Tuesday, September 1, 2015

దేశభక్తి - ఒక పరిశీలన


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
ముందుగా ఒక్కమాట! మనస్ఫూర్తిగా, మాట, చేతను కలుపుకొని, భారత దేశము నా మాతృభూమి, నేను భారతీయుణ్ణి, భారతీయులందరూ నా సహోదరులే అన్న రీతిని కనపరచగలవా? నిజంగా నీవిక్కడికి చేరిఉంటే, ఆ స్థాయికి చేరిన నీకుగాని, ఎవరికి గానీ దేశభక్తిని గురించి పెద్దగా చెప్పవలసిందేమీ ఉండదు. భావన చెప్పిన చొప్పిన, ఎంతెంతగా నడవగలమో చూసుకుంటూ, మరింతగా నడవడానికై ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగుతుండడమే చేయవలసిందిగా ఉంటుంది.
మన ప్రస్తుత ప్రధాన విచారణీయాంశమైన 'మత ప్రచారాలు - మత మార్పిడులు - ముంచుకొస్తున్న మహోపద్రవం' అన్నదానికి సంబంధించిన ధారావాహిక వ్యాసపరంపరలో భాగంగానే, అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారి, హైందవ క్రైస్తవాన్నీ, అలాి మరికొన్ని రచనలను శాస్త్రీయ విశ్లేషణకు లోనుచేయను మొదలెట్టుకున్నాం.
'హైందవ క్రైస్తవం' అన్న పుస్తకాన్ని ప్రచురించి, ప్రచారంలోకి తెచ్చిన ఓఫిర్‌గారు, అంతితో ఆగకుండా, ఈ పుస్తకములో తప్పులున్నాయని భారతదేశంలోని ఎవరు నిరూపించినా, హిందూధర్మ సంస్థలు తేల్చినా తాను హిందువునవుతానని ఛాలెంజ్‌ రూపంలో య్యూట్యూబ్‌ ద్వారా ఒక బహిరంగ ప్రకటన విడుదలచేశారు. ఆ పుస్తకంలో ఉన్నది సరైందేనని తాను నిరూపిస్తే, ఇతరులు తనవెంట క్రైస్తవంలో ప్రయాణించాల్సి ఉంటుందనీ అందులోనే ప్రకించారు. దానిపై నేను ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు, ఎప్పుడు, ఎక్కడ విచారణకు కూర్చుందామో చెప్పమని రిజిష్టరు లేఖలు రెండు వ్రాశాను. ఆ క్రమంలో భాగంగా మరికొందరు ఆయన పుస్తకంతో విభేధిస్తున్నవారు, ఆయనకు ప్రతి సవాలుచేస్తూ చర్చకు ఆహ్వానించినట్లు మాకు తెలియపర్చారు.
నిజానికాయన, నిరంతర సత్యాన్వేషినని ఆ పుస్తకంలో ప్రకించినదాన్ని బ్టిగాని, అంత ధీమాగా, ఒకింత సాహసమేననక తప్పని రూపంలో చేసిన ఛాలెంజి ప్రకటన రీతినిబ్టిగానీ, మా ప్రతి సవాలు లేఖ అందిన వెంటనే ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉందికనుక, ఆ నిమిషంలో ఫోన్‌చేసి గాని, ఎస్‌ఎమ్‌ఎస్‌ చేసిగాని, ఎప్పుడోఎందుకు ఇప్పుడే ఇదిగో సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు నేను చర్చకు సిద్ధం అని స్పందించి ఉండాల్సింది. కానీ ఏ కారణాల వల్లనో రెండునెలలు దాినా ఆయననుండి సమాధానం (కబురు) రాలేదింతవరకు. ఇది రాస్తున్నది 30-9-2015వ తేదీన. ఆయనగారి హైందవ క్రైస్తవం పుస్తకాన్ని మరోసారి చదువుతూ ముగింపుకొచ్చిన సందర్భంలో అట్టచివర పేజీలోని నాలుగు మాటలు మళ్ళా కంటబడ్డాయి. రంజిత్‌ ఓఫిర్‌గారి గురించి వ్రాయబడ్డ సమాచారం ఉంది అందులో. ఆ చిన్న రచనాభాగంలో..
1. దేశభక్తి, దైవభక్తి సమపాళ్ళలో మేళవించిన కుటుంబంలో ప్టుారని
2. భారతీయ వేదాంత సారాన్ని నరనరాన జీర్ణించుకొని ఉన్నారని
3. 6 సం||ల పసిప్రాయంలోనే రామాయణాన్ని చదివి జీర్ణించుకున్నారని
4. 12 సం||లు వచ్చేనాికి మహాభారతం, భాగవతం, మొదలైన సనాతన గ్రంథాలెన్నో చదివి జీర్ణించుకున్నారని
5. ఆయనగారితో ప్రస్తుత ధర్మోపదేశకులెవ్వరినీ పోల్చలేమని
6. గుండెలనిండా సాిమనిషిపట్ల ప్రేమ, దేశంపట్ల భక్తి నింపుకుని ఉన్నారని
7. 30 సం||ల తపస్సుకు ఫలితంగా దేవుడాయనకు సత్యాన్ని (అద్భుత సత్యాన్ని) ప్రకటపరిచాడని
8. ఆ సత్యాన్ని ఈ గ్రంథం ద్వారా మొదట భారత ప్రజలకు ఆపై ప్రపంచంలోని సత్యాన్వేషకులందరకు అందిస్తున్నారని
9. ఈ పుస్తకంలోని సమాచారం నేరుగా పైనుండి, సత్యలోకం నుండి వచ్చిందని
10. ఇందులో ఉన్న సమాచారం, ఈ భూమిమీదున్న ఏ పుస్తకంలోనూ లేదనీ
11. దీనిని వినమ్రులై చదివితే, పరాత్పరుడు చదివినవారితో మ్లాడి తన సత్యాన్ని  మనకు తెలియజేస్తాడని ప్రకింపజేశారు.
ఓ నిజానికీ 11 అంశాలను, అవి సరైనవేనని ఆయన రుజువుపర్చాల్సి ఉంది.
దేశభక్తి
ఈమాట దేశముపైన భక్తి, అనిగాని, దేశమును గురించి భక్తి అనిగాని విగ్రహం చేయాలి. దేశము +భక్తి అన్న రెండు పదాల సమాసమిది. ఆ రెండు మాటలగురించి వివరించుకుంటేగాని అవగాహనలో స్పష్టతరాదు.
భక్తి :- సాత్వస్మిన్‌ పరమప్రేమరూపా భక్తిః! అని భక్తికి నిర్వచనం. అంటే దీనియందు పరమప్రేమ - మిక్కిలి ఇష్టము లేదా శ్రేష్టమైన, మరిదేనినీ పోల్చడానికి వీల్లేనంత ఇష్టము (రాగము)- కలిగి ఉండడము అని.
ప్రపంచంలో ఉన్న విలువైన వాిని, ఇష్టమైన వాిని లేదా ఇష్టపడదగ్గ వాిని అన్నింనీ ఎదుటప్టిె ఏదోఒక్కదానిని మాత్రమే ఎంచుకోమని చెప్పినప్పుడు అన్నింనీ విడచి ఏ ఒక్కదానిని మాత్రమే స్వీకరిస్తామో అది మనకు మిక్కిలి ఇష్టము అని అర్థం. ఆస్తిక సాహిత్యం నుండి ప్టుిన పదం కనుక, దీనిని ప్రధానంగా దేవునికి వర్తింపజేస్తూ వాడడం వాడుకలో ఉంది. 'ఫలాని దేవుని భక్తుడు' అని సాధారణ ప్రయోగం ఉంది. గురుభక్తి, ఫలాని నాయకునియందు భక్తి, ఆరాధనాభావం, అన్నమాటలూ వాడుకలో ఉన్నయ్‌. ఇవన్నీ, వాివాి విషయంలో అమితమైన ఇష్టము అన్న అర్థంలో వాడుతున్న మాటలే.
అమితమైన ఇష్టమన్నదీనిని, దేశానికి వర్తింపజేస్తే  ఏర్పడే అన్వయరూపం ఏమి? ఎలాగుంటుంది?
దేశమంటే ఏమి? ఒక నిర్దేశిత ప్రాదేశికపు ఎల్లల మధ్యనున్న ప్రకృతి సంపద, దానికి హక్కుదారులుగా నున్న జనులు, వారందరినీ క్టిఉంచగల నడిపించగల కట్టడి అంటే ఒప్పందము, అన్న మూినీ కలిపితే దేశమవుతుంది. సాధారణ జనం - మామూలుగా - దేశమంటే ఈ నేల అనో, ఒకింత అవగాహన పెరిగితే, దేశమంటే మ్టికాదు, మనుషులనో అనడం (కద్దు) జరుగుతుంటుంది. నిజానికి దేశమంటే (మ్టి) ప్రకృతి సంపదేననికాని, అదికాదు మనుషులేనని గాని, అనుకునే రెండు భావనలు అవాస్తవాలు కావుగాని, పాక్షికమైనవి. దేశానికి మనం చెప్పుకోవలసిన పూర్ణరూపాలు కావవి. ఈ మరోరకంగా చెప్పుకుంటే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

సమాజమంటే ఏమి?

నిర్థిష్ట ప్రాదేశికపు ఎల్లల మధ్య ఉంటూ ఒక ఒప్పందానికి లోనయి జీవిస్తున్న జనసమూహాన్ని సమాజమాంము. ఈనాడు భూమిపైనున్న సమాజాలన్నీ ఆయా దేశాల పేర్లతోనే గుర్తింపబడుతున్నయ్‌. అందులోని ప్రతివ్యక్తీ ఆ దేశీయునిగనే గుర్తింపబడడం, నమోదుచేయబడడం జరుగుతోంది. ఆ దేశ పౌరులు అంారు వారిని. పౌరసత్వం కలిగి ఉండడం అంటే, ఆదేశంలోని జనాలమధ్య, వారేర్పరచుకున్న ఒప్పందానికి లోనై, హక్కులు, విధులు, బాధ్యతలు - కర్తవ్యాలుగా స్వీకరించి జీవించడానికి సమష్టి ఆమోదం పొందిఉండడం అని అర్థం.
