Showing posts with label Bible. Show all posts
Showing posts with label Bible. Show all posts

Wednesday, May 1, 2019

విజయకుమార్‌ గారి క్రొత్త తరహా ప్రసంగం


పి.డి.సుందర్రావు గారి 'భూతలక్రిందులు' పత్రికపై విమర్శనాత్మక విశ్లేషణ చేస్తూ విజయకుమార్‌ గారు, పి.డి.సుందర్రావు గారి బైబిలు అవగాహనలో లోపముందనీ, అపో. 17 :6, వచనంలోని, భూలోకమును తలక్రిందులు చేయువారు క్రైస్తవులు కారనీ, వారు సాతాను ప్రతినిధులేనని వివరించారు. దానిపై పి.డి.సుందర్రావు గారి బృందమూ, బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిీ ఇంటర్నేషనల్‌ వారిని అభిమానించే అనేక మంది బైబిలు విశ్వాసులూ, విజయకుమార్‌ గారిని వివిధ రకాలుగా దూషిస్తూ, నిందిస్తూ సోషల్‌ మీడియాలో మ్లాడేశారట. ఆ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విజయకుమార్‌ గారు, 'విశ్వాసులకు వి.కె.ఆర్‌. విన్నపం' అంటూ మరో వీడియో ప్రసంగం చేశారు. అందులో విజయకుమార్‌ గారు అనేకానేక వాస్తవాలను రాసిపోసేశారు. ఒక ప్రసంగంలో విజయకుమార్‌ గారు ఇలా, ఇన్ని వాస్తవాలను, ఇంత సంయమనంతో మ్లాడడం గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో గాని, నా దృష్టికి రాలేదు. ఏమాత్రం విచక్షణా జ్ఞానం, విజ్ఞత పనిచేస్తున్న వారైనా వారి ఈ ప్రసంగాన్ని మెచ్చుకొని తీరాలి. ఆయన అలా, నిర్భయంగా, నిజాయితీగా, నిబ్బరంగా అనేక విలువైన భావాలను వెల్లడించడం, నావరకు నాకు ఆపుకోలేనంత సంతోషాన్ని కలిగించింది. అదిగో ఆ సంతోషాన్ని నలుగురికీ పంచాలనుకునే ఇలా ఈ వ్యాసాన్ని మీ ముందుకు తెచ్చాను.
గమనిక : నేరుగా ఆయన వీడియో ప్రసంగాన్నే గమనించదలచుకున్న వారు ఖీ.ది.జీ.జిరిఖీలిశి.ఖీ అని సెర్చిచేయండి. అక్కడది మీకు దొరుకుతుంది.
ఆయనగారు వెలిబుచ్చిన అభిప్రాయాలు :
1. పి.డి.సుందర్రావు గారు ఎంత మేథావి అయినా, బైబిలు అవగాహన విషయంలో, వారి వివరణలు అక్కడక్కడా వాక్య విరుద్ధంగా ఉంటున్నాయి.
2. బైబిలు ఓపెన్‌ యూనివర్సిీకి చెందిన కొందరు సంస్కార హీనంగా మ్లాడుతున్నారు. అది వీరి దోషం కాదు. ఆ బడిలో చదువుకున్న వారందరికీ, ఆ శిక్షణలో భాగంగానే ఆ దురుసుతనం అలవాటవుతుంది.
3. వారి బోధనా శైలిలోనే, మనని మనం తగ్గించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి లాి మాటలు అలవర్చటం ఉండదు. డాంబికంగాను, దురుసుతనంతోనూ కూడా ఉంటుందా బోధన. కనుక అక్కడ చదువుకున్న వారందరిలోనూ అదే ఒరవడి కనపడుతుంది.
4. నేను అనేక సంవత్సరాలుగా బైబిలును అధ్యయనం చేస్తూ తయారు చేసుకున్న న్స్‌ో నుండి, ఏది సత్యమో దానిని ప్రజల ముందు పెడుతున్నాను. ఇకముందూ పెడుతూనే ఉంాను.
5. భూమ్మీద నాకెక్కువ ఇష్టమైన వ్యక్తి జయశాలి గారే. కాకుంటే ఆయన బైబిలు పైన మ్లాడిన వాిలో కొన్ని వాక్యవిరుద్ధంగా ఉన్నాయి గనుకనే చెప్పవలసి వచ్చింది.
6. బైబిలు ఓపెన్‌ యూనివర్సిీలో చదువుకున్న వారందరికీ, ఈ సంస్కార హీనమైన, రెచ్చిపోయి మ్లాడే అలవాటుంటుంది. ఇది నేను వారిపై వేస్తున్న అభాండం కాదు. అనుభవంతో చెబుతున్న మాటే. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ గూిలోని వాణ్ణే కనుక.
7. క్రైస్తవుణ్ణి ఎవరైనా నిందించి, దూషించి, హింసించితే సంతోషించండి. పరలోకంలో ఆ నిందపడిన వాడిపని మెరుగవుతుంది అంోంది బైబిలు.
8. కొందరు ఇలా బహిరంగంగా మ్లాడటమెందుకు నేరుగా బైబిలు యూనివర్సిీ కేంద్రానికి వెళ్లి వారితోనే ఈ విషయం చెప్పొచ్చుగా అన్న సలహా ఇస్తున్నారు. అక్కడికి వెళితే వారు మన సలహాలను వినకపోగా మూకుమ్మడిగా దాడిచేసే ప్రమాదమూ ఉంది.
9. మరి కొందరు, నువ్వక్కడున్నప్పుడు ఈ విషయం తెలియలేదా, అంటూ వ్యంగ్యంగా మ్లాడుతున్నారు. వ్యంగ్యంగా మ్లాడినా వారన్నది నిజమే. నేనూ అక్కడున్నంత కాలం ఆయనమీద అభిమానంతో, అదంతా వాస్తవమేనని గుడ్డిగా అనుకుంటూ వచ్చాను.
10. అయినా ఒక్కనిజం చెప్పాలి. ఎవరికైనా అప్పి వరకు తాము సరైందేనని అనుకుంటూ వచ్చిన విషయం తప్పని తెలిసినప్పుడు మార్చుకోవడం చాలా ముఖ్యమైనది. బైబిలు ప్రకారం చూసినా, అలా మార్చుకోలేకపోతే నరకానికి జారిపోతాము.
11. గతంలో నేర్చుకున్న దానిలో దోషాలున్నాయి అని మన పరిశీలనలో తేలినప్పుడు, నేర్చింది ఎంతవారి దగ్గరైనా తప్పును విడచి, ఒప్పును స్వీకరిస్తే దేవుడూ సంతోషిస్తాడు.
12. ఈ విషయాలు ఒకప్పుడు నీకు తెలియలేదా? అంటే, నిజంగానే అప్పుడు నాకవి తప్పులని తెలియలేదు. ఆ నిజాన్ని స్వయంగా నేనీనాడు అంగీకరిస్తున్నాను.
13. ఒక వ్యక్తినెవరినైనా పిచ్చిగా అభిమానిస్తే అతనిలోని లోపాలు ఆ థలో కనపడవు మరి.
14. తన అవగాహనలో లోపాలున్నాయని తేలితే, ఎవరైనా, అతడెంతి వాడైనా వాిని సరిచేసుకొని తీరాలి. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులుండవు.
15. ఒక ఉదాహరణ : 20వ శతాబ్దపు సంచలనాలు. ముఖచిత్రం - మరో పుస్తకంలోని ముఖచిత్రం మధ్య వ్యత్యాసాలు చూపుతూ సుందర్రావు గారి అవగాహన లోని ఒక లోపాన్ని రుజువుగా చూపారు.
16. అప్పికి మనకున్న అవగాహనలో తప్పుందని గమనిస్తే బ్రతికుండగానే తానే సరిచేసుకుంటే మేలు.
17. 666 గురించి పి.డి.సుందర్రావు గారు చెప్పింది, ఆయన కుమారుడైన ప్రసన్నబాబు గారు చెప్పింది పరస్పరం పూర్తి వ్యతిరేకంగా ఉంది. మరి రెండూ రైట్లు కావుకదా. ఎవరిది ఒప్పన్నట్లు.
18. బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిీ వారు బైబిలును అర్థం చేసుకోవడంలో పొరబడిన అంశాలెన్నో ఉన్నాయి.
19. నిజమైన విశ్వాసి, అసత్యాలనుండి బయటపడానికి సిద్ధంగా ఉండాలి లేకుంటే పరలోకం తప్పిపోద్ది.
