిద్ధి కై వ్యక్తిని సమర్దుణ్ణి, అధికారిని చేయగలిగిందిది ఒక్కటే. దురదృష్టవశాత్తూ నేడు సమాజం     ఈ కాయత్రయం విషయంలోనే అలసత్వం కలిగి ఉంది. అందుకనే- సమ్యకాయం లేమిచేతనే- సమాజం నేడు అనూహ్యమైన రీతిని ఒడిదుడుకలకూ, వత్తిడులకూ, భద్రతా రాహిత్యానికీ, హింసకూ లోనవుతున్నది. మొట్ట మొదట మేధావులందరూ గుర్తించవసిన అందరిచే గమనింపజేయవలసిన అంశం యిదే. దీనికి పిదపనే వారి వారి సాంప్రదాయాలకు చెందిన మరే అంశమైనా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఉండాలి కూడా.
ప్రస్తుతం మార్గోపదేశకులూ, మేధావులూనైన ఆయా సంస్థల వారందరూ కలసి ఈ విషయమై ప్రణాళికాబద్ధమైన బృహత్కార్యక్రమాన్నేర్పరచుకోని, కలసిగానీ, లేక ఎవరికి వారుగాగాని అమలు పరచవలసి ఉంది. స్థూల దేహమును గూర్చి నేనుకున్న ప్రణాళికాక్రమం మీముందుంచుతాను. వివేచించండి.
1. శరీరాన్ని ఆరోగ్యవంతమూ, శక్తివంతమూ చేయుట. ఇది ఎలా?
అనారోగ్య కారణాన్నెరిగి దాన్ని తొలగిస్తే ఉండేది ఆరోగ్యమే. అనారోగ్య మనగా శరీరం ఉండకూడని స్థితి(అస్వస్థత). అవి 1. యివ్వవలసిన అహారము నివ్వక పోవుట 2. దుష్టాహారము నిచ్చుట, 3. శరీరగత మాలిన్యములను వ్యర్థ పదార్ద ములను విసర్జింపక పోవుట అన్న కారణాల వల్లనూ, మరొక వంక 1. చేయవలసిన పనులు చేయకపోవుట, 2. చేయకూడని పనులు చేయుట అన్న కారణాల వల్లనూ (ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే యుక్తాహార విహారాదులు లేకుండుట వలన) ఏర్పడుతున్నది. అస్వస్థతా నివారణోపాయములుగ మొదట 1. దృష్టాహారము నివ్వకుండుట 2. హితాహారమును మితముగ నొసంగుట 3. శరీర గత బహిష్కరణావయవములను శక్తివంతము చేసి మాలిన్యములను తొలగించు యను ప్రక్రియలచే సరిచేయబడవలసి యున్నది. మరో కోణం నుండి విహారమును కూడా సరిచేసికొనిన గానీ, మరల అస్వస్థత రాకుండునట్లు చేయుట సాధ్యపడదు..
ఇచ్చట ఒక విషయాన్ని గమనించవలసి యుంది. అది ఆరోగ్యమూ, బలమూ వేరు వేరు అన్న దే. వాటి మధ్యనున్న సాన్నిహిత్య సంబంధం వల్ల రెండూ ఒక్కటిగా అనిపించవచ్చు. ఎందుకంటే బలవంతుడు అనారోగ్యానికి గురి కావడమూ, తగినంత క్రియా సామర్థ్యం లేకన్నా ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పడానికీ, వీలుండడమూ వైద్యశాస్త్రానికి అనుభవంలో నున్న విషయమే. ఈ విషయం [బలమూ-ఆరోగ్యము రెండన్న సంగతి] గమనించినారు కనుకనే ఆహారాన్ని రెండుగా వర్గీకరించారు. 1. ఆరోగ్యదాయకనులైనవి. 2. శక్తి, బలమూ యివ్వగలిగినవి.