ఆ దేశ పౌరుడన్నా, ఆదేశస్తుడన్నా, ఆ జాతీయుడన్నా, ఆ సామాజికుడన్నా ఈ సందర్భంలో ఒకటే అర్థం. (సమాజం అన్నదానికి అందరికీ వర్తించే ఒక కట్టుబాటు+ మొత్తం దేశంలోని జనం అన్నదే కాకుండా, ఒక కట్టుబాటుకు లోనై జీవిస్తున్న చిన్న సమూహాలు అనికూడా అర్థం వస్తుంది. కాని దాని విస్తృతార్థంలో సమాజమన్నదానికి దేశం అన్న అర్థమే సరైంది. మిగిలిన రూపాలన్నీ ఉప సమాజాలే అవుతాయి. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు లాివన్నీ ఈ ఉపసమాజాల క్రిందికి వస్తాయి. ఇలాివన్నీ మనం పైనచెప్పుకున్న దేశంలో భాగాలవుతాయి. ఈ ఉప సమాజాలలో వాిలో వాికి అంతర్గతంగా ఉన్న కట్టుబాట్లన్నీ, దేశం అనడానికి పెట్టుకున్న కట్టుబాటుకు లోబడి ఉంాయి. దేశపు కట్టుబాటును - ఒప్పందాన్ని - అతిక్రమించి గాని, కాదంటూ గాని ఈ ఉపసమాజాలేవీ ఉండడానికి వీలులేదు. ఆ ప్రధాన ఒప్పందాన్ని 'రాజ్యాంగం' అనాంరు. కనుక భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న సరిహద్దుల మధ్య నివశిస్తున్న  వారినే భారతదేశస్తులాంరు. అంటే భారత దేశంగా గుర్తిస్తున్న ప్రదేశము, భారత రాజ్యాంగము - దానికి లోబడి జీవిస్తున్న జనము- కలసి భారతదేశమవుతుంది. దేశాన్ని గురించి ఈరకంగా అర్థం చేసుకుంటేనే అది శాస్త్రీయ - సరైన - అవగాహన అవుతుంది. ఇంతకు ఏమాత్రం తగ్గినా, అది 'దేశభక్తి' అనే పదబంధంలోని దేశమన్న మాటకు సరైన అర్థం కాకుండా పోతుంది. కనుక దేశమంటే ఏమని చెప్పుకోవడం సరైందవుతుందని తేలినట్లు?
సూత్రము : భూమిపై ఒక నిర్థిష్ట ప్రదేశము, అందలి సంపద, అందుండే జనులు, వారినొక కట్టగా నిలిపి, నడిపిస్తుండే ఒప్పందము. ఇదే దేశమంటే. ముప్పిరిగొన్న ఈ మూితో కూడిన ఒక్కినే దేశమనుకుంటే, మరి దేశభక్తంటే ఏమవుతుంది?
ఈ మూిపట్ల, మిగతావేికంటెనూ అధికతమైన ప్రేమకలిగి ఉండడాన్నే దేశభక్తి అనాంరు. 'మిగతా వాికంటే' అన్నమాట ఈ వ్యాసానికంతికీ కేంద్రబిందువు అయిఉంది. ఆ 'మిగతావి' అంటే ఏమిో, వాి వివిధ రూపాలు ఈ దేశంలో ఎలా ఉనికిలో ఉంటున్నాయో స్పష్టంగా తెలిసి ఉండకపోతే, దేశభక్తికి సరైన అర్థం చెప్పుకోలేము. సరైన అన్వయాన్నీ చేయలేము. ఒక వ్యక్తి దేశభక్తుడో కాదో నిర్ణయించడమూ కష్టమవుతుంది.
మనపెద్దవాళ్ళు సమాజాన్ని 3 ప్రధాన విభాగాలుగా విడదీసి వివరించే పనిచేశారు. సాంఘికం, ఆర్థికం, రాజకీయం అన్నవే ఆ మూడు క్షేత్రాలు.
సాంఘికం : క్రింద వివాహం, కుటుంబం, కులం, మతం, ప్రాంతం అన్నవి ఉప భాగాలు కాగా మొత్తం దేశం పెద్దదైన ఒకి అవుతుంది. అందులో ఏదైనా దానిలో భాగమే. ఎన్నికలిసైనా అందులో భాగాలే అవుతాయి. (సహజసిద్దాలు, మానవకృతాలు ఉంాయి ఇందులో)
ఆర్థికం : ఆయా అవసరాలు తీర్చేవి, వాటన్నిం విషయంలో వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే రూపమైన నియమనిబంధనలు అన్నీ కలిపి ఈ భాగం క్రిందకు వస్తాయి.
రాజకీయం : ఆ ఒప్పందం ద్వారా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా వ్యవస్థనంతినీ కలిపి రాజకీయం అనంటున్నాం. అంటే మొత్తం దేశాన్ని రాజ్యం అనాంము. దానిని నిలిపి ఉంచుకోడానికీ, నడిపించుకోడానికీ ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రాజ్యాంగం అనాంము. ఆ ఒప్పందాన్ననుసరించి ఆ రాజ్యాన్ని కొనసాగించుకోడానికి ఏర్పరచుకున్న పాలనా విభాగాన్ని రూపొందించుకోడానికీ, కొనసాగించుకోడానికీ, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోడానికీ ఏర్పరచుకున్న విభాగాన్ని రాజకీయం అనాంము.
ప్రస్తుత మన రాజ్యాంగ లక్ష్యం 'పౌరుల మధ్య సమానత్వ సాధన' అన్నదే. భారత రాజ్యాంగంలోని ప్రస్తావన - ప్రియాంబుల్‌ - అన్న భాగం మనమేర్పరచుకున్న లక్ష్యాలను, దానిని సాధించుకోడానికి ఎంచుకున్న వ్యవస్థ సాధారణ రూపాన్ని గురించి నిర్థిష్టంగా ప్రకిస్తోంది.
మనది,  సర్వసత్తాకమైన సమాజం - దేశం. అంటే మన దేశంపై, బయటవారి పెత్తనం ఏ రూపంలోనూ లేదు. అలాగే లోపలున్న ఎవరో కొందరి పెత్తనమూ దీనిపై ఉండదు. ఉండరాదు. అందుకోసమే మనం ప్రజాస్వామ్యాన్ని మన లక్ష్యాలకు తగిన వ్యవస్థగా ఎంచుకున్నాం. దీని సాధారణ రూపం ప్రజలందరూ ఈ మొత్తానికి సమానంగా యాజమాన్యపు భాగస్వాములు అన్నదే. మన రాజ్యాంగ నిర్మాతలు, మొత్తం సమాజాన్ని 3గా విభజించి, ఆ మూడు కోణాలలోనూ సమానత్వం సాధించుకొమ్మని ఉపదేవించారు. పైన చెప్పుకున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయాలన్నవే ఆ మూడూ. అంటే, సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం అన్నవి సాధించుకోవాలనుకుంటున్నామన్న మాట. దీనినే పారిభాషికంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్య సాధన అనాంరు.
మానవుని స్వభావాన్ననుసరించి స్వేచ్చ = స్వీయ ఇచ్చ = తనకున్న ఇష్టం, నెరవేరాలన్నది, నెరవేరుతూ ఉండాలన్నది  మిగిలిన అన్నింకంటే ముఖ్యమైన ఆకాంక్ష్యగా ఉంటుంది. సుఖశాంతులుండాలి. దుఃఖము, అశాంతి ఉండకూడదు అన్నదీ స్వేచ్ఛయొక్క వినియోగ రూపం. స్వఇచ్చ నెరవేర్పు అన్నది ఒంటరి జీవితంలో పూర్ణరూపంలో సాధ్యపడదు అన్న అవగాహన కలిగాక, స్వేచ్చా పరిపూర్తి అన్నది ప్రకృతితోనూ, సాి ప్రాణులతోనూ సహజీవనం చేయడం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అన్న అవగాహన కలిగాకనే మనిషి సహజీవనానికీ, అందుకు అవసరమైన సర్దుబాటుకు సిద్ధమైనాడు. పుచ్చుకోవడమొక్కదానిపైనే దృష్టిపెడితే కథ నడవదన్నది అనుభవం నుండి గ్రహించాక ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మాత్రమే పూర్తిగా కాకున్నా, క్రమానుగతంగా ఎక్కువలో ఎక్కువ సుఖశాంతులనందుకోవచ్చని, తక్కువలో తక్కువ స్థాయికి దుఃఖాన్ని, అశాంతిని నియంత్రించవచ్చని తేల్చుకుని అందుకు అవసరమైన ఒక ఒడంబడికకు సిద్ధమైనాడు. దాంతో ప్రకృతిని, సాివారిని కాపాడుకుంటుంటేనే అవి తనకు ఉపయోగపడుతూ సుఖశాంతులకు కారకాలు కాగలుతాయని తెలిసి ఆ రకంగా ప్రవర్తించడానికి సిద్ధమైనాడు. ఇక్కడికిదంతా సంఘజీవితం ఏర్పడడానికి, సంఘజీవులుగా కొనసాగడానికి పూర్వరంగంగా ఉన్నదే. ఈ థవరకు మానవుని దృష్టంతా స్వార్థప్రయోజనాల నెరవేర్పు నుద్దేశించిందే. ఇక్కడివరకు ఆయా వస్తువులు, విషయాలు, వ్యక్తులపట్ల అవసరాలు తీర్చేవి, తీర్చనివి అన్న దృష్టినుండి ఏర్పడిన ఇష్టాఇష్టాలేగాని, ప్రేమ - ప్రతిఫలాకాంక్షలేని ఇష్టం అన్నది ప్రవేశించనే లేదు. ప్రేమకు తొలిరూపు, సహజరూపు, తల్లీబిడ్డా విషయంలో కనబరిచే వైఖరేననవచ్చు. అక్కడ బిడ్డ తనకేదో ఇస్తుందనిగానీ, తన అవసరం తీర్చుతుందని గానీ అనుకొని బిడ్డను ఇష్టపడదు తల్లి. కనుకనే మాతృప్రేమనే సహజ ప్రేమ - సహజాత ప్రేమగా చెబుతారు విజ్ఞులు.

ప్రేమంటే?!....

ప్రతిఫలం కోరని ఇష్టం - అంతేకాదు, దానికై తనను, తన అవసరాలను ప్టించుకోనంత ఇష్టం. దాని యోగక్షేమాలకై తనను తగ్గించుకొనేందుకు, తాను ఖర్చయ్యేందుకు సిద్ధపడేంత ఇష్టం, అందుకై శక్తి ఉన్నంతలో కష్టాలను, దుఃఖాన్ని, అశాంతినీ ఇచ్చేవాిని, భరించేందుకు సిద్ధపడేలా చేసే ఇష్టం. అర్థమవుతోందా మిత్రులారా! అదిగో ఆ క్షేత్రంలో వాడాల్సిన పదం 'ప్రేమ' అన్నది. అంతకు తగ్గిన ఏ ఇష్టాల విషయంలోనూ 'ప్రేమ' అన్న పదం వాడకూడదు.
