Friday, April 4, 2014

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఉద్యమ సమాచారం

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2013 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా విజయవాడ, కానూరులోని నాగార్జున హాస్పటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు శ్రీ పుట్టా సురేంద్రబాబు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో డా|| వి.బ్రహ్మారెడ్డి, జంపా క్రిష్ణకిషోర్‌, తోటకూర కృష్ణమూర్తిరాజు, పి.వేణుగోపాల్‌రెడ్డి, కోట ప్రసాద శివరావు, చెర్కూరి వెంకట్రామయ్య, ఎం.మాధవి, ఎం. శ్రీనివాసరావు, యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశ నిర్ణయాలు.

1. జిల్లా బాధ్యుల నియామకం : రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన నూతన బాధ్యులను ఎంపికచేసి ఆయా జిల్లాల బాధ్యతలను వారికి అప్పగించారు. అన్ని జిల్లాల్లో ఏప్రిల్‌ 15వ తేదీలోగా కమిటీల బాధ్యులను ఎంపికచేసుకోవాలి. అడ్‌హాక్‌ కమిటీలు ఏర్పరచినచో ఆయా కమిటీల బాధ్యులు నెలలోగా శాశ్వత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.

2. అన్ని జిల్లాల పాత కమిటీలు రద్దు : ఇప్పటివరకు కొనసాగుతున్న పాత జిల్లా కమిటీలన్నీ మార్చి 31 నాటికి రద్దుచేయటం జరిగింది.

వివిధ జిల్లాలకు రాష్ట్ర కమిటీ తరపున బాధ్యులుగా ఉన్న వారి వివరాలు :

వ.నెం. జిల్లా బాధ్యుల పేర్లు

1. కృష్ణా, పశ్చిమ గోదావరి కోట ప్రసాద శివరావు తోటకూర కృష్ణమూర్తి రాజు

2. గుంటూరు, ప్రకాశం యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు ఎం. మాధవి

3. ఆదిలాబాద్‌ (ఈస్ట్‌ & వెస్ట్‌), పి. వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌ టౌన్‌, నెల్లూరు

4. నల్గొండ, రంగారెడ్డి పుట్టా సురేంద్రబాబు

5. ఖమ్మం చెర్కూరి వెంకట్రామయ్య

6. కర్నూలు, అనంతపురం డా|| వి. బ్రహ్మారెడ్డి

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర మహాసభ మే 4,5 తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరపాలని నిర్ణయించటం జరిగింది. మే 4వ తేదీన అన్ని జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మరియు ముఖ్య బాధ్యులతో నిర్మాణ విషయాలపై చర్చ జరుగుతుంది. మే 5వ తేదీన రాష్ట్ర మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా కమిటీ సమావేశాలు మరియు మండల కమిటీల నిర్మాణాలు వివిధ జిల్లాల్లో జరిగాయి. శాశ్వత కమిటీ నిర్మాణము జరగని చోట అడ్‌హాక్‌ కమిటీలు వెయ్యటం జరిగింది. జిల్లా శాశ్వత కమిటీ నిర్మాణమునకు ఆ జిల్లాలోని కనీసం రెండు రెవిన్యూ డివిజన్ల నుండి 5 మండలాల్లో శాశ్వత కమిటీలు ఏర్పడి ఉండాలి. జిల్లా కమిటీలో అధ్యకక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. ఆ జిల్లాల లోని ఒక్కొక్క మండలం నుండి ఒక్కొక్కరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. జిల్లా కమిటీల బాధ్యులు మరియు మండల కమిటీ బాధ్యులు తప్పనిసరిగా ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకొని ఉండాలి. అలా పూర్తిచేసుకోని వారు బాధ్యతలు తీసుకున్న 3 నెలల్లోగా ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకోవాలి. అలానే జిల్లా బాధ్యులు నెలలో కనీసము 4 రోజులు మండల పర్యటన తదితర కార్యక్రమాలు చూడటానికి వెచ్చించవలసి ఉంటుంది. మండల శాశ్వత కమిటీ ఏర్పడాలంటే ఆ మండలంలోని కనీసం మూడు గ్రామాల ప్రాతినిధ్యంతో 15 మందికి తక్కువ కాకుండా సభ్యత్వం పొంది ఉండాలి. అందులో ఒక మహిళా ప్రాతినిధ్యం ఉండితీరాలి. మండల బాధ్యులు నెలలో కనీసం రెండు రోజులు గ్రామాల పర్యటన, తదుపరి కార్యక్రమాలు చూడటానికి సమయం ఇవ్వగలవారై ఉండాలి. ఈ విధానంలో జిల్లాకమిటీలు ఏర్పాటుచేసుకున్న జిల్లాలు, ఆయా వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి.

జిల్లా తేది నిర్వహించిన వారు

1. ఆదిలాబాద్‌ (తూ) 17.3.2013 పి.వేణుగోపాలరెడ్డి, సిహెచ్‌. వెంకట్రామయ్య 2. రంగారెడ్డి 07.3.2013 పుట్టా సురేంద్రబాబు, రాజేంద్రప్రసాద్‌ (ఎంవిఎఫ్‌)

3. ప్రకాశం 23.3.2013 పుట్టా సురేంద్రబాబు, ముప్పనేని వెంకటేశ్వర్లు (లోక్‌సత్తా)

4. నల్గొండ 30.3.2013 పుట్టా సురేంద్రబాబు, సునీల్‌ (ఎంవిఎఫ్‌)

5. గుంటూరు 31.3.2013 జంపా క్రిష్ణకిషోర్‌, ఎం.మాధవి, టి.వి.భాస్కర్‌

6. పశ్చిమగోదావరి 31.3.2013 తోటకూర కృష్ణమూర్తిరాజు, కోటప్రసాద శివరావు

7. ఆదిలాబాద్‌ (ప) 30.3.2013 పి.వేణుగోపాలరెడ్డి, సిహెచ్‌. వెంకట్రామయ్య

గమనిక : సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ప్రాథమిక శిక్షణా తరగతులు ఏప్రియల్‌ 6,7,8 తేదీలలో దోరకుంటలో జరుగుతాయి. దీనికి పైన పేర్కొన్న జిల్లా కమిటీల నుండి 30 మంది వరకు హాజరవుతున్నారు. ఔత్సాహికులు హాజరుకావాలనుకునే వారు ముందుగా తెలియపర్చగలరు.

No comments:

Post a Comment