20. పి.డి.సుందర్రావు గారి బృందం నోరు ఎంత దురుసో చాలా బాగా చెప్పారు విజయకుమార్‌ గారు. వారు ప్రేమతో చెబితే వినే రకం కాదు. ఛాలెంజ్‌ అంారు. కబడ్దార్‌ అంారు. వేసేస్తామాంరు, చించేస్తామాంరు, ఈడియ్‌ అంారు, లుచ్చా అంారు, బచ్చా అంారు, డర్టీ ఫెలో అంారు ... ఇలా ఎన్నెన్నో అంారు. ప్రక్కనున్న ఆయన బృందమూ చప్పట్లు కొడతారు. చంకలు బాదుకుాంరు.... అంతేగాని సత్యాన్ని మాత్రం గ్రహించరు.
21. అందరికీ అన్ని విషయాలు తెలియవు. మరొక్కసారి చెబుతున్నాను. భూమిమీద బ్రతికున్న సేవకులలో ఎవరూ బైబిలులో పరిపూర్ణులు కారు. ఎ టు జడ్‌ బైబిలంతా ఎవరికీ తెలియదు.
22. ఒక్కొక్కరికీ కొన్నికొన్ని తెలుస్తాయి, కొన్నికొన్ని తెలియవు. ఒకరినుండి మరొకరు తెలుసుకుంటుండాల్సిందే. ఈమాట పలుమార్లు నొక్కిచెప్పారు విజయకుమార్‌ గారు.
23. ఈమధ్య కాలంలో గుర్తింపులోకి వచ్చిన తమ్ముళ్లు కొందరున్నారు. శాంసన్‌, జేమ్స్‌ లాిం వాళ్లు. వాళ్లు అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు. వారు చెబుతున్న విషయాలు కొన్ని నాకు తెలియనివి ఉంటున్నాయి. కనుక అందరికీ అన్నీ తెలియదన్న నిజాన్ని అందరం అంగీకరించాలి.
24. అంతా నాకేతెలుసన్న భ్రమలో ఎవరూ ఉండకూడదు. ఒకరినుండి ఒకరు నేర్చుకుంటూనే ఉండాలి.
25. అలా అందరూ నేర్చుకుంటున్నారాంరా? అని అడుగుతారేమో. అందరి సంగతేమో గాని నేను మాత్రం నేర్చుకొంటూనే ఉన్నాను. నాకంతా తెలియదు. నిజంగానే చెబుతున్నాను. బైబిలు నాకు అంతా తెలియదు. ఇంకా సరిగా చెప్పాలంటే 10శాతం కూడా తెలియదు.
26. చాలా సంవత్సరములు వృధాచేశాను. ఇప్పుడు శ్రద్ధగా బైబులు చదువుతుంటే చాలా సంగతులు దేవుని కృపతో తెలుస్తూ వస్తున్నాయి.
27. నేను చెప్పే సంగతులు వింటున్నారు, నేను చెప్పిన సంగతులు మాత్రమే వింటే వారు జ్ఞానులు కారు. అక్కడితో ఆగిపోతారు. అలాగే ఆయా బోధకులను అనుసరిస్తున్న వారు, కేవలం వారొక్కరి బోధనలతోనే సరిపెట్టుకొంటే వారెప్పికీ పూర్ణులు కాలేరు.
28. ఈరోజు చాలామంది విశ్వాసులు వారివారి బోధకులే సర్వజ్ఞులనుకుంటున్నారు. ఇలా వ్యక్తుల్ని అభిమానించి అనుసరించటం వలన మీరెప్పికీ జ్ఞానులు కాలేరు. చచ్చేంతవరకు బైబిలును తెలుసుకుంటుండాల్సిందే.
29. వ్యక్తులపై అభిమానం పెంచుకుని వారితోనే ముగించుకుంటే నష్టపోయేది మీరే.
30. ఈనాి బోధకులలో చాలామంది తన అనుయాయులకు, మీరు ఇతర బోధనలేవీ వినకండి అని కట్టడి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విశ్వాసులు పరిపూర్ణులు కాకుండా అయిపోతున్నారు.
31. నేననేదేమంటే, విశ్వాసులు ఎవరికి వారుగానూ బైబిలును శ్రద్ధగా చదువుతుండాలి.
32. ఉదా : పౌలు శరీరంలో ముల్లు - అన్న మాటకు రకరకాల అర్థాలు చెప్పారు. అందరూ ఒకేమాట ఎందుకు చెప్పలేక పోయారు? పోనీ అందరూ సమావేశమై ఏదో ఒకే అర్థాన్ని చెప్పాలని నిర్ధారించుకోవచ్చు కదా. అబ్బే అలా ఎన్నికీ రారు.
33. పొరపాటుగా వివరించామని తెలిసొచ్చాకనూ, దానిని ఒప్పుకొని మార్చుకోడానికి, ఈనాి బోధకులలో ఎక్కువమంది సిద్ధంగా లేరు.
34. మనల్ని మనం తగ్గించుకొని, పొరపాట్లు జరిగితే ఒప్పుకొని సరిచేసుకోడానికి సిద్ధంగా వుండాలి. అలా తప్పులు సరిచేసుకోడానికి సిద్ధపడకుంటే విశ్వాసులైన మీరందరూ కూడా నాశనానికి వెళ్లిపోతారు.
35. మాలాిం బోధకుల నుండి విశ్వాసులైన మీరు నేర్చుకుంటేనే, నేనే తప్పు చెప్పానని మీరు గమనించిన రోజున నాకైనా ఇది తప్పని చెప్పడానికి మీరు వెనుకాడకూడదు.
36. మమ్మల్ని సరిచేసేందుకైనా సిద్ధంగా ఉండాలి. మీరు బైబిలును స్వయంగా చదివనంతకాలం, కేవలం వ్యక్తుల ప్రసంగాలపైనే ఆధారపడినంతకాలం మీకు బైబిలు అర్ధం కాదు. మీరు పరిపూర్ణులు కారు.
37. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నదిగా కాక దేవుని శక్తిని ఆధారం చేసుకున్నదై ఉండాలి.
38. బైబిలు అందరూ చదవాలి. నిశితంగా పరిశీలించాలి. ఏ విశ్వాసి అయినా, ఏ బోధకుడు చెప్పిన వాినైనా, బైబిలు అలానే చెబుతోందా? లేదా? అన్నది ఖచ్చితంగా బైబిలులో చూడాలి. ఎవరైనా తప్పుచెబితే, విశ్వాసి అయినా బోధకుణ్ణి సరిచేయాల్సిందే.
40. బోధకునికి మించిన జ్ఞానం విశ్వాసికి ఉండకూడదన్న రూలేమైనా ఉందా? అి్టది లేనేలేదు.
41. గురువుకి కృతజ్ఞత చూపకుండా గురువుని తప్పుపట్టడం తప్పుకదా! అంటూ ఒక సోదరుడు వాయిస్‌ మెసేజ్‌ ప్టోడు. నేననేది ఏమంటే అసత్యం ఎవరు బోధించినా గమనించిన వాళ్లు నోరు విప్పి చెప్పాలి. నేను అసత్యం బోధించినా మీరు నిర్భయంగా నోరు విప్పండి.
42. అదేమిటన్న వారందరూ దొంగలూ, తోడుదొంగలూ అంటే ఎలా? బైబిలు, తప్పును ఖండించానికి, గద్దించానికి, సరిచేయానికి అధికారమిచ్చింది. దుర్భాషలాడానికి, నిందించానికి అధికారమివ్వలేదు. ఎవడైనా దూషించాడంటే అతడు క్రైస్తవుడే కాదు, బోధకుడూ కాదు.
43. దూషణొద్దు, బూతులొద్దు, మేమే సర్వజ్ఞులం అన్న అహంకారం అసలే పెట్టుకోవద్దు.
44. గురువు చెప్పినా, ఎవరు చెప్పినా సత్యమైనంత వరకే వారిని అనుసరించాలి. ఈ సామర్ధ్యం మీకు కలగాలంటే మీరు ఎవరికి వారుగా బైబిలు బాగా చదవండి.
45. బోధకుల్ని బైబిలు కంటే గొప్పవారినిగా తలంచవద్దు. అనుసరించాల్సింది వాక్యాన్ని గాని బోధకుణ్ణి కాదు. అలా చేస్తే ఆ తప్పు వలన బోధకునితో పాటు నీవూ నరకానపడే ప్రమాదముంది.
46. మీరు ఏ బోధకుని శిష్యులుగాను ఉండకూడదు. అది ప్రమాదకరం. మీరు, మేమూ కూడా క్రీస్తు శిష్యులం మాత్రమే. (1వ కొరింధీ 3:5).
47. మీరు క్రీస్తువారిగా ఉండండి. వ్యక్తులనభిమానించే వారిగా ఉండకండి.
48. ఎవరికి వారు మాకే అంతా తెలుసని గాని, మా బోధకునికే అంతా తెలుసని గాని అనుకోవడం తప్పు.
49. వాక్యాన్ని ప్రేమించే వారుగా ఉండండి. వ్యక్తుల్ని ప్రేమించే వారుగా ఉండకండి. నేను చెప్పే ఏ వాక్యమైనా బైబిలుకు విరుద్ధంగా ఉందంటే నేరుగా నా దృష్టికి తేండి. నేను మార్చుకుాంను. ఆ మాట బహిరంగంగా చెబుతాను.