ఇక భక్తంటే అటువిం ప్రేమకు పరాకాష్టస్థితన్నమాట. అంటే హద్దుల్లేని ప్రేమ. మరి దేనితోనూ పోల్చడానికి వీల్లేనంత ప్రేమ. ఇష్టమైన వాిలో దేనిని గానీ, అన్నింనైనా వదులుకోడానికి సిద్ధపడగలంత ప్రేమ. అదిగో దానినాంరు 'భక్తి' అని. అవసరాల కోసం దేవుడి వెంటపడేదాన్ని దైవభక్తి అనకూడదు. ఎటువిం స్వార్థ ప్రయోజనాల దృష్టి ఏర్పడి ఉన్నా వాికొరకు దేవుణ్ణి ఎంతగా ప్రార్థించినా, దేవుడి వెంటపడినా దానిని 'భక్తి' అనకూడదు. ఒక భయం కారణంగానో, ఒక ఆశ కారణంగానో దేవుణ్ని ఆశ్రయించడాన్ని 'భక్తి' అనకూడదు. 'లేనా - దేనా' ప్రక్రియ నడుస్తుంన్నంత కాలం 'నీకిదిస్తాను, నాకదివ్వు' అంటూ ఎన్ని మొత్తుకోళ్ళు, ఎంత పెద్దఎత్తున, ఎంతకాలం చేసినా దానిని 'భక్తి' అనకూడదు. ఇచ్చిపుచ్చుకున్నా, పుచ్చుకొని ఇచ్చినా, ఇచ్చిపుచ్చుకొనే సంబంధం ఉన్నంతవరకు ఉండాలని కోరుకుంటున్నంత వరకు దానిని వ్యాపారమనే అనితీరాలి. వ్యాపార స్వభావం ఉన్నంతవరకు అి్టదానిని దేనినీ భక్తి అననే కూడదు. అర్థమవుతోందా మిత్రులారా.
దైవభక్తి
భక్తిలో వ్యాపారం ఉండదు. స్వప్రయోజనాకాంక్ష ఉండదు. అి్టది ఉన్నంతకాలం దానిని 'భక్తి' అనకూడదు. ఇదర్థమైతేగాని, 'దైవభక్తి'కి అన్వయం చెప్పుకోవడం గానీ, దైవభక్తి ఉందా లేదా అతనిలోనన్నది పరీక్షించడం గాని కుదరదు.
ఉదా : ఒకవ్యక్తి స్వర్గం రావాలనో, నరకం రాకూడదనో దైవాన్ని ప్రార్థించడం (స్తుతించడం - వేడుకోవడం) చేస్తున్నాడనుకోండి. దానిని దైవభక్తి అనకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మడం వేరు, దేవుణ్ని అమితంగా ఇష్టపడడం వేరు. ఉన్నాడనుకున్న వాళ్ళతోనే వ్యాపారమైనా చేసేది. కనుక దేవుడున్నాడని ఎంత గ్టిగా నమ్మినా దానిని దైవభక్తి అనకూడదు. ఒక్కమాట చెప్పనా? బైబిలు, ఖురానుల ప్రాతిపదికల్లోనే 'భక్తి' అనేది లేదు. ఆ రెండు ధోరణులు దేవుణ్ణి బండగా నమ్మడం తప్పనిసరి అంాయి. నమ్మకుంటే ఈ లోకంలోనూ, పైలోకంలోనూ శిక్షలు (నరకం) తప్పదాంయి. ఎన్ని మంచి పనులు చేసినా, నమ్మడం అన్నది లేకుంటే అవన్నీ నీకు నరకాన్ని తప్పించలేవు. స్వర్గాన్ని ఇప్పించలేవు అని అంాయి. కనుకనే ఆ రెండు థోరణులననుసరించేవారి దృష్టంతా నరకాన్నెలా తప్పించుకోవాలి? స్వర్గాన్నెలా ప్రాప్తించుకోవాలన్న దగ్గరే ఉంటుంది. ఆయా గ్రంథాలు చెప్పే మాటలలో స్వర్గం రాదని గానీ, నరకం పోదని గానీ అనుమానం వచ్చినా, అడిగిందిస్తాడో లేదోనన్న అనుమానం  వచ్చినా, ఆ థోరణిలోని దేవుణ్ని కాదని మరోథోరణిలోకి జారిపోవడం - చేరిపోవడం - చేస్తుాంరు ఆ రకమంతా. ఆయా గ్రంథాలు ఎలా నడవమంటే అలా నడవడానికి సిద్ధపడేదీ. ఆ క్రమంలో ఎవరినైనా చంపడానికి సిద్ధపడేదీ, స్వర్గ నరక సంబంధమైన ప్రతిఫలాల కొరకు మాత్రమే. ఆ ధోరణుల దేవుళ్ళున్నూ వారికి స్వర్గం ఇవ్వడం కొరకే, తనకోసం వారి ప్రాణాలనూ కొన్నామని విస్పష్టంగా ప్రకించారు. ఆయన ప్రయోజనం ఆయనది. వీరి ప్రయోజనం వీరిది. కనుక బైబిల్‌, ఖురాన్‌ సంప్రదాయాల ప్రాతిపదికల్లోనే 'భక్తి'కి తావులేదు. అంతా వ్యాపారపు గొడవే.
'నన్ను ప్రార్థించండి, నేను చెప్పిన పనులు చేయండి. ఇతరులను ప్రార్థించకండి. వారు చెప్పిన పనులు చేయకండి. మీకిష్టమున్నా, లేకున్నా ఈ మార్గంలోనే నడవండి. ఇతర మార్గాల నడవకండి. ఈ రిెంకీ మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది'. అన్నదే ఆ ఇద్దరి దేవుళ్ళ ప్రతిపాదన. నాయీ మాటలు సత్యాలు కాదనిపిస్తే ఆ రెండు గ్రంథాలను దగ్గరెట్టుకొని చూద్దాం రండి.
ఒక్క భారతీయ ఆస్తిక సంప్రదాయంలోనే ఈ స్వర్గ నరకాల గొడవతో పాటు ఈలోక బోగాలు వద్దు, స్వర్గలోక భోగాలు వద్దు. 'ఇహాముత్ర ఫలభోగ విరాగం'; అన్న మూడో పంథాను గురించిన ప్రస్తావన ఉంది. ప్రతిఫలాకాంక్షలేని త్యాగభావన ఉంది.
ఆవేశంలో చేసే త్యాగాలు, అవగాహనతో చేసే త్యాగాలు అని త్యాగరూపాలు రెండు. అందులోనూ అవగాహనతో చేసే త్యాగరూపం దగ్గరే 'భక్తి' నిర్వచనానికి తగిన లక్షణం ఉంటుంది. ప్రపంచంలోని - విశ్వంలోని - సమస్తాన్ని ఒకప్రక్కనుంచి, దేవుణ్ని ఒకప్రక్కనుంచి రిెంలో ఏదోఒకదాన్నే కోరుకోమన్నప్పుడు దేవుడు చాలు అని సుస్థిరంగా, నిస్సందేహంగా ఎటువిం ఊగిసలాట లేకుండా, క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయించుకోగలిగినవాణ్ణే దేవునియందు అమితమైన ఇష్టం - భక్తి - కలిగినవాడనాలి. ఇంతకు ఏమాత్రం తగ్గినా దానిని భక్తి అనిమాత్రం అనకూడదు. అతణ్ణి భక్తుడనీ అనకూడదు.
భక్తి పేరున జరుగుతున్న వ్యాపారం
ఇప్పుడు ఆస్తిక లోకంలో జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇందులో 'భక్తి' అనడానికి తగిన అంశాలు దాదాపు లేవనే అనవచ్చు. అందులోనూ మంచి వ్యాపారం అనదగ్గ భాగమూ కొద్దిగానే ఉంోంది. దేవుని పేరున చేసినదెంతో అంతకు తగిన ఫలితం వస్తే చాలని స్థిరంగా నిర్ణయించుకొని, దేవుడా! చేసినదానికి సరిపడా ఇవ్వు చాలు అనగలిగి, అంతకంటే అధికం పుచ్చుకోడానికి అంగీకరించని వారి వ్యాపారమే మంచి వ్యాపారం అవుతుంది. వీలైనంత తక్కువిచ్చి, వీలైనంత ఎక్కువ రావాలనుకొనే, పుచ్చుకొనే వ్యాపారం, అది వ్యాపారంగానూ తప్పుడు వ్యాపారమే. ఇది వ్యాపారపు సాధారణ సూత్రం. మారకం సమాన విలువల మధ్య జరిగితేనే, మారకం ధర్మబద్దంగా - న్యాయసమ్మతంగా - నీతిమంతంగా జరిగిందనగలం అన్నది అర్థశాస్త్ర ప్రాతిపదికలో ఒకి.
బైబిలు పాత నిబంధన, ఖురాను అన్నవి రెండూ దైవమార్గంలో ధన, మన, ప్రాణాలనిచ్చి స్వర్గ ప్రవేశానికి అనుమతి పొందండనే చెబుతున్నాయి. ఒకీ అరా మాటలు నాకంటే అధికంగా ప్రేమించదగినవాడు నీకుండకూడదు. అలా ఉంటే నీకిక స్వర్గానికి చెల్లుచీనే ఇవ్వబడుతుందని, రెండు గ్రంథాలలోని దేవుళ్ళు స్పష్టంగా ప్రకించారు. ఇక్కడుండగా ఆయన్ను ఇష్టపడడం నిజంగా ఆయనంటే ప్రేమ ఉండడం కాదు. ఇష్టపడకుంటే స్వర్గం రాదు, సరికదా, నరకం వస్తుంది కూడా అన్నదే. ఇంతకూ వీళ్ళంతగా స్వర్గాన్నెందుకు కోరుకుంటున్నారు? ఆ దేవుళ్ళిద్దరూ స్వర్గాన్నంతగా ఆశచూపించి తమకు లొంగి ఉండేట్లు ఎందుకు చూచుకుంటున్నారు?
మీలో యోచనాశీలత ఉంటే గింటే, బైబులు, ఖురానుల స్వర్గాల సమాచారాన్ని ఆ గ్రంథాల నుండే స్వీకరించుదాం రండి. మీలో ఆ పనికి సిద్ధపడేవారుంటే మండలి అందుకు సిద్ధంగా ఉంది. ఆ పనికి మరో సమయాన్ని కేయించుకుందాం. ఒక్కమాట! ఇప్పికీ నా దృష్టికందినంతలో బ్రతుకుల్లో ఆత్మనియంత్రణ అవసరాన్ని గుర్తించిన వివేకులు అంగీకరించరానివే ఆ రెండు స్వర్గాలూ. ఇది సందర్భం కాదుగాని, నిజానికి హిందూ ఆస్తిక సాహిత్యం - ఖురాను సాహిత్యం - లోని స్వర్గమూ బుద్ధిమంతులంగీకరించకూడనిదే. ఇదీ గుర్తుంచుకోండి.