విటమినులూ, ఖనిజ లవణములూ మొదలైనవి ఆరోగ్యదాయకములుగానూ, మాంసకృత్తులూ, తైల పద్ధార్థములూ, పిండి పదార్థములూ శ క్తికీ, దేహ దారుఢ్యమునకూ ఆలంబనములుగనూ విజ్ఞానశాస్త్రం తెలియజేస్తుంది. యోగశాస్త్ర ప్రతిపాదితమైన ఆహార విధియందునూ ఈ యంశం ప్రకటింపబడింది. కనుకనే మనం తీసి కునే ఆహారమునందు ఆకు కూరలూ, పండ్లూ, పాలూ, మరికొన్ని కాయగూరలూ ఆరోగ్యదాయకములుగనూ, పిండి పదార్థములూ, పప్పు పదార్థములూ-మాంస కృత్తులు-తైల పదార్ధములు బలసంధాయకములుగనూ ఉన్నవి. ఇవి సమతౌల్యంగా ఉన్న ఆహారమే సంతులితాహారమవుతుంది. అట్టి యాహారము మరల వారి వారి శరీర స్థితిని బట్టీ, వృత్తి వ్యాపారముల ననుసరించి మిత నిర్ణయం చేయబడి హితాన్ని కలిగిస్తుంది. అట్టిమితమైన సంతులితాహారాన్నే యుక్తాహారమంటారు. యోగం కూడా యక్తాహార విహారములు లేక దుఃఖనాశాన్ని కలిగించలేదని గీత. మన యనుభవం కూడా అట్లే ఉంది. కనుక ఆహార స్వీకరణ మొదట క్రమబద్ధం చేయబడాలి. అదిన్నీ ఆరోగ్యాన్ని మొదటనూ, పిదప దారుడ్యమునూ ప్రాధాన్యత ననుసరించి స్వీకరించాలి. మామూలుగా - సాధారణంగా- రెంటినీ జోడించి సాధించు కోవాలి. ఆధ్యాత్మ దృష్టినుండి అత్యంత ప్రధానమూ, సూక్ష్మమూనైన ఈయంశం వర్తమాన ఆధ్యాత్మిక కేంద్రాలనూ, సమాజంలోనూ మరుగున పడి పోయింది. నవీన తాత్వికాలలో దీని ప్రాధాన్యతను గమనించినవాడు వివేకానందుడు.“ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలవారు కావాలి' అన్న ఆయన నినాదంలోని ఆంతర్యమిదే.“నాయమాత్మా బలహీనేనలభ్యః" అన్న శృతి వచనం కూడా దీనిని సూచించునదే. బలోపాసన, బలోపాసన, బలోపాసన, శారీరక, మానసిక, బౌద్ధికమైన బలాన్ని కలిగి వుండటం ఇదే ఈనాటి అవసరం.(అయితే మూడు దేహాలకు చెందిన బలములూ పరస్పర అనుకూల సంబంధాలు కలిగి (బుద్ధి శక్తి ననుసరిస్తూ) ప్రవర్తించగలగాలి. లేకుంటే బలం దుష్టత్వానికి కూడా బలం చేకూర్చగలదు) ఏనాటి అవసరమైనా యిదే. ఎందుకంటే బలమే కర్మ కాధారం. కర్మే ఫలాన్ని పుట్టించగలదు గనుక. అయితే ఆ బలం పై మూడు దేహాల విష యంలోనూ పొందబడవలసి ఉన్నప్పటికీ ప్రారంభం మాత్రం ఆరోగ్యాన్నీ, ధారుఢ్యాన్నీ యివ్వగల ఆహార స్వీకరణ నుండియే.