50. తప్పొప్పులను నిష్కర్షించండి. ఒప్పులను స్వీకరిద్దాం. తప్పుల్ని సరిచేసుకుందాం. దూషణలు వద్దనే వద్దు.
విజయకుమార్‌గారి ఈ ప్రసంగంపై నా మాటలు
సహజంగా లేదా స్వభావతః మనిషి హేతుబద్ద యోచనాశీలత కలిగిన వాడు అన్నది విజ్ఞుల మాట. అది మనందరి అనుభవం కూడా. కానైతే తనకు తెలియని విషయాలతో ముడిపడి ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, అతడు మరొకరి మాటపై ఆధారపడుతుాండు. దీనినే జ్ఞాన సిద్ధాంతంలో 'శబ్ద ప్రమాణం ఆధారంగా' అనాంరు. నిజానికి మత విశ్వాసాలన్నీ గ్రంథాన్ని ఆధారం చేసుకొనే ప్రవర్తిస్తుాంయి.
మన విజయకుమార్‌ గారి ప్రసంగంలో ప్రధానంగా 3 అంశాలు చోటుచేసుకున్నాయి.
1. విన్న మాటలు సరిగనే ఉన్నాయో లేదో అనుభవంతో గాని, వాస్తవంతో గాని సరిచూసుకొనే అంగీకరిస్తుండాలి. అదే సరైన విధానం.
2. విన్న మాటలను గుడ్డిగా అంగీకరించకుండా ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి.
3. ఎంతి వారైనా పొరపడే అవకాశం ఉంటుంది కనుక, పరిశీలించుకునే స్వీకరించడమో, విడిచి పెట్టడమో చేయాలి.
ఒక నిజాయితీ గల, సత్యానికి పెద్దపీట వేయాలనుకునే వ్యక్తి ఎలా మ్లాడాలో అలా ఉందాయన గారి ఈ ప్రసంగం. విశ్వాసాలు, బైబిలుకు సంబంధించిన అనేకాంశాలపరంగా మా మధ్య తేడాపాడాలెన్నో ఉన్నా, ఈ ప్రసంగంలో ఆయన మ్లాడినవిగా నేను వ్రాసిన 50 అంశాలలో చాలా వరకు నేను కాదు, బుద్ధిమంతులందరూ అంగీకరించదగినవిగా ఉన్నాయి. అందులో కొన్నైతే నాకు అత్యంత కీలకమైనవనిపించాయి. చాలా కాలంగా నేనూ ఆ భావాలనే ప్రకిస్తూ వస్తున్నాను కూడా.
విజయకుమార్‌గారూ! ఇంతి తూనికైన ప్రసంగం చేసిన మీకివే నా అభినందనలు. అందులోని అందరికీ వర్తించే వాిని అందరం స్వీకరిస్తే మేలు.
నగ్నసత్యం
విజయకుమార్‌ గారి విశ్వాసులకో విన్నపం ప్రసంగం నుండి గానీ, పలువురు క్రైస్తవ ప్రసంగీకులూ, సంఘకాపరులుగా పిలవబడుచున్న వారూ, బోధకులుగా చలామణి అవుతున్న వారు మ్లాడిన మాటలనుండిగానీ, వ్రాసిన వ్యాసాలనుండి గానీ వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు ప్రకింపబడినట్లు, వారిలో కొందరైనా, ఒకరినొకరు, నీకు బైబిలు పట్ల సరైన అవగాహన లేదనిగానీ, నీ వివరణ వాక్యవిరుద్ధంగా వుంది అనిగానీ మ్లాడినట్లు రూఢీగా తేలిపోతుంది. ఈ అంశం వరకు ఎవరు ఎప్పుడు కావాలన్నా ఆయా వ్యక్తుల ప్రసంగ పాఠాలను నిజనిర్ధారణకు తీసుకొని రుజువుచేసుకోవచ్చు.
అబద్దపు బోధకులు, వ్యాపారస్తులూ సంఘంలో జొరపడతారన్న హెచ్చరిక యేసు కాలం నుండే వుంది. అనంతరం అపోస్తలులూ ఈ విషయమైన హెచ్చరిక చేశారు కూడా. ఇక ప్రొటెస్టెంటు ఉద్యమపు పుట్టుకే, బైబిలుకు విరుద్ధంగా కేథలిక్కులు ప్రవర్తించారనుకోవడం వల్లే జరిగిందే. ఈనాడైతే ఒక పెద్ద విశ్వాసుల సమూహమే, క్రైస్తవం పేరున అబద్ద ప్రచారకులు దండిగా పుట్టుకొచ్చేశారని, వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా ప్రకించటం కళ్లకు క్టినట్లు అగుపడుతూనే ఉంది. బైబిలుకు సంబంధించినంతలో, అన్నింకంటే పెద్ద సమస్య బైబిలు దేవుడెవరన్నదే. యెహోవా దేవుడు కాదని ఎవరూ అనరనే అనుకుాంను. సమస్యల్లా యేసు దేవుడా? కాదా? అన్నదే.
మొత్తం మొత్తంగా బైబిలును విశ్వసించే వాళ్లలోనే ఈ విషయంపై వివిదాభిప్రాయాలున్నాయి.
ఎ) యూదులు యేసును దేవుడని అంగీకరించక పోవడమే గాక తాము ఎదురు చూస్తున్న మెస్సియాగానూ యేసును అంగీకరించరు.
బి) ఎలా యెహోవా ''నేనే దేవుణ్ణి, నాకు వేరుగా మరొక దేవుడు లేడు, వుండడు అన్నట్లు సూిగా యేసు తానే దేవుణ్ణని ఎక్కడా ప్రకించలేదు''.
సి) ''వాక్యము దేవుడై యుండెను'' అన్న మా ; నన్ను ఎరిగిన వాడు నా తండ్రినీ ఎరిగిన వాడేనన్నమాట; '' ఇంతకాలంగా నన్ను చూస్తూనే దేవుని ఎప్పుడు చూస్తామని అంటున్నారేమి?'' అన్నమాట, ''తండ్రి నేను ఏకమైయున్నాము'' అన్న మాట ;.... ఇలాి మాటలను సాగదీసి, సరిప్టిె ఇదిగో యేసు దేవుడనానికి వాక్యాధారాలంటూ వివరించడమే గాని, యేసే దేవుడనానికి తగిన ఒక్క సూటైన మాట క్రొత్త నిబంధనలో లేదు.
డి) పాత నిబంధనలోనైతే నేరుగా యేసు ప్రస్తావనే లేదు. యేసు, అనంతరపు వారలు కూడా లేఖనములు (పాత నిబంధన వచనాలు) యేసును గురించి ప్రస్తావించాయి అన్న క్రొత్త నిబంధన వచనాలు కొన్ని ఎత్తిచూపుతుాంరు ఈనాి యేసు దేవుడేననే పక్షం వాళ్లు.
ఇ) కానీ క్రైస్తవులలోని వారే అయిన కొందరు  యేసు దేవుడు కాడు, దేవుని ఆదేశానుసారం ఈ లోకాన కొన్ని కార్యాలు నెరవేర్చడానికి వచ్చిన వాడు మాత్రమే అని ఘాంపథంగా చెబుతారు.
ఎఫ్‌) మూడైన ఒక్కడు / ఒక్కటైన ముగ్గురు / ముగ్గురూ ముగ్గురే, ఇలా యేసు, పరిశుద్ధాత్మతో ముడిప్టిె, మ్లాడే వర్గమూ ఒకటుంది.
ఇలా బైబిలు అర్థమైందనుకుంటున్న ప్రసంగీకులు, కాపరులు, బోధకులలోనే కొన్ని ముఖ్యాంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్నది వారంతా అంగీకరించిన వాస్తవమే.
కనుక, క్రైస్తవ పక్షాన ఉంటున్న యోచనాపరులందరి ముందున్న ప్రధాన సమస్య ఆయా విషయాల పట్ల బైబిలు అసలభిప్రాయం ఏమిో తేల్చుకోవాలన్నదే. ఏమాత్రం నిజాయితీ, నిబద్దత, సత్యసంస్థాపనోద్ధతి కలిగివున్నవారైతే, ఇది ప్రధానంగా వారి అంతర్గత సమస్య. దానిని తేల్చుకుని ఇంతకూ అి్ట విషయాలలో బైబిలు ఏమి చెబుతోందన్నది ఖరారుచేసే ప్రజలకు బోధించాల్సిన బాధ్యత వారిపై వుంది.
నేననేదేమంటే, బైబిలును ఖండించదలచుకున్న వారిపైనా ఈ బరువు బాధ్యతలున్నాయి. బైబిలు ఏమి చెబుతుందో తేల్చకుండా దానిని ఖండించటం కూడా సరైంది కాదు. సాధ్యపడదు కూడా. కనుక, ఇంతకూ బైబిలు ఏమి చెబుతోందో నిర్ధారించి అటుపిమ్మట అది సరైందేనని నిరూపించాల్సిన బాధ్యత దాన్నెత్తికెత్తుకుని మంది నెత్తికీ ఎక్కించజూసే ఆ పక్షం వారందరిపైనా ఉందాంను. ఇది సబబో, కాదో నిష్పాక్షిక దృష్టితో నిష్కర్షించండి.