ఓ ఏదో కావాలనుకొని దానికోసమై ఏ దేవుణ్ణిగాని, దేవతలను గాని, దయ్యాలను ప్రార్థించడం గాని, వారికి నచ్చే తృప్తికలిగే పనులు చెయ్యడం గానీ 'భక్తి' క్రిందికి రానేరావు. అవన్నీ వ్యాపార సంబంధమైన పనులే.
దేశభక్తి
దేశభక్తంటే తెగతెలిసినోరిమల్లే, చాలా మ్లాడేశారు రంజిత్‌ ఓఫిర్‌ గారు. దాందేముంది! అది ఇట్టే పాించేయగలంత చిన్న విషయమన్నట్లుందాయన ప్రలాపం. ఆయనగారి కుటుంబమే దైవభక్తి, దేశభక్తి సమపాళ్ళలో మేళవించిన్టిదని మొదల్టెాడా పరిచయకర్త ఎవరోగాని, ఓఫిర్‌ గారిని గురించిన హైందవ క్రైస్తవం అట్ట చివరి పేజీలోని - పరిచయ వాక్యాలను. ఆ కొద్దిపాి పరిచయ వాక్యాలలోనే ఓఫిర్‌ గారిలో పలు అసాధారణ గుణ, క్రియా సామర్ధ్యాలున్నట్లు రాసేశారు. ఆయనే రాశారో, ఈయనే రాపించుకున్నారో గాని ఓఫిర్‌గారు వాిని ప్రచురించడాన్ని బ్టి ఆ మాటలాయనగారికి అంగీకారమైనవే ననుకోవలసి వస్తోంది. అదలాఉంచి దేశభక్తి గురించి ఏమంటున్నారో చూడండి.
1. పేజీ 34 - మనలో దేశభక్తి ఉంటే విధిగా వేదభక్తి ఉండాలి. ఉంటుంది.
2. పేజీ 49 - బైబిలు మ్లేచ్చుల మతం, ఆ గ్రంథములో ఏముంటే మాకెందుకు? మనకు వేదంలోనే అన్నీ వ్రాయబడి ఉన్నాయి, అలాటప్పుడు ఆ అంటరాని వాళ్ళ మతగ్రంథం మనకెందుకు?.... బైబిలు సంగతి మాకు చెప్పకండి! అంటూ హడావిడిగా కళ్ళూ చెవులూ మూసుకోవడం ఈ మధ్య దేశములో దేశభక్తిగా చలామణి అవుతోంది.
గమనిక : ఇంత విరుద్ధమైన మాటలు, అందులోనూ కొన్ని ఎకసెక్కపు మాటలు మ్లాడడాన్ని బ్టి చూస్తే ఆయనలో దేశభక్తి లేకపోగా విదేశీయానురక్తి బాగానే ఉందనిపిస్తోంది. మ్లేచ్చుల్నీ, అటునుండి దిగుమతైన బైబులును అంగీకరింపక పోవడమే దేశభక్తి లేనట్లన్నంతగా పేట్రేగిపోయారాయన. బైబిలును వినం అనడమే కుసంస్కారమనేంతకు తెగబడ్డారు కూడానూ. ఇంతకూ 'బైబిలు మేము వినం, అది మాకక్కరలేదు' అనడమే దేశభక్తి అని ఎవరన్నారో, ఎవరనుకుంటున్నారో చెప్పకపోగా, అది అస్పృశ్యుల మతగ్రంథమని ఎవరో అంటున్నట్లు రెచ్చగొట్టే మాటలూ మ్లాడి, ఇక్కడి వాళ్ళ మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు పనికీ ఒడిగ్టారాయన. ఇన్ననీ దేశభక్తి, దైవభక్తి కూడా గుండెలనిండా తెగనిండి పొంగిపొర్లిపోతున్నదని చెప్పుకోడానికి వెనుకాడకపోడాన్నేమనుకోవాలి?
ఈ నాలుగు ముక్కల్ని బ్టీ...
1. ఆయనకు భక్తంటే ఏమిో అర్థం కాలేదని
2. దైవభక్తంటే ఏమిో తెలియనే తెలియదని, ఆయనలో అది లేనేలేదని
3. వేదభక్తి లేదని, ఆ మాటలు అమాయకపు మంద ముంద్టెి, వారిలో కొందరినైనా బైబిలు భక్తుల్ని చేయాలన్న దుగ్ద మాత్రం చాలాఉందనీ తేటతెల్లమయ్యింది.
అయ్యా ఓఫిర్‌జీ! రిెం మీద భక్తి ఉండడం అసాధ్యం. ఏ ఒక్కదానిపైనైనా భక్తి - అపరిమిత ప్రేమ - ఉందంటే ఇక దేనిమీదా దానితో సమానమైన ప్రేమలేదనే అర్థం. ఎలా ఏ రెండూ ప్రథమ స్థానాన్నాక్రమించలేవో. దేనిని గానీ 'ఒకవది' అన్నామంటే మరేదీఒకటవది కాజాలదనీ ఎలా నిర్ణయించవచ్చో, అలాగే దేనిపైగానీ 'భక్తి' అంటే అన్నింకంటే మిక్కిలి ఎక్కువ ప్రేమ ఉన్నదన్నామంటేనే, మరిక దేనిపైనా అంతి ప్రేమ లేదని అంటున్నామనే.
ఉదా : దేవుణ్ణి - దేశాన్ని ఒక దగ్గర్టిె దేనిపైన ఎక్కువ ప్రేమ నీకని అడిగితే రిెంపైనానూ, అని అననే కూడదు. ఏదో ఒకదానినెంచుకొంటే మిగిలింది రెండవ స్థానంలోకి పడిపోయినట్లే మన ప్రస్తుత సందర్భానికీ ఈ సూత్రాన్ని అన్వయిస్తే 1. మీకు వేదాల మీద కంటే బైబిలు మీదే ఎక్కువ ఇష్టం. ఈ దేశస్తుల పైన కంటే మ్లేచ్చులపైనే అనురాగమధికం. ఈ దేశంలోని ఆసేతు సీతానగంలోని ఆయా స్థలాలకంటే యిజ్రాయేలు, బెత్లెహాం లంటేనే మక్కువ. ఈ వాస్తవాలు మీరెంతగా వేదాభిమానిననే ముసుగు చాటున కప్పెడదామనుకున్నా సందుల్లోనుంచి తొంగిచూస్తేనే వున్నయ్‌.
మనమిప్పుడు చదువుకుంటున్న, నేర్చుకుంటున్న, వాడుకుంటున్నవన్నీ వేదాలలోనుండి తెచ్చుకున్నవేనా? మ్లేచ్చుల నుండి తెచ్చుకున్నవా? న్యాయంగా ఆలోచించండి! న్యాయంగా మ్లాడండి అనడంలోనే మీ దేశభక్తి, మీ వేదభక్తి ఏపాిదో కళ్ళకు క్టినట్లు అర్ధమైంది. ఇంతలేసి మాటలు వెనకాముందూ చూసుకోకుండా రాసి ప్రచురించేసిన మీకు అి్ట ఆధునిక విద్యలేమైనా బైబిలు నుండి పుట్టుకొచ్చాయా? అని వెనుదిరిగి చూచుకోవాలని అనిపించలేదన్నమాట! చీికి మాికి మిమ్ము పలకరిస్తూ ఆయా సత్యాలను ప్రత్యక్షపరిచే ఆ యేసుకైనా ఇది కనపడలేదా?
అదలా వుంచి దేశభక్తికీ, వేదభక్తికీ, వీి అవసరం ఏమొచ్చిందో, బైబిలును వినడానికీ, వినకపోవడానికీ, దేశభక్తి ఉండడానికీ, లేకపోవడానికీ సంబంధమేమిో విశదపరిస్తే తెలుసుకొనేందుకు యత్నిస్తాను.
అత్యంత ప్రాచీన సాహిత్యమైన వేదంలో చెప్పబడ్డ విషయాలు అన్నీగాని, కొన్నిగాని అనంతర కాలంలో వచ్చిన గ్రంథాలలో కనపడితే, అవన్నీ వేదము నుండే వాిని సంగ్రహించినట్లుగానీ, వేదంలో వున్నవాినే ఆ తరువాతి వారు గమనించినట్లు గానీ అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఇంగితం పనిచేస్తున్నా వేదం దగ్గరకొచ్చేయాలి. వేదంలో లేనివేవైనా తరువాత వచ్చిన వాిలో ఉన్నప్పుడే వాినాశ్రయించాలి. వివేకవంతులలోనేగాక, సామాన్య ఇంగితం వున్నవారిలోనూ ఇది నిర్వివాదాంశం. అలా కనీస ఇంగితాన్ని కనబరచకుండా వేదంలోనివే బైబిలు లోనూ వున్నాయి. అదీ 100 శాతం సమానంగా వున్నాయి అనంటూనే వేదాన్ని విడచి బైబిలు దగ్గరకు రమ్మనడాన్నేమనుకోవాలి? ఇదంతా కూడా దేశభక్తేనంటే ఒప్పేసుకోవాలన్న మాట. మ్లేచ్ఛుభక్తి, బైబిలు భక్తి, యేసుభక్తే ఇక్కడ దేశభక్తన్నమాట మీ ఉద్దేశ్యంలో!?! ఇదంతా చూస్తుంటే భర్తుృహరి సుభాషితాల్లోని ఒక పద్యసారం గుర్తొస్తోంది.
తెలివి యెకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి చరించితిన్‌ తొల్లి, ఇపుడుజ్వలమతుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనైతి హతమయ్యె నితాంత గర్వముల్‌.
ఆ పద్యములోని వ్యక్తి, అనంతరమైనా తన స్థితి నెరిగి గర్వాంధత్వాన్ని వదిలించుకున్నాడు. మరి మీ పరిస్థితేమిో...?
గమనిక : దేశభక్తి గురించి రాయడం మొదల్టెాక ఇక్కడికొచ్చేటప్పికి మీ మాటలు గుర్తుకు రావడంతో కలం ఇలా సాగింది. మీ విషయమై ఇంకా మ్లాడాల్సే ఉన్నా శీర్షికాంశం ప్రధానం కావడంతో దీన్నిక్కడికాపి, ప్రధాన విషయంలోకి వస్తున్నాను. మీరు కావాలనుకుంటే, సిద్ధపడితే మీ విషయాలు మళ్ళా మ్లాడుకోవడానికి నేను సిద్ధమే.