2. అట్లు ఆయా వ్యక్తుల శారీరక స్థితిగతుల ననుసరించి స్వీకరింపబడిన యుక్తాహారము శరీరానికి తగిన విధంగా వినియోగపడునట్లు క్రమబద్దమైన పరిశ్రమ చేయవలసి ఉంది. క్రమబద్ధ మైన పరిశ్రమ వలన శరీరావయవములన్నీ అవసరమైనంత మేర ఉత్తేజితములై కొంత - శక్తిని - పదార్థమును ఖర్చు చేయుటచే, స్వీక రింపబడిన పదార్దము వినియోగము లోనికి వస్తుంది. కనుకనే, వ్యాయామం వల్ల శక్తి ఖర్చు చేయబడ్డా పిదప స్వీకరించిన యాహారం అత్యధికంగా సద్వినియోగపడి - వంటబట్టి-బలం పుంజుకోబడుతుంది. 1. సంతులితాహార స్వీకరణమూ, 2. క్రమానుగత పరిశ్రమ ద్వారా దానిని శరీరం ఇముడ్చుకొనగలుగునట్లు  చేయుట అను ప్రక్రియల ద్వారా ఆరోగ్యమూ, దారుఢ్యమూ నిర్మాణము చేసి కొనుట, ఇదీ క్రమం. ఈ ప్రక్రియలోనే బహిష్కరణావయవముల నుద్దీపనము చేయుట, తద్వారా శరీరగత మాలిన్యములను వెడలజేయుట కూడా అంతర్భాగముగ నుంటున్నది.
ఇంత దనుక ప్రాధమిక సాధనమును శరీరమును శక్తివంతముగ జేయుటను గూర్చి చెప్పబడింది. ఆ స్థితి ఆ జీవితం నిలిపి వుంచుకొనదగినదై యుండుటచే పై క్రమాన్ని పాటించుట కూడా ఆ జీవితం అందరూ పరిశీలించదగి యున్నది.
అట్లే సూక్ష్మ శరీరమును గూడా సరిచేయవలసి ఉంది. ఏ దేహానికై నా  ప్రక్రియ పైన చెప్పిందే. అది ఆహార విహారములను క్రమపరచడమన్నదే. అయితే మానసిక శరీర స్వరూపాన్ని సంగ్రహంగాచూపి దాని ఆహార విహారములనుగూర్చి కూడా కొద్దిగా సూత్ర పాయంగా చెపుతాను. మానసిక శరీరమన్నది భౌతిక  శరీరాన్ని విడచి వేరుగా ఉన్నట్లు మనకేమీ యనుభవంలో లేదు. వెనుకటి వాళ్లునూ ; మనస్సు కూడా స్వీకరించిన ఆహారపు సూక్ష్మాంశ మే నన్న నిర్ణయం చేశారు. : ఈనాటి విజ్ఞానశాస్త్రం కూడా మనస్సూ పదార్ధ వికారమే నంటున్నది. కనుక ఈ సూక్ష్మ శరీరంగా, అవగాహనా సౌలభ్యం కోసం చెప్పుకొంటున్న మనోమయ దేహానికిన్నీ ఆహార విహారాలు ఒకింత కారణంగా ఉంటున్నాయి. ఈ దేహం యిష్టా యిష్టాలకు ప్రాతినిథ్యం వహిస్తుంది. యిష్టా యిష్టములు జ్ఞానేంద్రియ పంచకం ద్వారా స్వీకరిస్తున్న విషయానుభవజన్య జ్ఞానం నుండి ఏర్పడుతున్నవి. కనుక మనోకాయానికి రూపు, జ్ఞానేంద్రియాల ద్వారా విషయ రూపంగా స్వీకరిస్తున్న వాటినుండి ఏర్పడుతున్నదన్న మాట. కనుక ఈ కాయానికి ఆహారం ఇంద్రియ విషయాలుకూడా అవుతున్నాయి. కనుక సూక్ష్మ శరీరానికి ఆహారం క్రమబద్దంగా యివ్వడమనగా ఎట్టి విషయాలను స్వీకరించాలి. ఎట్టివి విడవాలి. ఎంతవర ఈ స్వీకరించాలి అన్నది పరిశీలించుకోవలసి ఉందన్న మాట.