తిరుపతిలో మార్చి 30న జరగని బైబిలుపై సత్యాసత్య విచారణ వివరాలు


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
బైబిలు దైవ గ్రంథమా? కాదా? అన్న అంశంపై మల్లెం దేవసహాయం గారికి, ప్టుా సురేంద్రబాబు అను నాకు మధ్య సత్యాసత్య విచారణ దృష్టితో విచారణ యత్నాలు జరుగుతున్న విషయం మీకూ తెలిసున్నదే. మార్చి 30న ఆ విచారణ జరపాలనుకోవడం జరిగింది. గత సంచికలో దీనికి సంబంధించి కొన్ని వివరాలు మీ ముందుంచాను. వాిలో అత్యంత ప్రధానమైన వాి వరకు స్ఫష్టంగా గుర్తుంచుకోవటం కొరకుగా మళ్లా ఒకసారి గుర్తుచేస్తాను.
1. గతంలో ఇరువురము ఒకింత ఆవేశాత్మకంగా, నీవెంతంటే నీవెంతన్నట్లు ప్రకటనలు చేసుకున్నాం.
2. నేను లోకంలో '3' రకాల వాళ్లు తారసపడుతుాంరు. అందులో రెండు రకాల వాళ్లతోనే నేను చర్చకు - విచారణకు - సిద్ధపడతాను. '3'వ రకం అలగా రకం. అల్లరి చిల్లరి రకం. వారితో మాటలాడానికే నేను సిద్ధపడను అని చాలా స్ఫష్టంగా ప్రకించాను.
3. దేవసహాయం గారు అనుసరిస్తున్న - మ్లాడుతున్న - తీరుననుసరించి, నా లెఖ్ఖప్రకారం వారు రెండవ రకానికి చెందిన వారవుతున్నారు. కనుక, రెండవ గ్రూపుకు వర్తించాలన్న నియమనిబంధనలకు వారు సిద్ధపడితే చర్చకు నేను సిద్ధం అని, అంతే స్ఫష్టంగా ప్రకించాను. ఆరంభంలో వారూ అందుకు సిద్ధమేనన్నారు.
ఓ  రెండవ గ్రూపు షరతులలో 1. ఎవరి పక్షం సరైనది అన్న అంశంతో పాటు, విచారణలో ఒక్కోవిషయంపై ఎవరి పక్షం సరైందికాదని తేలితే వారిని రెండో పక్షంవారు చెప్పుతో క్టొాలి. 2. చర్చ ఆసాంతం ముగిశాక ఓడిన వారు గెలిచిన వారికి కోి రూపాయలు పందెపు ధనాన్ని ఇచ్చుకోవాలి.
4. ఈ థలో బత్తిన మణికుమార్‌ గారు, రాధాకృష్ణగారు చేసిన యత్నాల వల్ల మల్లెం దేవసహాయం గారే చొరవతీసుకొని, మనం 1వ గ్రూపుకు చెందిన వారంగా స్నేహ సుహృద్భావ వాతావరణంలో సత్యాసత్య విచారణకు కూర్చుందాం అన్న ప్రకటన చేశారు.
ఈ సందర్భంలో ఒక్కమాట చెప్పుకోవాలి. గత పదేండ్లు పైబడి, నాతో సత్యాసత్య విచారణ పద్ధతుల అధ్యయనం విషయంలో సన్నిహితంగా మెలగిన మణికుమార్‌ గారు, నా గురించీ, సత్యాన్వేషణ మండలి స్వభావాన్ని గురించీ, విపులంగా దేవసహాయంగారితో మ్లాడడం ద్వారానే, దేవసహాయంగారు నాతో 1వ గ్రూపుకు సంబంధించిన పద్ధతులననుసరించే, బైబిలుపై విచారణకు కూర్చోడానికి సిద్ధమైనారు. అంతమంచి కృషి చేసినందుకు మణికుమార్‌ గారిని అభినందించడం సమయోచితం. సందర్భోచితం కూడా. అందుకనే ఆనాడే వారికి అభినందనలు తెలియజేసాను.
5. ఈ యత్నాలన్నిం పర్యవసానంగా, విజయవాడలో ఒకసారి, తిరుపతిలో రెండవసారి ఇరుపక్షాల వారమూ సమావేశమై విచారణ వేదికకు అవసరమైన నియమావళిని రూపొందించుకొని వాిననుసరించే విచారణ పూర్తిచేయాలన్న అంగీకారానికి వచ్చి ఒప్పందపత్రము వ్రాసుకుని సంతకాలూ చేసుకున్నాం.
6. అందులో చాలా స్ఫష్టంగా 1) ఇది 1వ గ్రూపు తరహా సత్యాసత్య విచారణ వేదిక మాత్రమేనని వ్రాసుకున్నాం. 2) వాదప్రతివాదాలుండవు. బైబిలు ప్రకించిన అభిప్రాయాలు సరైనవో, కావో పరిశీలించడమే జరుగుతుంది, అని వ్రాసుకున్నాం. 3) బైబిలు పక్షాన దేవసహాయం గారు బైబిలు ప్రకించినవన్నీ సరైనవేనని రుజువుచేయాలి. 4) బైబిలులో చెప్పినవి తప్పులు అని నేను రుజువు చేయాల్సిన పని లేదు. 5) లోతైన పరిశీలనకు అవసరమైన ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తడమే నేను చేయాల్సిన పని అనీ స్పష్టంగా చెప్పుకున్నాం. 6) దేవసహాయం గారి అభీష్టం మేరకే, విచారణ నేను వివేకపథం 239, 240 సంచికలలో లేవనెత్తిన 274 ప్రశ్నలతో మొదల్టెాలని, అంశాలను కూడా ఆ ప్రశ్నలున్న క్రమాన్ననుసరించే సాగించాలనీ అంగీకరించుకున్నాం. 7) ఇతరేతరమైన విషయాలను ఎవరమూ లేవనెత్తకూడదు, వ్యక్తిగతాంశాలను అస్సలు మ్లాడకూడదు అనీ నిబంధనల్లోనే పొందుపర్చుకున్నాం.
ఆరంభ సమావేశంలోనూ, అంతకుముందు ఇరువురమూ ఒకింత ఆవేశంగా మ్లాడేసుకున్న సందర్భంలోనూ కూడా, 'నా సిద్ధాంతాన్ని పరీక్షకిస్తాను, పరీక్షించండి. మీ సిద్ధాంతాన్ని పరీక్షకివ్వండి, పరీక్షిస్తాను' అని నేను ప్రకించి ఉన్నాను. దానికి మల్లెం దేవసహాయం గారు మీ సిద్ధాంతంతో పనిలేదులేండి. బైబిలును విచారణకు స్వీకరించుదాం. బైబిలు పక్షాన నేనుాంను. బైబిలు చెప్పినవన్నీ సత్యాలేనని నిరూపిస్తాను. బైబిలులో ఒక్క దోషమున్నా బైబిలును విడిచిపెట్టేస్తాను అని స్పష్టంగా ప్రకించియున్నారు.
ఆయనగారు చేసిన ఆ సాహసిక ప్రకటనను, సత్యంపట్ల ఆయనకున్న దృష్టిని ఆనాడే నేనూ ప్రశంసించాను. ఆనాి సభలోనున్న వారిలో పెక్కురూ ఆయనను అభినందించారు.
జరిగినదాన్నంతినీ బ్టి మేమిరువురమూ ఈ విచారణ పూర్తంయ్యేంతవరకూ, పూర్తయ్యాకనూ, 1వ గ్రూపువారిలానే మసలుకోవాలి.
ఏర్పరచుకున్న నియమనిబంధనలను అతిక్రమించరాదు. అందులోనూ 1) విచారణ నుండి అర్థాంతంరంగా విరమించుకోరాదు. 2) అన్యవిషయాలు వ్యక్తిగతాంశాలు ప్రస్తావించరాదు. 3) విషయాలను, వాిపై జరిపిన విచారణను నిర్ణేతలముందుంచి వారి తీర్పులను స్వీకరించాలి.
కానీ, సోంప్రకాష్‌ గార్లిోం గతంలో జడ్జీలకు మేము ఏర్పరచుకున్న నియమనిబంధనలను గురించి వివరించడానికి ఏర్పరచుకున్న సమావేశంలోనూ, మొన్న మార్చి '30'న కమ్యూనిస్టు పార్టీ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన సమావేశంలోనూ దేవసహాయం గారు ఏర్పరచుకున్న నియమాలను ప్టించుకోకుండా, వాిని పలుమార్లు అతిక్రమిస్తూ మ్లాడారు. అందులోనూ కొన్ని ముఖ్యమైనవి ఇవిగో, ఇలాఉన్నాయి.
1. వ్యక్తిగతాంశాలను ప్రస్తావించడం - ఇది రెండు రూపాలలో చేశారాయన.
  ఎ) బైబిలు మీకు ఇసుమంతకూడా అర్ధంకాలేదు.
  బి) బైబిలు మీద అదేపనిగా బురదజల్లేపని మీరు చేశారు.
2. 2వ గ్రూపు విధానం ప్రకారం చర్చకు రాగలరా? రండి, అని అనేకసార్లు రెచ్చగొట్టడం.
  ఎ) నేను బైబిలు సత్యమన్న పక్షాన నిలబడి అవన్నీ సరైనవేనని రుజువుచేస్తాను.
  బి) మీరు బైబిలులో దోషాలున్నాయని రుజువుకు నిలబడతారా?
  సి) ఆ దమ్ము, ధైర్యము మీకున్నాయా? మరందుకు రాగలరా?
3. ఎ) అభౌతిక శక్తులున్నాయని మీరు నిరూపించమంటున్నారు. అవి ఏ మనిషికీ సాధ్యపడవు కదా! అలా అసాధ్యమైన వాిని నిరూపించమనడం తప్పుకదా!
   బి) అభౌతిక శక్తుల జాబితాను తొలగించాలి. వాిని విచారణకు తీసుకోకూడదు.
4. అసలు బైబిలుపై మ్లాడడానికి మీకెవరిచ్చారండీ అధికారం. మీకా అధికారం లేదు, అర్హతా లేదు.
5. నియమనిబంధనావళిలో కొన్ని సవరణలు చేసుకోవాలి. అలా చేసుకోవచ్చని, ఒప్పందపత్రంలోనే చివరిలో ముఖ్యగమనిక అన్నదానిలో చెప్పబడి ఉంది.
6. మీరు ఏదో వంకన విచారణ జరగకుండా చేయాలనుకుంటున్నట్లుగా ఉంది సురేంద్ర గారూ, అవునా?
ఏర్పరచుకున్న నియమావళిని అతిక్రమిస్తూ ఇలా 5, 6 అంశాలలో దేవసహాయం గారు అనేకసార్లు మ్లాడేస్తూ వచ్చారు.
నావరకు నేను, ఆయన, వ్యక్తిగతాంశాలను ప్రస్తావించినప్పుడూ, రెండో గ్రూపు పద్ధతిన చర్చకు రమ్మని ఆవేశంగా మ్లాడినప్పుడూ, బైబిలు మీకేమీ తెలియదంటూ తీసేసి మ్లాడినప్పుడూ, చర్చజరగకుండా తప్పించుకోవాలని చూస్తున్నారా? అని అసత్యారోపణ చేసినప్పుడూ, ఇలా ఆయన పద్ధతిని విడిచిప్టిెన ప్రతిసారీ, నేను, మనం ఏర్పరచుకున్న నియమాలను విడచి ఏ పనికీ సిద్ధంకానని చెప్పాను. సమావేశంలో ఉన్న అందరినీ ఉద్దేశించి, ఆయన నియమాలనతిక్రమించి, అన్యవిషయాలను లేవనెత్తుతుంటే ఒక్కరూ అదేమినరేమని అడిగాను. అధ్యక్షస్థానంలో ఉన్న మణికుమార్‌ గారినైతే మాిమాికీ, దేవసహాయం గారు అనకూడని మాటలంటున్నారు. వారిని నియంత్రించండి. ఆ మాటలను ఉపసంహరించుకోమనండని హెచ్చరిస్తూ వచ్చాను.