దేశభక్తి
1. భక్తంటే ఏదో ఒకదానియందు అమితమైన - శ్రేష్టమైన - అంటే మరోదానితో పోల్చడానికి వీల్లేనంత ప్రేమ అని ఆ పదం నిర్వచనం చెప్పుకున్నాం గుర్తుంది కదూ!
2. దేశమంటే ఎ) నిశ్చిత సరిహద్దులలోపు వున్న ప్రకృతి సంపదంతానూ, బి) అందులో నివశిస్తున్న ప్రజలందరున్నూ, సి) వారినందరినీ నిలిపి, కలిపి, నడిపించే ఒప్పందమున్నూ కలసిన రూపం అని నిర్వచించుకున్నాం. ఇప్పుడు దేశభక్తంటే ఈమూిపైనా, ఈమూడూ కూడిఉన్న మొత్తంపైనా అమితప్రేమ కలిగిఉండడమని అర్థం. కొన్ని ఉదాహరణల ద్వారా దేశభక్తిని వివరించుకుందాం.
ఉదా : 1. మనిషి తనను తాను బాగా - అతిగా - ప్రేమించుకుంటుండాడు. అనుకోకుండా దేశభద్రతకు ప్రమాదం వచ్చిందనుకుందాం. తనను కాపాడుకోడానికి దేశాన్ని ప్టించుకోకపోవడం, దేశాన్ని కాపాడడానికి తాను మరణించడానికీ, కనీసం కష్టాలు పడడానికీ సిద్ధం కావడం. ఇందులో ఏది దేశభక్తి క్రిందకు వస్తుంది.
2. తన కుటుంబ శ్రేయస్సు - దేశ శ్రేయస్సులన్న వాిలో ఒకి వదులుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తే ఏ వైఖరిని అవలంభించిన వానిని దేశభక్తిగలవాడనగలం.
3. తన కులానికి ప్రాధాన్యతనివ్వాలా? దేశానికి ప్రాధాన్యత నివ్వాలా? ఏదో ఒకి ఎంచుకోవలసి వస్తే ఎి్ట నిర్ణయం తీసుకున్నవాణ్ణి దేశభక్తుడనగలం.
4. తన మతానికి - మత గ్రంథానికి; దేశ సమగ్రతకు - రాజ్యాంగానికి, దేనికి ప్రధమగణ్యతనిస్తే దేశభక్తి క్రిందకు వస్తుంది. మత గ్రంథం చెబుతున్న దానికి - రాజ్యాంగం చెబుతున్న దానికీ తేడావచ్చి, ఏదో ఒక్కదానినే అనుసరించవలసిన విపత్కర పరిస్థితి వస్తే దేశభక్తుడు దేనిని అనుసరించడానికి సిద్ధపడతాడు? (పడాలి?)
5. మత గ్రంథాలు చూపుతున్న ఆరాధనా స్థానాలు - దేశము, అన్నవాిలో దేనిపై మీ ప్రేమ అధికంగా ఉంటే నీకు దేశభక్తి ఉందనడం కుదురుతుంది? ఏదోఒకదాన్ని విడవవలసి వస్తే, దేశం కోసం నీ ఆరాధనా స్థానాన్ని విడుస్తావా? దానికోసం దేశాన్ని విడుస్తావా? దేశభక్తుడేమిచేస్తాడా సందర్భంలో.
6. నీ దేవుడు చెప్పిందానికి - రాజ్యాంగం చెబుతున్న దానికి తేడావస్తే నీవు దేనివెంట నడుస్తావు.
గమనిక : యోచనాశీలురైన మిత్రులారా ! మన రాజ్యాంగం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, లింగాన్ని బ్టి వ్యక్తుల మధ్య వివక్ష చూపరాదోంంది. ఈ నేలపైకి పరాయివాళ్ళెవరు దండెత్తివచ్చినా, దీనికోసమై పోరాడడానికి, దీనిని రక్షించుకోడానికి ప్రతి వ్యక్తీ సర్వదా సన్నద్దుడై ఉండాలోంంది రాజ్యాంగం. సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి సాధనకై, సోదర భావంతో సమైక్యంగా, అఖండంగా కొనసాగమనోంంది రాజ్యాంగం.
1. ఈనేల కోసం, 2. ఈ దేశ ప్రజల కోసం, 3. ఈ రాజ్యాంగపు అమలు కోసం, వీికి అడ్డుపడే వేినైనా వదులుకోవడానికి, ఈ మూినీ అమితంగా ఇష్టపడడానికి సిద్ధమై ఉండడమే దేశభక్తి కలిగి ఉండడమంటే.
నీకంటే, నీ కుటుంబం కంటే, నీ కులం కంటే, నీ మతం కంటే, అది చూపించే స్వర్గం కంటే, నీ ప్రాంతం కంటే, నీ పార్టీకంటే దేశమంటే నీకు అధికతమ ప్రేమ ఉండడాన్నే దేశభక్తి అని అంారు. ఈ దేశంలో ఉన్న ఏ మత గ్రంథంపైన ప్రేమ లేకున్నా దేశభక్తి ఉండడానికేమీ అభ్యంతరం ఉండదు. మొత్తం మొత్తం మత గ్రంథాల్ని ప్రక్కకు ప్టిెనా, దేశభక్తికేమీ ఆటంకం ఉండదు.
అదేమరి! ఈ రాజ్యాంగాన్ని ప్రేమించకున్నా
ఈ దేశాన్ని ప్రేమించకున్నా
ఈ ప్రజలందర్నీ సమానంగా ఇష్టపడకున్నా
నీ దేశభక్తి ఇంకా అరకొరగానే ఉందన్నట్లు అదింకా చక్కజేసుకోవలసిందిగానే ఉన్నట్లు
ముఖ్య గమనిక : ఇక్కడి వరకు వ్రాసేటప్పికి ఒక మిత్రుడు నన్ను కలవాలని ఇంికొచ్చాడు. ఏమి రాస్తున్నావని అడిగాడు. ఈ వ్యాసాన్నిచ్చి చదవమన్నాను. చదివి ఒకమాటడగనా  అన్నాడు. అడగమన్నాను. ఇంతకూ నీవు దేశభక్తుడవేనా? అనడిగాడు.
అడగవలసిన ప్రశ్నే అడిగాడనుకొని, కొద్దిసేపు నన్నునేను పరిశీలించుకునే పనిచేశాను. సమాధానంగా ఏమిచెబితే నిజం చెప్పినట్లవుతుందో స్పష్టంగా గోచరించింది.
మిత్రమా! నాకు దేశభక్తంటే ఏమిో స్పష్టంగా తెలుసు. దేశభక్తుడనడానికి తగినవానిగా నన్ను నేను రూపొందించుకొనే ప్రయత్నంలో ఉన్నాను. సాధన సరైన దిశలోనే సాగుతూ వస్తోంది. చాలావరకు పరిమిత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రధమస్థానం మానసికంగా ఇవ్వగలుగుతున్నాననిపిస్తోంది. ఆచరణలో మాత్రం కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి.,ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న వాికి ప్రాధాన్యతనివ్వకుండా దేశం అన్న దృష్టితో ఉండగలుగుతున్నాను. కానీ నిక్కచ్చిగా సందర్భం ఎదురుపడితే అన్ని విషయాలలో దేశానికి, సమష్టికి, రాజ్యాంగానికి పెద్దపీట వేయగలనా? లేదా? అన్నది పరీక్షించి చూసుకోని విషయంగానే ఉందిప్పికీ. దేశభక్తి సాధనలో ఉన్నానన్నది మాత్రం నిజం.
మానవ హననానికి దారులుతీయగల మతమార్పిడులు - 4
యోచనాశీలురైన మిత్రులారా !
ఈ శీర్షికాంశాలను శ్రద్ధగా ప్టిచూస్తున్న వారికీ, ఈ చర్చలో నేరుగా పాల్గొంటున్న వారికీ కూడా రాత రూపంలో, జరిగిన, జరగనున్న విషయాలు అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశము. గత సంచికలో అంటే వివేకపథం 218 - 20వ పేజీలో, ఈ వేదికకు - 'వాస్తవాల వెలికితీత' అన్న పేరెట్టుకుందాం అనన్నాను. ప్రధాన శీర్షికగా మొదట ఆరంభించిన దానినే ఉంచితే బాగుంటుందనిపించటంతో ఈ సంచికలో ఈ వ్యాసానికి ఆపేరే ప్టోను. ధారావాహికగా - ఆక్రమంలో - ఇది నాల్గవది. మనయత్నమంతా 'వాస్తవాల వెలికితీత' కు సంబంధించినదేనన్నదీ వాస్తవమే. ఆ దృష్టినుండే ఈ వ్యాస పరంపరను పరిశీలిస్తుండండి. ఈ విషయాలపై క్రమంగా జరుగుతుండే చర్చలలోనూ అభిలాష, తపన, శ్రద్ధ ఉన్నవాళ్ళు పాల్గొనండి. అయితే వినడానికో, చూడడానికో గాక, ఎంపిక చేసుకున్న విషయాలపై తగినంత అధ్యయనం చేసుకొని రాగలిగిన వాళ్ళకే ప్రవేశం ఉండుందిందులోనన్నది గమనించండి.
ముందనుకున్న ప్రకారం 18, 19 తేదీలలో చర్చలో పాల్గొనడానికి రావలసిన వాళ్ళంతా చేరారు. రెండు రోజులు జరిగిన చర్చ వివరాలను సంగ్రహంగా మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. చర్చనంతా వీడియో రికార్డు చేశాము కనుక మొత్తాన్ని యథాతధంగా పరిశీలించగోరిన వారా'సిడి'లను తీసుకొని చూడండి.
18వ తేదీ - బైబిలు ఆది కాండంలోని విషయాల శాస్త్రీయతేపాిది? అన్నది చర్చనీయాంశం
ఓ మనష్షే గారు ప్రధాన వక్తగా, ప్రతిపాదకునిగా ఉన్నారు. వేథాస్త్రాలెరిగిన వారే ఎరుగరు సృష్టిరహస్యం అంటూ మొదల్టెారాయన. ఆయనగారి జీవనయానంలో అనేకులు తారసపడటం, అనేక ప్రశ్నలు ఎదురవడం - రకరకాల ఆలోచనాథోరణుల గుండా ప్రయాణిస్తూ కడకు క్రైస్తవునిగా మారి స్థిరపడటం జరిగిందన్నారు. క్రైస్తవునిగా సాగుతున్న థలోనే, బైబిలు మొది 12 అధ్యాయాలు కల్పితాలని ఒకరనగా, వాి నిజానిజాలు తెలుసుకోవాలని పరిశోధన మొదల్టెాను. ఆ పరిశోధనాంశాలనే 'ఆదియందు' అన్న పుస్తకంలో వ్రాశాను.