అట్లే బౌద్దిక కాయం (విజ్ఞాన కాయం - విచక్షణాజ్ఞానం). ఈ శరీరం జ్ఞానరూపమై ఉంది. జ్ఞానాన్ని ఎట్లార్జించాలి. దోషరహితమైన జ్ఞానమనగా నేమి ? అట్లు దోష రహితమైన జ్ఞానం ఏర్పడకపోవుటకు గల అభ్యంతరా లేమి? వాటిని తొలగించుకొనుట ఎట్లు? ఈ విషయాలను పరిశీలించి బుద్ధికి ఆహార రూప మైన జ్ఞానాన్ని - యివ్వకూడనిది. యివ్వవలసింది అన్న దృష్టి నుండియూ, ఇప్పటికే దోషసహిత జ్ఞానం ఏ కోణం నుండిగాని, నీలో బుద్ధి రూపంలో చేరియున్న దానిని తొలగించుకొనడమూ అన్న దృష్టి నుండియూ, ఇలా మూడు ప్రక్రియల ద్వారా బౌద్ధిక మైన అర్ఘ కాయాన్ని సాధించుకోవాలి. ఆరోగ్య విషయమై మరో కోణాన్ని కూడా గమనించాలి.
జీవి మనుగడ- జీవనయాత- ఉద్దిష్ట లక్ష్యం వైపునకే కదలవలెనన్న దానికి తగిన దేహం అర్హకాయం పై మూడు దేహాల విషయంలోనూ అవసరం. ప్రకృతి ఒక క్రమంలో సమ్మేళనం పొందడం వల్లనే అట్టి దేహమేర్పడగలదు. ఆక్రమిత భంగపడిన అస్వస్థత ఏర్పడుతుంది. కనుక ఆక్రమాన్ని నిలిపి ఉంచుటకు మనిషి ప్రకృతితో - పంచభూతములతో - ననుబంధాన్ని కలిగి ఉండాలి. దానికై ప్రయత్న పూర్వకంగా ప్రకృతిని శుద్దముగ నుండునట్లు చేసికొనుట, అట్టి పరిశుద్ద, నిర్మల వాతావరణములో జీవికను సాగించుట అవసరమగుచున్నది. ఈ క్రమం యొక్క లోపమే నేటి నాగరిక ప్రపంచ శారీరక, మానసిక అనారోగ్య లక్షణములకు ప్రముఖ కారణమై ఉంది. తనయొక్క సాటి ప్రాణుల యొక్క హితమును గూర్చి కోర్కెగల వారెల్లరూ ముందుగా ఈ విషయమును గమనించి వాతావరణ కాలుష్యమును నివారించుటకే తనవంతు యత్నమును చేయుట, పరిశుద్ధ వాతావరణముతో సంబంధము కలిగి యుండునట్లు చూసుకొనుట చేయవలయును.
ప్రకృతి చికిత్సా విధానము రోగకారణమున్నూ, తన్నివారణమున్నూ ఈ  యంశము పైనే యాధారపడి యున్నవని తెలుపుచున్నది. “పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యధ' అన్న గీతావచనం కూడా. దీనిని వ్యక్తం చేయునదే. అట్లే యజ్ఞములూ, నిత్యాగ్ని ఆన్న వాటి వెనుక కూడా వాతావరణ కాలుష్య నివారణ ఒక ఆశయంగా యిమిడి ఉంది. అయితే ఈ విషయమూ లేమీ అతి రహస్యములు కాదు. కానీ అమలు పరుపబడుట లేదంతే. జీవనయాత్ర, గమనించుట ఆచరించుట అన్న రెండు ముఖాలు కలిగి ఉంటుంది. ఇది గమనించి పైమూడు దేహాల విషయంలోనూ ప్రస్తుతమున్న స్థితిని, ఉండవలసిన స్థితిని గమ నించుట, గమనించిన దానినుండి ఉండకూడనివి తొలగించుకుని, ఉండవలసిన స్థితికై యత్నించుట జరుగవలసి ఉంది. గమనించగలరు.
ఈ విషయమై విపులావగాహన కోరువారు సంప్రదించగలరు. అభ్యాసము కోరువారున్నూ కలవవచ్చును.
సత్యాన్వేషణలో---- మీ సురేంద్ర.
