Thursday, March 23, 2017

దేవుడు - ఒక పరిశీలన



- పుట్టా సురేంద్రబాబు

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

మిత్రులు రఘుగారు ఫోను చేసి మేము ముద్రించనున్న వ్యాసాల సంపుటిలో మీ వ్యాసమూ ఉంటే బాగుంటుంది. ఒక వ్యాసం రాసివ్వగలరా? అని అడిగారు. నావైఖరి రచనా శైలి కూడా తెలిసున్న ఆయన అలా అడగడంతో యోచనాపరుల మెదడుకు పదును పెట్టే ఉద్దేశంతోనే అడిగి ఉంటారులే అనుకుని, సరే అలాగే రాసి పంపుతానని మాటిచ్చాను. అదిగో ఆ అలాగే వలన ఇదిగో ఇలా రూపు ధరించిందీ వ్యాసం. మీరూ దీనిని విజ్ఞతతోనూ, విమర్శనా దృష్టితోనూ పరిశీలించి చూడండి.

ముందుగా ఒక్కమాట!

మన దృష్టిలోకి వచ్చిన కొన్ని రకాల విషయాలు, అంతా బాగా తెలిసున్నవేననిపిస్తుంటాయి కాని నిజానికి వాటి గురించి మనకేమీ తెలిసుండదు. అలాటి వాటిలోనిదే మనం ఎత్తుకున్న దేవుడి విషయం కూడా. అంతేకాదు, అలాటి విషయాల జాబితాలను గనుక తయారు చేస్తే, ఇది మొదటి జాబితాలోనూ మొట్టమొదట ఉంచాల్సిందిగా ఉంటుంది.

ప్రపంచ సాహిత్యంలో దేవుడు అన్న పదం ఆధారంగా సృష్టించబడినంత సాహిత్యం మరే పదం క్రిందా తయారవలేదు.

అంతేకాదు. ఈ పదం చేత దేనిని గురించి తెలపాలని వారంతా ఇంత సాహిత్యాన్ని రాశిపోశారోదానిలో ఎంతో వైవిధ్యంతో కూడిన, పరస్పరం పొసగని, కొన్నింట వైరుధ్యాన్నీ కలబోసుకున్న సమాచారం ఉంది.

దేవుడు అన్న పదం సంస్కృత మూలం నుండి వచ్చింది. దానాద్వా, దీపనాద్వా, ద్యోతనాద్వా అన్న అర్ధాలున్నాయి దీనికని 'నిరుక్తం' అంటోంది.

దీవ్యతీతి దేవః! దిపు క్రీడాయాం - ప్రకాశించునది, ప్రకాశించువాడు అని అమర కోశములో వుంది.

దేవా ఏవ దేవతాః! దేవతా ఏవ దైవతాని. దేవుళ్ళే దేవతలు, దేవతలే దేవుళ్ళు అనిదానర్ధం. మరియు పుంసివా అన్న నియమం చేత దేవత అన్న మాట స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. అంటే దేవత పురుష దేవత కావచ్చు స్త్రీ దేవతా కావచ్చన్నమాట.

గాడ్‌ (God) :- అన్నమాటకు ఆంగ్లంలో 'ద సుప్రీం బీయింగ్‌' (The supreme being) అన్న అర్ధం ఉంది. సర్వోన్నత జీవి అని దానర్ధం. భగవంతుడు, సృష్టికర్త, ఈశ్వరుడు, పరమాత్మ అన్న మాటలూ దేవుణ్ణి తెలిపే పదాలుగా రూఢిపడి ఉన్నాయి. కొందరైతే దేవుడు సహస్రనాముడనీ, అనంత నాముడనీ అనేశారు. వేయి నామాల వరకు వివిధ దేవీదేవుళ్ళకు కల్పించేశారు కూడా.

జీవసృష్టి అనేది లేకపోయినా, మెదడన్న పదార్ధం ఉనికిలోకి రాకపోయినా, అది మానవునిలో ఉన్న రూపంలో ఏర్పడక పోయినా, మనిషి తనకు కలిగిన అనుభూతుల ద్వారా గమనింపులోకి వచ్చిన వాటి మూలాల గురించి ఆలోచించకపోయినా, ఈ దేవుడన్న పదం గానీ, ఇలాటి ఊహాజనితాలైన మరికొన్ని పదాలు గానీ ఉనికిలోకే వచ్చుండేవికావు.

సృష్టి - సృష్టిలోని వివిధాంశాలు, వాటికి కారణాలు అన్న వాటిని గురించిన పరిశీలన ఆధారంగానే దైవ భావన సృష్టికి కారణం అన్న స్ధానంలో ఏర్పడింది.

'కార్య కారణ భావన' :- మనిషి, నిత్యజీవితంలో ఎదురపడే అనేక సంఘటనల నుండి క్రొత్త క్రొత్తవి ఉనికిలోకి రావడం, అలా అవి రావడానికి ముందే, వాటికి ఆధారంగా కొన్ని సమకూడి ఉండడం, మాటి మాటికీ గమనించడం ద్వారా పుట్టింది- అది పుట్టడానికి అవసరమైంది అన్న రెంటినే 'కార్యము - కారణము' అన్న పదాల ద్వారా గుర్తించుతూ, పేర్కొంటూ వచ్చాడు. అట్టి అనుభవాల సాధారణీకరణే ఏదైనా పుట్టింది అంటే, దానికి ముందే ఆ పుట్టిందాంట్లో ఉండాల్సిన ద్రవ్యాలు, వాటిని ఆ రూపానికి తెచ్చే పని చేసిన పదార్ధమూ ఉండి తీరతాయి, ఉండితీరాలి అన్న నియమం ఏర్పడింది. దీనినే మనం కార్యకారణ నియమం (Law of causation) అనంటున్నాము. దాని సాధారణ రూపం ఇలా ఉంటుంది. అప్పటికి లేని ద్రవ్యంగానీ, వస్తువుగాని ఉనికిలోకి రావాలంటే అందుకవసరమైన ముడి సరుకు ఉండాలి. అది ఆ కార్యంలోనూ ఉండాలి. అదిగో అలాటి దానినే కార్యకారణాలలో ఉపాదాన కారణం, Material cause అనన్నారు. అది కార్యానికి అంతర్గత కారణం కూడా. కార్యం ఏర్పడక పూర్వం ఉన్న ముడిసరుకును కార్యరూపంలోకి మలచిన పని చేసిన దానిని నిమిత్త కారణం. బాహ్యకారణం అనన్నారు. ప్రతి కార్యానికీ అంటే క్రొత్తగా ఉనికిలోకి వచ్చే ప్రతిదానికి అవశ్యం పై ఉపాదాన, నిమిత్త కారణాలు ఉండి తీరతాయి. ఉండి తీరాలి అన్న నిర్ణయానికి వచ్చిన మనిషి, ఈ కార్యకారణ నియమం విశ్వనియం అనీ సర్వసాధారణ నియమమనీ నిర్ణయించుకున్నాడు. Universal law / Most general law ఈ సూత్రం, కనుగొన్న నాటి నుండి ఈ నాటి ఆధునిక వైజ్ఞానిక క్షేత్ర పరిశోధనల వరకూ నిర్వివాదాంశంగా చెలామణి అవుతూ వస్తోంది. ఈ సూత్రం ఆధారంగానే గతానికి చెందిన వివిధ పరిశోధనలూ, కొత్త క్రొత్త వాటి తయారీ జరుగుతూ వస్తోంది.

గమనిక :- ఉపాదాన కారణం అన్న దానికి మారుగా మరికొందరు కార్యకారణజ్ఞులు సమవాయి కారణం + అసమవాయి కారణం అన్న పదాలు వాడారు. బాహ్యకారణాన్ని నిమిత్త కారణంగానే వ్యవహరించారు. మొత్తానికి ఏమని తేలినట్లు? ఏదైనా క్రొత్తగా ఉనికిలోకి రావాలంటే (దీనినే కార్యం, ఎఫెక్ట్‌ అంటారు) అందుకు ముందే అంతర్గత కారణం అనదగ్గదీ, బాహ్యకారణం అనదగ్గదీ ఉండి తీరాలన్నమాట.

మిత్రులారా! దేవుణ్ణి గురించి పరిశీలనంటూ మొదలెట్టి ఇవన్నీ ఎందుకు చెపుతున్నట్లు? అని మీలో కొందరికైనా అనిపిస్తుండవచ్చు. ఆస్థిక సిద్దాంత విచారణలో పట్టున్న వారికీ ఆలోచన రాకపోవచ్చుగానీ, సైద్దాంతిక విచారణలో అంతగా ప్రవేశంలేని చాలా మంది ఆస్తికులకు మాత్రం ఇదంతా ఎందుకన్న సందేహం వచ్చి తీరుతుంది. ఎందుకిదంతానంటే; మనిషి ఈ కార్యకారణ నియమాన్ని ఏర్పరచుకుని, దానిని జీవితంలో ఎదురుపడుతున్న అనేకాంశాలకు వర్తింపజేసుకుంటూ వస్తున్న క్రమంలోనే;

అయితే మరి ఈ సృష్టికీ, ప్రకృతిలో క్రొత్తగా ఉనికిలోకి వస్తున్న వాటికీ కూడా పై రెండు కారణాలూ ఉండి తీరాలి కదా అన్న ప్రశ్న పుట్టింది. అంతర్గత కారణం (ఉపాదాన కారణం) ఆ కార్యంలో ఉండి కనపడుతూనే ఉంది. ఇకపోతే నిమిత్తకారణం (బాహ్యకారణం) ఏమై ఉంటుంది? అన్న ఆలోచనే సృష్టికి అతీతంగా ఒక నిమిత్త కారణం ఉండి ఉండాలన్న ఊహకుదారి తీసింది. అదిగో దానిపేరు 'సృష్టికర్త' అలా వచ్చిందే దైవం (దేవుడు) అన్న భావన.

నిమిత్త కారణం ఉండక తప్పదు గనుక, ఇంతటి సృష్టిని చేయగలిగింది ఎంతటిదైయ్యుండాలి? అన్న ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్నకు సమాధానంగా తార్కిక బుద్ది చెప్పిన సమాధానంలోనివే దేవుడు సృష్టికర్త - సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అన్న భావనలు. ఈ రెండూ ఉండాలంటే ఆ దేవుడు ఎంతుండాలి? అన్న ప్రశ్న పుట్టి సర్వ వ్యాపి - అంతటా ఉన్నవాడు - అయ్యుండాలన్న సమాధానం చెప్పుకున్నాడు మనిషి.

ఇక ఈ సృష్టిని తెలియబడుతున్నంత వరకు పరిశీలించినా దీనిలో ఒక క్రమం ఉన్నట్లు తెలుస్తుండడంతో క్రమం ఉండేట్లు చూచే నియామకత్వమూ దేవునికి ఉండాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాడు. దేవుడనే వాడు ఉంటేగింటే (కార్యకారణ నియమాన్ని బట్టి ఉండక తప్పదు, గనుక ఉండే ఉంటాడు) వాడు అంతటా ఉన్నవాడై ఉంటాడు, అన్నీ తెలిసిన వాడై ఉంటాడు, అన్నీ చేయగలిగినవాడై ఉంటాడు. అన్నింటినీ నియమించే వాడై ఉంటాడు అని సిద్దాంతీకరించుకున్నాడు.

1) సృష్టికర్తుత్వము 2) సృష్టి నియామకత్వము అతని పనులు అవి చేయాలంటే 3) సర్వజ్ఞత్వమూ 4) సర్వ శక్తి మత్వమూ అవసరం ఆ రెండూ ఉండాలంటే అతడు 5) సర్వవ్యాపి (అంతటా ఉన్నవాడు) అయ్యుండాలి.

అందుకే ప్రతి మత గ్రంధమూ తాను ప్రకటిస్తున్న దేవునికి ఈ అయిదూ ఉన్నట్లు ఖరాఖండీగా పేర్కొంటుంది. కానీ గొప్ప ఆశ్చర్యకరమూ, అసమంజసమూ అన్న రీతిలో తమ దేవుణ్ణి గురించి మరింత సమాచారం అందించే క్రమంలో పై అయిదు విషయాలు ఉండవలసినంతగా లేవనుకోడానికి తగిన సమాచారాన్నే అందించాయి. ఇది ఎంతటి వైరుధ్యం?!? అయినా వారెవరూ ఈ మౌలికమైన దోషాన్ని పట్టించుకోనే పట్టించుకోరు. ఆయా మత గ్రంధాలలోని సమాచారం ఆధారంగానే, వారి దేవుడు అల్పజ్ఞుడు, అల్ప సామర్ధ్యం కలవాడు, పరిమిత శరీరం కలవాడు (ఏకదేశి) అని తేల్చవచ్చు. ఈ మూడూ సరిగలేని వాడిక సృష్టికర్తగా ఉండడానికిగానీ, నియామకునిగ ఉండడానికి గానీ తగి ఉండడు అని నిరాక్షేపణీయంగా నిర్ధారించుకోవచ్చు.

ఇలాంటిదే మరో విడ్డూర ముంది. ప్రతి మత గ్రంథమూ దేవుడు ఒక్కడేనంటుంది. అలా అన్నవన్నీ రకరకాల దేవుళ్ళనే ప్రతిపాదించాయి. పైగా తమ గ్రంథంలో ఉన్నదంతా దేవునిచే ప్రకటింపబడిందేనని ప్రకటిస్తాయి అవన్నీ. ఇంతకంటే విడ్డూరం అడ్డగోలు తనం ఇంకేముంటుంది?! వెనుకటికాలపు ఆయా మత గ్రంధాల నెరిగిన వాళ్ళంతా, తమ ప్రచారంలో భాగంగా పరమత ఖండన, స్వమతస్ధాపన అన్న విధానాన్నే అనుసరించారు. ఎదుటి మతాలు దోష సహితాలనీ, తమ సిద్దాంతమే సరైందనీ, కనుక అన్ని మతాలూ ఒక్కటే చెపుతున్నాయన్నది శుద్ద అబద్దమని తేల్చేశాయి ఆ మేరకు వారు నిజాయితీగా ప్రవర్తించారు. కానీ ఈనాటి మత ప్రచారకులలో కొందరు అన్ని మతాల సారాంశం ఒక్కటేననీ, అన్ని మతాలూ ఒకే దేవుణ్ని ప్రకటిస్తున్నాయని మాయ మాటలు చెపుతూ వస్తున్నారు. దీనినైనా అర్ధం చేసుకోవచ్చు, కొంత వరకు సహించుకోవచ్చు గానీ, కపటితనాన్న - మతి సెబ్బరితనాన్ని సహించనే కూడదు. సమాజహితం కోరేవారు ఏ రకమైన వంచననూ, వంచకులనూ సహించనే కూడదు. వంచనను సహించడమంటే చెడును సహించడమేకాక, అది పెరిగిబలపడడానికి పరోక్షంగా దోహదపడడం కూడా.

మత గ్రంధాలన్నీ తమ తమ దేవునికి పై అయిదు సామర్ధ్యాలే కాక, మరిన్ని పనులు సుగుణాలు ఉన్నట్లు ప్రకటించేశాయి. జీవులు చేసిన మంచి చెడు పనులకు ఫలితాలనందిస్తుంటాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు, నిస్పాకిక్షుడు, దయాళువు, కృపాశీలుడు, క్షమాశీలి, భయంకరుడు, శాంతమూర్తి మొదలగు గుణాలను, వాటితో కూడిన పనులను అంటగట్టారు. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మిమ్ముపురికొల్పేందుకు కొన్ని వివరాలు అందిస్తాను పరిశీలించండి.

1)         తప్పులు చేసి నాలుక్కరుచుకుని సంతాపపడుతూ సరిచేసుకుంటుంటారు.

2)         ఆయా వ్యక్తులు చేసే పనులను తెలుసుకోడానికి నిఘా మనుషుల్ని పెట్టుకుంటారు.

3)         అనేక పనుల కొరకై ఇతరుల సహాయాన్ని తీసుకుంటుంటారు. కొన్ని సార్లైతే పరుల సాయాన్ని కోరుకుంటుంటారు కూడా.

4)         అటూ ఇటూ తిరుగుతుంటారు. వచ్చి పోతుంటారు. అవతరిస్తుంటారు. ఒకణ్ణీ అరా చంపడానికే నానా యాతనలు పడుతుంటారు. సైన్యాన్ని ఏర్పరచుకుంటారు. పోరాటంలో అడపాదడపా ఓడిపోతుంటారు.

5)         సమాచారాన్ని రాబట్టడానికై గూఢచారుల్నీ, సమాచారం అందించడానికై సందేశహరుల్ని పెట్టుకుంటారు.

గమనిక :- వీటన్నింటికంటే వేరుగా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కీలకాంశం ఒకటుంది.

6)         ఆ గ్రంధాలన్నీ పేర్కొనక తప్పని 'వ్యక్తి - సమాజము - ప్రకృతి' అన్న మూటికీ సంబంధించిన ఆ గ్రంధాలలోని సమాచారంలో 1) అరకొర జ్ఞానము 2) అజ్ఞానము తట్టెడుంది. ఆ మూడంశాల గురించీ మనకీనాడు ప్రయోగపూర్వకంగా (అనుభవ పూర్వకంగా) తెలిసిందాన్ని బట్టే, ఏ గ్రంధానికా గ్రంధాన్ని గానీ, ఏ అంశానికా అంశంగా ఆ గ్రంధాలన్నింటిని గాని పరీక్షించడానికి వారిలోని ఎవరు సిద్దపడ్డా, ప్రయోగ పూర్వకంగా వాటిలోని దోషాలను, లోపాలనూ వెలికితీసి చూపించవచ్చు. మచ్చుకు -

    ఎ)     వ్యక్తి :- మనిషి శరీర నిర్మాణము, అందులోని అవయవాలు, వాటి పనులు, జీవన ప్రక్రియ, ఆరోగ్యము -     అనారోగ్యము అవి ఉండడానికి కారణాలు రోగ నివారణోపాయాలు వగైరాల గురించి పరీక్షించవచ్చు.

    బి) సమాజం :- సమాజాన్ని గురించిన ఆ గ్రంధాల అవగాహన - ఈ నాటి మన అవగాహన

    సి) ప్రకృతి :- ప్రకృతిని ఈనాడు అనేక ఉప విభాగాలుగ ఏర్పరచుకుని బహుముఖంగా పరిశోధనలు సాగుతున్నై వాటిని ప్రస్తుతానికి మూడుగా అనుకుని పరిశీలిద్దాం.

    1) భూలోకానికి సంబంధించిన అవగాహన

    2) ఖగోళానికి సంబంధించిన అవగాహన

    3) విశ్వానికి సంబంధించిన అవగాహన

ఈ సందర్భంలో మరో ముఖ్యమైన మాట గుర్తు చేయాలి. ప్రతి మతమూ తన గ్రంధంలోని సమాచారమంతా దైవదత్తం అని ప్రకటిస్తుంటుంది.

1) వేదం : ఈశ్వరీయం కనుక సర్వ విషయాలకూ ఆకరం (నెలవు)

2) బైబిలు : అవన్నీ దేవుడు చెప్పినవీ, దైవాదేశంతో దూతలు, ప్రవక్తలూ ప్రకటించినవీ

3) ఖురాను : ఇక ఇదైతే ఒకింత అతిగాపోయి, అన్ని గ్రంధాలూ దేవుడు చెప్పినవేగాని అవి అసంపూర్ణాలు. ఖురానైతే అంతిమగ్రంధం. పూర్ణ గ్రంధం మరో ఆదేశమూ అవసరం లేదు, మరో ప్రవక్త అవసరమూ లేదు. ఇందులోనిది మార్చాల్సిన అవసరమూ లేదు అనంటుంది.

4) ఇక ఈ దేశంలోని, ఇతరత్రానూ ఉన్న బహు దైవారాధన రూపమైన ధోరణులన్నీ ఎవరి సొద వారిదేనన్నట్లు గుట్టలకు గుట్టలన్నంత సాహిత్యాన్ని సృష్టించి మందినెత్తిన లేదా తమనంగీకరించిన మందనెత్తిన పెట్టారు.