ఓ పాత నిబంధన మొది '5' పుస్తకాలు మోషే రాసినవన్నది సాంప్రదాయం. దీనినే తౌరాతు లేదా ధర్మశాస్త్రం అనాంరు. సృష్టిజరిగాక కొన్ని వందల సంవత్సరముల తరువాతి వాడయిన మోషేకి సృష్టి ఎలా జరిగిందన్న విషయాలు ఎలా తెలిసుాంయన్నది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంది. దానిపై మనష్షేగారు : మోషే దేవుణ్ణి అడిగి ఉండాలి. దేవుడు అతనికి తెలియపరచి ఉండాలి. అంటూ తనదైన శైలిలో ఒక సమాధానం చెప్పారు. ఆ మాటంటూనే వారు ఆదికాండంలోని సృష్టిక్రమంలో ఉన్న 6 రోజుల విషయంలో ఒక క్రొత్తతరహా ప్రతిపాదన చేశారు.
ఓ నిజానికి సృష్టి ఎప్పుడు జరిగిందో, ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు. ఆది కాండం 1,వ అధ్యాయంలోని ఆరు దినాలు దేవుడు సృష్టించిన కాలాన్ని తెలిపేవి కావు. అవి మోషే వివరాలు తెలుసుకొని రాసిన కాలానికి చెందినవి. అన్నదే ఆ ప్రకటన. ఆ రకమైన వివరణ ఆయన గారెందుకు చేశారో, దానిని శాస్త్రీయమైన ప్రతిపాదనగా ఆయనగారెలా నిర్ధారిస్తారో చూడాల్సి ఉంది.
ఓ మాటల సందర్భంలో మనష్షేగారు ఆధునిక, భౌతిక, విజ్ఞానశాస్త్ర ప్రస్తావన చేశారు. విశ్వావిర్భవాన్ని గురించి రెండు థియరీలు వున్నాయి. 1. స్టడీ స్ట్‌ే థియరీ (యధాస్థితి వాదం), 2. వ్యాకోచ సిద్ధాంతం అంటూనే జీవపరిణామ సిద్ధాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందకి వస్తుందన్నారు.
ఓ 'థియరీ' అంటే వాస్తవం కాదని, అదింకా ప్రయోగాత్మకంగా  నిర్ధారించవలసిందిగానే ఉంటుందనీ, ప్రయోగాలు పూర్తయ్యాక దానిని 'లా' అంారని థియరీ అనరని అన్నారు.
ఓ ఐన్‌స్టీన్‌ రిలేివిీ థియరీ ద్వారా పదార్థం నశిస్తుందని రుజువైందనీ రాశారాయన పుస్తకంలో.
ఓ యురేనియం అర్థాయుష్షు 10 లక్షల సంవత్సరాలనీ, అంతకాలానికైనా అందులో 1/637వ వంతు మాత్రమే సీసంగా మారుతుందని అన్నారు.
ఓ మనకు దగ్గరి నక్షత్రం 3 1/2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నారు.
ఓ సృష్టి జరిగి 2,000 కోట్ల సంవత్సరాలయ్యిందోంంది సైన్స్‌ అనీ అన్నారు.
ఓ బైబిలు ప్రకారం సృష్టి జరిగి క్రీ.పూ. 4004 సంవత్సరములని చాలామంది అనుకుంటుాంరు. అది సరికాదు. నిజానికి బైబిలు సృష్టి ఎప్పుడు జరిగిందో చెప్పదు. అది సైన్స్‌ గ్రంథమూ కాదు. చరిత్రా కాదు. సృష్టి విషయం మనకు అర్థం కాలేదనాల్సిందే కాని తప్పనకూడదన్నది నా అభిప్రాయం.
ఓ మోషే ఆదామునుండి 14, 15 శతాబ్దాలకు చెందిన వాడు. అంటే క్రీ.పూ.2500 సంవత్సరముల నాివాడు.
సురేంద్ర : - నిజానికీ విషయాలన్నీ ఒక్కోదాన్ని తీసుకొని విచారించాల్సి ఉంది. నా అవగాహన ప్రకారం ఆయన వెల్లడించిన అభిప్రాయాలలో కొన్నిదోషాలున్నాయి.
ఉదాహరణకు : 1. పరిణామ సిద్థాంతం స్టడీస్ట్‌ే థియరీ క్రిందికి రావడమేమి?
2. సాపేక్ష సిద్ధాంతం పదార్థం నశిస్తుందని నిరూపించడమేమి?
3. సృష్టి జరిగి 2000 కోట్ల సంవత్సరములని సైన్స్‌లో ఎక్కడుంది?
4. బైబిలు సృష్టిక్రమంలోని 6 రోజులు మోషే రచనా కాలాన్ని తెలుపుతాయనడమేమి?
5. దేవునికి బహుళ వ్యక్తిత్వాలుండడం, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదన్న యోహాను సువార్తను చెపుతూనే దేవుడు యెహోవా వ్యక్తిగా ప్రత్యక్షమైనాడు అబ్రహాముకు అనడమేమి?
ఓ బైబిలు మూల భాషలోని కొన్ని పదాలకు అనువాదంలో లోపం జరిగింది. అలాిం సందర్భాలలో మూలంలో ఏమని ఉందో చూడాల్సి ఉంటుంది అంటూ మధ్యాహ్నం ప్రసంగం ప్రారంభించారు మనష్షేగారు. వారికి వత్తాసుగా జగదీష్‌, శ్రీధర్‌, తిమోతి........ వగైరాలు మ్లాడుతూ వచ్చారు. వారంతా క్రైస్తవ ప్రచారకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారే.
సృజించెను అన్న మాటకు, చేసెను, నిర్మించెను, ఆయను అన్నమాటలకూ చాలా తేడా ఉంది. సృజించెను అన్న మాటకు మాత్రమే శూన్యమునుండి ప్టుించెను అన్న అర్థము వస్తుంది. మిగిలిన వాికి, ఉన్నదానినే అలా మార్చాడన్న అర్థం వస్తుంది. ఆదికాండంలోని మొది వచనాలలోని  భూమి శూన్యముగను, నిరాకారముగను ఉండెను అన్నప్పుడు మూలభాషలో 'ఆయను' అన్న అర్థాన్నిచ్చే పదముంది. యెషయా గ్రంథంలోని 45 : 18 వచనంలో, నిరాకారముగ నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాసస్థలమగునట్లుగా దానిని సృజించెను. అని ఉందిగనుక దేవుడు ఆకారంతోనే దాన్ని సృష్టించాడు గాని, అది అనంతరం నిరాకారంగా అయ్యింది.
సురేంద్ర :- ఒక గ్రంథంలో విరుద్ధాభిప్రాయాలున్నాయని గానీ, లేవని గానీ నిర్ణయించాలంటే ఆ గ్రంథం ఏదేని ఒక విషయంపై ఏ విధంగా -  రకరకాలుగా - చెప్పిందో లేదో చూడడమన్నదొక్కటే పద్ధతి. నాకు తెలిసి బైబిలులో అలాిం వాక్యాలు అనేకం ఉన్నాయి. అలాి వాిని భిన్నాభిప్రాయాలుగా స్వీకరించాలే గాని, దానికిది అర్థం, దీనికది అర్థం అంటూ విపరీత అన్వయాలు చేయనే కూడదు. ఉన్నదోషాల్ని చూడనొల్లనివారూ, కప్పిపుచ్చాలనుకునే వారూ మాత్రమే సాగదీసే పనో, మడచి దోపే పనో చేస్తూ వైరుద్ధ్యాలు లేవని చూపడానికి నానాయాతన పడుతుాంరు. పైగా అలాి సందర్భాలలో, ఎదుటవాళ్ళకాగ్రంథం అర్థం కాలేదనేందుకూ, తనకు మాత్రమే అర్థమైందనేందుకూ అడ్డగోలుగా మ్లాడటం మొదలెడతారు.
ఒక గ్రంథంలో దోషాలున్నాయా? లేదా? అన్నది నిర్ణయించుకోడానికి అనుసరించాల్సిన భాషాపరమైన సాధారణ నియమాలను ప్టించుకోకపోవడమే ఆ రకం వారంతా చేస్తుండే తప్పు. అదే పొరపాటు ఈ సమావేశంలో పాల్గొన్న బైబిలు పక్షంవాళ్ళు చేశారనిపించింది నావరకు నాకు.
గమనిక : ఇదొకింత సాహసంతో కూడిన ప్రకటనే అయినా, దీనిపై విచారణకు, నా మాటసరైందేననడానికి తగిన ఆధారాలు చూపే బాధ్యతవహించడానికీ నేను సిద్ధంగా వున్నాను. అందుకు మీరెవరైనా సిద్ధంకావచ్చు. బైబిలు, సృష్టి విషయంలో రెండు రకాలుగా మ్లాడుతోంది అన్నది భాష ప్రకారంగా చూస్తే నిర్వివాదాంశం. అది బైబిలును నెత్తికెత్తుకున్న వాళ్ళకూ అర్థమవుతూనే ఉందికనుకనే, దానర్థం అదికాదు, ఇది అంటూ వివరణలివ్వడం మొదల్టెారు. అసలు సమస్యను సజావుగా పరిష్కరించకుండగనే, ఎవరిష్టమొచ్చిన సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటూ తమదే సరైన వివరణలంటూ చెప్పుకుపోతున్నారు.
వాళ్ళెంత ప్రమాదకర -డోలాయమాన - పరిస్థితిని జనింపజేశారో - సృష్టించారో - చెప్పినా!? వాళ్ళందరి ఈ వివరాల పర్యవసానం, ఇంతకూ బైబులు ఏమిచెబుతోందన్నది ఇంకా తేల్చుకోవలసిందిగానే ఉందన్న దగ్గరకు చేర్చింది పరిస్థితిని. వాళ్ళందరి పోకడలను క్రోడీకరిస్తే, బైబిలు ప్రవచకులూ! ముందు మీరంతా ఒకదగ్గరకు చేరి, ఇంతకూ బైబిలు ఏమిచెబుతోందో తేల్యుకోండి. ఆ తేలినదాన్నే అందరూ ఒక్కటై లోకానికందించండి.