-------------------

పర్యావరణ శాస్త్రజ్ఞులను ఈ రోజు కలవర పెడుతున్న అంశం ప్రధానంగా వాతావరణ కాలుష్యమే. ప్రకృతి సమతౌల్యతను కోల్పోతూ ఉన్నది. అందువల్ల ముందు ముందు మానవ మనుగడకే- అస్థిత్వానికే ముప్పు రావచ్చన్నదే ఇప్పుడు వారి ముందున్న సమస్య. దీనికి కారణం అతిగా పెరిగిన విజ్ఞానం దుర్వినియోగం చేయబడడమే నన్నది ఒక వాస్తవము. అయితే సామాజిక శ్రేయోదాయకులము, శ్రేయోకాములము అని చెప్పుకునే ఆయా సిద్ధాంతకారులీ విషయాన్నెంతవరక గుర్తించారు? గుర్తించినా ఈ సమస్యా పరిష్కారానికై ఎంతవరకు చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నారు, జ్ఞానులము, (కొందరి విషయములో) పరిపూర్ణులము అనుకునే ఆధ్యాత్మవేత్త లీవిషయాన్ససలు గుర్తించారా? నిష్కర్షగా చెప్పాలంటే ఈ విషయా లేమీ వారికి పట్టపు పైగా ఎవరైనా చెప్పినా అక్కర లేని విషయంగానో, అప్రధాన మైన విషయం గానో కొట్టివేస్తారు. ఎందుకని?“లోకాసమస్తా సుఖినోభవంతు" అని వెనుకటి వాళ్ళన్న మాటను వర్ణించడమేగానీ దాని భావమేమి? అట్టి స్థితి సమాజాని జెట్లు సిద్ధిస్తుంది? అందుకై జరుగవలసిన దానిలో తన బాధ్యత ఎంత? అన్నదీ ఎక్కువ భాగం ఏ మాత్రమూ ఆలోచించరు. నిజంగా చెప్పాలంటే, తమకు బాగానే గడచి పోతున్నదిగదా! అన్నదే ఎక్కువమంది దృష్టి. ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నా ఇది ముమ్మాటికీ వాస్తవము. ఆరోగ్యమూ, బలమూ అన్న విషయాలలో - ముడి పడి ఉన్న అంశమే కాక అసలు ప్రాణిజాతం అస్తిత్వానికే సవాలుగా మారనున్న, మారుతున్న అంశమిది. అందరూ, అందరం ఆలోచించవలసిన, వెంటనే  తగిన విధంగా స్పందించవలసిన అంశమిది. ఆలోచించగలరు. ప్రస్తుతాంశమును ముగిస్తాను. నమస్సులు.

గత సంచిక తరువాయి
41. శ్రీ J. శివాజీ సికింద్రాబాద్, 42. శ్రీ S R. S. అయ్యంగార్, 43. శ్రీ K G. C. హరివిఠల్ PRINCIPAL S.R.R. & C.V.R Govt. College, 44. శ్రీ L. మంగయ్య, 45. శ్రీ B. రాజేంద్రప్రసాద్ M.Sc. ఉపాధ్యాయులు హైద్రాబాద్, 46.శ్రీ చిత్స్వరూపానంద,47 శ్రీమతి A. శారదాదేవి మెదక్, 48. శ్రీ ప్రయాగ సుబ్రహ్మణ్యం విశాకోడూరు, 49. శ్రీ K. దయానంద జగ్గయ్య పేట, 50. శ్రీ A. సాంబశివరావు  కంచికచర్ల, 51. శ్రీ C. L. నారాయణ  విజయవాడ, 52. శ్రీ T.V. రామకృష్ణ విజయవాడ, 53. శ్రీ G పాండవులు పొదిలి, 54. శ్రీ J. ఆచార్య గుంటూరు, 55. శ్రీ Dr. K. వేంకటేశ్వరరావు గుంటూరు.
సశేషం.
గమనిక :- మీవి మీకు తెలిసినవారివి పూర్తి చిరునామాలు పంపగోర్తాము.
1-6-1991
Book-Post
మా చిరునోమా : మేలుకొలుపు C/o సత్యాన్వేషణ మండలి సీతానగరం, పోలకంపాడు (P.0) తాడేపల్లిమండలం గుంటూరు జిల్లా పిన్-522 515



No comments:

Post a Comment