ఒకి రెండు సార్లైతే, నియమాలను ఉల్లంఘించిన విషయాన్ని దేవసహాయంగారే అంగీకరించినట్లు నిర్ధారణయ్యే మాటలు ఆయనే పలికారు. అవేమంటే; నియమ నిబంధనలను పాించాల్సింది రేపి విచారణ వేదికలో మాత్రమే. ఈ సమావేశాలలో కాదు అని దేవసహాయం గారే అనేశారు. అంటే ఈ సమావేశాలలో ఆ నియమాలను పాించకపోవడం తప్పుకాదని అంటున్నట్లే కదా.
నిజానికి, మేమంతా మార్చి '30' సమావేశం, ప్రధానమైన విచారణ వేదిక కొరకు అనుకునే హాజరైనాము. విచారణకు ఒక్కరోజు సరిపోకపోవచ్చు కనుక 29, 30 రెండు రోజులు పెట్టుకొంటే బాగుంటుందని ముందుగానే వారి దృష్టికి తెచ్చాము. మొద్లో వారి అధికార ప్రతినిధిగారు దేవసహాయం గారిని కనుక్కొని చెబుతానని చెప్పి, అలాగే రెండు రోజులు పెట్టుకుందాం అని అంగీకారాన్ని తెలిపారు. దానిననుసరించే మా పక్షం నుండి సమావేశానికి రావలసిన వారందరం 29, 30 తేదీలు తిరుపతిలో ఉండడానికి వీలుగా రైల్వే రిజర్వేషన్లు చేసేసుకున్నాం కూడా. నిర్ణేత పక్షానికీ ఈ సమాచారం అందించాల్సిందిగా సోం ప్రకాష్‌ గారికి తెలియజేశాము. దానిననుసరించే ఆయనా, మాకు తిరుపతి విష్ణు నివాసములో రూములు ఏర్పాటుచేసి వుంచారు. ఇదంతా అయ్యాక, దేవసహాయం గారి ప్రతినిధుల నుండి '29'న వారికి వేరే పనులున్నాయని, కనుక 29న రావడం కుదరదని, '30'న ఒక్కరోజు మాత్రమే సమావేశమని మాకు కబురందింది. చేసేదేమీ లేకపోవడంతో, ఆ ఒక్కరోజైనా వీలైనంత ఎక్కువ సమయం విచారణలో కూర్చోగలిగితే బాగుంటుందనీ, కనుక '9' గంటలకల్లా ఆరంభించుకుందామని వారికి తెలియజేశాము.
అనుకోని అవాంతరం
నిర్ణేతల పక్షంలో పాలుపంచుకోవలసిన విశ్రాంత న్యాయమూర్తి గురప్ప గారి, సమీప బంధువులలో ఎవరొ ఒకరు 29 నాడు హత్యచేయబడ్డారు. కనుక '30' సమావేశానికి సకాలంలో నేను రాలేకపోవచ్చు. వీలయినంత త్వరలో రావడానికి యత్నిస్తాను అని గురప్పగారి నుండి సోంప్రకాష్‌ గారికి ఆ రోజు ఉదయం కబురందింది. ఇక ఆ రోజు విచారణ వేదిక సమావేశం దాదాపు జరక్కపోవచ్చు అన్న అంచనాకు నేను వచ్చేశాను. అయినా మిగిలిన ఇద్దరు నిర్ణేతలు వస్తే ఇరుపక్షాలూ అంగీకరిస్తే డా|| బ్రహ్మారెడ్డి గారిని మూడో నిర్ణేతగా కూర్చోబెట్టుకుంటే ఎలాఉంటుందని అప్పికి అక్కడున్నవారితో అన్నాను. మీ ఇరుపక్షాలూ అంగీకరిస్తే బాగానే ఉంటుంది అన్నారు వాళ్ళున్నూ.
సమయం పదిన్నర అయింది. దేవసహాయం గారి బృందం రాలేదు. నిర్ణేతల పక్షంలో రావలసిన విశ్రాంత న్యాయమూర్తులూ అప్పికి రాలేదు. 11 గంటలు దాక దేవసహాయంగారు, వారి బృందమూ వచ్చారు. వారే నిర్ణేతల పక్షంలోని దాసప్ప గారినీ తోడ్కొని వచ్చారు. మరో న్యాయమూర్తి రాలేదు. రాగలనో లేదో చెప్పలేను, అనుకోని పనులు వచ్చిపడ్డాయని కబురు చేశారు.
ఇహనేం! సమావేశం జరగదని తేలిపోయినట్లే. ఏమిచేద్దామంటే ఏమిచేద్దామనుకున్న తరుణంలో మల్లెం దేవసహాయంగారో బాంబు పేల్చారు. అసలీ సమావేశం విచారణకొరకు ఉద్దేశించింది కాదు. గత సమావేశంలోనే, నేను లేవనెత్తిన అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు కదా! వాిని తేల్చుకోకుండా విచారణ ఎలా మొదలెడతాము? అభౌతికాంశాలను మినహాయించే, విచారణీయాంశాలుండాలి. అంతవరకే విచారణ జరగాలి. దానికి మీకంగీకారమైతేనే విచారణ, అని అన్నారాయన.
ఆ బృందం తప్ప, మిగిలిన వారందరికీ, ఇది ఊహించని సంఘటనే. వారి వెంట వచ్చిన న్యాయమూర్తి దాసప్పగారూ మా వైపు నుండి వచ్చిన డా|| బ్రహ్మారెడ్డి గారు కూడా ఇది ప్రధాన విచారణ కొరకు పెట్టుకున్న సమావేశమేనని తాము అనుకున్నట్లు స్పష్టంగా చెప్పారు. ఇదంతా మీకు అసమంజసంగా ఉందనిపించినా, న్యాయమూర్తులిరువురు లేరుగనుక, ఈరోజు విచారణ ఎలాగూ సాగదు కనుక, ఆ తేల్చుకోవలసిన అంశాలపై మ్లాడుకుంటే ఈసారి సమావేశానికి ఏ అభ్యంతరాలు ఉండవుకదా అనుకొని, సందర్భాంశాన్ని చర్చకు పెట్టుకుందామనుకున్నాం.
విచారణ విషయంలో దేవసహాయం గారు లేవనెత్తిన అభ్యంతరం
అభౌతికాంశాలను విచారణకు తీసుకోవద్దు. వాిని ప్రపంచంలో ఎవరూ రుజువుచేయలేరు. కనుక ముందుగా మనమిరువురమే అలాిం అంశాలను గుర్తించి వాిని విడచి మిగిలిన అంశాలనే విచారణకు తీసుకోవాలి.
దానిపై నేను వెలిబుచ్చిన అభిప్రాయం.
అలా అయితే బైబిలుపై విచారణే సజావుగా చేసినట్లు కాదుగదా! కనుక వాిని కూడా వేదికలో ప్రస్తావించాల్సిందే. వాిపై అవి అభౌతికాంశాలు గనుక నిరూపించటం కుదరదు అని ప్రకించండి. దానిపై న్యాయనిర్ణేతలు మీ అభిప్రాయం ఏమిటని నన్నడుగుతారు. అది వాస్తవమే. అభౌతికాంశాలు అనిర్ధారితాల జాబితాలో చేర్చాల్సిందేనంటూ నా సమ్మతిని తెలుపుతాను. అప్పుడు నిర్ణేతల పక్షం ఇరుపక్షాలు చెప్పినదాన్ని బ్టి అి్టవాిని అనిర్ధారితాంశాలుగా తీర్పునిస్తారు.
ఎందుకంటే, బైబిలు చెప్పినవన్నీ ఎంపిక చేసుకున్న అంశాలు. క్రమముననుసరించి విచారణకు లోనుచేయాల్సిందే కనుకనూ, అది సత్యమా? అసత్యమా? అనిర్థారితమా? అని నిర్ణయించాల్సింది మనం కాదుగనుకనూ, నిర్ణేతల పక్షమే గనుకనూ అని నా పక్షాన్ని వినిపించాను.
దానికి దేవసహాయం గారు, ససేమిరా! అంగీకరించలేదు. అనిర్ధారితాంశాలని విచారించి వేదికే తీర్మానం చేస్తే, అది మా సంస్థ ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందికరంగా తయారవుతుంది అని, దానికి మేమంగీకరించము అని పట్టుబ్టారు. లోకంలో ఎవ్వరూ రుజువుచేయలేని వాిని రుజువుచేయమాంరేమిటని నన్ను ఆక్షేపించారు.
అి్ట వాిని రుజువుచేయమని నేననడం లేదు. పైగా అభౌతికాంశాలు అనిర్ధారితాలని గత '30' ఏండ్లుగా నేను చెబుతూ వస్తున్నాను, అని నేను స్పష్టంగా చెప్పాను. మనం ఏర్పరచుకున్న నియమావళిననుసరించి బైబిలులో ఎంపికచేసుకున్న విషయాలన్నింని, 274 ప్రశ్నలతో మొదల్టెి ఒక క్రమంలో విచారణ పూర్తిచేసి, అప్పుడు చెప్పాలి. అవి ఒప్పులో, తప్పులో, అనిర్ధారితాలో అన్నది, అని నేను గ్టిగా చెప్పాను.
మా వాదన చాలాసేపు ఎటూ తేలకపోవటంతో న్యాయమూర్తి దాసప్పగారు మీరిరువురూ వింనంటే నేనొక సూచనచేస్తానన్నారు. చెప్పండన్నాను నేను.
ఈ అంశాన్ని నిర్ణేతల నిర్ణయానికి వదిలెయ్యండి. మేము ముగ్గురం కలసి ఆలోచించుకొని, అభౌతికాంశాలను విచారించి అనిర్ధారితాలుగా నిర్ణయించడం సరైందో, ముందే వాిని విచారణీయాంశాల జాబితా నుండి తొలగించి, మిగిలిన అంశాల వరకే విచారించడం సరైందో నిర్ణయం చేస్తాము. అి్ట మా నిర్ణయాన్ని మీ రిరువురూ అంగీకరించి తీరాలి అని సూచించారు.
దేవసహాయం గారు, వాిని విచారణకు తీసుకొనే కూడదు అని పట్టుబ్టి కూర్చోనుండడంతో, నేను ఆలోచించుకొని, విచారణ జరిగితీరాల్సిందే అన్న దృష్టితో, దాసప్ప గారితో, నేనొక మెట్టు దిగి మీ సూచనను అంగీకరిస్తున్నాను. నిజానికి మా ఒప్పందం ప్రకారమైతే అన్ని అంశాలూ విచారణకు పెట్టే నిర్ణయాలకు రావలసి ఉంది అని చెప్పాను.
దానికీ దేవసహాయం గారు అంగీకరించలేదు. పైగా ఒక థలో ఏ అంశాలు విచారించాలో, ఏది విచారించక్కరలేదో నిర్ణయించాల్సింది మేమే గాని, నిర్ణేతల పక్షం వారు కాదు. అందులో మీ ప్రమేయం అనవసరం అనేశారు. దాసప్పగారూ మౌనంగా ఉండిపోయారు.
ఈ థలో బ్రహ్మారెడ్డి గారు మాత్రం ఒకి రెండు సార్లు దేవసహాయం గారి మాటలు ఇరువురూ కలసి రూపొందించుకొన్న ఒప్పందంలోని నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి కదా అని సూచించారు. ఎవరేమి చెప్పినా దేవసహాయం గారు మాత్రం, తాము చెప్పిందానికి అంగీకరిస్తేనే విచారణ ప్రక్రియ ఆరంభమవుతుంది. లేకుంటే లేదు అన్న దగ్గరకు వచ్చేశారు.
నేను చాలాసేపు ఆలోచించుకొని, మరో మెట్టు దిగి ఒక సూచన చేస్తున్నాను. దేవసహాయంగారు చెప్పినట్లే అభౌతికాంశాలను ప్రక్కన ప్టోలన్నా ముందుగా 'అభౌతికం' అంటే ఏమిో ఇరుపక్షాలూ, వేదిక ఖరారు చేసుకోవాలి కదా? ఇది జరక్కపోతే రేపు మళ్లా అభౌతికాంశాల క్రిందికి ఏవి వస్తాయి? ఏవి రావు అన్న విషయంలో వివాదం ఏర్పడుతుంది. కనుక 'అభౌతికం' అంటే మీరేమనుకుంటున్నారో ప్రకించండి. నేనూ ప్రకిస్తాను. ఆ విషయంలో ఒక సరైన నిర్ణయానికి వచ్చి, ఆ కొలతననుసరించి కొన్ని అంశాలను విచారణాంశాల జాబితా నుంచి మినహాయించుకోవచ్చు అన్న సూచన చేశాను.
దేవసహాయం గారు, 'కింకి కనిపించనిది, అదృశ్యరూపమైనది ఏదో దానిని అభౌతికం' అంారని చెప్పారు. మీరు చెప్పదలచింది వ్రాతరూపంలో కాగితంపైన పెట్టండి. నేనూ అలానే వ్రాస్తాను అని చెప్పాను. ఇరువురమూ వ్రాశాము. వాిని నిర్ణేతలకిచ్చి ఎవరు చెప్పింది సరిగా ఉందో నిర్ణయించమని అడగాలనుకున్నాం. ఈ విషయంలో అవసరమైతే భాషావేత్తలనూ సంప్రదించవచ్చు అనుకున్నాం.
ముగింపు
మార్చి 30 నాి సమావేశంలో చివరాఖరుకు క్రింది నిర్ణయాలకు వచ్చాము.
1. మలి సమావేశం జూన్‌ 18న విజయవాడలో జరుపుకోవాలి.
2. సమావేశం అయిన వెంటనే, అభౌతికానికి ఇరువురం అంగీకరించుకున్న అర్ధాన్ని బ్టి అభౌతికాంశాలను గుర్తించి అవి రుజువు చేయలేనివి గనుక మినహాయించాలి.
3. మిగిలిన అంశాలపై విచారణ సాగించి సత్యాసత్యాలను కనుగొనాలి.
4. ఈ లోపునే 'అభౌతికం' అంటే ఏమిో దేవసహాయం గారు తెలుసుకొని మాకు తెలియజేయాలి.
5. విచారణ వేదికలో శ్రోతలు - వీక్షకులు, ఎక్కువ మంది ఉండరాదు. ఎంపిక చేసుకున్న కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.
6. జరిగేదాన్నంతినీ రికార్డు చేసుకోవచ్చు. కావాలనుకుంటే 'లైవ్‌ టెలికాస్ట్‌' చేసుకోవచ్చు.
గమనిక : మా వివాదాన్ని గురించి తెలిసిన వారెందరో ఏమైంది? ఏమైందంటూ అడుగుతుండటంతో జరిగిందాన్ని క్లుప్తంగా వివరించానిక్కడ, గమనించగలరు.
ఒక సంతోషకరమైన వార్త
సత్యాన్వేషణాతత్పరులైన వారంతా సంతోషించదగిన ఒక వార్త పాఠకులందరికీ, ముఖ్యంగా మండలి సభ్యులందరకు తెలియజేస్తున్నాను. సుమారు థాబ్దకాలం పైబడి నాతోను, మండలి సభ్యులతోను మిత్రులుగా కొనసాగుతూ వస్తున్న ప్రాతూరు రాధాకృష్ణగారు మొన్న ఏప్రిల్‌ 13న మండలి త్రైమాసిక సమావేశాలలో ఒక సాహసికమైన, సంతోషకరమైన బహిరంగ ప్రకటన చేశారు.
ఆయనగారు, దయానంద సరస్వతి ప్రవచిత ఆర్యసమాజ - వైదిక - సిద్ధాంతం సరైందన్న దృఢాభిప్రాయంతో కొనసాగుతూ వస్తున్నారు. అయినా నాతో పరిచయం అయిన దగ్గర నుండి మండలికి చెందిన ప్రమాణ విద్యను తెలుసుకొనే, నేర్చుకొనే పనిని, వివిధ తాత్విక ధోరణులను తులనాత్మక విచారణ చేసే పద్ధతినీ అభ్యాసం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో నాకూ, వారికీ మధ్య పలుమార్లు, ఆర్యసమాజ సిద్ధాంతాన్ని మండలి విధానాన్ననుసరించి విచారణకు లోనుచేయాల్సి ఉందన్న మాటలు జరుగుతూ ఉండేవి. ఆయనగారూ, ఆ అవసరం ఉందిగాని, అందుకుగాను నేను మరికొంత వాదనైపుణ్యాన్ని సమకూర్చుకోవలసి ఉంది, అంటూ అంటుండేవారు. నేను అప్పుడప్పుడూ వారిని మరికొంత వత్తిడిపెడుతూ, సత్యాన్వేషిగా ఉండడం, సత్యస్థాపనోద్ధతి కలిగి ఉండడం ఒక ప్టాన అయ్యేపని కాదని, దానికి చాలా తెగువ ఉండాలని అంటుండే వాణ్ణి. ఆ నా వత్తిడిని ఎంతో సహనంతో భరిస్తూనే క్రమంగా వైదిక సిద్ధాంతంపై నాతో విచారణకు మానసికంగా తయారవుతూ వచ్చారు. ఆ సంసిద్ధతే మొన్న ఆయనగారిచేత అలా బహిరంగ ప్రకటన చేయించగలిగింది. ఆయనగారి ప్రకటన సారాంశమిది.
1. ఆర్యసమాజ సిద్ధాంతపక్షాన సురేంద్రతో సత్యాసత్య విచారణకు నేను సిద్ధపడుతున్నాను.
2. విచారణకు పెట్టడానికి ఇప్పికీ కష్టమనుకున్న కొన్ని అంశాలను ప్రస్తుతానికి ప్రక్కనుంచి విచారణకు పెట్టగల అంశాలలో విచారణను ప్రారంభించుకుందాం.
3. రెండునెలలలోపు ఒక తేదీని ఖరారు చేసుకొని విచారణ మొదలెట్టుకుందాం.
4. ఏఏ అంశాలపై చర్చించాలన్నది సుస్పష్టంగా ప్రకించకపోయినా, స్పష్టాస్పష్టంగా కొంత వివరించారు.
ఎ) దయానందుని ప్రమాణాలపై విచారణ.
బి) భౌతికాంశాల సంబంధంగా, పంచభూతాల విషయం, యజ్ఞం - దాని ప్రయోజనం.
5. విచారణ ప్రక్రియంతా నియమనిబంధనలననుసరించి జరగాలి. నిర్ణేతలనూ ఎంచుకోవాలి.
వారి ప్రకటనపై నా స్పందన
మిత్రులు రాధాకృష్ణ గారికి, అభినందనలు మిత్రమా!
చాలా సమయం తీసుకున్నా సరైన నిర్ణయానికి వచ్చినందుకూ, సత్యాన్ని స్వీకరించానికీ, అసత్యాన్ని విసర్జించానికీ సర్వదా సంసిద్ధంగా ఉండాలన్న దయానందుల వారి మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ఒక నిజాయితీగల ఆర్య సామాజికునిగా ప్రవర్తించినందుకూ మీకు నా అభినందనలు. మీరన్నట్లే ఎక్కడో ఒకచోట మొదల్టెి సత్యాసత్య విచారణ సాగించుదాం.
మనం 1వ గ్రూపుకు చెందిన వాళ్లంగా ప్రవర్తించగల మానసిక సన్నిద్ధత ఉన్నవాళ్లమే గనుకనూ, చర్చావేదిక నియమనిబంధనల విషయమై దాదాపు ఏకాభిప్రాయం కలిగిఉన్నవాళ్లమే గనుకనూ, విచారణ ప్రక్రియలో అవాంతరాలకు అంతగా తావుండకపోవచ్చు. మన ఈ ప్రయత్నం మన పరిచయస్తులలోని మరికొందరు సత్యస్థాప నోద్దతులకూ ప్రేరణ కల్గించాలని ఆశిద్దాం. కనుక ఏ రకంగా చూసినా ఇది అభిలషణీయమే.
మరోమాట
మీరు నాకు  పరిచయం అయ్యేనాికే మీతో మిత్రులుగా ఉంటూ ఉన్న క్రైస్తవ, ఇస్లాం, హైందవ పక్షాలకు చెందిన వారిలోనూ ఇలాి కదలిక వస్తే బాగుంటుంది. ముఖ్యంగా మణికుమార్‌ మాస్టారు, ముస్తాక్‌ గారు కూడా వారు వారు స్వీకరించి అనుసరిస్తున్న బైబిలు, ఖురాను సిద్ధాంతాలపై సత్యాసత్య విచారణకు సిద్ధపడాలన్నది నా అభిలాష.
చిన్న జీవితాలు మనవి. ఉన్నన్నాళ్లు ఉండబోము. నలుగురూ బాగుండాలన్న పెద్దల మనస్సును అంతో ఇంతో అర్ధం చేసుకొని, ఇష్టపడుతున్న వాళ్లంగానే ఉన్నవాళ్లం మనం. సత్యాన్ని కనుగొని, దానిని స్వీకరించి, సమాజానికీ అందించటం వల్ల పోయేదేమీ ఉండదు అజ్ఞానం తప్ప.
కనుక, మీరు చూపిన ఈ చొరవను ఆసరా చేసుకొని వారిరువురకూ, అదే స్వభావం కల వివిధ థోరణులకు చెందిన మిత్రులు, పరిచయస్తులకూ ఈ ముఖంగా ఒక బహిరంగ ఆహ్వానం పలుకుతున్నాను.
రండి! నిజాయితీగల సత్యాన్వేషులముగా కలసి కూర్చొని మనం మన సిద్ధాంతాలను ఒక్కొక్కిగా విచారణకు లోనుచేసి, తేలిన విషయాలను అందరమూ స్వీకరించి, సమాజానికి అందించే పని చేస్తూ జీవితాలను సాగించుదాము. మీ అందరికీ మరోసారి మండలి సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది. రండి! సత్యాన్ని ఆవిష్కరించుకొని, స్వీకరించి, ఆచరించుకొందాం రండి. అందరం వివేకపథికులం కావాలన్నదే నా ఆకాంక్ష.
నా యీ ప్రకటన సమాజంలో ఈనాికీ మనుగడలో ఉన్న అన్ని ధోరణులకు సమానంగా వర్తిస్తుంది. జ్ఞానక్షేత్రమంతికీ ఆయువు పట్టైన సత్యావిష్కరణ లక్ష్యంగా శ్రమించుదాం రండి.

ఇంతకూ బైబిల్‌ ఏమిచెబుతోంది - 5

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!
ఈ శీర్షిక ఎంత కీలకమైనదో, ఎంత మౌలికమైనదో, ఎంత గంభీరమైనదో మొదట గమనించండి. ఎంచుకున్న సందర్భాన్ని బ్టి 'బైబిలు' అన్న పదం వాడానే గాని, ఈ శీర్షిక అంశం నిజానికి ప్రతి సిద్ధాంత అధ్యయనంలోనూ, విచారణలోనూ ప్రధానాంశంగానే ఉంటుంది. ఏదైనా ఒక సిద్ధాంత  భావజాలాన్ని శాస్త్రీయ విచారణకు లోనుచేయాలంటే, మొట్టమొదట సుస్ఫష్టంగా నిర్ధారణ కావలసింది, ఇంతకూ ఆ విషయంలో ఆ సిద్ధాంతం ఏమి చెబుతోందన్నదే. అవునా? కాదా? ఎందుకంటే, ఏమిచెబుతున్నదో తేలకుంటే దేనిని విచారణకు లోనుచేయాలన్నదే ఖరారు కాదుకదా. కనుకనే, విచారణ నియమాలలో దీనికి సంబంధించిన నియమం ఒకి ఏర్పడింది.
నియమం : వక్త హృదయం ఇదేనని నిర్ధారణ అయినాకనే దాని సబబు బేసబబుల గురించి ఆలోచించాలి. దీనినే మనం ఆ సిద్ధాంత ప్రతిపాదన లేదా ప్రకితాభిప్రాయము అనంటున్నాం. తార్కికంగా దీనిని 'ప్రతిజ్ఞ' అంారు. 'వాదము' అనీ అనవచ్చు. ప్రకించాలనుకున్న దానిలో ఎటువిం సందిగ్దతకూ చోటుండకూడదు. అభిప్రాయప్రకటన నిర్ధిష్ట రూపంలో ఉండాలి. అప్పుడు కూడా, ఆ సిద్ధాంత పక్షం వారు చెప్పిన వాక్యార్ధం ఇదేనని ఇదమిద్దంగా ఖరారు చేసుకున్నాకనే, విచారణ మొదల్టెాలి.

Monday, October 1, 2018

ఇంతకూ బైబిలు ఏమి చెపుతోంది? - 2


ఇంతకూ బైబిలు ఏమి చెపుతోంది? - 2
యోచనాశీలురైన పాఠక మిత్రులారా! గత మాసం ఈ శీర్షికను ఆరంభించుకున్నాం. బైబిలు గోల మనకెందుకులే అనుకునే వారికి ఇలాంటి కూలంకుష, తులనాత్మక పరిశీలనకు సమయాన్ని వెచ్చించడానికి అంతగా ఇష్టముండదు. జ్ఞానార్జన విషయంలో ఉండవలసినంత శ్రద్దా, అవసరమైనంత శ్రమకు సిద్దపడగలిగి వుండడమూ అన్న రెండూ అరుదుగా లేదా చాలా బలహీనంగా వుంటున్న నేటి తరుణంలో ఈ రకమైన, ఎంతో ఓపికతో శ్రమించాల్సిన ఈరీతి అధ్యయనానికి మీలో ఎంతమంది సిద్దపడతారన్నది అనుమానమే. అయినా ఈ వ్యాస సంపుటి, ఒక దస్తావేజు (డాక్యుమెంటు)గా వుండి, ఈనాడు, రేపు కూడా బైబిలుపై తులనాత్మక అధ్యయనం చేయగోరేవారికి, ఎంతో కొంత సహాయకారిగా, మార్గదర్శిగా ఉండగలదన్న శుభచింతనతోనే దీనిని మొదల్టెాను. దీనివల్ల నాకూ ఒకింత వ్యక్తిగత ప్రయోజనం లేకపోలేదు. ఈ రచన కోసం మరొక్కసారి నేను, బైబిలులోని ఎంచుకున్న అంశాల వరకైనా, వచనం, వచనం చదవాల్సి వచ్చింది గనుక ఆమేరకు స్పష్టత పెరుగుతుంది. మొత్తం బైబిలును చదివి 15, 20 ఏండ్లైంది. నాకిది పునశ్చరణగా ఉపయోగపడుతోంది. మరొక్కమాట!

Friday, December 15, 2017

క్రైస్తవ మత ప్రచారకుడు విజయకుమార్‌కు సూచన


  మొన్నటి జై భారత్‌ కార్యాలయంలో మనం కలసినప్పుడు తీసిన వీడియో రికార్డింగు ఆధారంగా, దానిలో మీరు మాట్లాడిన, నేను మాట్లాడిన అంశాలకు పరిమితమై విచారణకు కూచుందాము. అందులో ఎవరి పక్షంలో అపసవ్యతుంటే, దుందుడుకుతనం ఉంటే వారం లెంపలేసుకుని, క్షమాపణ చెపుతూ ఒక ప్రకటన విడుదల చేద్దాం. ఇలాటి వివాదాల విషయంలో ఎప్పుడు ఎవరు విచారణకు - చర్చకు - సిద్దపడ్డా అందులో అందరూ పాటించాల్సిన మొట్టమొదటి నియమం అనుకున్న విషయానికి పరిమితమైయ్యే మాట్లాడాలి. అన్యవిషయాలు మాట్లాడనే కూడదు అన్నదేకనక ఆ సమావేశంలో మన ఇరుపక్షాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ హద్దులు దాటి మాట్లాడారో చూద్దాం. సమావేశం ఏర్పరచిందే, కరుణాకర్‌ రాసిన ''బైబిలు దేవుని నిజస్వరూప స్వభావాలు'' అన్న పుస్తకం పై చర్చకు నియమనిబంధనలు ఏర్పరచుకుని ఒప్పంద పత్రం రాసుకోడం కొరకు. ఇప్పుడు మనం ఆనాటి వీడియోను పరీక్షించేది 1. పై విషయంపై ఎవరేమి మాట్లాడిందీ తిరిగి చూసుకోడానికీ, అన్య విషయ ప్రస్తావన లెవరు చేసిందీ తేల్చుకోడానికీ, మాట్లాడినంతలో ఎవరు ప్రస్తావించిన అంశాలు సబబుగా ఉన్నాయో సరిచూసుకోడానికి. దీనిపై అనవసరపు మాటలు మాట్లాడకుండా వీడియో పరిశీలించడానికి సిద్దపడండి. నేను ఈ రోజు నుండి సిద్దంగా ఉంటాను. ఒక్కమాట! సమంజసమైన ఏ షరతుకైనా కరుణాకర్‌ని సిద్దం కమ్మని చెపుతాను. మీరుగానీ అతణ్ణికాదని, నాతోనే మాట్లాడతాననేట్లైతే, అందుకూ నాకభ్యంతరం లేదు. ఇకపోతే! ఆనాటి సమావేశానంతరం, హైద్రాబాదు కొత్తపేటలో ననుకుంటా, మీ బృందం ఏర్పరిచిన వేదికపై నుండి మీరు మాట్లాడిన దాన్నంతా విచారణకు తీసుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. ప్రగల్భాలు ఎవరు మాట్లాడినా అట్టి వారిని పిట్టలదొర అనో, ఉత్తరకుమారుడనో అనడం తెలుగు ప్రాంతంలో ఆనవాయితీ. మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నేను ఇంకా కొంత మాట్లాడవలసిఉన్నా, నేనేదో అనడం, మీరేదో అనడం ఇదంతా మాటల మనుషులు చేసే కాలహరణ ప్రక్రియే. కనుక పై రెండు సందర్భాలకు చెందిన సంభాషణలపైనే విచారణకు కూర్చుందాం. దాన్నంతానూ రికార్డు చేద్దాం. చర్చలో మీరూ- నేను మాత్రమే మాట్లాడాలి. మీతోపాటు 4,5 గురు ఉండవచ్చు. నా వెంటా అంతే మంది ఉంటారు. వారెవరూ మాట్లాడకూడదు. వాస్తవాలను ఇష్టపడే స్వభావం నాకుంది. అది మీకూ ఉంటే ఈ సమావేశానికి సిద్ద కాకుండే అవకాశమేలేదు. సమావేశం విజయవాడలోనైనా, హైద్రాబాదులోనైనా అయితే బాగుంటుంది. మీ ప్రతిస్పందనగా వివేకపధానికి లేఖ రాసినా పరవాలేదు. నాకు వ్యక్తిగతంగా తెలియజేసినా సరే. మీ వీడియో రికార్డింగు రూపంలో ప్రకటించినా సరే. లుచ్చాల కంటెనూ హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు బచ్చాగాండ్లు : ఇలాటి భాష మాట్లాడడానికి ప్రజ్ఞలేమీ అవసరంలేదు. బుద్దిహీనతుంటే చాలు. విజయకుమార్‌ మరియు విజయప్రసాద్‌రెడ్డి గార్లకు, అయ్యలారా! మన తెలుగులో ''పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ'' అనీ; సంస్కృతంలోనైతే ''మహాగజాః పలాయంతే మశకానాంతుకాగతిః'' అనీ రెండు నానుడులున్నాయి. మీకు అవి వర్తిస్తాయో లేదో గాని, మీ మందలోని కొందరికి మాత్రం అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. మొన్నామధ్య ఒకరోజు కరుణాకర్‌ ఒక ఫోన్‌కాల్‌ వాయిస్‌ రికార్డు వినిపించాడు. అందులో ఒకడు ''బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు'' అన్న మా పుస్తకాన్నీ, కరుణాకర్‌ చేస్తున్న ప్రసంగాలను ప్రస్తావించి, ఆపై తిట్ల పురాణం లంకించుకున్నాడు. పెంటనోట్లో పెట్టుకుని అతడు మాట్లాడిన అశుద్ధాన్నంతా ఇక్కడ రాయడం కుదరదు. నీ అమ్మ, నీ అక్క, నీ పెళ్ళాం అంటూ సాగిందా సంధి ప్రేలాపన. మీ చెవిదాకా అది వచ్చిందో లేదోగాని, మీ మందలోనే ఉన్న అలాటి మతిచెడిన వాళ్ళ విషయంలో మీ నిజాయితీ, నిస్పాక్షికతతో కూడిన నియంత్రణ ఎలా ఉంటుందో మీరే ప్రకటిస్తే మంచిది. బౌద్ద సాహిత్యంలో ఇలాటిదే ఒక సంఘటన గురించిన ప్రస్తావన ఉంది. పైన నేను చెప్పిన లాటి పిచ్చోడొకడు ఒకరోజు బుద్దుణ్ణి నానాదుర్భాషలూ ఆడాడు. అప్పుడు బుద్దుడు ఆ మాటలన్నవాడితోనే శాంతంగానే, మీరు పంపినవి చేరవలసిన వారికిగాక, వేరే వారికి చేరితే, ఆ నిజాన్ని బట్టి అవతలివారు వాటిని ఇవి నాకు సంబంధించినవి కావని తిరస్కరిస్తే అవి ఎవరికి చెందుతాయి అనడిగాడట. అవి పంపినవారికే గదా అన్నాడట. అలా అయితే ఇప్పుడు మీరు పంపినవి నాకు తగినవికావు. కనుక అవి పంపిన వారికి చెందడమే న్యాయం అన్నాడట. బుద్దిలేని వారికిలాటి సుద్దులు అంతుబట్టవుగాని, అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉన్నవాళ్ళకి మాత్రం అన్నవాడికి మాడుపగిలింది అన్న విషయం తేలిగ్గానే అర్ధమవుతుంది. అలాగే, మరో పోస్టింగూ చూశాను కరుణాకర్‌ని ఉద్దేశించిందే. ఏదో ఇతర దేశంలో ఉన్న యువకుని వీడియో ప్రసంగం అది. అతడూ మతిచెడినవాడే. మొదటతానో హిందువునన్నట్లు మాట్లాడి, క్రమంగా ఆ ముసుగు తొలగించి అసలు రూపాన్ని చూపిస్తూ వచ్చాడతడు. ఒక దశలో హద్దులు మీరిన ఆవేశంతో, ఇండియా రాబోతున్నాను. అరే దుర్గుణగా! నిన్ను వదిలిపెట్టను. ఫిజికల్‌గా డామేజ్‌ చేస్తాను. అంటూ తెగ మాట్లాడేశాడు. అతడు మీ వాడో కాదో నాకైతే తెలీదు. అలాగే అక్కడున్నాను ఇక్కడున్నానంటున్న ఆ ఉత్తరకుమారుడు, ఇక్కడే ఎక్కడో సందులు గొందుల్లో ఉంటూ అంత బిల్డప్పు ఇచ్చాడేమో కూడా అన్న సందేహమూ ఉంది నాకైతే. అలాటి ''ఆల్‌బిత్తర్‌' గాండ్ల గురించినేను చెప్పేది ఒక్కటే, దొంగ దెబ్బలు, చాటుమాటు దాడుల బాపతుకాకుంటే, ఒక్కసారి మా ఎదుటబడి, అతడు చేస్తానన్నదీ, చేయగలిగింది చేసేస్తే ఒక పనైపోతుందికదా! ఆ గుంటడు ఈడనే ఉన్నాడనీ కరుణాకర్‌ మిత్రులలో ఎవరో అన్నారని కరుణాకర్‌ నాతో అన్నాడు. ఏడున్నావురా బిడ్డా! ఓసారి ఎదురుపడి చూడరాభడవా! మరో దుండగుడు విషయమూ కొద్దిరోజుల క్రిందటే నాకు తెలిసింది. మిత్రులు జాన్‌రాజ్‌ గారు, తన అవగాహనననుసరించి 1. రంజిత్‌ ఓఫీరుగారి హైందవక్రైస్తవం పోకడ దిక్కుమాలింది క్రైస్తవాన్ని బలహీనపరచేది, నిజమైన క్రైస్తవులూ, బైబిలును పరిశుద్ద గ్రంధంగా నమ్మేవాళ్ళూ ఏమాత్రం అంగీకరించనే అంగీకరించకూడనిది అని విస్పష్టంగా ప్రకటించారు. 2. మరో వంక బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు అన్న పుస్తకంలో బైబిలు దేవునికి మనిషికుండే లక్షణాలన్నీ.. అరిషడ్వర్గాలన్నీ - ఉన్నాయన్న కరుణాకర్‌ మాటలు తనకెంతో అభ్యంతరకరమైనవి కనుక ఆ విషయంలో కరుణాకర్‌తో చర్చకు సిద్దమంటూ తెలియజేశారు. దీన్నంతటినీ గమనిస్తున్న క్రైస్తవపక్షంలోని మతి చెడిన మందలో ఎవరో ఒకరు, కరుణాకర్‌ వాళ్ళతో చర్చకు సిద్దపడవద్దు. మా మాటకాదని పోయావా నిన్ను మర్డర్‌ చేసేస్తాం అని ఆయన్నే బెదిరించారట. ఈ రకం మంద ముందుగా ఏసుని అనుకరిస్తూ ప్రియమైన సోదరుడా! దేవునికి స్తొత్రం ప్రేమతో నేను చెప్పిదేమంటే, నీ పద్దతి మార్చుకోకుంటే అత్యంత కౄరంగా నిన్ను చంపేయబోతున్నాను. లాటి రెండు రకాల మాటలూ మాట్లాడేస్తుంటారు. మొదట మాట పడికట్టుపదం - తరవాతది తన సొంతం అన్నమాట. 
ఈ రకానికంతా నేను చెప్పిదేమంటే! 
బైబిలునో, మరో గ్రంధాన్నో ఆ మూలాగ్రం పరిశీలించుదాం రమ్మంటేనో, మాట్లాడుకుందాం రమ్మంటేనో, అందుకు సిద్దపడక, జ్ఞానం విషయంలో చేయాల్సిన పనినీ, పద్దతినీ విడిచి, భౌతిక దాడులంటూ బెదిరిస్తారేమిటి బుడతలూ! బుద్దున్నవాళ్ళైతే తలతో ఆలోచించేపనీ విచారించే పనీ మాత్రమే చేస్తారు. ఆ సామర్ధ్యం లేనివాళ్ళే, గొర్రెపొటేళ్ళ మాదిరో, దున్నపోతుల మాదిరో తలను ఢీ కొట్టేందుకు మాత్రమే వాడుతుంటారు. అలాటి వారి విషయంలో అవకాశముంటే మాడు పగిలేలా ఒక్కటిచ్చికోవడమో, అవకాశంలేకుంటే ప్రక్కకు తప్పుకోడమో చేస్తారు బుద్దిమంతులు. కనుక మీ మీ స్వభావాలు సామర్ధ్యాల ననుసరించి మీరు చేయదలచింది చేయండి. మేం చేయవలసింది చేస్తాం. ఈ రకమంతా ఎలాగూ గొర్రెల మందేగాని, ఆ మందలకు కాపరులమంటున్న వారికైనా తల ఉండొద్దా? తలగలిగినవాళ్ళు ప్రవర్తించాల్సిన తీరున ప్రవర్తించవద్దా? సిద్దాంత విచారణెక్కడ? సిగ్గెగ్గులు గానీ, సభ్యతా సంస్కారాలుగానిలేని కారుకూతలెక్కడ? రెంటికీ ఏమైనా పొంతన ఉందా? ఓ సభ్యతా సంస్కారాలు లేని, ఏ పెద్దల వద్దా బుద్ది గరవని మంద, స్ధాయిల గురించి తెగవదరుతోన్న పిదప కాలంలో ఉన్నాం మనం. ఓ చర్చావేదిక నియమనిబంధనల గురించి కనీస అవగాహన కూడా లేనివారే ఎక్కువగా చర్చల పేరిట నానా రభసా చేస్తున్న పిదపకాలంలో ఉన్నాం. ఓ విమర్శకు, విచారణకు, సమీకక్షూ, రుజువుకూ, ఖండనకు, నిందకు తేడా తెలియని మంద ఉన్న పిదపకాలంలో ఉన్నాం మనం - ఏం చేద్దాం? సమయం, సందర్భం కొరకు వేచి చూద్దాం 
సత్యాన్వేషణలో - 
మీ సురేంద్ర 

Saturday, August 1, 2015

ఒక ముఖ్య ప్రకటన

2015 జూలై 31, ఆగస్టు 1 తేదీలలో ద్వారకుంటలో ఇస్లాం, క్రైస్తవ, హిందూ, మతేతర ధోరణులనుండి ఒకింత అధ్యయనమూ, అవగాహన కల విజ్ఞులతో కూడిన బృంద చర్చారూపమైన సమావేశం జరిగింది. అందులో 
1. మత ప్రచారాలు, మత మార్పుడులు - మానవ మారణకాండకు దారితీసే ప్రమాదం ఉంది అన్న అంశంపైన.
2. మీ గ్రంథాలలో మీ దేవుడు, మీ ప్రవక్తలు అన్న థోరణి రచనలపైనా చర్చ జరిగింది.
అందులో ఎ) మొది అంశంపై మత మార్పిడులు - మత అసహనానికి, క్రమంగా హింసకూ దారితీస్తాయి. అందుకు ప్రేరణ కలిగించే వాక్యాలు ఆయా మత గ్రంథాలలోనే వున్నాయి. అని ఒక పక్షం - ముఖ్యంగా మేము - సత్యాన్వేషణ మండలి, హిందువుల పక్షం, మతేతరులూ అనగా, ప్రధానంగా అి్ట ఆధారాలు ఖురాన్‌, హదీసులలో ఎక్కడున్నాయో చూపండని ఇస్లాం పక్షంవాళ్ళన్నారు.