ఈ సందర్భంలో మరొక్క మా చెప్పుకోవాలి. బైబిలును - ఏ ముందస్తు అభిప్రాయాలు పెట్టుకోకుండా తగినంత భాషాపరిజ్ఞానం ఉండి, శ్రద్ధగా చదివేవాళ్ళకు ఏమర్థమవుతుందో, అది మాత్రం చెప్పడంలేదు మీరందరిలో ఎవరున్నూ. ఇదొక్కటే చాలు మీలో ఎవరూ ఉన్నదున్నట్లు చూడడానికీ, చెప్పడానికీ సిద్ధంగాలేరని, ఎవరి రంగు బక్కెట్టు వాళ్ళు పుచ్చుకొని, ఆ ఉన్నదానిపై ఎవరి రంగు వాళ్ళు పులుముతున్నారనడానికి. కనుక ఇప్పికైనా ఆ రంగులు, కుంచెలు, పులుముళ్ళూ వదిలి, ఉన్నదున్నట్లుగా గమనించడానికీ, మ్లాడడానికీ సత్యాన్వేషణ తత్పరతతో సిద్ధంకండి. ఇంతచెప్పినా దీనిని తలకింంచుకోగూడదనుకుంటే. పైన నేనన్నట్లు, అందరూ కలసి కూర్చొని బైబిలు ఇదిగో ఇదే చెబుతోంది అని ఒకేఒక్క అభిప్రాయాన్నైనా ప్రకించండి. ఈ రిెంలో ఏదో ఒకదానికి సిద్ధపడకుంటే, అది మీలో నిజాయితీలేనితనాన్నే ప్టిస్తుంది.
బైబిలులో ఆధునిక, భౌతిక విజ్ఞానాన్ని వెదకబూనడం దానికదే ఒక తెలివితక్కువ పని. నిజానికి ఇది బైబిలు పక్షీయులకొక్కరికి మాత్రమే వర్తించే విషయం కాదు. ఖురాను, వేదములే కాక, ప్రాచీనమైన ఏ తాత్విక సాహిత్యంలోనూ ఆధునిక భౌతిక విజ్ఞానాన్ని వెతకబూనడం సరైంది కాదు. సాంఖ్యంలో గానీ, వైశేషికంలో గానీ అణువిజ్ఞానమో, ప్రకృతి విజ్ఞానమో ఈనాి వైజ్ఞానులకు తెలిసినంతా ఉందనడం అవివేకమూ, అదరగండం గూడా. పంచభూతాలు, వాి సూక్ష్మరూపాలు (తన్మాత్రలు లేదా పరమాణువులు అనన్నారు వాిని) గురించిన ప్రస్తావనలే ఆ రచనల్లో ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్నంగీకరించాలి మనం. ఆనాి మేథావుల్లో కొందరు ప్రకృతి పరిశోధకులు, పదార్థ పరిశోధకులూ ఉన్నారు. వారు అప్పికున్న అవకాశాలను బ్టి వాిని గురించి పరిశోధనలు చేశారు. వారారంభించిన మార్గంలోనే ప్రయాణించి క్రమక్రమంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరింత మరింతగా సమాచారాన్ని సేకరించుకుంటూ ఇప్పికీథకు చేరింది.
విజ్ఞానశాస్త్ర పరిణామక్రమాన్ని చారిత్రక దృష్టితో చూస్తే, ఎందరో మేథావులు గవేషణా ప్రవృత్తిలో ఈ స్థూల విశ్వాన్ని, సూక్ష్మప్రపంచాన్ని గురించి కూడా వెదుకులాడుతూ, అనేక విషయాలను గమనిస్తూ ఆ క్రమంలో చోటుచేసుకున్న మానవ తప్పిదాలను సరిచేసుకుంటూ వచ్చినట్లు తేలుతుంది. ఆ క్రమాలన్నీ ఆరంభించిన ఆద్యులుగా వారిని గమనించుకుంటూ, గౌరవించుకుంటూనే ఆనాి వారి అవగాహనల్లో దొర్లిన దోషాలను వదిలించుకుంటూ ముందుకు సాగడమే వైజ్ఞానిక విధానానికి సంబంధించిన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలన్నీ అందిపుచ్చుకోలేని మతావేశపరులే, ఆనాి రచనల్లోని దోషాలను వదులుకోలేకపోవడమే గాక, ఈనాి పరిశోధనాంశాలను ఏదోఒక నెపాన ఆనాి వాికి అంటగట్టేందుకూ తెగబడుతుాంరు. ఈరకం వారిలో రెండు రకాల దోషాలున్నాయి. ఒకి వైజ్ఞానిక పంథాలోని విధివిధానాలు తెలియనితనం కాగా, రెండోది మానసిక నిజాయితీ లేనితనం. ఈ రిెంలోనూ రెండోదే మరింత ప్రమాదకరం.
బైబిలు సృష్టిక్రమానికి చెందిన వివరాలివిగో ఇలావున్నాయి
1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి శూన్యముగాను, నిరాకారముగాను ఉండెను.
గమనిక : ఈ 'ఉండెను' అన్నమాట మూలానికి సరైన అనువాదం కాదనీ 'ఆయెను' అన్న అర్థాన్నిచ్చే పదం ఉంది మూలంలోనేనని మనష్షేగారన్నారు. ఈ మాట మరికొందరు బైబిలు వివరణకర్తలూ అంటున్నదే.
2. ఈ ఆదికాండములోని సృష్టి నిజానికి మొది సృష్టికాదని రెండో సృష్టి అని కొందరంటున్నారీనాడు. అందుకు ఆధారంగా ఆదికాండములో నుండి 1:26 :- దేవుడు - మన స్వరూపమందు మన పోలికచొప్పున నరులను చేయుదము అన్న వాక్యములోని మన స్వరూపమందు... చేయుదుము. అన్న మాటలు అక్కడ దేవునితోపాటు ఇంకెవరో ఉన్నట్లు అర్థాన్నిస్తున్నయ్‌ కదా అని, అధ్యాయం 3:22 :- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివిం వాడాయెను, అన్న మా ఈ సృష్టికి పూర్వమే దేవునితోపాింకెవరో ఉన్నట్లు తెలుపుతున్నయ్‌ కదా అనంటున్నారు. వీికి బలాన్నిచ్చేవిగా యషయా 14:13 నుండి 18 వరకున్న వచనాలను ఉట్టంకిస్తున్నారు. తేజో నక్షత్రమా! వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?... వగైరా మాటలన్నీ పరలోకములోని, ప్రథమ సృష్టిలోని లూసీఫర్‌ - సాతాను - కలదను వివరాలేనని అంటున్నారు. ఈ సందర్భంలో ఆ రకమైన వివరణలిచ్చేవారందరికీ నా ప్రశ్నలివే.
1. 'ఆదియందు' ఇన్‌ద బిగినింగ్‌ అన్న దానికి, రెండవ సృష్టి ఆరంభించునప్పుడు మొదిగా అన్న అర్థం ఎందుకు చెబుతున్నారు?
2. 'ఉండెను' అన్నా 'ఆయెను' అన్నా మా ప్రశ్న 'శూన్యముగా, నిరాకారముగా' అంటే ఏమిటన్నదే గాని, ఆయన అలా వాిని శూన్యంగా, నిరాకారంగా సృష్టించాడా? అవే అలా అయ్యాయా? అన్నది కాదు. ఆయన సృష్టించినప్పుడు కానీ, అటు తరువాత అవెందువల్ల గాని, అయినప్పుడు గాని, భూమి శూన్యంగా, నిరాకారంగా ఉండడమంటే ఏమిటన్నదే.
గమనిక : ఈ సందర్భాన్ని వివరిస్తూ మనష్షేగారు చాలా మ్లాడేశారు. పరలోకంలో లూసీఫర్‌కు - దేవునికీ గొప్ప యుద్ధం జరిగిందనీ, అందులో బాంబుల ప్రయోగాలూ జరిగాయనీ, కడకు దేవుడు లూసీఫర్‌ను, అతని సైన్యాన్ని భూమిపైకి పడేశాడనీ, ఆ సందర్భంలో భూమిపై అగ్నిపడి భూమి తగలబడిపోయి నిరాకారంగా, శూన్యంగా అయ్యిందనీ అనేశారాయన. ఆయన ఈ మాటలు, తట్టే మోయలేనివాడు బండినెత్తికెత్తుకున్న చందానికి నెట్టేశాయి ఆయన్ను. పరిశోధనలూ చేశానంటున్న మనష్షేగారు, తాను ప్రకించిన అభిప్రాయాలన్నింకీ సరైన ఆధారాలు చూపాల్సే ఉంటుందన్న శాస్త్రీయ పద్ధతిని కాదనరనే అనుకుాంను.
1. భూమిపై నిప్పులు పడడమేమిో, దానివల్ల భూమి తగలబడి నిరాకారంగా మారడమేమిో ఆయనే తేల్చాలి.
2. పదార్థం నశిస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం - సాపేక్ష సిద్ధాంతం - రుజువుచేసిందన్నారు. దానినీ ఆయనే తేల్చాలి. ఇకపోతే బైబిలు ఆదికాండం 1వ అధ్యాయం - మరియు రెండవ అధ్యాయాలలో రెండు రకాల సృష్టి క్రమాల వివరాలున్నాయి. వాిలో ఏదో ఒకి సత్యమయ్యేందుకు గానీ, రెండూ తప్పులై, అసలు నిజం మరోటయ్యేందుకు గానీ ఆస్కారముందేగాని, రెండూ సత్యాలేననడానికి అవకాశమే లేదు. అయినా, ఆయన, ఆయన వెంటవచ్చినవారూ, ఆ పక్షాన్ని స్వీకరించిన వారూ కూడా వాిలో తప్పుప్టాల్సిందేమీ లేదన్నట్లు మ్లాడబోయారు. అక్కడితో ఆగక ఆధునిక భౌతిక విజ్ఞానశాస్త్రంలో కన్ఫూజన్‌ ఎంతో ఉందంటూ నిర్ణయించేశారు. ఆ సందర్భంలో అలానా! ఏదీ, అలాిది ఒక్కి చూపండి అని నేను ప్రశ్నించగా శ్రీధర్‌గారొక ఉదాహరణ చెప్పారు. అందులో కన్‌ఫూజన్‌ ఏముంది? మీరు అర్థం చేసుకోవడంలో కన్ఫూజనే గానీ అనన్నాను. దీనిని మరింత పరిశీలించాలి. ఇలా రాసుకుంటూ పోవాలంటే, ఈ పత్రిక పరిమాణాన్ని బాగా పెంచాల్సి ఉంటుంది. కనుక మీ మెదడుకు మేతగా ఉండే రెండు మూడు ప్రశ్నలు వేసి ఇప్పికాగుతాను.
1. యోహాను సువార్తలోని, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను - అన్న మాటలలో వాక్కంటే శబ్దమనీ, శబ్దమంటే సౌండ్‌ ఎనర్జీ అని వివరణిచ్చారు మనష్షేగారు. ఈ విషయాన్నీ వారు రుజువుచేయాల్సి ఉంది.
2. అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న అనువాదంలోని 'అల్లాడుట' దగ్గర 'పొదుగుట' అని అనాలి. కోడిగ్రుడ్లను పొదిగినట్లు, దేవుని ఆత్మ జలములపై పొదుగుచున్నది అని వివరించారు. అదేమిోనూ ఆ పక్షంవారే వివరించి నిరూపించాలి.