మరికొన్ని ముఖ్యాంశాలు :

ఆయా మత గ్రంధాలు అంతో యింతో చదివి తెగ జ్ఞానులల్లే ప్రవర్తిస్తుండే వీరిలో ఎవరిని గానీ ఈ విషయాలు వాస్తవాలేనని మీకెలా తెలిశాయి. మాకెలా తెలుస్తుంది అని అడిగామనుకోండి. వారందరి సమాధానం ఒక్కటే, విశ్వసించి ఆచరిస్తూ జీవించు ఫలితాలవే వస్తాయి అనంటారు వాళ్ళంతా. నిజానికి ఇక్కడ మనం అడిగిందొకటైతే, వాళ్ళు చెప్పింది మరొకటి. అందుకు కారణం. ఆ ప్రతినిధులంతా గ్రంధాలు చెప్పిందాన్ని ఏ కరువు పెట్టడం నేర్చిన వాళ్ళే గాని, అవి చెపుతున్న విషయాలు వాస్తవంలో అలాగే ఉన్నయోలేదో తెలిసిన వాళ్ళు కాదు.

మరో విడ్డూరం చెప్పనా!? ఆ గ్రంధాలు ఏమి చెపుతున్నాయన్న విషయంలోనూ ఆయా గ్రంధాలు చదివిన వారి మధ్యనే ఇంకా ఏకాభిప్రాయం కుదురుకోలేదు. ఆయా గ్రంధాలను సరిపోల్చుతూ చూస్తే వాటిలో ఎంత గంద్రగోళం ఉందో ఇట్టే తేలిపోతుంది.

1) దేవుడు తెలియబడడు - తెలియబడతాడు

2) అంతటా ఉన్నాడు - ఫలాని చోటే ఉన్నాడు

3) సర్వజ్ఞుడు - అల్పజ్ఞుడు

4) సర్వ సమర్ధుడు - సర్వ సమర్ధుడు కాడు

5) అనుకుంటే అయిపోతుంది - అనుకుంటే కాదు, బ్రతిమాలుకున్నా అవదు.

6)     1) సృష్టి స్థితి ప్రళయాలు అనాద్యనంతంగా జరుగుతునే ఉంటాయి

    2) ఇదే ప్రధమ సృష్టి - స్థితి - ప్రళయం కూడా ఒక్కసారే. ఇక శాశ్వత స్వర్గ - నరక వాసమే

7)     1) స్వర్గ నరకాలున్నాయి - స్వర్గనరకాలు వేరుగా లేవు.

    2) స్వర్గ నరకాలున్నాయి, మోక్షమూ ఉంది. అనేకలోకాలూ ఉన్నాయి.

    3) అనేక లోకాలు లేవు. శాశ్వత స్వర్గ నరకాలున్నాయి. మోక్షం లేదు.

8)     1) జీవులను ఎవరూ సృష్టించరు. వారు దేవునిలానే నిత్యులు

    2) జీవులను దేవుడే సృష్టించాడు. వారు నిత్యులు కారు.

9)     1) జీవుడు అణురూపుడు, వ్రేలెడంత ఉంటాడు, ఏ శరీరంలో ఉంటే అంతుంటాడు. విభుడు.

    2) జీవుల అన్ని రకాల శరీరాలను ధరిస్తుంటాడు.

    3) మానవ శరీరానికే జీవాత్మ ఉంటుంది. మిగిలిన ప్రాణులలో జీవుడు ఉండడు.

యోచనా శీలురైన మిత్రులారా! ఇలా చెప్పుకుంటూ పోతుంటే దీనికో దరి తెన్ను, అంతూ పొంతూ ఉండవు. ఆయా మతాలకు చెందిన వెనకటి వారు వివిధ మత గ్రంధాలలోని తేడాలనీ గమనించి తమదే సరైందనీ మిగిలినవి అపసవ్యమైనవనీ చెప్పుకుంటూ పోయారు. కానీ ఈనాటి మత ప్రచారకులలో కొందరు అన్ని మతాల సారాంశం ఒక్కటేననీ, అన్ని గ్రంధాలు చెపుతున్నది ఒక్క దేవుణ్ని గురించేననీ చెప్పడం మొదలెట్టారు. నిజంగా ఈ పోకడ ప్రమాదకరమైనది. వంచన తోకూడినది. ఎందుకంటే, ఈ విధానం

1) సత్యాలను ప్రకటించదు సరికదా కప్పెడుతుంటుంది.

2) కనుక అవశ్యం అసత్యాలను ప్రకటిస్తూంటుంది.

3) నిజానికి మానసికంగా తాము చెడిన ఈ రకం మరింత మందిని చెడగొడుతుంటూ మరో వంక అన్ని ఒకటే చెపుతున్నాయంటూనే తమ మతంలోకి గుంజే పని చేస్తుంటారు. ఒక వంక మత మార్పిడులు చేస్తూనే, బైటికి మాత్రం మతం మారక్కరలేదంటుంటారు.

ఒక్కముక్క చెప్పి ఇప్పటికి ముగిస్తాను.

ఆత్మ - పరమాత్మ; సృష్టి - ప్రళయము; సృష్టికి పూర్వమూ - ప్రళయానంతరము, పరలోకాలు, అన్న వాటిని గురించి ఆయా గ్రంధాలలో ఉన్న వాటిని ప్రకటించడమే తప్ప, అవి వాస్తవాలో కాదో, అలాగే ఉన్నాయో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వాటిని గురించి ఆ గ్రంధాలే అందించిన సమాచారాన్ని బట్టే మరొనాటికైనా స్వయంగా తెలుసుకునే అవకాశం కూడా లేదు.

మనిషి - తనకున్న బలహీనతలు లేని వానినిగానూ, తనకు లేని, తాను ఉంటే బాగుండును అనుకునే బలాలన్నీ ఉన్న వానినిగానూ దేవుని ఊహించుకున్నాడు. అలా ఊహాత్మకంగా ఏర్పరచుకున్న దైవభావనకు గుణాలు, పనులు అంటగట్టబోయి తనకున్న అవలక్షణాలనన్నింటినీ దేవునికీ అంటగట్టాడు. దేవునికి సంబంధించినదంతా విశ్వాస మూలకమని ఆ గ్రంధాలే పేర్కొంటున్నాయి. దైవ సంబంధ విషయాలు తెలపబోవడమంటే తెలియని వాడు మరో తెలియని వానికి తెలియ జెప్పడంలాటిదే. నమ్మడం - నమ్మకపోవడం - రెండే మార్గాలు. విశ్వాసాలను సత్యాసత్య పరీక్షకు పెట్టడం అవివేకం - ఉంటాను సెలవ్‌.

సత్యాన్వేషణలో

- మీ సురేంద్ర




కమ్ముకొస్తున్న యుద్ద మేఘాలు - కిం కర్తవ్యం

ఈ దేశంలో ఏనాడు ముస్లిం లీగ్‌ పురుడుపోసుకుందో, ఆనాడే ఈ దేశ భవిషత్తుకు అభద్రతా పురుడుపోసుకుంది. భారతీయులుగ, ఆంగ్లేయుల్ని ఇటనుండి వెళ్ళగొట్టి అన్నదమ్ములుగ కలిసి ఉండాల్సిన ఈ దేశస్తులు మత ప్రాతిపదికన రెండుగా చీలిపోయారు. ముస్లింలు ఈ దేశంలోని వివిధ దైవ విశ్వాసాలలో, ఒక విశ్వాసానికి చెందిన వారుగా మిగిలిన వారిలా ఇక్కడ కలసి ఉండలేకపోయారు. పైగా ఆనాటికి ఇక్కడున్న ముస్లింలందరూ దాదాపుగా మతం మార్చుకుని ముస్లింలైనవారే. ఈ దేశాన్ని సొంత దేశంగా తలచిన వాళ్ళే కదా! మరెందులా జరిగింది?. కారణమేమిటి? ఈ దేశంలో ఏకేశ్వరారాధకులున్నారు. బహుదేవతారాధకులున్నారు. ఈశ్వరుని విషయంలో ఒక నిర్ణయానికిరాని, రకరకాల విశ్వాసాల వాళ్ళూ ఉన్నారు. అవిశ్వాసులూ ఉన్నారు. వారిలో ఎవ్వరికీ, తమ విశ్వాస మూలకంగా వేరు దేశంగా విడిపోదామన్న ఆలోచన పుట్టనేలేదెన్నడూ. ఈ దేశం అఖండ భారతంగా లేని స్థితిలో, అంటే వివిధ పెద్ద చిన్న రాజ్యాలుగా ఉంటున్న సందర్భంలోనూ విశ్వాస - మత - ప్రాతిపదికన అట్టి రాజ్యాలు ఏర్పడడంగానీ, విశ్వాస ప్రాతిపదికన పాలన జరగడంగానీ జరగనేలేదు. రాజులెవరైనా, రాజ్యాలేవైనా, వివిధ విశ్వాసాల వాళ్ళు వారారాధించే దేవుళ్ళ మందిరాలూ అన్నీ, అంతటా విస్తరించే ఉంటుండేవి. అందరినీ ఆరాధించే వాళ్ళు కొందరైతే, తామంగీకరించిన దేవతామూర్తిని మాత్రమే ఆరాధిస్తూ మిగిలిన విశ్వాసాల పట్ల ఆరాధ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవారు ఇంకొందరు. తమ దైవాన్ని అభిమానిస్తూ ఇతరాలను సరైనవి కావనిగానీ, తమ దైవం కంటే అల్పశక్తిమంతాలని అనిగాని తలుస్తుండేవాళ్లు మరికొందరు. ఇలాటివన్నీ తెలీనివీ, తేలనివీ, జీవితానికి అవసరంలేనివి అనే దృష్టికల రకరకాల ధోరణులవారూ ఈదేశంలో సామరస్య పూర్వకంగా సహజీవనం చేస్తూనే వచ్చారు. అత్యంత ప్రధానమూ, ప్రాధమికమూ అయిన ఈ నిజాన్ని మొదట గుర్తించాలి మనమంతా.

సైద్దాంతిక స్థాయిలో ఆ స్థాయి కలవాళ్ళమధ్య వాద వివాదాల రూపంలో పరస్పర విభేదాలుంటున్నా, సాధారణ ప్రజలంతా ఆ వివిధ సైద్దాంతికులందరినీ పెద్దలు - జ్ఞానులు - గానే విశ్వసించి గౌరవిస్తూనే ఎవరికి వారు, తమకు నచ్చిన ధోరణిని యధాశక్తి అనుసరిస్తూ, అందరూ సామాజికంగా సామరస్యంతో సహజీవనం సాగిస్తూ వచ్చారు.

ఈ సంస్కృతి - ఈ దేశ సంస్కృతిగా ఇక్కడి వారికి నరనరాన జీర్ణించుకుని అలవాటుగా మారి ఉంది కనుకనే చక్కగా కొనసాగుతూ వచ్చింది. ఏనాడైతే ఈ దేశంలో క్రైస్తవం అడుగుపెట్టిందో ఆనాటి నుండే 1) అటు క్రైస్తవంలోకి పోయినవారూ, వీరిని అటు లాక్కెళ్ళిన వారూ 2) తమ నుండి క్రైస్తవంలోకి వెళ్ళిన వారిని మతం మార్చుకున్న వారినిగానూ, విదేశీ మతాన్ని స్వీకరించిన వారినిగా, తలంచుతున్న ఇక్కడి నానా విశ్వాసాల వారూ కూడా పరస్పరం పరాయిభావనతో తమవారు, పరాయివారు అన్నదృష్టితో చూసుకోవడం ప్రారంభించారు. అందుకు బలమైన కారణం క్రైస్తవ్యానికి ఆధార గ్రంథంగా ఉన్న బైబిలు వాక్యాలలోనే, స్వజనులు - అన్యజనులు అన్న భావన బలంగా ప్రతిపాదింపబడి ఉండడమే. పైగా అందులో ఎహోవాను తప్ప అన్యులను ఆరాధించరాదన్న ఆదేశాలూ, బహుదైవారాధకులు, విగ్రహారాధకులు అవిశ్వాసులుగానూ, సాతాను పక్షం వారిగనూ, శతృవులుగానూ చూడాల్సిందే నన్న ఆదేశాలూ ఉండడం వల్లనూ, బైటికి ఇరుగుపొరుగుగా కొనసాగుతున్నా, లోలోపల మాత్రం బైబిలు విశ్వాసం ఎంత బలంగా ఉన్నదన్న దాన్ని బట్టి అంతగానూ క్రైస్తవేతరుల పట్ల వ్యతిరేకత పేరుకుంటూనే వచ్చింది. అయినా, అప్పట్లో, క్రైస్తవులు తమకంటూ ప్రత్యేక రాజ్యం ఉండాలన్న వైఖరిని కనబరచలేదు. ఈ నిజాన్ని చాలా స్పష్టంగా గమనించారు కనుకనే ఒక హిందువు మతం మార్చుకోవడమంటే హిందువు ఒకడు తగ్గడం కాదు. హిందూ వ్యతిరేక - శతృవు - ఒకడు పెరగడమని అర్ధం. అన్నాడు వివేకానంద.

ఇదంతా ఒక అంకం కాగా, భారత స్వతంత్ర పోరాటం ఒక ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ముస్లింలంతా వేరుగా ఉండడానికే - ముస్లింలలోని బలమైన వర్గం సిద్దపడడం, అన్నది మరో స్వభావం కలిగిన ఇంకో అంకం. వారెందుకని అలాటి నిర్ణయం తీసుకున్నట్లు...?!

ద్విజాతి సిద్దాంతం అంటే రెండు మతాలననుసరించి, రెండు సమూహాలుగా దేశ ప్రజలను విడదీసే సిద్దాంతం - తెరపైకి బలంగా ముందుకొచ్చి, ఆ ప్రాతిపదికనే, ఒక్కటిగా ఉండాల్సిన దేశం రెండుగా విడివడింది అదీ ఎలా?

ముస్లింలు ఒక్కరూ ఒక జాతి, భారత దేశంలో మిగిలిన వారందరూ ఒక జాతి. హిందూ - ముస్లిం అన్న పేరున్నే, ద్విజాతి సిద్దాంతం ప్రబలంగా ముందుకొచ్చింది. ఇదెంతటి విడ్డూరం? విషాదకరం? అవివేక జనితం? ఆనాటి ఆ స్వార్ధపరులైన మేధావుల తప్పుడు నిర్ణయం యొక్క ఫలితాలను గత డెబ్బై ఏండ్లుగా అనుభవిస్తూనే వచ్చిందీ దేశం. ఈనాటి ఉద్రిక్త పరిస్థితీ, ఆ ద్విజాతిలోని ముస్లిలంతా ఒకేజాతి అన్న ప్రాతిపదికనుండే తన్నుకొచ్చింది. ఈనాడున్న జనాభాను బట్టి ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ''జనాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్‌) ప్రకారం నిర్ణయించుకుందాం'' అన్న కుట్రపూరిత వాదాన్ని ముందుకు తెస్తోంది పాకిస్తాన్‌. దానికి ఈ దేశంలోని మతిమాలిన అదోరకం మేధావి వర్గం (అమ్ముడుపోయిన అందామా?) వంతపాట పాడుతూ వస్తోంది.

నిజానికిది పాక్‌ భారత్‌ దేశాల సమస్య కానే కాదు. కాశ్మీర్‌ - భారతీయుల అంతర్గత సమస్య మాత్రమే. అయితే రష్యా, అమెరికా, చైనాలు వాటిమధ్య నెలకొనిఉన్న వాస్తవ పరిస్థితులు దృష్ట్యా, భారత్‌ - పాక్‌లతోనూ, అలాటి మరికొన్ని దేశాలతోనూ రాజకీయ ప్రయోజనాల రీత్యా, తమ ప్రాబల్యం నిలుపుకోవడానికి కొరకై శత్రుమిత్ర, అలీన వైఖరిని అవలంభిస్తూ వచ్చాయి. వస్తున్నాయి. భారత్‌ - పాక్‌ సరిహద్దు సమస్య ఒక కొలిక్కి రాకుండా, రావణ కాష్టంగా రగులుతుండడానికి అంతర్జాతీయ సంబంధాలు న్యాయ బద్దంగా లేకపోవడమూ ఒక కారణమేనన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఒక ప్రాంతంలో అధిక జనాభాగా ఉన్నవారు కోరితే (దేశాన్ని ముక్కలు చేయవచ్చన్నమాట! చేయాల్సిందేనన్నమాట! క్రైస్తవులంతాగానీ, సిక్కులంతాగాని అధికాధికంగా ఒక ప్రాంతానికి చేరి మైనారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం తాము అఖండ భారత్‌ నుండి విడిపోతామంటే, అంగీకరించి వారినీ వారి ప్రాంతాన్ని విడగొట్టి ఉండండనాలన్న మాట. ఎంత వికృతమైన ఆలోచన ఇది? భారత్‌ రాజ్యాంగ స్ఫూర్తికి ఎంత విరుద్దమైన మాట ఇది?! ఎంత మంది కోరినా దేశాన్ని ముక్కలు మాత్రం చేయనేకూడదు.

ఈ దేశంలోని క్రైస్తవులకుగాని, ముస్లింలకుగానీ, తెగ ఎదిగిన వాళ్ళమంటుండే అనుకుంటుండే వామపక్ష, నాస్తిక, హేతువాద మేధావులకుగానీ ఇంత ప్రమాదకర సమస్య నెత్తిమీది కొచ్చికూర్చున్నా, అసలు సమస్యగానే కనపడదెందుకని? ఈ దేశ ముస్లింలు భారతీయులుగారా? వారికి ఈ దేశం పట్ల ప్రేమ, దేశ భద్రత పట్ల ఆందోళన ఉండక్కర లేదా? వారెందుకని ఏ కోన్ముఖంగా హమారా భారత్‌ మహాన్‌ అని ఎలుగెత్తి నినదించరు? జాతీయ పతాకానికి నమస్కరించడం తమ మత విశ్వాసానికి విరుద్దమంటూ ఏవేవో అడ్డగోలు వాదనలు చేయడమెందుకు?

దేశాన్ని ప్రేమించడానికీ, జాతి ప్రతీకలను గౌరవించడానికీ, ''అల్లా తప్ప ఆరాధ్యుడు లేడు'' అన్న సూక్తిని తెచ్చి అడ్డుపెట్టుకోవడమెందుకు? తండ్రికి నమస్కరించమా? తల్లికి నమస్కరించమా? పెద్దలకు నమస్కారమనమా? యజమానికీ, మిత్రులకు సలామనమా? ఇందరికి సలామనగాలేంది, దేశానికి, దేశ ప్రతీకలకు సలాం అనడం దగ్గరే 'అల్లా' ఎందుకు అడ్డొస్తున్నాడు? దేశాన్ని, పెద్దలను, దేశ ప్రతీకలను గౌరవించడాన్ని, అల్లాకంటే వేరైన వాటిని ఆరాధించడం అన్న తప్పుడు వివరణతో వ్యతిరేకించడమెందుకు? ప్రేమించడాన్ని - ఆరాధించడంగా తప్పుడు అర్ధాన్ని పులమడమెందుకు? ఒక ముస్లిం మక్కాను పవిత్ర స్థలంగా చూస్తాడా? లేదా? దానిని ప్రేమిస్తాడా, లేదా? అక్కడున్న నల్లబండను ఇతర బండలకంటె వేరుగా తలచుతాడా లేదా? అలాగే ప్రవక్తను ఇతర మనుషుల కంటె వేరుగా చూస్తాడా, లేదా? అతణ్ణి కుటుంబీకుల కంటె అధికంగా ఇష్టపడతాడా, లేదా? గౌరవిస్తాడా లేదా? విధేయత కనపరుస్తాడా, లేదా? నా కంటె ఈ లోకంలో నీకు అధిక ఇష్టుడుండరాదన్న ప్రవక్త మాటనేమి చేద్దాం? కనుక అల్లాను, ఖురానును చూపించి, రాజ్యాంగం పట్లా, ఈ దేశం (ఉంటూ, తింటూ) పట్లా; దేశ ప్రతీకల పట్లా విధేయతను కనపరచకపోవడం తప్పుడు పోకడే అవుతుందెవరికైనా.

ఈ దేశంలో పుట్టి, ఇక్కడే, పెరుగుతూ ఉన్న ఎవరికైనా ఈ దేశాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉందా? లేదా? అది వారి విధి కాదా? కర్తవ్య కర్మ కాదా? ఈ దేశం కంటే మక్కానో, ఈ దేశంకంటే బెత్లహాంనో, రోంనో, మరో దాన్నో అధికంగా ప్రేమించే వారినేమనాలి? ఏమనుకోవాలి. వాటి యందలి వీరాభిమానం వల్ల, ఈ దేశానికి అపకారం చేయడానికీ వెనకాడని, సిద్దపడే వారిని, ఈ దేశస్ధులుగా ఎలా చూడాలి? అట్టి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి? మిత్రులారా! నా ఈ మాటలు ఆవేశాన్ని రేకెత్తించేందుకు వాడుతున్నవికావు. ఆవేశంతో లోలోపల శివాలెత్తిపోతున్న వారి ఆవేశాలను అదుపులోకి తేవడానికి ఉద్దేశించినవి మాత్రమే.

రాజ్యాంగ ప్రస్తావనలో దేశం సమైక్యంగా, అఖండంగా, సమానత్వం లక్ష్యంగా ముందుకు సాగాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామో? అదంతా పుస్తకాలకు పరిమితమైందేనా? ప్రతి భారత పౌరుడూ, కుల, మత, ప్రాంత, లింగ, వర్గాలకతీతంగా పై లక్ష్యసాధనకు త్రికరణ శుద్దిగా తనవంతు విధిని నిర్వర్తించాలావద్దా? ఎట్టి గుంజులాటలూ లేకుండా తెల్చి చెప్పాల్సిన అంశమిది.

దేశం ఏమైపోయినా పరవాలేదు అనుకునే వారి పట్ల రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించాల్సి ఉంది? అలాటివారిని, ఉంటే దేశం పట్ల, రాజ్యాంగ నిర్ధేశాల పట్లా విధేయత కలిగి ఉండండి. లేకుంటే మీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళిపోండి. అదిన్నీ ఇప్పటి వరకు దేశం నుండి మీరు పుచ్చుకున్న దాన్ని లెక్క చూసుకుని తిరిగి ఇచ్చేసి వెళ్ళండి. ఒక వేళ మీలో ఎవరు గానీ దేశానికే అదనం ఇచ్చి ఉంటే అదంతా తీసుకునే వెళ్ళవచ్చు అంతేకాని, దేశాన్ని ఇష్టపడకుండా, దేశం పట్ల మీ వంతు కర్తవ్యాన్ని స్వీకరించకుండా, మరో దేశాన్ని ఇష్టపడుతూనో, మరో దేశపు ఆదేశాలను పాటిస్తూనో ఇక్కడే ఉండడం తిన్న, తింటున్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం లాటిదే. ఆ వైఖరి దేశభక్తి లేకపోవడాన్ని మాత్రమేకాక, దేశద్రోహి లక్షణం కలిగుండడాన్నీ సూచిస్తుంది. దేశ ద్రోహులుండడాన్ని ఏ దేశమూ సహించదు. సహించకూడదు.

ఈ సందర్భంలో మరొక్కమాట చెప్పుకుంటేనే ఈ వ్యాసానికి నిస్పాక్షికత సిద్దిస్తుంది. తమ తమ మత విశ్వాసాలను వ్యక్తిగతమైనవిగా భావించి, దేశం విషయంలో, దేశానికిగాని రాజ్యాంగాశయానికి గానీ, దేశ ప్రజలకుగానీ, ఎటువంటి ఆపద వచ్చినా లేదా వస్తుందనుకున్నా ఆ సందర్భాలలో దేశ రక్షణకు, భద్రతకు ప్రధమ గణ్యతనిచ్చి దేశం కోసం, దేశం కోసమే స్ధిరంగా నిలబడే వాళ్ళు, దేశం పక్షాన మాట్లాడే, పనిచేసేవాళ్ళు అన్ని మతాల, ధోరణుల వారిలోనూ కొద్దిమంది ఉన్నారు. అలాటి వారు ప్రతి దేశంలోనూ, ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. మనం అట్టి వారిని చూపి సమస్య వాస్తవ పరిస్థితిని, తీవ్రతను చిన్నది చేసే పని చేయనే కూడదు. ఆయా సమూహాలలో సింహభాగం - మెజారిటీ - వైఖరి ఎలా ఉందన్నదే పరిగణనలోకి తీసుకుంటుండాలి. కనుక ఈ దేశం కోసం ప్రాణాలివ్వడానికి సిద్దంగా ఉండే, ముస్లిం, క్రైస్తవాది సకల ధోరణులలోని అతికొద్ది మందిని ఆధోరణికి ప్రతీకంగా చూడనేకూడదు. అట్టి వారి ప్రవర్తనను, ఆ ధోరణి వారి ప్రవర్తనకు రుజువుగా చూపనేకూడదు. నిజానికి ఆ రకం కొద్ది మంది ఆ మత ధోరణికి చెందిన మనస్సుకంటే, ఉన్నత మానసిక స్థితిలో ఉన్నవారే. కనుక వారిని హిందువు కనక దేశభక్తుడు, ముస్లిం కనక దేశభక్తుడు, క్రైస్తవుడు కనక దేశభక్తుడు అనో అననే కూడదు. అట్టి వారంతా మత విశ్వాసాలకతీతంగా 'దేశభక్తులు' అన్న నిజాన్ని మనం గమనించాలి. ఈ వ్యాసం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది 130 కోట్ల భారతీయులు తమ తమ మతాల, విశ్వాసాలకతీతంగా, దేశభక్తులుగా ఉండాలని, ఉండి తీరాలన్న ఒకే ఒక్క వాస్తవాన్నే. నిజానికి ''దేశానికన్నమిన్న లోకాన లేదురా'' అన్న ఓ కవి అద్భుత భావన ఈ దేశస్తులకు మాత్రమే వర్తించేది కాదు. కాకూడదు. నిజానికి, ఆ భావన సార్వత్రకమైన విలువ కలిగినది అంటే ఏ కాలంలో, ఏ దేశంలో ఉన్న ఎవరికైనా సమానంగా వర్తిస్తుంది. అంత విలువైన మాట అది. దాని అన్వయాన్నిలా చెప్పుకోవచ్చు.

అమెరికా పౌరసత్వాన్ని పొందిన ఏ మతస్థుడు గానీ, గతంలో అతడెక్కడున్నవాడైనా, ఎక్కడనుండి అమెరికా చేరి పౌరసత్వం పొందిన వాడైనా, పౌరుడైన నాటి నుండి ప్రపంచంలోని మిగిలిన ఏ దేశం కంటేనూ అమెరికానే అధికంగా ఇష్టపడాలి. అమెరికా అభివృద్దికీ కృషి చేయాలి. అమెరికా తరఫునే నిలబడాలి. అమెరికాను కాదని మరే దేశానికీ అనుకూలంగా ప్రవర్తించనేకూడదు. ముఖ్యంగా అమెరికా ప్రతికూల - శత్రు- సంబంధాలున్న దేశాలతో. ఇది నిజమా? కాదా?

ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో ఉండే ఒక హిందువు అంటే హిందూమతంలోని ఏదో విశ్వాసాన్ననుసరిస్తున్న వాడు, పాకిస్తాన్‌కు - భారత్‌కు విభేదాలు పొడచూపితే పాకిస్థాన్‌ తరపునే నిలబడాలి. పాకీస్థానీగానే అతడు తన బాధ్యతలు నిర్వర్తించాలి. పాకీస్ధాన్‌ను ప్రేమించాలి. దానికి విరుద్దంగా ఆ దేశంలోని ఎవరు ప్రర్తించినా అది దేశ వ్యతిరేకమైనదీ దేశ ద్రోహ చర్యే అవుతుంది. అట్టి వైఖరిని మేధావులెవరు అంగీకరించరు. అంగీకరించకూడదు. ఏ దేశమూ తన దేశ పౌరసత్వం కలిగిన వ్యక్తులు, తనకు వ్యతిరేకంగా, మరో దేశానికి అనుకూలంగా ఉండే వైఖరిని అంగీకరించదు, సహించదు, అంగీకరించకూడదు. సహించకూడదు.

సర్వ సాధారణమైన ఈ సూత్రం అర్ధమైతేనే గాని అదే సరైనదని అంగీకరించితేనే గాని ఈ దేశంలోని, ఏ దేశంలోని- ఎవరు గాని ప్రవర్తిస్తున్న తీరు సరైందో కాదో నిర్ణయించడం సాధ్యపడదు.

ఈనాడు ఒక వ్యక్తి, అతడే దేశానికి చెందినవాడైతే, మునుముందుగా అతడా దేశపౌరుడు. అతనిపై ఆ పౌర బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతల్లో, విధులను నిర్వర్తిస్తుండడం, హక్కులను పొందుతుండడం - కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తుండడం అన్న మూడు చేరి ఉంటాయి. (హక్కులు - విధుల, బాధ్యతలు అన్న మూటినీ కర్తవ్య కర్మల క్రింద పేర్కొనీ వాస్తవాన్ని అర్ధం చేసికోవచ్చు. ఇక్కడ వివాద పడాల్సినంత అవసరం లేదు) ఆ తరవాతనే మిగిలిన ఏ విషయాలను గానీ పరిగణనలోకి తీసుకుంటుండాలి. అది - ఆ వైఖరిని - వ్యక్తులు స్వీయ నియంత్రణ కలవారై (స్వతంత్రులై) అనుసరించగలిగితే అట్టి సమాజాన్ని ఉత్తమ (వివేకవంతమైన) సమాజం అంటాము. అట్టి స్థాయిలేని వ్యక్తులున్న సమాజంలో వ్యక్తులు పరనియంత్రణ వల్లనైనా (వ్యవస్థ అదుపులో నుండైనా) అలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడే సమాజం ఒక క్రమంలో ప్రశాంతంగా, అలజడులు లేని వాతావరణంలో సాగగలుగుతుంటుంది.

అత్యంత ప్రాథమికమూ, ఏ దేశానికైనా వర్తించే సర్వ సాధారణమూ అయిన ఈ సూత్రాన్ని, మన ప్రస్తుత దేశ సమస్యకు వర్తింప జేస్తే దాని ఆచరణ రూపంఎలా  ఉండాలి?

మును ముందుగా ఈ దేశంలోని 130 కోట్ల మందీ ఈ దేశ పౌరులు. అంటే భారతీయులు. అలాగే, ఈ దేశం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య విధానాన్ననుసరించి ఈ దేశ సంపద విషయంలోనూ, వ్యవహారాల విషయంలోనూ యజమానులు, యాజమాన్యపు భాగస్వాములు. సొంతదారులన్న మాట. యజమానితనానికి మూడు ప్రధాన లక్షణాలుంటాయి. సంపదపైనా, అది పుట్టించే ఫలితాల విషయంలోనూ -1) నిర్ణయాధికారము 2) పర్యవేక్షణాధికారము 3) లాభనష్టాలకు బాధ్యుడైయ్యుండడము.

గమనిక  : ఈ సందర్భంలో భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రచించిన, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారి మాటలు నిరంతరం స్మరించదగినవిగా, స్పురణలో ఉంచుకోదగినవిగ నా కనిపించాయి. ''40 సం|| కాలం స్వాతంత్య్ర యోధులు చేసిన త్యాగాల మూలంగా మనకు స్వతంత్రం వచ్చింది. వారు మనకు చిరస్మరణీయులు. వారు సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని నిలబెట్టడం మన ప్రథమ కర్తవ్యం. గతంలో మనలో జాతీయ భావమూ, సమైక్యతా లేని కారణం చేత స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుని అష్టకష్టాలను అనుభవించాము. భవిష్యత్తులో మనకు, మన దేశానికీ, అలాటి ప్రమాదం లభించకుండేట్లు మనమూ, భావితరములవారూ ప్రవర్తించడం అవసరం. నా గ్రంధం మూలంగా మనం నేర్చుకొనవలసిన గుణపాఠం ఇదే. ఇందుకుగానే, నేనీ గ్రంధాన్ని వ్రాశాను.

మిత్రులారా! ఇదే ఈవ్యాసం ద్వారా నేను చెప్పాలనుకున్నదీ. జాతీయ భావము, దేశ సమైక్యత అన్నదే దేశభద్రతకూ దేశాభివృద్దికీ ఆధార శ్రోతస్సులు. ఆ రెండూ ఉన్న వారే ఇక్కడ ఉండడానికి అర్హులు, ఈ దేశ సంపద విషయంలో న్యాయ బద్దమైన భాగస్వాములూ కాగలరు.

గతాన్ని తవ్వుకోవడం అనవసరం. అయితే, గతాన్ని యథాతధంగా గుర్తించకున్నా, గుర్తుంచుకోలేకున్నా, సరైన భవిష్యత్తుకు దారులు వేసుకోలేము. ఈ దేశంలో మతం ఆధారంగా ఏర్పడ్డ ద్విజాతి సిద్దాంతం, దాని వల్ల ఇక్కడ జరిగిన దారుణ మారణ కాండలను గమనికలోకి తీసుకోకుంటే, వర్తమాన పరిస్థితుల్లో అంటే మళ్ళీ మతం - రాజకీయంతో కలసి వికృత వేషాలు వేయడానికి ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో, ఏ నిర్ణయం, ఎలాటి నిర్ణయాలు భారత దేశ శ్రేయస్సుకు సరళమైన దారి చూపించగలుగుతాయో అలాటి నిర్ణయాలు తీసుకోలేము. నాకు తెలిసి ఆ పనిని సమర్ధవంతంగా చేయగలిగింది, జాతీయ భావనొక్కటే. మనమంతా ఎంతో ప్రమాదకరమైన మతపరమైన జాతి భావన నుండి బైటపడి, దేశపరమైన అంటే రాజ్యాంగ బద్దమైన జాతీయ భావన, సమైక్యభావన దగ్గర నిలబడి, ముక్త కంఠంతో, ఒకే గొంతుతో మేమంతా భారతీయులం, మా జాతి భారత జాతి, మా దేశం సమైక్య భారతదేశం అని కట్టకట్టుకుని నినదించాలి. కటిబద్దులమై ఒక్కటిగా నిలవాలి. అదొక్కటే మన మధ్యనున్న అంతర్గత వ్యత్యాసాల ప్రభావం నుండి మనల్ని నిలువరించి సమైక్యంగా ఉంచగలుగుతుంది.

అంబేద్కర్‌ - వాల్యూం - 8 (భారత దేశ విభజన)లో, జాతీయ నిస్పృహ అన్న వ్యాసంలో ''మీ దేశానికి ఎలాటి మహోన్నత భవితవ్యం ఉండాలని కోరుకుంటావు? అని ఏ భారతీయుణ్ణి అయినా అడిగారనుకోండి. జవాబు ఏమై ఉంటుంది?

ఈ ప్రశ్న ముఖ్యమైనది. జవాబు ఉద్బోధకంగా ఉండకతప్పదు.

ఇతర విషయాలన్నీ సమతూకంగా ఉండి, తన దేశమంటే గర్వపడే నికార్సయిన భారతీయుడు ''సమైక్య స్వతంత్ర భారత దేశమే నా ఆదర్శం, అదే భారత భవిష్యత్‌కి కావాలి'' అని అంటాడు. (ఇదెంతనిజమో) హిందువులూ, ముస్లింలూ ఉభయులూ కూడా ఇలాటి భవితవ్యమే ఉండాలని అనుకుంటే తప్ప ఈ ఆదర్శం ఒక పవిత్ర కామనగానే మిగిలిపోతుందన్న మాటా అంతే నిజం. అలా తప్ప దీనికి కార్యరూపం కార్యరూపం ఎన్నటికీరాదు. ఇది ఏదో కొందరి పవిత్రాశయం మాత్రమేనా లేక యావన్మందీ నడుం కట్టి సాదించాల్సిన లక్ష్యమా? 1993 ముద్రణ పే. 259 - సంపు(8)

నిజం చెప్పాలంటే బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్య్రం సాధించడంతోనే (మనపని) అయిపోదు. ఆ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడమనేకర్తవ్యం ఇంకా ముఖ్యమైనది (మిగిలే ఉంటుంది.) అయితే ఈ ముఖ్యమైన కర్తవ్యం మ్మీదే ఏకాభిప్రాయం ఉన్నట్లులేదు. ఏమైనా, ఈ విషయానికి సంబంధించి ముస్లింల వైఖరి అంత నమ్మకం కలిగించేట్లులేదు. భారత దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని తమనెత్తిన మోపుకోమని ముస్లిం నాయకులు శతదా చేస్తున్న ప్రకటనల ద్వారా విశదమవుతూనే ఉందీ విషయం.

సిల్హేట్‌లో 1939 జనవరి 27న మౌలానా అజాద్‌ శోభానీ చేసిన ఉపన్యాసంలోని భావాలు కూడా శ్రద్దగా గమనించదగినవి. ఒక మౌలానాగా రడిగిన ప్రశ్నకు జవాబుగా శోభాని ఇలా అన్నారు.

''ఈ దేశం నుంచి ఇంగ్లీషు వాళ్ళను తరిమెయ్యాలని చెప్పే ప్రముఖ నాయకుడెవరన్నా ఉన్నాడనంటే అది నేనే. అయినా ముస్లింలీగు నుండి ఇంగ్లీషు వాళ్ళతో పోరు ఉండకూడదని నా అభిప్రాయం. మనం చెయ్యాల్సిన పెద్దయుద్దం 22 కోట్ల హిందూ శత్రువులతోనే... వాళ్ళుగాని శక్తి సంపన్నులైతే ముస్లిం భారత్‌ని, క్రమేపీ ఈజిప్టుని, టర్కీని, కాబూల్‌ మక్కాల్ని, మదీనాని, యాజూజ్‌ మాజూజ్‌ లాటి ఇతర ముస్లిం మతాల్ని కబళించేస్తారు. (ఖురాన్‌లో ఉంది ప్రపంచ ప్రయళయం సంభవించడానికి ముందు వాళ్ళు భూమ్మీద ప్రత్యక్షమై దొరికిందాన్ని దొరికినట్లు మింగేస్తారట)

''ఇంగ్లీషు వాళ్ళు రాను రాను శుష్కించిపోతున్నారు. వాళ్ళురేపోమాపో భారతదేశం నుండి వెళ్ళిపోతారు. అందుచేత మనం ఇస్లాంకి బద్ద శత్రువులైన హిందువులతో పోరాడి వాళ్ళని బలహీన పరచకపోతే వాళ్ళు భారతదేశంలో రామరాజ్యం స్థాపించడమేకాదు, క్రమేపీ భూమండలమంతా వ్యాపిస్తారు. హిందువుల్ని బలోపేతుల్ని చేయడమో లేక నిర్వీర్యులను చేయడమో అనేది 9 కోట్ల మంది ముస్లింల మీద ఉంది. అంచేత హిందువులు ఇక్కడ స్థాపితం కాకుండా, ఇంగ్లీషువాళ్ళు నిష్క్రమించిన వెంటనే ముస్లిం పాలన స్థాపితమయ్యేందుకుగాను, ముస్లింలీగులో చేరి పోరాడడం ప్రతి పవిత్ర ముస్లింకీ తప్పనిసరి కర్తవ్యం.

''జాగ్రత్త! కాంగ్రేసులో ఉన్న మౌల్వీల వలలో పడకండి. ఏమంటే 22 కోట్ల హిందు శత్రువుల చేతిలో ముస్లిం ప్రపంచం ఎన్నటికీ భద్రంగా ఉండలేదు.'' ఇది మౌలానా అజాద్‌ శోభాని ఇచ్చిన ఉపన్యాసంలోని భావాలు.

శ్రీమతి అనిబిసెంట్‌ ముస్లిం సమస్యపై ఇలా అంటున్నారు.

''ఖిలాఫత్‌ ధర్మయుద్దాన్ని ప్రోత్సహించడం వల్ల భారతదేశానికి పెద్ద దెబ్చే తగిలింది'' విశ్వాస రహితులకు వ్యతిరేకంగా ముస్లింల మనోగత భావాలలో ద్వేషం ఉబికింది. గడచిన సంవత్సరాలలో మాదిరే లజ్జారహితంగా, నగ్నరూపంలో ఉందా ద్వేషం. ప్రత్యక్ష రాజకీయాలలో చోదకంగా పాత ముస్లిం కరవాలం మళ్ళీ ఊపిరి పోసుకోవడం చూశాం... జాజిరుత్‌ - అరబ్‌ అంటూ, అరేబియా ద్వీపాన్ని పవిత్ర భూమిగా చాటడం చూశాం... ఆఫ్ఘన్లు గనక భారత దేశం మీదికి దాడిచేస్తే, తమ మతస్తులు వాళ్ళతో చేతులు కలిపి, ఆఫ్ఘన్లకు వ్యతిరేకంగా దేశరక్షణకు పోరాడే హిందువుల్ని హతమారుస్తామని ముస్లిం నాయకులు చాటడం విన్నాం.

ముసల్మాన్లు మౌలికంగా తమ మాతృదేశానికి కాక, ఇస్లాం దేశాలకు విధేయంగా ఉంటారన్న దాన్ని చూడక తప్పలేదు. వాళ్ళకు ప్రాణప్రదమైంది దేవుని రాజ్యాన్ని స్ధాపించడం అని మనకు తెలియవచ్చింది. ఆ దేవుడు లోకపితగా సర్వప్రాణుల్ని ప్రేమించే దేవుడు కాదు. ప్రవక్తల ఆదేశాల ద్వారా ముసల్మాన్‌ కళ్ళద్దాల గుండా కనిపించే దేవుడు.

''తాము వశిస్తూ ఉన్న రాజ్యచట్టాన్ని మించి ఆఫలాన ప్రవక్త బోధనల్ని మన్నించాలని ముసల్మాను నాయకులు చేసే ప్రతిపాదన పౌరక్రమ శిక్షణకు, రాజ్య స్థిరత్వానికీ నాశనకరం (భంజకం) దాని వలన వారు దుష్ట పౌరులవుతారు. ఏమంటే వాళ్ళ భక్తి ప్రపత్తులు దేశం వెలుపట ఉన్నవాటి పట్ల ప్రదర్శితమవుతాయి.''

''భారతదేశంగనక స్వతంత్య్రమైతే, జనాభాలో ముస్లిం విభాగం భారతదేశ స్వాతంత్య్రానికి ప్రత్యక్షంగా ప్రమాదకరమవుతుంది. ఎందుకంటే, అజ్ఞానులైన ముస్లిం జనసమూహం ప్రవక్త పేరుతో తమకు విజ్ఞప్తి చేసేవాళ్ళ వెనకాలే పడిపోతుంది గనుక.... వారంతా భారతదేశాన్ని ఇస్లాం పాలన క్రిందికి తేవడానికే ఉద్యుక్తులవుతారు.

''యథార్ధానికి చాందస ముస్లింలు పాలించే దేశాల్లో ముస్లిం శాఖీయులకీ భద్రత లేదు. షియాలు, సున్నీలు, సూఫీలు, బాహేలు బ్రిటీషు రాజ్యంలోనే హాయిగా ఉండగలరు.''

2) లాలాలజపతిరాయ్‌ సి.ఆర్‌.దాస్‌కు రాసిన లేఖలోని అంశాలు.

''ఈ మధ్య హిందూ ముస్లిం జోక్యం అన్న అంశం నన్ను అతిగా కలవరపెడుతోంది. గత ఆరు నెలలుగా ముస్లిం చరిత్ర, ముస్లిం ధర్మశాస్త్రం అధ్యయనానికే ఎక్కువ వ్యవధిని ఖర్చుపెట్టాను... వాళ్ళ మతం ఐక్యానికి గట్టిగానే అడ్డంగా ఉంటుందని పిస్తోంది. హాకింసాబ్‌ కంటె మంచి మహమ్మదీయుడు హిందూస్తాన్‌లో ఎవరూలేరు. కానీ ఏ మహమ్మదీయుడైనా ఖురాన్‌ను ఎదిరించగలడా? ఇస్లాంమతన్యాయం నాకర్దమైన పద్దతి తప్ఫైతే బాగుండుననినేనాశిస్తున్నాను... హిందూస్థాన్‌ని ప్రజాస్వామ్య పద్దతిలో పాలించడానికి మనం ఐక్యంకాలేము. మరైతే దీనికి మందేమిటి?...

హిందూ ముస్లింల మధ్య ఐక్యత అవసరం లేదా వాంఛనీయం అని నేను మనస్ఫూర్తిగా, గుండె మీద చేయి వేసుకుని విశ్వసిస్తున్నాను.... కానీ ఖురాన్‌, హజీలు విధించే అనుశాసనాల మాటేమిటి? ముస్లిం నాయకులు వాటిని కాదనలేరు.

3) 1924లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌తో జరిపిన ఇంటర్వ్యూలో...

హిందూ ముస్లిం ఐక్యత అసంభవం అని కవిగారి అభిప్రాయం. మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని పరిమితం చేయలేరు అన్నదే ఠాగూర్‌ బలమైన అభిప్రాయం.

ఏ మహమ్మదీయ రాజ్యమైనా భారతదేశంపై దండయాత్ర చేస్తే, ఆ సందర్భంలో తమ ఉమ్మిడి భూమిని రక్షించుకునేందుకు మహమ్మదీయులు హిందువులకు తోడుగా నిలుస్తారా? అని నిర్మొగమాటంగా అడిగాడు... ఓ మహమ్మదీయుడి దేశం ఏదైనా కానీ, అతడు మరో మహమ్మదీయునికి వ్యతిరేకంగా పోరాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ముహమ్మద్‌ ఆలీ లాటివారే చాటారు.''

పాఠక మిత్రులారా! ఈ ఉట్టంకింపుల సందర్భంలో ఈ అభిప్రాయాలు వెళ్ళడించింది ఆషామాషీ వ్యక్తులు కారు అంటూ అంబేద్కర్‌ ఇలా రాశారు.

''ఈ భయాలు వెళ్ళడి చేసిన వాళ్ళు ఉచితానుచితాలు తెలియని వాళ్ళనుకునేరు. కాదు సరి కదా వాళ్ళు ముస్లిం నాయకులతో బాగా సంబంధాలుండి, తమ అభిప్రాయాల్ని వెళ్ళడించగల ఉచితజ్ఞత కలవాళ్ళు.

కనుక అంబేద్కర్‌ కాలంనాటికే అంబేద్కరే కాకుండా, ఆస్థాయి మేధావులని అంబేద్కర్‌ ప్రస్తావించిన వాళ్ళూ ఖురాన్‌ మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది? దాని ఆదేశాల విషయంలో ఒక ముస్లిం వైఖరెలా ఉంటుంది అన్న విషయంలో వారు తమని ప్రత్యేకించుకుని తీరతారని, హిందువులను, ఇస్లామేతరుల్ని అన్యులుగానే భావిస్తారని స్పష్టంగా ప్రకటించారు. సంస్కరణవాదులైన ముస్లింలెవరైనా ఖురానుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాందస ముస్లింలు వారిని చంపేయవచ్చనీ అన్నారు.

ఇస్లాంలోని అంతర్గత బలహీనతల్ని గురించీ డా|| అంబేద్కర్‌ 8 వాల్యూం - సామాజిక స్తబ్దత అన్న శీర్షిక క్రింద చాలా విలువైన, ప్రామాణిక సమాచారాన్ని రాశిపోశారు. వివరంగా తెలుసుకోదలచిన వాళ్ళు 8వ సంపుటిని ఆ సాంతం శ్రద్దగా అధ్యయనం చేయండి. ఒక్కమాట చెప్పి దీనిని ముగిస్తాను.

సత్యాన్వేషణ మండలి ద్వారానూ, ఐక్యవేదిక ద్వారానూ నేను పౌరులకు సంబంధించిన ఒక అభిప్రాయాన్ని సూత్రరూపంలో బలంగా చెపుతూ వస్తున్నాను.

భారతదేశంలో ఉన్న భారత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా, ముందుగా తాను భారతీయునిగా త్రికరణ శుద్దిగా తలంచాలి. ఆ రకంగానే ప్రవర్తిస్తుండాలి. ఆ తరవాతనే తానేదో ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి, పార్టీకి చెందిన వాణ్ణని తలంచాలి, ఆ రకంగానే ప్రవర్తించాలి. భారతదేశము, భారత రాజ్యాంగము, భారతీయులు అన్న భావన అన్నిటికంటే ముందుది, ముఖ్యమైందిగా అనుకుంటూ ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట.

విషయం అర్ధమవుతుందనుకుంటాను. నీవు మొదట భారతీయుడివి. పిదపే హిందువులి మొదట భారతీయుడివి, పిదపనే క్రైస్తవుడివి, మొదట భారతీయుడివి, పిదపనే ముస్లింవి... ఇలాగన్న మాట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, 70 ఏండ్లకు పూర్వమే, అంబేద్కరూ ఈ విషయాన్ని ముఖ్యమైనదిగ తలంచడమేగాక, ఈ విషయంలో వివేకవంతుడైన పౌరుడేలా ఉండాలో ఉంటాడో సుస్పష్టంగా ప్రకటించాడు. ఆ మాటలు ఇవిగో,

దేశంలో కొందరు సంఘహితైషులైన మేధావులు, మొదట భారతీయుడివి తరవాతే హిందువైనా, ముస్లిమైనా క్రైస్తవుడైనా అన్న దృష్టి కలిగి ఉండాలనంటుంటారు. నా దృష్టిలో అది సరికాదు. సరిపడినంత వివేకం ఉన్నవారైతే, నేను మొదటా భారతీయుణ్ణేతరవాతే భారతీయుణ్ణే, చివరకూ భారతీయుణ్ణే అంటారు అనాలి, అనన్నారు.

ఎంతటి ఉదాత్తభావన ?! రాజ్యంగ పీఠికలోని ఆశయాలు నెరవేరాలంటే పౌరుల మానసిక స్థితి ఎలా ఉండితీరాలని ఆయన విచక్షణ నిర్వింద్వంగా ప్రకటిస్తొందో గమనించారా? ఆ వైఖరే ఉత్తమోత్తమమైనది. నిజమైన జాతీయ భావనను నెలకొల్పగలిగింది.

నా వరకు నేను అక్కడే ఉన్నాను. నాకు ఏ మతమూలేదు. ప్రాంతల పట్టింపూలేదు కేవలం భారతీయుణ్ణి మాత్రమే. ఇంకే సంకుచిత భావనకు తలొగ్గడానికి నేను సిద్దంగా లేను ఈ ఉన్నత భావాన్ని అంగీకరిస్తూనే నేను, కనీసం మొదట భారతీయుణ్ణి తరవాతే ఫలాన మతస్ధుణ్ణి, ప్రాంతం వాణ్ణి వగైరాలన్నీ అనుకొమ్మని చెప్పాను. ఈ నాప్రతిపాదన అంబేద్కర్‌ ప్రతిపాదనతో పోలిస్తే మధ్యమ స్థాయి కలిగింది మాత్రమే.

వివిధ మత, ప్రాంతాలకు చెందిన వారిగా తలంచుతుండే పౌరులారా! మీరేక్కడున్నారో ఎక్కడికి రావాలనుకుంటున్నారో తేల్చుకుని, ఆ రకంగా నిజాయితీగా ప్రవర్తించండి. 1) నేనన్నదానికంటే అంబేద్కర్‌ చెప్పింది ఉన్నతమైనది. నేను మనిషిని, మానవ సమాజం మంతా ఒక్కటే అన్నది మరింత ఉన్నతమైనది, ఆదర్శప్రాయమైనది ఆలోచించండి.

ఇస్లాం మత స్వేచ్చను అంగీకరించదనడానికింత కంటే రుజువేం కావాలి? విధిలేక మాత్రమే వారు మరొకరితో కలిసి ఉంటారు.

1) ఇస్లాం పద్దతి అమలయ్యే పరిస్థితి ఉంటే, అక్కడ ఇస్లామేతరులు స్వేచ్ఛగా ఉండడం అసంభవం. షరతులతోకూడిన, అదిన్నీ అవిశ్వాసిగా ఉన్నందుకు గాను విధించిన షరతులతో, ఉండనిచ్చినందుకు గాను విధించిన పన్ను చెల్లించే ఉండాలి.

ఫజులూర్‌ రహ్మన్‌ గారికి



రాయడానికి ఒకింత ఇబ్బందిగా ఉన్నా ముందుగా ఒక నిజాన్ని చెప్పి విషయానికి వస్తాను. సుమారు 10 ఏండ్లు ఆత్మీయంగా మెసలిన మన మధ్య ప్రస్తుతం మనస్ఫూర్తిగా మిత్రుడా అని అనలేని పరిస్థితి నెలకొని ఉంది. నాకైతే సత్యం ప్రాతిపదికన, ఈ పరిస్తితి మారితే బాగుండును అనిపిస్తున్నా, ఆశ మాత్రం దాదాపు కొండెక్కేందుకు సిద్దంగా ఉన్న దీపంలా మినుకు మినుకు మంటోంది. ఇంకా కొండెక్కలేదన్న ఆ ఆశతోనే లేఖ ఇలా తయారైంది.

1. బైబిలు, ఖురాను మూలాల్లోనే పరమతాన్ని సహించని, విరోధించే వాక్యాలున్నాయి.

''నేను తప్ప మరోదేవుడుండకూడదు'' బైబిలు; ''దేవుడు లేడు అల్లా తప్ప'' ఖురాను

2. మీరు ఏ రూపమును, విగ్రహమును చేసికొనకూడదు, మొక్కకూడదు, పూజించ కూడదు. నిర్గ 20:3,4; వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, దేవతాస్థంభాలనూ పడగొట్టాలి. నిర్గ 34:13,14. సమస్త స్తోత్రములూ అల్లాకే, అల్లా తప్ప ఆరాధ్యుడులేడు. బహుదైవారాధకులు, విగ్రహారాధకులకు ఈ లోకము పరలోకములో కూడా ఘోరమైన శిక్ష ఉంది. ఖురాను. ఆవు దూడను పూజించినందుకే స్వజనులనే హతం చేయడం బకరా:54; మక్కాలోని దేవతామందిరాలను ప్రవక్తే ధ్వంసం చేయడం మీకూ తెలిసున్న విషయాలే.

3. ఆ రెండు గ్రంధాలను బట్టే కాక, ఆ వాక్యాలననుసరించి గతంలో చాలా ఘటనలు జరిగాయనడానికి చరిత్ర నిండా అనేక ఆధారాలూ ఉన్నై.

ఈనాడు పై మూడు వ్రాతరూపంలో మనకు అందుబాటులోనే ఉన్నప్పటికీ, మతాభిమానం మన చేత ఈ నిజాన్ని అంటే ఆ రకమైన అన్యమత వ్యతిరేకత బైబిలు, ఖురానులలో ఉందన్నా అంగీకరించనీయడం లేదు. ఎందుకని క్రైస్తవులూ, ముస్లింలూ అంగీకరించడం లేదు?

ఒకటి :- రకరకాల దైవారాధనలను అంగీకరిస్తూ అనుసరిస్తూ కూడా కలసి మెలసి జీవించడం నేర్పిన భారతీయ సంస్కృతికి అలవాటు పడి ఉండడం.

రెండు :- మానవీయ మరియు ఇరుగు పొరుగు సంబంధాలననుసరించి విశ్వాసాలు వేరైనంత మాత్రాన ఒకరి నొకరు శత్రువులుగానూ, దుష్టులుగానూ భావించనక్కరలేదని మనకు మనకే అనిపిస్తుండడం.

మూడు :- ఆ అసహనపు, శత్రుపూరిత వైఖరిని నలుగురూ అంగీకరించరు. భారత రాజ్యాంగమూ అంగీకరించదు కనుక. ఈ మూడూ, ఇలాటి మరి కొన్ని కారణాలవల్ల పై గ్రంధాలలో పేర్కొన్నటువంటి పరమత అసహనంగానీ, వైరభావం గానీ మనుషుల మధ్య ఉండకూడనివనే, మన సామాన్య జ్ఞానం (ఇంగితం) ప్రకారం అంగీకరిస్తున్నామన్నమాట. కాబట్టే అట్టి వైఖరి సరైందా కాదా అన్న దగ్గర మనం విభేదించుకోడం జరగలేదు. ఆ గ్రంధాలలో అట్టి భావాలున్నాయా లేదా? అన్న దగ్గరే మనం వివాద పడ్డాం. ఉన్నాయని నేను, మరికొందరూ అనగా ఉంటే చూపండి, దానిని విడిచి బైటికి వచ్చేస్తాను అని మీరూ అనడం జరిగింది.

పరమత అసహనంగానీ, అల్లాను విశ్వసించక, అన్య విశ్వాసం కలిగి ఉన్నాడన్న కారణంగా శత్రువుగా తలంచడంగానీ, సరైంది కాదనే ఇరువురమూ అంటున్నాం. అట్టిపోకడను విడిచిపెట్టాలనీ, అరికట్టాలనీ అంటున్నాం. ఇక్కడికిది మనం నిజంగా అనుకుంటున్నదోకాదో మీరూ ఆలోచించండి.

కానీ, ఖురాను ప్రకారం, ఖురానుకు వేరైన ధర్మశాస్త్రాలేవీ ప్రామాణికాలుకావు. అల్లా ప్రవక్త ద్వారా అంతిమ సందేశాన్ని అందించాక, ఇక ఇతరమైన వేటినీ అంగీకరించడు. కనుక ఒక ముస్లింకు ఇస్లాం రాజ్యమే కోరదగిందై ఉంటుంది. ఇతర రాజ్యాలు, రాజ్యాంగాలు అవేవైనాగానీ, ఉండకూడనివీ, ఒక ముస్లింగా పరాయివీనే అవుతాయి. ఈ అర్ధాన్నిచ్చే వాక్యాలు ఖురానులోనూ, హదీసుల్లోనూ ఉన్నాయి. సూటిగా అడుగుతున్నాను. ఖురాన్‌ తెలిసిన వ్యక్తి, భారత దేశంలోనూ, ఇస్లాం ధర్మం స్ధాపించబడాలని కోరుకుంటాడా లేదా? విధిగా కోరకుంటుంటాడు. కోరుకోవలసిందే లేకుంటే అవిశ్వాసి ఐపోతాడు కూడా.

కనుక నా లెక్క ప్రకారం బైబిలు, ఖురానులననుసరించి, పరమత అసహనం, బహుదైవారాధకుల పట్ల, అన్యదైవారాధకులపట్ల శత్రువైఖరి కలిగి ఉండడం వాటిననుసరించే వారికి తప్పనిసరి. సమానమూ కూడా. కానీ మీరు దీనిని అంగీకరించడం లేదు. అట్టి మాటలు లేవు అనంటున్నారు. ఇదే మన మధ్య వివాదాంశం.

ఈ విషయంలో ఎవరి అవగాహన - పక్షము - సరైందో తేల్చుకోడానికి రకరకాల వ్యక్తిగత విమర్శలు గానీ, ఇతరేతరమైన పలు అంశాలుగాని ప్రస్తావించుకుంటూ కూర్చోనక్కరలేదు. రెండు మూడు భాషలలో ఉన్న ఖురాను అనువాదాలను, హదీసులను పరిశీలించి అర్ధ నిర్ణయం చేయగల భాషాభిజ్ఞులను నిర్ణేతల స్ధానంలో కూర్చుండబెట్టుకుని, మనం చూపించదలచిన వాక్యాలను, ఖురానులోని సందర్భాన్ని కూడా వారి ముందర పెట్టి అర్ధ నిర్ణయం చేయండని అడిగితే సరిపోతుంది. విచారణ నీతివంతంగా జరిపించుకోవాలంటే, ఆ నిర్ణేతలుగా ఎంచుకునేవారిని మన రెండు పక్షాలలో ఎవరమూ ప్రభావితం చేయకుండా ఉండాలి. ''భాషననుసరించి ఈ మాటలకు అర్ధమేమిటి?'' అన్న మాట తప్ప మరింకేమీ మాట్లాడకూడదు మనం. ఇది మీకు గానీ, మీ పక్షంలోని వారెవరికి గానీ అంగీకారమైతే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఖురాను అనువాదాలను, వీలుంటే అరబ్బీ ఖురానును తీసుకుని, ఆ నాలుగు భాషలలోని భాషావేత్తల ముందుంచుదాం. ఆ వచనాలకు అర్ధాలు చెప్పమని అడుగుదాం.

ఇదొక్కటే, ఈ దశలో మన మధ్య నెలకొని ఉన్న సమస్యకు సరళమైన సరైన పరిష్కారం అనిపిస్తోంది. మీరూ, మీ బృందంలోని వారూ ఆలోచించి స్పందించండి. ఇతరేతర విషయాలను ప్రస్తావించకండి. క్రొత్త విషయాలను లేవనెత్తకండి.

రహ్మన్‌గారూ! ఈ వ్యాసం ద్వారా మిమ్మల్ని మరో విషయాన్ని అడగాలనిపించింది. అదేమంటే... రంజిత్‌ ఓఫీరుగారు వాదనలు మీకూ తెలుసు. ఆయన ప్రకటిస్తున్న వాటిలో, మీ అవగాహన ప్రకారం కూడా, సరికానివి కొన్నీ, అబద్దాలేననడానికి తగినవి కొన్నీ ఉన్నాయి. అందులో 1. ఏసే దేవుడన్నదీ, 2. ఏసేలోకరక్షకుడన్నదీ 3. ఏసే సృష్టికర్త అన్నదీ 4. ఏసే రక్షకుడన్నదీ చాలా ముఖ్యమైనవి. వీటికి సంబంధించి, ఇటు బైబిలు ప్రకారంగానీ అటు ఖురాను ప్రకారంగానీ, ఓఫీరు గారు చెపుతున్నది సత్యం కాదనీ, అతడు చేస్తున్నది అసత్య ప్రచారమేనని నిజంగా మీకు అనిపిస్తున్నదా, లేదా?

ఏసును దేవుడని గానీ, సృష్టికార్యంలో (దైవకార్యంలో) భాగస్వామి అనిగానీ అన్నవారు ఖురాను ప్రకారం మీకు శత్రువర్గమా? మిత్రవర్గమా? ఖురాను ప్రకారం వాళ్ళు విశ్వాసులా? అవిశ్వాసులా? తీర్పు తరువాత వారి నివాసం స్వర్గమా? నరకమా? సూటిగా ఒక్కమాటడుగుతాను. అంతే సూటిగా సమాధానం చెప్పగలరేమో చూడండి. మీ విశ్వాసం చెపుతున్న దానిని బట్టి, అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారు స్వర్గానికి పోతారా? ఘోరనరకాన్ని పొందుతారా? ఆయన పోకడ  'షిర్కు' క్రిందికి వస్తుందా, రాదా?

ఓఫీర్‌గారు ఇస్లాం సంబంధంగాగానీ, హైందవం సంబంధంగాగానీ మాట్లాడే విషయాలలో చాలా భాగం స్వకపోల కల్పితాలేనని మీకూ అనిపిస్తోందా లేదా? మీకు నిజమనిపిస్తున్నంత వరకైనా ప్రకటించగలిగితే ప్రకటించండి. ఇకపోతే, ఆయన తన గురించి తాను చెప్పుకునే గొప్పలకు అంతే ఉండడం లేదు. అంతగా ఆత్మ స్తుతి చేసుకోగలిగిన వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు లోకంలో అనుకోకుండా మన కళ్ళెదుటే అట్టివారు ఇద్దరు ఉన్నారు. ఒకరు పి.డి సుందర్రావుగారు కాగా మరొకరు మన రంజిత్‌ ఓఫీరుగారు ఇద్దరూ ఎవరికి వారు తాము సర్వజ్ఞులమూ, అసాధారణులము, ఏసుకు అత్యంత ఆప్తులమూ, మరెవరికీ తెలియనంతగా బైబిలు వాస్తవాలు, మర్మాలు తెలిసిన వారము, ఏసు చేత ఎంపిక చేయబడ్డవారము అని ప్రకటించేసుకుంటారు. అంతే స్థాయిలో ఒకరినొకరు నీకేం తెలీదంటే, నీకేంతెలీదంటూ నిందించుకుంటుంటారు. నీవు సాతాను ప్రతినిధివంటే, నీవే సాతాను ప్రతినిధివనీ బహిరంగంగా ప్రకటించు కుంటూనూ ఉంటారు. ఇరువురికీ తలో ఇంతమందంటూ భజన బృందం వెంటబడి ఉంటూ తమ నాయకుణ్ని పొగుడుతూ, రెండో వాణ్ణి తెగడుతూ తెగ సంబర పడిపోతుంటారు. నా అస్సలు ప్రశ్న ఏమంటే, వీరిద్దరూ తెగ రెచ్చిపోతూ ఎవర్ని మహిమాన్వితుడు, రక్షకుడు అనంటున్నారో ఆయన వీరిద్దరి చేత ఇలాటి పరస్పర విరుద్ద ప్రసంగాలు ఎందుకు చేయిస్తున్నట్లు? రంజిత్‌ ఓఫీరుగారు కురిపించమన్న పిడుగులు, భూకంపాలు ఇందులోని అబద్దకునిపైన ఎందుకు కురిపించనట్లు? ఇంతకూ వీరిలో బైబిలు సరిగా అర్ధమైందెవరికి? ఏసు ఎంచుకున్నదెవరిని? ఇది తేలేదెట్లా?

రంజిత్‌ ఓఫీరుగారు తన గురించి తాను చెప్పుకున్న గొప్పలు కొన్ని ఇవిగో

1. 10 సం|| ప్రాయం నుండీ ఏసుతో మాట్లాడుతున్నాను.

2. ఈ కడవరి యుగానికి ఏసేనన్ను అపొస్తలునిగ నియమించాడు.

3. ఈ యుగపు ఏసునోరును నేనే

గమనిక : ఈ వ్యాసం ద్వారా నేను మిమ్మల్ని, బైబిలు తెలిసిన ఇతర క్రైస్తవ విశ్వాసుల్ని అడిగేదెమంటే,

1. రెండవ రాకడకు ముందే ఏసు ఈ లోకానికి దిగి వచ్చి, వాళ్ళతో,వీళ్ళతో మాట్లాడి వెళుతుంటాడనడానికి బైబిలులో ఏమైన ఆధారాలున్నాయా?

2. ఓఫీరు గారన్నట్లు, ఏసే ఎవరోఒకర్ని, తన శిష్యుల అనంతరం వివిధ కాలాలలో, ఆయా కాలాలకు, అపొస్తలునిగా ఎంపిక చేస్తుంటాడనడానికి బైబిలులో ఆధారాలున్నాయా?

3. ఓఫీరు గారు మాట్లాడే అబద్దాలు, ప్రగల్భాలు, కల్పితాలు, పులుముడులు అని అనిపిస్తున్నన్నీ ఏసు పల్కిన లేదా పలికించిన మాటలేనని అంగీకరించగలరా?

1. జయశాలికాడతడు భయశాలి మాత్రమేనని పి.డి వారి గురించి ఓఫీరుగారి ప్రకటన

2.  ఓఫీర్‌ కాడతడు, ఓఫియర్‌గాడు అనంటూ ఓఫీరుగారి గురించి పి.డి గారి ప్రకటన

3. ఇద్దరి ప్రకారం ఇద్దరూ సాతాను ప్రతినిధులే. ఎవరి ప్రకారం వారే ఏసు ప్రతినిధులు.

ఇందులో ఏది సత్యం? ఏదసత్యం ? ఇది ఏసుతెల్చాల్సిన ప్రశ్న. ఏసు మాత్రమే తేల్చాల్సిన ప్రశ్న అనంటారా? మన మూ ఆలోచించి తేల్చుకోవాల్సిన అవసరమున్న ప్రశ్న అంటారా? ఇందులో అంతగా ఆలోచించాల్సిన దేముందండీ! మా ఇస్లాం ప్రకారం వారిద్దరూ మార్గభ్రష్టులే. సత్య తిరస్కారులే గనుక సాతాను పక్షం వారే. ఇద్దరికీ ఘోరశిక్ష సిద్దం చేయబడి ఉంది అంటారా? రహ్మన్‌గారూ! మీ మనస్సు చెపుతున్న మాట ఏమిటో అది బైటికి అనేయగలిగితే అనేయండి. సత్య సందేశ కేంద్రం వారు కదా మీరు!?

సురేంద్ర

రంజిత్‌ ఓఫీర్‌ - నేను (సురేంద్ర)



ఓఫీర్‌గారిని, నన్నూ శ్రద్దగా పరిశీలిస్తున్న పాఠకమిత్రులారా!

ఈ మధ్య హైందవ క్రైస్తవంలోని వివిధ విషయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నై.

1. భారత్‌ టుడే - ఛానల్‌లో 'ఓ హిందూ మేలుకో అన్న పేరుతో ప్రసంగాలు, గోష్టులు జరగడం మెదలైంది. మరోవంక 'హిందూ ధర్మాచార్య ప్రతిష్టానమ్‌' పేరుతో ఆరంభమైన త్రిమతాచార్య పీఠాల మరియు వివిధ హైందవ సంప్రదాయాలకు చెందిన సాధు సన్యాసుల ఐక్యవేదిక నుండీ హైందవ క్రైస్తవం పుస్తకం పై విశ్లేషణాత్మక విమర్శ ఆరంభమైంది. హిం.ధ.ప్ర (హెచ్‌.డి.పి) సంస్ధ ఆరంభవేదిక నుండీ, చినజీయ్యరు స్వామివారు, సుభుదేంద్ర తీర్ధస్వామి వారు, పరిపూర్ణానంద స్వామివారూ హిందూ గ్రంథాలలో ఏసున్నాడు, మహమ్మదున్నాడు లాంటి రచనలన్నీ ఎవరు చేసినా అట్టివన్నీ అసత్యాలే, వంచనతో కూడుకున్న ప్రచారాలేనని బహిరంగంగా ప్రకటించారు. అలాంటి రచనలు చేసిన క్రైస్తవ, ఇస్లాం మత ప్రచారకులు సత్యాసత్య విచారణకు సిద్దపడితే పండిత సభను ఏర్పాటు చేస్తామనీ ప్రకటించారు. అలాటి రచనలు కొన్ని క్రైస్తవ సంస్ధలనుండీ ముఖ్యంగా 1. గుండా బత్తిని, 2. రంజిత్‌ ఓఫీర్‌ గార్ల నుండి వచ్చాయి. ఇతర క్రైస్తవ ప్రచారకులలో చాల మంది వీరి రచనలను ఎత్తి రాస్తున్న వారే. ఇక ముస్లింలకు చెందిన వారిలో 1) జాకీర్‌ నాయక్‌ 2) సత్య సందేశ కేంద్రం వారూ, వారిని అనుసరిస్తున్నవారూ ఈ రకమైన ప్రచారాలకు గడంగుతున్నారు. ఈ రకానికంతటికీ వేద ప్రకాశ్‌ ఉపాధ్యాయ గారి రచనలు, శ్రీ వాత్సవ గారి రచనలూ ఆధారంగా ఉంటున్నాయి.

ప్రస్తుతాంశం ఏమంటే, ఈ రకమైన పెడపోకడ పోతున్న వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరైనా ఆయా గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితులతో చర్చకుగానీ, పరిశీలనకుగాని సిద్దం కాకుండా, వాటి గురించి ఏమీ తెలియని అమాయక జనం ముందు విపరీతంగా వీటిని ప్రచారం చేస్తూ జనాన్ని తమతమ మతాలలోకి మరలించుకుపోయే పని చేస్తున్నారు. ఇక్కడికిదే ఒక అనైతిక చర్య. కుటిలపన్నాగం. గొప్ప ఆశ్చర్యకరమూ, హాస్యాస్పదమూ కూడా అయిన విషయ మేమంటే ఈ గుంపంతా సత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నట్లు మాట్లాడుతుంటారు. నటిస్తుంటారు. సామాన్య జనుల ముందరా, తాన అంటే తందాన అని వంతపాడే సొంతమంద ముందరా తెగపెట్రేగిపోతుంటారు. ఒకరు సత్యంలోకి రండంటారు. మరొకరు సత్య సందేశం అంటారు. ఇంకొకరు నిరంతర సత్య సంస్ధానాభి లాషి నంటారు. అంతా తామంతా సత్యం కోసమే పుట్టినట్లు తెగ ప్రదర్శించుకుంటుంటారు.

ఏ విశ్వాసికీ తాము విశ్వసిస్తున్న విషయాన్ని గురించి వాటికివేరైన వాటికి వేరైన గురించీ సత్యాసత్యాలంటూ మాట్లాడే అర్హతే ఉండదన్న ప్రాథమిక నియమమే అవగాహనలోలేని ఈ రకం వారి మాటలు మాత్రం మహా జ్ఞానుల మాటలనుమించి ఉంటుంటాయి. నిజంగా వైదిక సాహిత్యాన్ని చదవవలసిన రీతిలో, చదవవలసినంత చదవకుండానే తెలిసిన వాళ్ళమల్లే ప్రసంగాలలో తెగ రెచ్చిపోతుంటారు.

1. జాకీర్‌ నాయక్‌ - శాంతి సందేశం పేరిట ఎంత దుర్మార్గపు పాత్రపోషించిందీ నిఘా విభాగాలు ఈ మధ్య వెళ్ళడి చేశాయి. అయినా అతగాణ్ణి అల్లా రక్షించనూలేదు. తన తిప్పలేవో తానుపడుతూ తప్పించుకు తిరుగుతున్నాడతడు. అతగాని వెంట పడిపోయే మంద చాలా మంది ఇస్లాంలో ఉన్నారు. అలాగే అతణ్ణి అంగీకరించని సాంప్రదాయ ఇస్లాం. పండితులూ చాలా మంది ఉన్నారు. అతడూ పైన నేను చెప్పిన వేద ప్రకాష్‌ ఉపాధ్యాయ, శ్రీవాత్సవ పుస్తకాలను పట్టుకునే హిందూ గ్రంధాలలో ముహమ్మద్‌ ఉన్నాడంటూ ప్రసంగాలు చేశాడు. ఖురానును సాంప్రదాయంగా అధ్యయనం చేసిన వాళ్ళకు తెలుసు జాకీర్‌ నాయక్‌ చేస్తున్నపని, ఖురాన్‌ ప్రకారం చేయకూడనిదనీ, నరకానికి దారి తీస్తుందనీ అయినా వాళ్ళు వాస్తవాలు మాట్లాడరు. మౌనంగా ఉంటారు. ఎక్కడన్నా ఒకడు అదేమిటన్నా, వీరు దానిని పట్టించుకోరు. ఈనాడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలలో మీ గ్రంథాలలో మా ముహమ్మద్‌ అన్న ప్రచారం చేస్తున్న వాళ్ళున్నారు. ఒకరు జాకీర్‌ నాయక్‌ను అనుసరించేవాళ్ళు, మరొకరు సత్య సందేశ కేంద్రం నుండి వెలువడ్డ రచనలను ఆధారం చేసుకుని ప్రసంగాలు చేస్తున్నవారు షిరాజుఅహ్మద్‌, షఫీ, ఇమ్రాన్‌, ఫజులూర్‌ రహ్మాన్‌, ముస్తాక్‌ అహ్మద్‌లూ, వారి అనుయాయులూ ఈ ప్రచారం చేస్తున్నవారుగా ఇప్పటికి నా ఎరుకలోకి వచ్చారు. ఒకరిద్దరు పబ్లిషర్సూ ఈ రకమైన సాహిత్యాన్ని ప్రబోదిస్తున్నారు. ఆ వివరాలన్నీ రుజువు అవసరమైన రోజు అందిస్తాను.

ఇస్లాంకు చెందిన వీరందరికి స.మండలి పక్షం నుండి నేను చెపుతున్నదొక్కటే.

మీలో నీతి నిజాయితీగానీ మాటకు కట్టుబడి ఉండే నిబద్దతగానీ, సత్యస్ధాపనోద్దతిగానీ ఉంటే వేదాలలో పురాణాలలో ముహమ్మదు అనే విషయంపై వేద వేత్తలతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో పాల్గొని మీరంటున్నవన్నీ సరైనవేనని నిరూపించడానికి సిద్దంకండి.

1. వేదాలలో ముహమ్మదు 2. ఉపనిషత్తుల్లో ముహమ్మదు, 3. పురాణాలలో ముహమ్మదు ఇది పరిశీలనాంశం

క్రైస్తవ పక్షం


హిందూ గ్రంధాలలో ఏసు అన్న ప్రచారం ఈనాటిదికాదు. ఈనాడు దానికి ప్రసిద్ది కలిగించిన వారిలో పండిట్‌ సి.హెచ్‌. ఫ్రాన్సిస్‌, పరవస్తు సూర్యనారాయణ అన్నవార్లు పెద్ద తరం క్రిందికి వస్తారు. ఆ తరవాత గుండాబత్తిన, అటు పిమ్మట రంజిత్‌ ఓఫీర్‌గార్లు ఈ వాదాన్నెత్తుకుని, చాలా పుస్తకాలు రాసేశారు. అందులోనూ గుండా బత్తిన వారి పుస్తకాలను ఆధారం చేసుకుని చిన్న చితకా ప్రసంగీకులెందరో పుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చేశారు. అట్టి వారిలో కణితి అబ్రహాం, సుధాకర్‌, జెపన్సాశాస్త్రి గారిలాటి కొందర్ని మా మిత్రబృందం కలిసి మాట్లాడగా ఆ విషయాలు తమకేమీ తెలియవనీ, గుండాబత్తిని వారి పుస్తకాలు చూసి రాసినవి మాట్లాడినవే అవన్నీ అని నోటిమాటేగాక, చేతివ్రాత ద్వారాను మా వాళ్ళకు తెలియజేశారు. అటు తరువాత మా మిత్ర బృందం గుండా బత్తిని వారిని నేరుగా కలసి, హిందూ గ్రంథాలు నుండి వారు ఉట్టంకించిన మంత్రాలు శ్లోకాల అర్ధం చెప్పమని నిలదీయగా ఆయన చెప్పలేకపోయారు. మరోసారి కూర్చుందామనీ అన్నారని మా మండపేట, రాజానగరం బృందం నాకు చెప్పారు. ఈ విషయంలో గుండా బత్తిని వారికి నేను చెప్పిదేమంటే, మీ రచనలలో మీరు చెప్పిన వాటిలో ఎక్కువ భాగం తప్పుడు వివరణలే అవి అ సత్య ప్రచారాలు మాత్రమే. నా ఈ మాట కాదలచుకున్నా, నిజం కొరకు నిలబడే నిజాయితీ ఉన్నా ఈ సమాచారం అందిన వెంటనే నాకు కబురు చేయండి. విజ్ఞులతో కూడిన సభను ఏర్పాటు చేస్తాను. అందులో మీ రాతలు సరైనవేనని నిరూపించండి. లేకుంటే తప్పైందని వప్పుకుని, క్షమాపణలూ చెప్పుకుని, ఆ పుస్తకాలనన్నంటినీ ఉపసంహరించుకోండి.

సూక్తి :- అసత్యాలు చెప్పమని, ప్రచారం చేయమని ఏమతమూ చెప్పదు. జనమే ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మతాల పేరున  అవి చెప్పనివీ ప్రచారం చేస్తుంటారు.

రంజిత్‌ ఓఫీర్‌గారు


మిగిలిన క్రైస్తవ ప్రచారకులకూ, ఓఫీరుగారికీ ఇలాటి రచనలు చేయడం, ప్రసంగాలు చేయడం విషయంలో ఒక తేడా ఉంది. మీ గ్రంధాలలో మా ఏసు అన్న ఇతర రచయితలెవ్వరూ ఈయన గారిలా సవాళ్ళు తొడగొట్టడాలూ చేయలేదు. ఈయనంతలా, సొంత డబ్బా కొట్టుకునే వారూ అలాగే ముందేమన్నదీ పట్టించుకోకుండా పరస్పర విరుద్దమైన భావాలను ప్రకటించడంలోనూ ఈయనకీయనే సాటి. అలాంటి కొన్ని మాటలు చెప్పుకుంటేగాని, ఓఫీరుగారి వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోడం కుదరదు.

1. 10 ఏండ్ల ప్రాయంనుండే ఏసుతో మాట్లాడడం మొదలెట్టానంటాడు. ఏసును వేదాలను తెనుగు చేయించమని 20 ఏండ్లుగా అదే ధ్యాసతో నిరంతరం ప్రార్థించానంటాడు.

2. ఏసు కృపవల్ల ఎన్నో భాషలు మాట్లాడుతున్నానంటాడు - సంస్కృతంలో ఉన్న వేదాన్ని అర్ధం చేసుకోలేక తెలుగు, తెలుగు అనిదేబిరించుకున్నానంటాడు.

3. ఎవరేమన్నా వేదాలు బ్రహ్మాముఖోద్దిష్టాలని నమ్మడమే నా కిష్టం అంటాడు - వేదాలను రుషులే రచించారంటాడు.

4. రంగాచార్యుల వారిని ఏసే పురమాయించి అనువాదం చేయించాడంటారు - రంగా చార్యులవారితో ఆ విషయంలో, ఈ విషయంలో తీవ్రంగా విభేదిస్తున్నానంటారు.

5. హైందవం - క్రైస్తవం నిజానికి రెండు కావంటారు - నీవైనా సత్యం చెప్పు నేను హిందువునవుతా, నేనైనా సత్యం చెపుతాను నీవు క్రైస్తవుడివికా అనీ అంటారు.

6. నేను సాత్వికుణ్ణి అని తన గురించి తానే చెప్పుకుంటారు - నేను చాలా చెడ్డవాణ్ణి నా జోలికి రాకండనీ అంటారు.

7. తనను చంపిన వాళ్ళనూ క్షమించాడు ఏసు అనంటారు - దిగిరాతండ్రీ! భూకంపాలు, ఇళ్ళు నేలమట్టాలు చేసేయ్‌ అనీ అంటారు.

8. ఒక ప్రక్క తెగ శక్తి ఉన్నవానిమల్లే శాపాలు పెడుతుంటారు - మరో ప్రక్క దిగిరాతండ్రీ! వచ్చి వీళ్ళను దుంప నాశనం చేసేయ్‌. నీవు రావాల్సిందే. రాకుంటే ప్రాణాలు తీసుకుంటాం అని దేబిరిస్తుంటారు.

9. దయానందుని మాటలను ఎత్తిచూపుతూ గుడ్డిగా దేనినీ నమ్మకూడదు. అనేక విధాల పరీక్షించుకున్నాక, నిగ్గుతేలినవాటినే స్వీకరించాలని ఒక చోట చెప్పి, మరో పుస్తకంలో నమ్మడం మినహా మరో దారిలేదు. నమ్మబుద్దికాకున్నా నమ్మాల్సిందే, అసంబద్దంగా అనిపిస్తున్నా నమ్మల్సిందేనంటూ పూర్తి విరుద్దమైన మరో పాటందుకుంటారు.

10. 1 గంట ప్రసంగం చేశారనుకుంటే 40 శాతం ఆత్మస్తుతి - సొంత డబ్బా- చేసుకుంటారు. మరో 40 శాతం అసందర్భము, అప్రస్తుతము, అప్రధానమూ అయిన విషయాలే మాట్లాడుతుంటారు. మిగిలిన 20 శాతంలో కూడా ఎక్కువభాగం చెత్తే ఉంటుంది.

11. సింహాన్ని నిద్రలేపుతున్నావ్‌, నిద్రలేపావ్‌, ఇక నేనూరుకోను, అది చేస్తాను ఇది చేస్తాను, సిద్దంగా ఉండండని అంటారు. నాకు టైంలేదు. అనొకసారి, మీరునాకు సరిపోరని ఒకసారి, మీ సంగతి పట్టించుకోనని ఇంకోసారి ఇలా రకరకాలుగా ప్రసంగిస్తుంటారు.

12. కుస్తీకి సవాల్‌ అనంటారు - సరేరమ్మంటే ముందు నన్ను కొడతానికి నీ దగ్గర ఏమేమిపట్లున్నాయో వివరంగా నాకు తెలియజేయి. వాటిని చూశాక నీతో పోట్లాడాలో లేదో తెల్చుకుంటానంటారు.

13. భారత దేశానికి సవాలంటూనే - నేను సవాళ్ళ మనిషినికాదు. సవాళ్ళెందుకండీ!! నిజాన్ని ప్రకటించండి నిజమైతే అంగీకరించి వాగ్దానానికి కట్టుబడి ఉంటానంటారు.

14. నేనేవరికీ భయపడను. నన్నెవరూ భయపెట్టలేరు అనంటూనే, నా జొలికి రావద్దు. నేను చెడ్డవాణ్ణి పులిని సింహాన్ని అది చేస్తాను, ఇది చేస్తాను, ఎవర్నీ వదల్ను అని భయపెడుతూ, బెదిరిస్తూ మాట్లాడేస్తారు.

15. వేదరుషులెరిగిన ఏసు అనంటారు - దేవుడెవరో తమకు తెలియదని రుషులే ప్రకటించారంటారు.

16. ముస్లింలతో గొడవ పడుతూ, బైబిలు, ఖురానులలో ఒకే దేవుణ్ణి గురించి చెప్పబడిందంటూ 99% వివరాలు సరిపోయినా అల్లా - ఎహోవా (ఎలోహిం) అన్నతేడా ఉన్న రెండు గ్రంధాలలోని దేవుడొక్కడేనని నేనంగీకరించను అంటాడు. వేదాల దగ్గర కొచ్చేటప్పటికి ఏసు, ఎహోవా పేర్లు ఎందుకుంటాయండీ? రెంటిలోని వివరాలు పోలుతున్నాయి కాని అని, వేదాల్లో చెప్పబడింది ఏసేనని రుజువు చేశానంటారు. అంగీకరించమంటారు.

17. తెలుగులో లేకుంటే అర్ధం చేసుకోలేనంటూనే, రంగాచార్యులకూ, వేదరుషులకు - భాష్య కారులకూ అర్ధం కాని - కనపడని - విషయాలూ తన కర్ధమైనయ్‌ అనంటారు.

పాఠకమిత్రులారా! ఈ రచన చదువుతున్న ఓఫీర్‌ భక్తులారా! ఇలాటివి ఇంకేన్నోఆయన రచనలు ప్రసంగాలనుండి ఎత్తి చూపవచ్చు.

18. ఏసు వేదాలలో ప్రతి పేజీలో దర్శనమిచ్చాడంటారు. అక్కడక్కడా ఉంది ఏరుకుని కూర్చుకోవాలని మరోమాటంటారు.

19. 30 సం|| తన తపస్సు ఫలితంగా ఈ సత్యాన్ని పరాత్పరుడు బయట పరచాడంటారు. వేదరుషులకు తన గురించిన సత్యాన్ని బయలుపరచకుండా ఎందుకుంటాడు అనీ అంటారు.

ఈ సంచిక వరకు ముగింపుగా రెండు మాటలు :

అయ్యా ఓఫీరుగారూ! అస్సలు మన మధ్య నున్న వివాదాంశం ఏమిటండీ? మీరు హైందవ క్రైస్తవంలో ఉట్టంకించిన 115 మంత్రాలకు వేదం తెలిసిన వారంగీకరించే అర్ధమేమిటి? అన్నదేకదా! లేదా! ఆ మంత్రాలకు మీరన్న అర్ధం వస్తుందా? రాదా? అనైనా చెప్పుకుని దానిని విచారణ చేయవచ్చు. ఇంత సరళమైన విషయాన్ని పరిశీలించడానికి, స్థాయిలు, సముజ్జీలు లాటి గొడవలెందుండీ! ఆ మంత్రాల అర్ధమేమిటన్నది ఎలా నిర్ణయించుకోవాలో, నిర్ణయించుకోగలమో మీరే తేల్చి చెప్పండి. ఇంత సులభంగా పరిష్కరించుకోగలిగిన దానిని పీటముడుల వ్యవహారంగా మార్చారెందుకు?

2. అలా కాదనుకుంటే, ఎందుకన్నారో ఏమోగాని భారతదేశంలోని ధర్మాచార్యు లందరకూ సవాలన్నారు కనుక, బహిరంగ సవాలు విధివిధానాలననుసరించి పోటీకైనా సిద్దంకండి. పోటీకి తగినవారా కాదా నిర్ణయించాల్సింది మీరు కానే కాదు. అంతేకాక, పోటీలో నీవు ఎలా పోరాడతావో ముందే నాకు చెప్పమని మీరే అడగడమంత తెలివి తక్కువ తనం మరోటుండదు. మీసవాలులో అర్హతానర్హతల ప్రస్తావన లేదు సరికదా వేదం విషయంలో మీ పక్షపు పట్లన్నీ అనువాదకుని ఆసరాతో నిలబడినవే. కనుక స్వయంగా మీకు వేదార్ధ నిర్ణయంచేసే అర్హతగానీ, శక్తి సామర్ధ్యాలుగాని లేవని మీరే చెప్పుకుని ఉన్నారు. కనుక ఎవరి అర్హత లేమిటన్నదిగానీ, ఎవరు చెప్పింది సబబుగా ఉందన్నది గాని తేల్చవలసింది పోటీలో పాల్గొనే ఇరువురిలో ఎవరూ కాదు. వీరిరువురికి వేరుగా నున్న న్యాయ నిర్ణేతలకే ఆ అర్హత అధికారం ఉంటాయి. పోటీలకు సంబంధించిగాని, వాద ప్రతివాదాలకు సంబంధించి గానీ, ఇది సార్వత్రిక నియమం. ఇది మీకు తెలుసో లేదో మీరే తేల్చండి. చివరిమాట!

మిమ్ములను (మీ గ్రంధాలను, ప్రసంగాలను) జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తున్న నాకు,ఇప్పటికి నా గురించీ, మీ గురించీ అర్ధమైన దానిని బట్టి మీ ఆర్భాటాలు, అట్టహాసాలు, జబ్బలుచరచడాలు, శాపాలు పెట్టడాలు, మీ ఏసును రమ్మన్న మొత్తుకోలులు అన్నీ మనం తారసపడనంతవరకే బ్రతికుంటాయి.

1. యోగ్యులైన విద్వజ్జనుల మధ్యలో సత్యాన్వేషులంగా విషయ విచారణ చేద్దామన్నా;

2. కాదుకూడదంటూ పోరాటంలోనే తేల్చుకుందాం నువ్వోనేనో అని అనాలనుకున్నా నేను సిద్దం.

గమనిక : స్థాయి అర్హతలన్నవీ పరిగణించాలన్న నియమం పెట్టుకోవలసిందే అని మీరన్నా నా కభ్యంతరం లేదు. మనం ఎంచుకున్న నిర్ణేతల ముందు నా స్థాయి, సామర్ధ్యాలకు చెందిన సమాచారం నేను పెడతాను, మీ వివరాలు మీరూ ఇవ్వండి. న్యాయ నిర్ణేతలు తేలుస్తారు ఎవరి స్థాయి ఏమిటి మీ స్ధాయికి నేను తగను ఈ వివాదం వరకైనా అని వారు నిర్ణయిస్తే ఏమి చేయాలో అప్పుడాలోచిద్దాం. సరిపోతానంటే పోరాటం చేద్దాం. ఒకవేళ నా స్థాయికి మీరే సరిపోరని గాని వారు తేలిస్తే ఏమి చేయాలో, చేస్తారో మీరే చెప్పండి. నా వరకైతే స్థాయిల మాట ప్రక్కనపెట్టి మీతో అప్పుడూ విచారణకు కూర్చుంటాను.

ఎందుకంటే, మండలి విధానంలో, తనకంటే అధికులతోనూ, సములతోనూ, చిన్న వారితోనూ కూడా మాట్లాడుతుండాలన్న నియమం ఉంది కనుక. అనవసరపు ప్రస్తావనలనాపి, హైందవ క్రైస్తవం పై విచారణకు సిద్దం కండి.

సత్యాన్వేషణలో  - సురేంద్ర


ప్రమాణము - ప్రమ - ప్రత్యక్షము



''ప్రమాకరణం ప్రమాణం'' అన్న అర్థంలో దీనిని వాడారు. ప్రమ అనగా ఒప్పు జ్ఞానం అని అర్థం. కరణం అనగా అసాధారణ కారణం అని అర్థము. కనుక ప్రమాణం అంటే ఒప్పు జ్ఞానానికి అసాధారణ కారణం అని చెప్పినట్లయింది. ''అనధిగత అబాధిత విషయజ్ఞేయత్వం ప్రమాత్వం'' అని అన్నారు.

''తద్వతి తత్ప్రకారకో అనుభవం యథార్థం, యథార్థ జన్య జ్ఞానం ప్రమ''

''యథా అర్థో తథా జ్ఞానం యథార్థ జ్ఞానం ప్రమ''

ఉన్నది ఉన్నట్లే కలిగిన జ్ఞానమునకు పెట్టిన పేరే ప్రమ. అట్టి జ్ఞానమును కలిగించు కారణమును ప్రమాణం అంటారు. సత్యాన్వేషణ మండలి ఈ ప్రమాణం అన్న పదాన్ని యథార్థ జ్ఞాన సాధకం అన్న అర్థంలో కాక, జ్ఞాన సాధకం అన్న అర్థంలో వాడుతుంది. అలాగే ప్రమాకరణం అన్న దానిలో కరణం అన్న మాటకు అసాధారణ కారణం అన్న అర్థాన్ని అంగీకరిస్తూనే, వెనుకటి వాళ్ళు చెప్పినదానికంటే మరికొంత విస్తృత అర్థాన్ని చెబుతుంది. ఏదైనా ఒక ఫలితాన్ని పుట్టించటానికి పరికరము, పద్ధతి అన్నవి కూడా అసాధారణ కారణాలు అవుతాయి. ఆ పరికరాన్ని వాడడం వలన ఆ ఫలితం వచ్చింది అన్న సందర్భమూ, ఆ పద్ధతిని వాడటం వలన ఆ ఫలితం వచ్చిందన్న సందర్భమూ, ఈ రెండు సందర్భాలనూ బట్టి కూడా వాటికి అసాధారణ కారణత్వం సిద్ధిస్తుంది. భాషాపరంగా చూస్తే పరికరానికి, విధానానికి కూడా కరణత్వం సిద్ధిస్తుంది అన్నంతవరకూ, సాంప్రదాయక పండితులు అంగీకరిస్తూనే తాము ప్రస్తావిస్తున్న ప్రమాకరణం అన్న శబ్దంలోని కరణం అన్న మాటకు ''తస్మాత్‌ ఇంద్రియం ప్రమాణం'' అనే అర్ధాన్ని చెబుతూ పరికరాన్నే సూచించారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే, ప్రమాణ శాస్త్రంలోని ప్రమాణములు అన్న పేర్లు పరికరములను అనుసరించి పెట్టినవిగా కాక పద్ధతిని అనుసరించ పెట్టినవిగానే తేలతాయి. ప్రమాణ క్షేత్రంలోని కరణం అన్న మాటకు భాషాపరంగా రెండు రకాల వ్యుత్పత్తులున్నాయి.

''ప్రమీయతేయేన తత్ప్రమాణం'' ''ప్రమీయతే అనేన ఇతి ప్రమాణం'' యేన అన్న పదం దేనిచేత అని అర్ధాన్నిస్తూ, పరికరాన్ని సూచిస్తుండగా, అనేన అన్నది ఈ ప్రకారముగా అన్న అర్థాన్నిస్తూ విధానాన్ని సూచిస్తుంది. సాధనం అన్న పదము పరికరాన్ని సూచించేది కాగా, సాధకం అన్న పదము సాధించిపెట్టేది అన్న అర్థములో పరికరాన్ని, విధానాన్ని కూడా సూచించగలుగుతుంది. ఇందులో కరణం అన్నదానికి సాధకం అన్న అర్థం తీసుకుంటేనే జ్ఞాన సిద్ధాంతంలో పేర్కొనబడ్డ ప్రమాణాలను వివరించుకోవడం వీలుపడుతుంది.

అవగాహనా స్పష్టత కొరకు మరికొంత వివరిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. దీన్ని ఇంత విపులంగా ఎందుకు వివరించవలసి వచ్చిందంటే, ఈ సిద్ధాంత క్షేత్రానికి సంబంధించిన మౌలిక అంశాలలోనే వెనుకటి వాళ్ళతో మేము విభేదిస్తున్నాము. గనుక ఈ విషయంపై మీలో కొంత స్పష్టత రావడంకోసం మరికొంత వివరించవలసిన అవసరం ఉందనిపిస్తోంది.

ప్రపంచంలో ఉన్న జ్ఞాన సిద్ధాంత క్షేత్రాలన్నీ, ప్రమాణాలన్నవాటి పేర్లు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ది, సంభవము, ఐతిహ్యము అంటూ పేర్కొన్నాయి. పైన చెప్పుకున్నట్లు కరణం అన్న మాటకి ఇంద్రియం (పరికరం) అన్న అర్థాన్ని గనుక తీసుకొని పేర్లు పెట్టి ఉంటే, ఆ పేర్లు నేత్ర ప్రమాణం, శ్రోత్ర ప్రమాణం, ఘ్రాణ ప్రమాణము, త్వక్‌ ప్రమాణం, రసన ప్రమాణము అని ఉండాలి. ఎందుకంటే జ్ఞాన సాధనాలు ఇంద్రియాలే గనుక. కానీ ప్రపంచంలో ఎక్కడా, జ్ఞాన సిద్ధాంతంలో ప్రమాణాల పేర్లు అలా పెట్టబడి లేవు. కనుక  పరికరాలను అనుసరించి కాక ప్రక్రియలను అనుసరించే ప్రమాణాల పేర్లు పెట్టబడ్డాయని రూఢి అవుతుంది. అంటే ప్రత్యక్ష పద్దతి, అనుమాన పద్ధతి, శబ్ద పద్ధతి అంటూ చెప్పటమే వాస్తవాన్ని చెప్పటం అవుతుంది. పద్ధతులననుసరించే ప్రమాణాల పేర్లు వచ్చాయి.

సత్యాన్వేషణ మండలి వెనుకటి వాళ్ళతో విభేదిస్తున్న మరోముఖ్యమైన అంశము ప్రమాకరణం ప్రమాణములో ప్రమ అన్న పదానికి సంబంధించినది. జ్ఞాన సాధకాలు అయిన పరికరాలను గాని, పద్థతులను గాని వాడినప్పుడు, ఉన్నది ఉన్నట్లు తెలియడము, లేనిది ఉన్నట్లు తెలియడము జరుగుతున్నాయి. వీటినే మనము ఒప్పుజ్ఞానము, తప్పు జ్ఞానము అంటున్నాము. ఒప్పు జ్ఞానం కలగడానికి, తప్పు జ్ఞానం కలగడానికి కూడా అవే పరికరాలు, అవే పద్ధతులు కారణాలు అవుతున్నప్పటికీ ప్రమాకరణం అన్న పదంలో ప్రమ అన్న పదానికి యథార్థజ్ఞానము అన్న అర్థం మాత్రమే నంటూ వెనుకటి వాళ్ళు చెప్పిన అర్థాన్ని గనుక స్వీకరించినట్లుయితే, తప్పు జ్ఞానాన్ని పుట్టించేదానికి, పరికరాన్ని, విధానాన్నీ వేరుగా చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మన అనుభవంలో అటువంటి వేరే పరికరాలు, విధానాలు లేవు. కనుక భాషను అనుసరించి ప్రమ, భ్రమ అన్న పదాలకి ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న అర్థం చెప్పుకుంటున్నప్పటికీ ప్రమాకరణంలోని ప్రమ అన్న పదానికి యథార్థ జ్ఞానం అనికాక, యథార్థజ్ఞానాన్నీ, అయ్యథార్థ జ్ఞానాన్నీ కూడా సూచించగల 'జ్ఞానం' అన్న అర్థాన్ని చెప్పుకోవడమే సరైనది అవుతోంది. వినియోగంలో సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వీలవుతుంది. ఒకవేళ ప్రమ అన్న పదానికి ఒప్పుజ్ఞానం అన్న అర్థం తప్ప, వేరే అర్థం చెప్పటానికి వీలులేదు అనిగనుక అన్నట్లయితే, ప్రమాణములు అన్న పదం స్థానే జ్ఞాన సాధకం అన్న అర్థాన్నిచ్చే పదం వాడటమే సరైనది అవుతుంది. అట్టి యోగ్యమైన పదమన్నా ఏర్పరచుకోవాలి. లేదా ఉన్న పదాన్నే వాడుకోక తప్పని స్థితి ఉన్నట్లయితే ఈ అర్థంలో వాడుచున్నామన్న వివరణ అయినా చేసుకోవాలి. మండలి ఈ విషయంలో ప్రమ, భ్రమ అన్న వాటికి ఒప్పుజ్ఞానం, తప్పుజ్ఞానం అన్న అర్థాలను అంగీకరిస్తూనే, ప్రమాకరణంలో ప్రమ అన్న మాటకు యథార్థ జ్ఞానము అనికాక, జ్ఞానము అన్న అర్థాన్ని కలిగి ఉంది. ప్రత్యక్షములోని వివిధ రకాలైన జ్ఞానం కలుగుతున్న సందర్భంలోనైతే, ఆ రకమైన ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి ఇంద్రియమే అసాధారణ కారణమని అంగీకరిస్తుంది. కనుక పైన చెప్పుకున్నట్లు నేత్ర ప్రత్యక్షము, శ్రోత్ర ప్రత్యక్షము మొదలైనవి ప్రత్యక్ష పద్ధతిలో కలిగే జ్ఞానములో వివిధ రకాలు అవుతాయి.

మిత్రులారా ! ఇక మా సిద్ధాంతాన్ని పరిశీలించబోతారు గనుక ప్రమాకరణంలోని ప్రమ అన్నదానికి, కరణం అన్నదానికి పైన మేము అంగీకరిస్తున్న అర్ధాలను మనసులో పెట్టుకొనే అధ్యయనం చేయండి.

జ్ఞానమనగా నేమి? :


ఏదో ఒక విషయాన్ని గురించిన అనుభూతి కలగటాన్ని జ్ఞానం (తెలియడం) అంటారు. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం : విషయం లేకపోయినా, జ్ఞానేంద్రియం లేకపోయినా, గ్రహించేవాడు లేకపోయినా, ఈ మూడిటితో ముడిపడి ఒక పద్ధతి ప్రకారం పని జరగకపోయినా అనుభూతి కలుగదు. అంటే తెలియడం జరుగదు. ఆ మూటితో ముడిపడి అనిపించడం అన్నది ఏర్పడే వరకూ జరిగేదాన్ని జ్ఞానం ఏర్పడే క్రమము అంటున్నాము. దానిని సూటైన మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు.

















దీనినే అనుభూతి చెందడం అనిపించడం అంటున్నాము. ఈ విషయంలో వెనుకటి వాళ్ళతో సత్యాన్వేషణ మండలి ఒక విషయంలో విబేధిస్తుంది. భారత దేశంలోని ప్రమాణజ్ఞులు జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని ఇలా చెప్పారు.

ఆత్మ మనస్సుతో సంయుక్తమై, ఇంద్రియం ద్వారా విషయాన్ని చేరి విషయాకారాన్ని ధరిస్తుంది. అప్పుడే ఆ విషయంయొక్క జ్ఞానం కలుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశీలనలు, పై దానికి పూర్తి విరుద్ధమైన రీతిలో జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఉంటుంది అని పరిశోధనల ద్వారా రుజువుచేశాయి. మన అనుభవాలను పరిశీలించి చూసుకుంటే కూడా ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలకి సంబంధించి ఆయా ఇంద్రియాలు పట్టుకోగలిగిన మేర సమాచారమే తలకిచేరి, తెలుస్తూ ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. సత్యాన్వేషణ మండలికి దీనిని వివరించే ఒక ప్రక్రియ ఉంది. ''లోపలికి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నావా? బయట ఉన్న విషయాన్ని గమనిస్తున్నావా?'' అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే లోపల చేరిన దాన్ని గమనిస్తున్నామని తెలుస్తుంది. ఈ విషయాన్ని కొన్ని ఉదాహరణలు తీసుకొని పరిశీలించి చూద్దాము.

ఉదా 1 :  కొద్ది దూరంలో ఒక వస్తువు ఉంది. భౌతిక నియమాలను అనుసరించి అది ఒక ఆకారంలోనూ, ఒక పరిమాణంలోనూ, ఏదో ఒక రంగును కలిగి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ వస్తువుకి మన కంటికి మధ్య వేరే రంగు అద్దాన్ని పెట్టిచూస్తే, ఆ వస్తువు మనం పెట్టిన అద్దపు రంగు కలిగినదిగా అనిపిస్తుంది. బూతద్దాన్ని పెట్టి చూపినట్లయితే వస్తువు పరిమాణము ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. వక్ర / గరుకు తలం కలిగిన అద్దాన్ని గనుక పెట్టినట్లయితే వస్తువు వంకర టింకరగా కనిపిస్తుంది. పుటాకార అద్దంలో నుంచి చూస్తే చాలాదూరం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగాలన్నీ వస్తువునుంచి కంటిద్వారా మెదడుకు సమాచారం ఏ రీతిలో చేరితే ఆ రీతిలోనే వస్తువు కూడా ఉంటుంది అన్న వాస్తవాన్ని చూపెడుతుంది. అలాగే మిగిలిన ఇంద్రియాలకి సంబంధించిన అంశాలనీ పరిశీలించి చూసుకోవచ్చు.

ఉదా 2 : ఒక శబ్దాన్ని గురించిన అనుభూతి (జ్ఞానం) కలగాలంటే పై పండితులు చెప్పినట్లు ఆత్మ మనస్సుతో కూడి శబ్దం పుట్టిన చోటుకి వెళ్ళి శబ్ద రూపాన్ని ధరించటం అనేది చాలా అసంబద్దంగా కన్పిస్తుంది. దానికి మారుగా శబ్ద తరంగాలు చెవిని చేరడము, అక్కడ నుంచి ఆ సమాచారము గ్రహణ కేంద్రానికి చేరటము సరైనదిగా అనిపిస్తుంది. మరో ప్రయోగం కూడా చేసి చూసుకోవచ్చు. హటాత్తుగా ఒక విపరీతమైన శబ్దం వినపడితే చెవులు గింగురు మనటము, కొన్ని సందర్భాలలో కర్ణభేరి పగలడము (చిల్లు పడటము) జరుగుతాయన్నది మన అనుభవంలో ఉన్న విషయమే.

ఇలాంటివి ప్రతి జ్ఞానేంద్రియంతో ముడిపెట్టి ఈ క్రమము ఇలాగే ఉందో లేదో పరీక్షించి చూసుకోండి. చాలా విషయాలలో బాగానే ఆలోచించారు అనిపించే వెనుకటి వాళ్ళు ఈ విషయములో ఇంత బండ తప్పు ఎందుకు చేశారో ఒక పట్టాన అర్థం కాదు. వారెందుకు చేశారన్నది ఊహించటాన్ని ప్రక్కనపెట్టి, సాంప్రదాయ తర్కాన్ని పట్టుకున్న ఈనాటి ఆ పక్షపు అధ్యయనపరులను చూస్తే వారుకూడా, దానినే పట్టుకొని వేలాడడమూ, తమ వాదనా పద్ధతిలో నిలబెట్టబూనటం, విడ్డూరం కాకపోతే మరేమిటి? తమ పెద్దలు చెప్పింది నెత్తికి ఎత్తుకోవడం, అవకాశం ఉన్నంత మంది నెత్తికి ఎత్తడం అన్న దృష్టే తప్ప, సత్యాసత్యాలను అవగాహన చేసుకోవాలన్న దృష్టి ఈ విషయంలో వారికి కలగలేదన్నది స్పష్టంగా కనపడుతుంది కదా. ఈ మొత్తాన్ని క్రోడీకరించి చూసుకుంటే ఉన్నవాటి గురించి మనకి అనిపిస్తున్నది, 1. ఉన్నది ఉన్నట్లే అన్న రూపంలోనూ, 2. ఉన్నది ఉన్నట్లే కాకుండా మరో రూపంలోనూ కూడా ఏర్పడుతున్నట్లుగా రుజువవుతున్నది. మానవ జ్ఞాన వికాస పరిణామ క్రమంలో, ఉన్నది ఉన్నట్లే కాక, లేనిది ఉన్నట్లు కూడా అనిపించవచ్చు అన్న విషయం గమనింపులోకి వచ్చిన రోజు జ్ఞాన క్షేత్రానికి సంబంధించినంతలో ఒక పెద్ద మలుపులాంటిది. అక్కడి నుండే మనిషిలో ఆయా విషయాలకి సంబంధించి కలుగుతున్న జ్ఞానం సరైనదా కాదా పరిశీలించి చూసుకోవాలి అన్న దృష్టి ఏర్పడింది. అదే క్రమంగా జ్ఞాన సిద్ధాంత రూపకల్పనకు దారితీసింది. ఎప్పుడైతే; సహజ ప్రక్రియని అనుసరించే తప్పుజ్ఞానము, ఒప్పు జ్ఞానమూ కలుగుతూ వస్తున్నాయని గమనించాడో, ఒప్పుజ్ఞానం బ్రతుకు అవసరమని గమనించాడో అప్పటి నుండే ఈ జ్ఞాన క్షేత్రాన్ని నిశితంగా శోధించడం, స్ఫష్టంగా అర్థంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తప్పు జ్ఞానమంటే ఏమిటి? తప్పు జ్ఞానము ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అలాగే ఒప్పు జ్ఞానం అంటే ఏమిటి? ఒప్పు జ్ఞానం ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? ఒప్పు జ్ఞానమే కలుగుతూ ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అన్న వాటి జ్ఞానాన్ని సంపాదించుకొని వినియోగించుకోవటం బ్రతుకు అవసరంగా గమనించటం జరిగింది. ఈ పరిశీలన నుండే ఎన్ని రకాల జ్ఞానం ఏర్పడుతున్నది, ఆ జ్ఞానం ఏఏ పరికరాల ద్వారా, ఏఏ విధానాల ద్వారా ఏర్పడుతోంది అన్న అవగాహన కలిగింది.

అభ్యాసము : పైన మనం వివరించుకున్న జ్ఞాన క్రమము ప్రత్యక్ష ప్రమాణానికి సరిపోతుంది. అనుమాన ప్రమాణ క్రమము వివరించుకునేటప్పుడు మరికొన్ని దశలు కలపాలా? ఈ క్రమం సరిపోతుందా? అవసరం లేకుంటే ఈ క్రమంలోనే ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి మధ్య ఏ దశలో తేడా వస్తుంది? ఇంకొంత కలపాలి అనుకొంటే ఏమేమి ఎక్కడెక్కడ కలపాలి? వివరించండి.

జ్ఞానంలో రకాలు


ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అని జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. పరోక్ష జ్ఞానంలో అనుమాన ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము, శబ్ద ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము (భాష ఆధారంగా కలిగే జ్ఞానము) అనే ఉప విభాగము ఉంటుంది. ఈ మూడు రకాలుగా కలిగే జ్ఞానములోనూ మళ్ళా తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము అన్న విభాగము ఉంది. వీనినే ప్రమ, భ్రమ అనికూడా అంటారు. ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే ఆ జ్ఞానాన్ని ప్రమ అంటారు. లేనిది ఉన్నట్లుగా తెలియటాన్ని మరియు ఉన్నది ఉన్నట్లుగా కాక ఇంకొకలా తెలియటాన్ని భ్రమ అంటారు.

భ్రమ : ''అతస్మిన్‌ తద్బుద్ధి మిధ్యా'' ''విపర్యయో మిధ్యాజ్ఞానం తద్రూప అప్రతిష్టితం'', ''తదభావవతి తత్‌ప్రకారకో అనుభవం అయ్యథార్థం తద్జన్యం జ్ఞానం భ్రమ'', ''తత్‌ అవిద్య తత్‌ దుష్టజ్ఞానం''

గమనిక : భ్రమ, మిధ్య, విపర్యయము, తప్పుజ్ఞానము, అసత్యము, అవిద్య, అబద్దము, బాధిత జ్ఞానము అన్న పదములన్నీ ఈ క్షేత్రములో సమానార్థకాలు.

ప్రమ : ''అసన్ని కృష్ణార్థ పరిచ్చిత్తిః ప్రమా''

అని వైశేషికం ప్రత్యక్షం గురించి చెపుతోంది.

జ్ఞానానికి సంబంధించి కొన్ని సాధారణ అంశాలు :

*   విషయ రహితమైన జ్ఞానం ఉండదు.

*   ఉన్నది తెలియడం అన్నది ప్రత్యక్ష పద్ధతి ద్వారానే సాధ్యము

*   పరోక్ష జ్ఞానసాధకాలైన అనుమానశబ్ద ప్రమాణముల ద్వారా తెలిసింది, అనిపిస్తున్నది వాస్తవానికి ఇంకా తెలియవలసిందిగానే ఉంటుంది.

*   అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానంలో రెంటి సంబంధం ఆధారంగా; ఇప్పుడు తెలియబడుతున్న దానితో సంబంధపడిన రెండవది ఉండిఉంటుంది అన్న ఊహాత్మక నిర్ణయాన్నే; అనిపించటం జరుగుతోంది గనుక జ్ఞానం అని పిలుస్తున్నాము. నిజానికి ఏది ఉంటుందన్న ఊహాత్మక నిర్ణయం జరిగిందో అది తెలియని స్థితే ఉంటుందక్కడ. కనుకనే దానిని పరోక్ష జ్ఞానం అని పిలుచుకున్నాము.

*   అలాగే శబ్ద ప్రమాణంలో కూడా ఒక వ్యక్తో, ఒక గ్రంథమో ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారము అందించినపుడు లేదా అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు, అతనేమంటున్నాడన్నది తెలుస్తుందేగాని, అతను దేనిని గురించి అయితే సమాచారం అందించాడో అది తెలియనిది గానే, తెలియవలసినదిగానే ఉంటుంది. కనుకనే శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానాన్ని  కూడా పరోక్షజ్ఞానం అనే అంటున్నాము.

ప్రత్యక్ష ప్రమాణం


జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని అనుసరించే పైన పేర్కొన్న ప్రత్యక్ష జ్ఞానమన్నది కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు విషయాలకి సంబంధించి తాము పట్టుకోగలిగిన మేర పట్టుకున్న సమాచారాన్ని గ్రహణ కేంద్రానికి చేర్చటం ద్వారా అందిన సమాచారం వరకు కలిగిన జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఇంద్రియం వెళ్ళి విషయాన్ని తాకిందా, విషయం వచ్చి ఇంద్రియాన్ని తాకిందా అన్నది ఖచ్చితంగా నిర్ణయించుకోనక్కర లేకుండానే ఇంద్రియార్థ సన్నికర్ష జరగటం అన్నది ప్రత్యక్ష ప్రమాణములో కీలకం అయి ఉంది. సన్నికర్షలో ఉన్నంత వరకు తెలియడం అన్నదే ప్రత్యక్ష ప్రమాణం యొక్క పరిమితి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కలిగే వివిధ రకాలైన జ్ఞానాలకు ప్రమాణ పద్ధతి సామాన్య కారణంగానూ, ఇంద్రియం (జ్ఞానేంద్రియం) అసాధారణ కారణంగానూ ఉంటుంది. కనుకనే తెలుసుకొనే మనకు /జ్ఞాతకు (గ్రహణకేంద్రానికి) వేరుగా ఉన్నవాటన్నిటి గురించి కలిగిన జ్ఞానాన్ని, ఆయా ఇంద్రియాలతో ముడిపెట్టి కలిగిన జ్ఞానంగా పేర్కొంటాము. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక మరియు అంతరింద్రియము అన్న ఆరు పరికరాలను అనుసరించి మనిషికి ఆరు రకాల ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంటుంది. వాటినే 1. నేత్ర ప్రత్యక్షము, 2. ఘ్రాణ ప్రత్యక్షము, 3. రసన ప్రత్యక్షము, 4. శ్రోత్ర ప్రత్యక్షము, 5. త్వక్‌ ప్రత్యక్షము, 6. అంతరేంద్రియ ప్రత్యక్షము అనంటాము.

గమనిక : అంతరింద్రియము అన్నదానికి వివిధ జ్ఞాన సిద్ధాంత కారులు మనసు అని ఒకరు,బుద్ధి అని ఒకరు, చిత్తమని ఒకరు ఇలా పేర్లు పెట్టారు. ఏ పేరు సరైంది అన్న విషయంలో వివాద పడకుండానే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా కలుగుతున్న జ్ఞానానికి వేరైన ఆరోరకం జ్ఞానమూ కలుగుతుందన్నది అన్నది మన అనుభవములో ఉన్న విషయమే. కనుక ప్రమాణ క్షేత్రాలను అధ్యయనం చేయదలచిన వ్యక్తికి ఏఏ ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తాయి అన్న విషయం స్పష్టంగా అవగాహనై ఉండాలి.

మిత్రులారా! ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తున్నాయో మీమీ అనుభవాలు పరిశీలించి రాయండి. ఆరవ రాశిగా ఏఏ విషయాలు తెలుస్తున్నాయోనూ రాయండి.

గమనిక: ప్రమాణ విద్యను నేర్వదల్చుకున్నవారు ఈ విషయములను ఇతరుల నుంచి స్వీకరించటం అంత మంచిది కాదు. క్షేత్ర దర్శనం చేస్తూనే వాటిని గురించిన అవగాహన పొందాలి. కనుక ఎవరికి వారుగా ఈ పరిశ్రమ చేయండి.

''యేనేంద్రియేణ యావ్యక్తిర్‌గృహ్యతే, తేనేంద్రియేణ తద్గతాజాతిః తదభావచ్ఛ'' అంటే ఏ ఇంద్రియముల ద్వారా ఒకటి ఉంది అని తెలుస్తుందో, అది లేదు అనికూడా ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంది. అది ఏ జాతికి చెందిందన్నదీ ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంటుంది.

భ్రమ :


భ్రమ అంటే తప్పు జ్ఞానమని అర్థం. ఉన్నది ఉన్నట్లు కాక మరోలా అనిపించటం, ఏమీ లేకుండానే ఏదేదో ఉన్నట్లు అనిపించటం అని భ్రమలు రెండు రకాలు. ఇందులో రెండో రకమంతా మానసిక భ్రమల క్రిందికే వస్తుంది. ఈ రకాన్ని ఆంగ్లంలో హెల్యూషినేషన్‌ అని తెలుగులో భ్రాంతి అని అంటున్నారు.

భ్రమ, మిధ్యాజ్ఞానం, విపర్యయం, భ్రాంతి, అవిద్య, అసత్యం, తప్పుజ్ఞానం, బాధిత జ్ఞానం లాంటి పదాలన్నీ ఒకే అర్థాన్నిచ్చే మాటలే.

మనో వైజ్ఞానిక క్షేత్రాలలో ఇల్యూషన్‌, హెల్యూసినేషన్‌, డెల్యూషన్‌ అన్న పదాలు వాడుతున్నారు. అవన్నీ కూడా పైన మనం చెప్పుకున్న అర్థాన్ని తెలిపేటివే. వాటన్నింటి సారాంశం తప్పు జ్ఞానం అన్నదే.

ఓ   ఈ భ్రమలన్నింటినీ విపులంగా అర్థం చేసుకోవాలన్నా, విడివిడిగా అర్థం చేసుకోవాలన్నా ఆ భ్రమను అలా తప్పు జ్ఞానం కలగడానికి జ్ఞానం ఏర్పడుతున్న క్రమంలో ఇమిడిఉండే వాటిలో ఏది ముఖ్య భూమికను పోషిస్తున్నదో దాని కారణంగా కలుగుతున్న భ్రమ అనంటున్నాం. మండలి దృష్టినుండి తప్పు జ్ఞానం ఏర్పడడానికి కారణాలు నాలుగు గా ఉన్నాయి.

1. బాహ్య కారణాలు : ఇంద్రియాలు సరిగనే ఉండి, మనస్సూ సరిగనే ఉన్నప్పటికీ విషయాలు ఉన్నది ఉన్నట్లుగా అనిపించకపోడానికి గల కారణాలు, ఇంద్రియాలకు సమాచారం చేరేలోపునే ఉన్నట్లయితే అట్టి వాటిని ఆయా భ్రమలకు బాహ్యకారణాలు అనంటాము.

నేత్ర భ్రమలు : కంటి ద్వారా తెలియబడే ఎన్నో విషయాలలో బాహ్య కారణాల వల్లనూ భ్రమలు కలుగుతుంటాయి. ఉదా: 1. నీటిలో సగం వరకుముంచిన కర్ర వంగినట్లుండడం, 2. తారు రోడ్డుపైన మంచి వేసవి కాలములో మధ్యాహ్నం పూట నీరున్నట్లు కనిపించటం, 3. నదిలో ప్రయాణిస్తున్న వారికి గట్టుమీద చెట్లు కదులుతున్నట్లు అనిపించటం, 4. ఒక వస్తువును కుంభాకార, పుటాకార, అసమతల అద్దాలలో నుండి చూసినప్పుడు ఆయా వస్తువులు, దృశ్యాలు ఉన్నది ఉన్నట్లుగా కాక మరోలా కనిపించడం, 5. సమాంతర రేఖలు వంకరగాను, సమాన నిడివి ఉన్న రేఖలు చిన్నా పెద్దగా అసమానంగానూ, ఒక పెద్ద వృత్తంలో ఒక దానికంటే మరొకటి చిన్నగా ఉన్న అనేక వృత్తాలు, ఒకే సర్పిలాకారంగానూ అనిపించటం లాటివన్నీ బాహ్య కారణాల వల్ల కలిగే నేత్ర భ్రమల క్రిందకి చేరతాయి. రంగులకు సంబంధించిన భ్రమలూ ఈ కోవకు చెందినవి కొన్ని ఉన్నాయి.

ఇంద్రియ లోపాల కారణంగా కలిగే భ్రమలు :

1. రాత్రిపూట దూరాన ఉన్న లైట్లు, అవి ఉన్నవి ఉన్నట్లుగా కాక, రెండుగా గాని, పొడుగ్గానో, వెడల్పుగానో గాని కనిపించటం.

2. దూరదృష్టి, హ్రస్వదృష్టి కారణంగా కలిగే భ్రమలు.

3. రంగుల్ని యథాతథంగా గమనించలేక పోవడం - కంటి అద్దాల వల్ల నేల ఎగుడుదిగుడుగా అనిపించడం.

4. సినిమా తెరపై మనకు రకరకాల కదలికలు కనిపిస్తుంటాయి. నిజానికక్కడ స్థిర చిత్రాలే ఉంటాయి కనుక చలనచిత్రంలోని చలనరూపాలన్నీ భ్రమ రూపాలే.

శ్రోత్ర భ్రమలు : 1. స్టీరియో శబ్దాలు వింటున్నప్పుడు రెండు వైపుల నుండి శబ్దాలు వస్తున్నా తలపై నుండి శబ్దాలు వస్తున్నట్లుండడం, ఒక వైపునుండి వచ్చే శబ్దాలు మరోవైపు నుండి వస్తున్నాయనిపించడం, బాహ్య కారణం వల్ల కలిగే శబ్ద భ్రమే.

2. చెవుల్లోని వినికిడి శక్తి లోపాలు, తేడాల వల్ల ఒకవైపు నుండి వస్తున్న శబ్దం మరోవైపు నుండి వస్తుందనిపించడం ఇంద్రియ కారణంగా కలిగే శబ్ద భ్రమ అవుతుంది.

3. బయట ఎటువంటి శబ్దాలూ లేకుండానే చెవుల్లో హోరు ధ్వనులు వినిపించడం.

4. తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించడం, తానెవరితోనో మాటాల్లడుతున్నట్లు అనిపించటం. వశీకరణలో ఉండి హిప్నాటిస్టు ఏదేది వినిపిస్తుందంటే అదంతా వినిపిస్తున్నట్లే అనిపించడం మానసిక కారణంగా ఏర్పడే శబ్ద భ్రమలు. దేవుళ్ళు, దెయ్యాలు మాట్లాడినట్లనిపించటం ఇలాంటిదే.

  త్వగింద్రియానికి సంబంధించిన భ్రమలు :

1. చూపుడు వేలు - మధ్య వేలును మడిచి, రెండు వేళ్ళ కొనల మధ్య ఒక బఠాణీ గింజంత గుండ్రని వస్తువును దేనినైనా ఉంచితే, రెండు వస్తువులున్నట్లు అనిపిస్తుంది. అలాగే చూపుడు వేలు మాత్రమే వస్తువును తాకేట్లు ఉంచితే, మధ్యవేలు వస్తువును తాకుతున్నట్లు అనిపిస్తుంది.

2. ఒక చేతిని అధిక ఉష్ణం కలిగిన నీటిలోనూ, మరో చేతిని అతి శీలంగా ఉన్న నీటిలోనూ కొద్దిసేపు ఉంచి తరువాత ఒక బకెట్టులోని నీళ్ళలో ఆ చేతులనుంచితే ఒక చేతి స్పర్శ ద్వారా బకెట్లో చల్లని నీళ్ళున్నట్లు, మరో చేతి  స్పర్శ ద్వారా వెచ్చని నీళ్ళున్నట్లూ అనిపిస్తుంది. ఇదీ స్పర్శకు చెందిన భ్రమే.

3. హిప్నటైజ్‌ చేసిన వ్యక్తిని మేకుల పడకపై పరుండబెట్టి నీ విప్పుడు పరుపుమీద పడుకున్నావని ఆదేశమిస్తే, అతనికి పరుపుమీద పడుకున్నట్లే అనిపిస్తుంది. ఇది స్పర్శకు సంబంధించిన మానసిక కారణంగా ఏర్పడ్డ భ్రమ (భ్రాంతి అవుతుంది).

*   జిహ్వ భ్రమలు (రుచుల భ్రమలు) :

1. పడపత్రి ఆకు నమిలి కొద్దిసేపయ్యాక పంచదార తింటే, తీపి అనిపించదు. చప్పగా ఉందనిపిస్తుంది. నాలికపై ఇసుక ఉన్నట్లనిపిస్తుంది.

2. అతి తీపి పదార్థాలు, అతి ఉప్పని పదార్థాలు తిన్నాక వెంటనే సాధారణ మధుర పదార్థాలు లేదా కాఫీ టీ లాటివి తీసుకుంటే చప్పగానో, అతి తీపిగానో ఉన్నట్లు అనిపించడం రుచికి సంబంధించిన భ్రమలే.

3. హిప్నటైజ్‌ చేసి ఒక వ్యక్తిచేత మిరపకాయ తినిపించి అది తీపిగా ఉందన్న ఆదేశమిస్తే అతనికది తీపిగానే అనిపిస్తుంది. అది రుచివిషయమైన మానసిక భ్రమ (భ్రాంతి) అవుతుంది.

4. జ్వరం వచ్చినప్పుడు ఏదితిన్నా చేదుగా అనిపించడం ఇంద్రియం కారణంగా జరిగే భ్రమే.

5. ఉసిరి కాయ తిన్నాక మంచినీల్ళు తాగితే అవి తియ్యగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది రసాయనిక భ్రమ.

ఘ్రాణ భ్రమలు :

1. ముక్కు చెడిపోయినప్పుడు వాస్తవంగా ఉన్న వాసనలు లేనట్లు అనిపిస్తుంటుంది.

2. హిప్నటైజ్‌ చేసి వేరువేరు వాసనలున్నట్లు భ్రమలు కల్పించవచ్చు.

మానసిక భ్రమలు : దేవుడు కనపడడం, దయ్యాలు కనపడడం, మాట్లాడడం, లాటివన్నీ మానసిక భ్రమలే.

ఉదా :- 1. దినకరన్‌ గారికి హాస్పటల్‌ పార్కులో ఏసుకనపడి ప్రక్కనే కూర్చుని అనేక విషయాలు మాట్లాడాడనిపించడం.

2. రంజిత్‌ ఓఫీర్‌గారికి నిత్యం ఏసు మాట్లాడుతున్నాడనిపించడం

3. పోలేరమ్మలు, దేవరలు పూనడం లాటి పూనకాలన్నీ మానసిక భ్రమలే.

ఓ   రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలు :

1. గంజాయి, నల్లమందు లాటి మాదక ద్రవ్యాల వల్ల గాలిలో తేలిపోతున్నట్లు, దారి ఎగుడుదిగుడులుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అలాటి వాటిని రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలంటారు.

గమనిక :- భ్రమలకు ఎన్ని రకాల కారణాలుండే వీలుందన్న విషయంపై శాస్త్రీయ పరిశోధనలెన్నో జరిగాయి. జరుగుతున్నాయి కూడా. కనుక ఈ జాబితాకు ముగింపంటూ పెట్టుకోనక్కరలేదు. ఎన్ని రకాలుగ భ్రమలుండే వీలుందో అర్ధం చేసుకుని, అవి ఏర్పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్త లేమిటో తెలిసికుని, వినియోగించుకోవడం అలవరచుకుంటే జీవితంలో తరచుగా తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉంటుంది.

*   'భ్రమలు - వాటికి కారణాలు' అన్న వాటి గురించి కొంత వరకు విచారించు కున్నాం. ఇక వాటి నివారణోపాయాలను గురించి తెలుసుకోవలసి ఉంది.

1. బాహ్య కారణాల వల్ల కలిగే భ్రమలు కలక్కుండా చూసుకోవడానికి 1. ఇంద్రియార్థ సన్నకర్షను బలంగా, ప్రగాఢంగా ఉండేలా చూసుకోవడం 2. పెక్కింద్రియాలను వాడడం ద్వారా తెలియబడే దానిని గురించిన స్పష్టత ఏర్పరచుకోవడం 3. ఆయా విషయాలలోని గుణాలననుసరించి వాటికి ఉండే సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకుని (అర్ధక్రియా కారిత్వ మంటారు దీనినే) అట్టివి ఉన్నాయో లేదో చూసుకోవడం వలన, బాహ్య పరిస్థితులను చక్కజేయడం వలన వాటిని నివారించుకోవచ్చు.

2. ఐంద్రియిక దోషాలనే కారణాలను, ఇంద్రియాలు దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఐంద్రియిక కారణాలను పరిష్కరించుకోవచ్చు.

3. రసాయనాలవల్ల ఏర్పడే భ్రమలనైతే రసాయనాల ప్రభావం పడకుండా చూసుకోడం ద్వారా సరి చేసుకోవచ్చు.

4. మానసిక భ్రమలకు అనేక కారణాలుండే వీలుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా ఉండడం, మూఢనమ్మకాలు లేకుండా జాగ్రత్తపడడం, అతి ఆవేశానికి లోనుగా కుండడం, ఆత్మాధిక్యతకుగానీ, ఆత్మన్యూనతాభావానికి గానీ లోను కాకుండడం లాటి వన్నీ మానసిక భ్రమలు కలగకుండా ఉండేందుకు పనికి వచ్చేటివే. శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవడం, శాస్త్రీయ పద్దతిని వినియోగించుకోవడం అన్నరెండూ మానసిక భ్రమలు ఏర్పడకుండా ఉండేందుకు దోహదపడుతాయి.


అపరోక్షము



ప్రమాణ విచారణలో ప్రమాత - ప్రమాణము - ప్రమేయము అన్న మూడు అత్యంత కీలకమైనవి. సాంప్రదాయంలో వీటినే త్రిపుటి అని అంటారు. ప్రమాత అంటే తెలుసుకొనే వాడు అని. జ్ఞాత, విషయి, ద్రష్ట అన్న పదాలూ తెలుసుకునే వానికి వర్తించే పదాలే. చూచేవాడు, తెలుసుకునే వాడు అన్నవి సమానార్థకాలు. తెలుసుకునే సామర్ధ్యం కలిగి, తనను - తనకన్యమైన వాటినీ కూడా తెలుసుకుంటాడితడు. తనకు అన్యమైన వాటిని గురించి తెలుసుకోడానికైతే ప్రమాతకు ఆ పనికి అవసరమైన పరికరాలు, పద్ధతులు అవసరమవుతాయి. వాటినే ప్రమాణాలు (జ్ఞాన సాధకాలు) అంటారని ముందే చెప్పుకున్నాం. ఇకపోతే తన గురించి తాను ఎరుక కలిగి ఉండడానికి ప్రమాణావశ్యకత లేదుగనుక, ప్రమాతకు సంబంధించిన ఏ విషయాలైనా త్రిపుటితో పనిలేకుండానే తనకు తనకుగానే తెలుస్తూ ఉంటాయి. కనుకనే ఈ భాగానికి సంబంధించిన తెలివిని (జ్ఞానాన్ని లేదా ఎరుకను) అపరోక్షజ్ఞానం అంటున్నాము.

దీనికి సంబంధించిన క్షేత్ర దర్శనం


ఒక్కసారి నిద్రనుండి మెలకువలోకి వచ్చే సందర్భాన్ని గుర్తుచేసుకోండి. మెలుకువ వచ్చిందని తెలుస్తుంది మొదట. గమనించడం ఆరంభమైందని దానర్ధం. నేను అన్న భావన కూడా పుట్టకముందే ఎరుకలోకి రావడం జరుగుతుంది. అంటే గమనించడం మొదలైంది. ఆ క్షణంలో గమనిస్తున్నాను అన్న స్పృహకూడా ఉండదు. రెండో దశలో నేను అన్న భావన, నేను గమనిస్తున్నాను అనిగాని, నాకు మెలుకువ వచ్చింది అనిగాని అనిపిస్తుంది లేదా తెలుస్తుంది. తెలుసుకునే దానికి / వానికి తనకు అన్యమైన వాటి గురించి తెలుసుకునేందుకున్న విధానాలు, సాధనాలనే ప్రమాణాలనుకున్నాం కదూ! ఒక ముఖ్యమైన విషయమేమంటే త్రిపుటిలోని ప్రమాణాలు, ప్రమేయాలూ కూడా ప్రమాతకు అన్యమైనవే అవుతాయి. ఆ దృష్టినుండి చూస్తే; తెలుసుకునే వాడు, తెలియబడేటివి అన్న రెండుగానే వీటిని అర్థంచేసుకోవచ్చు.

ఓ   జ్ఞాత (ప్రమాత) : ఎవరన్న విషయంలో రకరకాల 'సిద్ధాంతాలు - రాద్ధాంతాలు' ఉనికిలో ఉన్నా శరీరంలో తెలుసుకునే పని జరుగుతూనే ఉందనీ, మనందరికీ ఆ పని మనమే చేస్తున్నామని అనిపిస్తుంటుందనీ అనేంతవరకు ఏకాభిప్రాయమే ఉంటుంది. నేనే తెలుసుకుంటున్నాను. ఈ శరీరంలో తెలుసుకుంటున్నది 'నేనే' అని మనందరికీ అనిపిస్తుంటుంది. తెలుసుకునే పని తలలో జరుగుతుంటుందనీ మనందరకూ తెలుసు. భారతీయ ఆస్తిక సాహిత్యంలో జ్ఞాన లక్షణం ప్రకృతికి, ప్రకృతి సంబంధితాలకూ ఉండదన్న దృష్టిఉండడంతో, శరీరభిన్నము (జడ భిన్నము) అయినది ఒకటుండక తప్పదనీ, దానినే ఆత్మ అంటారని, కనుక తెలుసుకునే నీవే ఆ ఆత్మవు అనీ చెప్పబడింది. మన ప్రస్తుతాంశం శరీర భిన్నమైన ఆత్మ ఉందా లేదా? అన్నది కాదు. ఈ శరీరంలో నేను అన్న భావనతో కూడి తెలుసుకునే పని చేస్తున్నదొకటి ఉందని, అది మనందరికి, ఆ తెలుసుకుంటున్నది నేనేనని అనిపిస్తుంటుందని, సందేహ రహితంగా తెలుసు. కనుక తెలుసుకునేది ఏది? లేక ఎవరు? అన్నది ప్రస్తుతానికి ప్రక్కనుంచుదాం.

అంటే; జ్ఞాతను నేనే. తెలుసుకునే లక్షణము గల నేను పరిమిత సామర్ధ్యముతో తెలుసుకుంటుంటాను. నన్ను నేను తెలుసుకుంటూ, నాకు సంబంధించిన విషయాలూ తెలుసుకుంటూ, నాకితరమైన వాటిని వివిధ పరికరాలూ, పద్ధతులాధారంగా తెలుసుకుంటూ ఉంటాను. ఇంతవరకు ఇదంతా మీమీ అనుభవం (ఎరుక)లో ఉందో లేదో ఎవరికి వారుగా, మీమీ అనుభవాలను తరచిచూసుకోండి. తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు మనకెవ్వరికీ అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. కనుక నేను ఉన్నాను, తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు ప్రమాణాపేక్ష లేకుండానే తెలుస్తుంటుంది.

ఈ ప్రమాత లేదా జ్ఞాత (అహం) కు సంబంధించిన తెలివినే (ఎరుకనే) అపరోక్షం అనంటారు. జ్ఞాన సాధకాల తీరుతెన్నులను విచారించుకునే సందర్భంలోనూ, ఏఏ జ్ఞాన సాధకాల అంటే ఏఏ పరికరాల, పద్ధతుల ద్వారా ఏ రకమైన జ్ఞానం కలుగుతుంటుందో విచారించే సందర్భంలోనూ ఈ ప్రమాత స్వరూప స్వభావాల విచారణ అంత ప్రధానం కాదు. అయినా మనకు కలిగిన జ్ఞానరాశినంతటినీ పరిశీలించి చూస్తే. మూడు ప్రమాణాల ద్వారా కలిగిన జ్ఞానం కాక, మరికొంత జ్ఞానమూ ఉన్నట్లు తేలుతుంది. ఆ జ్ఞానానికి మనం ప్రమాణాల పేరిట చెప్పుకున్న పరికరాలు గానీ, పద్ధతులు గాని అవసరపడలేదని తెలుస్తుంది. అదిగో ఆ భాగాన్నే అపరోక్షం అనంటున్నాం. ఇదంతా ఇక్కడెందుకు విచారించు కుంటున్నామంటే ప్రమాణబద్ధమైన జ్ఞానానికీ, అది ఒప్పు జ్ఞానం కావచ్చు, తప్పు జ్ఞానం కావచ్చు, అపరోక్ష జ్ఞానానికీ, అంటే ప్రమాణాల క్రింద చెప్పుకున్న పరికరాలు, విధానములన్న వాటి ప్రమేయము లేకుండనే కలిగే జ్ఞానానికి తేడా ఉందని గమనించి, ఆ అపరోక్ష జ్ఞాన రాశిని విడిగా ఉంచడానికే.  ముందుగా ఆ పని చేసుకుంటేనే ప్రమాణాల విషయాన్ని వివరంగా పరిశీలించగలుగుతాం. మరి 1, 2 ఉదాహరణలు చెబుతాను. అపరోక్ష జ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోడానికి (స్పష్టత రావడానికి) ప్రత్యక్షం ద్వారా ఏదో ఒక విషయానికి చెందిన అనుభూతి కలుగుతుందను కుందాం. అంటే ఏదో ఒక దానిని గురించి ఏదో ఒకటి అనిపించింది. ఇంతవరకు ఇది ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమే. ఆ తరువాత ఆ విషయం మనకు తెలిసిందని తెలుస్తుంటుంది. ఒక విషయం తెలియడం - అది తెలిసిందని తెలియడం ఇది మీమీ అనుభవాలలో ఉందో లేదో చూసుకోండి. తెలిసిందని తెలియడానికి మూడు ప్రమాణాలలో ఏ ప్రమాణంతోనూ పనిలేదు. అది తెలుసుకునే మనకు, మనకుగానే తెలుస్తుంది. దానితో పాటు తెలుసుకుంటున్నాను అన్న తెలివీ కలుగుతుంటుంది. ఈ జ్ఞాన భాగాన్ని అపరోక్ష జ్ఞానమనే అనాలి. ఇక ప్రమాణజన్య జ్ఞానమంతా ప్రమాతకు - ప్రమేయ స్థానంలో ఉన్న విషయానికి సంబంధం ఏర్పరిచే వ్యవహారం జరిగి ఏర్పడ్డదై ఉంటుంది. ప్రస్తుతానికీ వ్యత్యాసాన్ని గమనించుకొని ప్రమాణాలను, తద్వారా కలిగే వివిధ రకాల జ్ఞానాలను వివరించుకుందాం.

అపరోక్షాన్ని మినహాయించితే, మిగిలిన జ్ఞాన రాశీ, అదేర్పడేందుకు అవసరమైన పరికరాలు, పద్ధతుల విచారణే ప్రమాణ విచారణంతా. అదిన్నూ ప్రత్యక్షమూ - పరోక్షమూ అన్న రెండు రాశులుగానూ, ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న భేదంతోటీ ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిననుసరించి కలిగే జ్ఞానం ఇంద్రియాల తేడావల్ల మరల 6 విధాలుగా ఉంటుంది. ఇక పరోక్ష జ్ఞానం అనుమాన పద్ధతిన, భాషనాధారం చేసుకునీ, రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది. భాషనాధారం చేసుకునేదంతా మానవుడు తమారుచేసుకున్నదే. అదికాక మిగిలిన రెండూ అంటే ప్రత్యక్షమూ - అనుమానమూ అన్న రెండూ శరీర నిర్మాణంలోనే అమరిఉన్న వ్యవస్థ రూపాలు. కనుకనే మండలి అవైవున్న ప్రమాణాలు రెండనీ, భాష ఆధారంగా మనిషి చేసుకున్నదొకటనీ అంటూ ప్రమాణ పద్దతులు మూడని నిష్కర్షిస్తోంది. మొత్తంమీద, మానవ జీవితానికి ముడిపెట్టి చూసుకుంటే, మూడు విధానాలను వాడుకోకుంటే జీవితంలో జ్ఞానపరంగా లోటుఏర్పడుతుంటుందనీ, నాలుగో ప్రమాణంతో పనిలేదని, మూటికంటే అధిక సంఖ్యలో ప్రమాణాలున్నాయనే వారంతా ఉన్న వాటినే అనవసరంగా అధిక భాగాలు చేసి సంఖ్యను పెంచే పనిచేసినట్లేనని మండలి సిద్ధాంతీకరిస్తోంది.