3. దేవుడు అని మీరంటున్నది, ఎలోహిమ్‌ గురించా, యావే గురించా, యెహోవా గురించా, జహోవా గురించా? దేవుడు, దేవతలు, ఒక్కడైన ముగ్గురు, ముగ్గురైన ఒక్కడు, ఒకటవ సృష్టి, సృష్టికర్త, రెండవ సృష్టి, సృష్టికర్త, ఇలా గడబిడగా ఉన్న దాన్నంతినీ చక్కబరచి అదంతా సరిగనే ఉందని తేల్చాలి.
4. ఏ మత సిద్ధాంతం ఇప్పి వరకు శాస్త్రీయ విచారణకు లోనుచేయబడలేదని నేననగా, బైబిలుపై అలాి విచారణ జరిగిందన్నారు ఆ పక్షం వాళ్ళు. ఆ ఆధారాలు చూపాల్సి ఉంది వాళ్ళు.
ఖురాన్‌
ముందనుకున్న ప్రకారం ది.19-9-2015న పరిశీలనాంశాలు మూడు.
1. పూర్వ గ్రంథాల విషయంలో ఖురాన్‌ - ఇస్లాం - వైఖరి.
2. అవిస్వాసుల పట్ల ఇస్లాం వైఖరి ఎన్నిరకాలుగా ఉంది? అవిస్వాసుల్ని వధించమని ఉందా లేదా ?
3. ఒకసారి ఇస్లాం స్వీకరించి, అటుతర్వాత ఇస్లాంను విడచిన వారిపట్ల ఇస్లాం వైఖరిేం?
ఆరంభంలో ముస్తాక్‌ అహ్మద్‌ గారు, ఒక గంటసేపు పూర్వ గ్రంథాలను ఖురాన్‌ దృవీకరిస్తున్నదనీ, ఖురాన్‌తో సమంగా ప్రమాణమని అంటుందనీ, ఇంకా చెప్పాలంటే, తనకంటే వాికే అధిక విలువని ఇస్తున్నదనీ చెప్పారు. అలా పూర్వ గ్రంథాలను విశ్వసించని వారు అవిస్వాసుల క్రిందికే వస్తారని చెప్పారు. ఖురాన్‌లో పేర్కొన్న 3 గ్రంథాలే కాక, ప్రతి జాతి దగ్గరకు పంపబడ్డ గ్రంథాలనూ అంగీకరించాలని అంటుందనీ చెప్పారు. ఈ ప్రసంగాంశాలనన్నింనీ ఆయన ఒక ప్రసంగ పాఠంగా చిన్న పుస్తక రూపంలో తయారుచేసి సభికులందరకూ ఇచ్చారు. ఈ పద్ధతి బాగుందనీ, మలి సమావేశాలలో ప్రతిపాదించదలచుకున్న వారందరూ వారివారి భావాలను ఇలానే రాతమూలకంగా సభకు - సదస్సులకు - అందజేయాలని అనుకున్నాం.
సురేంద్ర :- ఆ ప్రసంగాంశాలపై సరిపడినంత చర్చ జరగలేదు. బైబిలు పక్షంనుండి వచ్చినవారు మాత్రం సూిగా ఒకి రెండు ప్రశ్నలు వేశారు. ఒకి, ముందు వచ్చిన గ్రంథాలను, చివర వచ్చిన గ్రంథం దృవీకరించటమేమిటండీ, అది సరికాదు కదా! మొదట వచ్చింది దైవ గ్రంథమే అయితే తరువాతవి దానికి సరిపోతున్నాయో లేదో చూసుకోవడమే సరైందవుతుంది కదా!.
2. ఆయా మత గ్రంథాలలో ఉన్నదాన్నంతినీ మీరు - ముస్లింలు - అంగీకరిస్తారా? ఖురాన్‌లో ఉన్నంతవరకా? మొత్తాన్నంగీకరిస్తానంటే ఖురానెందుకు? అంగీకరించనంటే ఖురాన్నెందుకు అంగీకరించాలి? ఈ ప్రశ్నలపై సరిపడినంతగా చర్చ జరగలేదు. సంతృప్తికరంగా సమాధానమూ రాలేదు. ఒక థలోనైతే, భారత దేశానికి పంపబడ్డ ప్రవక్తలెవరన్నదీ, వారు తెచ్చిన గ్రంథాలేమిటన్నదీ మీరు గమనించారా? అని సూిగా అడిగిన ప్రశ్నలకు ముస్తాక్‌ గారు కొద్దిగా ఆలోచించుకొనే, గమనించాము, రాముడు, కృష్ణుడు, అర్జునుడు అని, వేదము, భగవద్గీత, కొన్ని ఉపనిషత్తులు అని సమాధానం చెప్పారు. వీటన్నింపైనా విచారణ సాగాల్సి ఉంది.
ఇక రెండో విషయానికొస్తే, బైబిలు పక్షాన్నుండి, పీటర్‌, శామ్యూల్‌ అన్న సోదరులిరువురూ కలసి ఖురాన్‌ పక్షం వారిని ప్రశ్నించడం ఆరంభించారు. ఇస్లాం అవిస్వాసుల పట్ల మూడు రకాల పరిస్థితులననుసరించి ఎలా ప్రవర్తించాలో చెబుతోందనీ, వాడుకలో వాిని దారుల్‌ హరబ్‌, దారుల్‌ హమన్‌, దారుల్‌ ఇస్లామ్‌ అంారనీ వారనగా, ముస్తాక్‌ గారు, ఫజులూర్‌ రహమాన్‌ గారు అి్ట మాటలు గ్రంథాల్లో ఎక్కడున్నాయో చూపమన్నారు.
సూిగా అి్ట మాటలు గ్రంధాలలో లేకున్నా ఆయుతులు, హదీసుల్ని పరిశీలిస్తుంటే ప్రవక్త మూడు రకాల పరిస్థితుల్లో ముస్లిం ఎలా ఎలా నడుచుకోవాలో చెప్పినట్లు ఆధారాలు దొరుకుతాయి అనన్నారు వారు.
ఓ  అటు తరువాత అవిస్వాసుల పట్ల, అవిస్వాసుల్ని చంపేయమన్న ఒక్క వాక్యం కూడా నాకు దొరకలేదని ఫజులూర్‌ రహమాన్‌ గారు అన్నారు.
దానిపై ఒక్కికాదు, చాలా ఉన్నయ్‌, అవిస్వాసుల్ని చంపండన్న వాక్యాలంటూ, పీటర్‌ ముందుగా 9:5 ఆయుతులను ఉట్టంకించారు. ఇదిగో ఆ ఖురాన్‌ ఆదేశం.
''నిషిద్ధ మాసాలు గడచిపోగానే, ముష్రిక్కులను (ముష్రిక్‌ అంటే దేవుడికి సాి కల్పించేవాడు, బహుదేవతారాధకుడు అన్న అర్థాలున్నాయి. ఇది క్రైస్తవులకు - అనేక దైవారాధకులకు వర్తిస్తుంది). ఎక్కడ కనపడితే అక్కడ చంపండి. వారిని నిర్భంధించండి. వారిని ముట్టడించండి. ప్రతి మాటువద్ద వారికొరకు పొంచి ఉండండి''....
దీని విషయమై ముస్తాక్‌ అహ్మద్‌ మరియు ఫజులూర్‌ రహమాన్‌ గారు, వీి విషయమై మరింత పరిశీలించుకొని రావడానికి కొంత సమయమివ్వండి. పై మాసానికి సిద్ధపడి మా పక్షాన్ని వ్రాతరూపంలోనూ సిద్ధంచేసుకొని వస్తాం అన్నారు. సంధానకర్తగా ఉన్ననేను అలాగే చేయండి. ఈ వేదిక నియమాలలో పరిశీలించుకు రావడానికి, మరింతమంది తెలిసిన వాళ్ళూ కలసి చర్చలో పాల్గొనడానికీ అవకాశం ఉంది. కనుక వచ్చే సమావేశానికి మరింతగా అధ్యయనం చేసుకొని రండి అననన్నాను.
బైబిలు పక్షం వాళ్ళకు నాయీ మాటలు ఒకింత అసహనం కలిగించినా, ఎంతో సంయమనంతో ప్రవర్తించి అలాగే కానీండనన్నారు వాళ్ళునూ. ఇంకేమైనా ఆయుతులు, హదీసులూ ఉంటే వాి వివరాలూ మీరడగదలుచుకున్న ప్రశ్నలూ ఇవ్వగలిగితే ఇవ్వండిప్పుడే అనన్నారు ఖురాన్‌ పక్షం వారు.
పీటర్‌ సోదరులు ఇవిగో మరికొన్ని ఆయుతుల వివరాలంటూ 9:11, 12, 14, 15, 17 :111, 8:39, 2:191, 17:16, 25:52, 9:29 అంటూ మరికొన్ని వివరాలిచ్చారు.
మలి సమావేశం వివరాలు :
నవంబర్‌ 6,7 తేదీలలో దోరకుంటలోనే కలవాలి. 6వ తేదీ బైబిలు పైనా, 7వ తేదీ ఖురాన్‌పైనా చర్చ జరగాలి. చర్చనీయాంశం - అవిస్వాసులు, అన్యజనుల పట్ల, ఆ రెండు గ్రంథాలు (యోహోవా, అల్లా) ఎలా ప్రవర్తిమంటున్నాయి?
సమావేశానికి ఉదయం 9 గం.ల లోపు చేరాల్సి ఉంటుంది. ఊరికే వినడానికి గాక, చదువుకొని పాల్గొనడానికి సిద్ధమైన వారే రావాలి. చర్చనీయాంశం ఒకింత ఒత్తిడిని, ఆవేశాన్ని కలిగించగలిగిందవడంతో 'వాస్తవాల వెలికితీత' అన్న వేదిక లక్ష్యానికి అనుగుణంగా, సంయమనంతో ఉండండి.
మ్లాడే స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉంటుంది. అయితే తాను మ్లాడిన దానికి ఆధారాలు చూపడం తప్పనిసరి నియమంగా ఉంటుంది.
గమనిక : బైబిలు, ఖురానులు మాకు బాగా తెలుసును అనుకుంటున్నవాళ్ళెవరైనా పై చర్చనీయాంశానికి పరిమితమై ఈ వేదికలో పాల్గొనవచ్చు. వేదికలో పాల్గొనదలచిన వారు ముందుగా వారి వివరాలు మాకందించాల్సి ఉంటుంది.
సత్యాన్వేషణలో... మీ  సురేంద్ర.

1 comment: