Showing posts with label Letters. Show all posts
Showing posts with label Letters. Show all posts

Thursday, October 1, 2015

స్పందన - ప్రతిస్పందన

వివేకపథం 208 సంచిక నుండి ''హేతువాద సంఘంకు సత్యాన్వేషణ మండలికి మధ్య'' శీర్షిక క్రింద శ్రీ యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు రాస్తున్న శీర్షికపై స్పందనలను ఆహ్వానిస్తున్నాము. స్పందనలు సూిగా, సంక్షిప్తంగా, విషయపరంగా రాస్తే మంచిది. ఆ విషయంపైనే కాక హేతువాదంపైన పత్రికలో వస్తున్న విషయాలపై మీ స్పందనలను వివేకపథంలో ఆహ్వానిస్తున్నాం.

మిత్రులు కె.బాబూరాజేంద్ర ప్రసాద్‌ గారు తమ స్పందనగా సుదీర్ఘ  లేఖ వ్రాశారు. స్థలాభావం వలన పూర్తి లేఖను గాక వారి అనుమతితో దానిలోని ముఖ్యాంశాల వరకు ప్రచురిస్తూ దానిపైన జగన్‌ ప్రతిస్పందనను ప్రచురిస్తున్నాము  - ఎడిటర్‌

కె.బి.ఆర్‌.ప్రసాద్‌ గారి లేఖ సారాంశము :
1.  వెంకాద్రి గారి భావాలను విమర్శించటంలో సురేంద్రగారికి మిత్రభావనే తప్ప అన్యభావన లేదు. కేవలం సమాజంలోకి తప్పుభావాలు ప్రచారం కాకూడదనే అభిప్రాయం తప్ప.
2.  హేతువాద సంఘం కోరకుండానే మళ్ళీ మళ్ళీ వారిసిద్ధాంతాన్ని విమర్శించడం వారి కోపానికి కారణం. 
3.  సురేంద్రబాబు గారితో సంబంధంలోకి రావడానికి హేతువాద సంఘం వారికి ఇష్టంలేదు. రావిపూడి వారి రచనల్లో చిన్న లోపాలున్నా వాివల్ల నష్టంజరిగే అవకాశం లేదు అనేభావన వారికి ఉందని నేననుకుంటున్నాను.
4.  రచనలు, అవి ఎవరిని ఉద్దేశించి, ఎవరికోసం రాయబడినవో వారి స్థాయికి తగ్గట్లు ఉండాలి.
5.  రావిపూడి  వారి రచనల్లో దోషాలు చూపించగలిగే సామర్ధ్యం ఒక్క సురేంద్రబాబుకే తప్ప ఇతరుల్లో కనపడ్డంలేదు. అలా విమర్శించే స్థాయి అందరికీ సాధ్యం కాదు. అందరికీ అవసరమూ లేదు. రావిపూడివారి రచనలు సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే స్థాయిలో ఉంటున్నాయి.
6.  మండలి సభ్యులలో ఎవరూ కూడా సురేంద్రగారి ప్రమేయం లేకుండా ఏ ఒక్క విషయంపైనైనా 20 మందికి క్లాస్‌ చెప్పలేరు. సురేంద్రబాబుగారికి ఉన్నంత స్థాయి అందరికీ రాదు. అవగాహనల్లో తేడాలుాంయి మరి.
7.  తమతో హేతువాద సంఘానికున్న భేదాలను సురేంద్రగారు ఎత్తిచూపినా వాిని పరిశీలించడానికి కూడా ముందుకు రావడానికి హేతువాద సంఘం ఇష్టపడటం లేదు. అందువలన అలా ఎత్తిచూపడం వ్యర్థప్రయాస.
8.  హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందంటున్న వారు స్వయంగా హేతువాద ఉద్యమంలో ఎందుకు పాలుపంచుకోవటం లేదు? నాస్తికులుగా జీవిస్తున్నప్పుడు ఆ జీవితంయొక్క ఆవశ్యకతను సామాన్య ప్రజలకు చెప్పవచ్చుకదా.
9.  ఎంత ఎదిగినవారైనా ప్రాథమిక మానవీయలక్షణాలు - ఇష్టాఇష్టాలు, ఉద్వేగాలు తొంగిచూస్తూఉంాయి. వాినుండి పూర్తిగా విముక్తిపొందడం సాధ్యం కాదు. ఈ లేఖలోని విషయాలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే. హేతువాద సంఘానికి దీనితో ఎటువిం సంబంధం లేదు.
జగన్‌ ప్రతిస్పందన :
మిత్రులు రాజేంద్ర ప్రసాద్‌ గారికి లేఖారూపంలో మీ స్పందన పంపినందులకు ధన్యవాదములు. నా ప్రతిస్పందనను అంశాల వారీగా క్లుప్తంగా తెలియజేస్తున్నాను.

1.  మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సురేంద్ర గారికే కాదు, ఉద్యమకారులందరికీ సాి ఉద్యమకారుల పట్ల మిత్ర భావనే ఉండాలి. భావజాలాల్లో సారూప్యతను మితృత్వం ద్వారానే సాధించుకోగలుగుతాం.
2.  తమ భావాలపట్ల పాఠకుల సలహాలను, అభిప్రాయాలను, విమర్శలను, భావవిప్లవోద్యమంలో ఉన్నవారు కోరుతున్నట్లు, ప్రత్యేకించి ప్రకించుకోనఖ్ఖరలేదు. భావసంఘర్సణ జరిగితేనే భావాల్లో తప్పొప్పులు బయటపడతాయి. 9వ అంశంలో మీరు సూచించినట్లు భావవిప్లవ ఉద్యమకారులు ఉద్వేగాలనుండి బైటపడాలి. అంతేగాక సద్విమర్శలను సహృదయంతో స్వీకరించి  పునరాలోచన చేసుకోవాలి. నా అవగాహనలో వారికోపం వారి భావాలను విమర్శించినందులకు కాదు. వారు దానిని వ్యక్తిగతంగా అన్వయించుకున్నందువలననే సమస్య వస్తుంది.
3.  సురేంద్ర బాబుగారితో సంబంధంలోకి రావటం హేతువాద సంఘానికి ఇష్టంలేదని, వారి పత్రిక పాఠకులకు అర్థమవుతూనే ఉంది. కాని భావజాల విమర్శలు చేసేటప్పుడు వారి వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేదు. అలా అనుమతి తీసుకోవాలంటే వెంకాద్రిగారు వ్రాసిన ఎన్నో విమర్శనాత్మక గ్రంథాలు వెలుగుచూసేవే కావు. లోపాలు చిన్నవా పెద్దవా అన్న విషయాన్నట్లుంచితే  మీరు ఇరు సంస్థల భావజాలాల్ని కనుక ప్టిచూస్తే మౌలికాంశాల అవగాహనల్లోనే విభేదాలున్నట్లు తెలుస్తుంది. వాిని సరిపెట్టుకోవడం భావవిప్లవ లక్ష్యం దిశగా మిమ్మల్ని సాగనివ్వదు.
4.  మీరు చెప్పిన దానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. కాని నా అవగాహనలో నాకు వారిరువురితో వ్యక్తిగతంగాను, ఉద్యమ క్షేత్రంలోను ఉన్న పరిచయంతో వారు వారి వారి రచనలు మేథావుల స్థాయికి చెందినవనే అంటుాంరు. కాని భాష విషయంలో మాత్రం సురేంద్రబాబు గారి రచనల కంటే వెంకాద్రి గారి రచనలు సరళంగా ఉన్నట్లు అనిపిస్తాయి.
5.  ఎవరి రచనల్ని అయినా ఎలా అధ్యయనం చెయ్యాలో, ఎవరి ప్రసంగాలనైనా ఎలా అర్థం చేసుకోవాలో ''పదపదార్థ విచారణ'' విద్య అభ్యసించిన వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. ప్రస్తుతం మీరన్నట్లు మనకు సురేంద్రగారు ఒక్కరే ఆ విద్య తెలిసిన వారుగా కనిపిస్తున్నారు. అలా ఒక్కొక్కరే కాకుండా తనలాగ  మరింత మంది తయారు కావాలనే ఉద్దేశ్యంతోనే తాను మొదలుప్టిెన ''హేతువాద పునరుజ్జీవన యత్నాలు'' అధ్యయనం శిక్షణ తరగతులను కూడా పదపదార్థ విచారణతో ప్రారంభించారు. ఈ విచారణే సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం  నుండి ఒక కార్యక్రమంగా చేస్తూ వస్తుంది.
6.  సురేంద్రబాబుగారైనా, వెంకాద్రి గారైనా, ఎం.ఎన్‌.రాయ్‌ అయినా ఎవరి స్థాయి వారిదే. వారిలాగా వారి సహచరులు లేరు అనుకోవటం కంటే వారిని స్పూర్తిగా  తీసుకొని వారు చేసినంత కృషిచేస్తే వారితో సమానులే కాదు వారిని మించిన వారుకూడా ఉద్యమ క్షేత్రంలో తయారవానికి అవకాశం ఉంది.
7.  సురేంద్ర గారు తమ భావజాలంపై చేస్తున్న విమర్శలను హేతువాద సంఘం ప్టించుకోవటం లేదని నేను అనుకోను. కాని వారు ఆ విమర్శలను స్వీకరించవలసిన రీతిలో కాక ఉద్యమకారులు తీసుకోకూడని వ్యక్తిగత రీతిలో స్వీకరించి స్పందిస్తున్నారు. ''హేతువాది''లో వస్తున్న వ్యాసాలను ప్టిచూడండి. విమర్శకు గురైన విషయాన్ని మళ్ళీపునరుద్ఘాించడం లేదా విషయం విమర్శకులకు అర్థం కావటం లేదనడం జరుగుతుంది. విమర్శకులు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం వారినుండి రావడం లేదు. సురేంద్రబాబుగారి విమర్శల్లో కేవలం తప్పు ఎత్తిచూపడం కాక అది ఎలా  తప్పు అవుతుందో, ఏది ఒప్పవుతుందో కూడా స్పష్టంగా  మొదటనే రాస్తే సరిపోతుంది. అందువల్లనే పత్రికల్లో విషయాల్ని సాగదీసుకోవటం కంటె ముఖాముఖి చర్చలలోనే విషయాలు ఒక కొలిక్కి వస్తాయని నేనాంను.
8. హేతువాద ఉద్యమం బలహీనంగా ఉందన్న సురేంద్రగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారో లేదో ముందు తెలియజేయండి. సత్యాన్వేషణ మండలి ఆవిర్భావం నుండి వారు హేతువాద ఉద్యమంలోనే ఉన్నవారని ప్రమాణ క్షేత్రాలు తెలిసిన వారికి సులభంగానే అర్ధమవుతుంది. అనుమాన ప్రమాణం, హేతువాద క్షేత్రం సారూప్యాలే. కాని సంచిక 205లో వివరించినట్లు కేవలం హేతుబద్దాలోచన ద్వారా పొందిన జ్ఞానం సత్యాన్ని నిర్ధారించలేదు. ఆపై ప్రయోగము అంటే అనుభవము ఒక్కటే సత్యాన్ని నిర్ధారించగలుగుతుందని మండలి అభిప్రాయం.
ఆస్తికత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఆస్తికేతర జీవన విధానాన్ని పాించేస్తున్నారు. ఒక రకంగా అది నాస్తిక జీవన విధానమేనని నా అభిప్రాయం. కాని నాస్తికత్వాన్ని రుజువు చేయమని ఎవరైనా తనని అడిగినా, తాము ఎవరినైనా అడిగినా ప్రస్తుతము ఉన్న శాస్త్రీయ విజ్ఞాన పరిమితుల దృష్ట్యా అది వీలుకాదని చెబుతున్నారు. కాని తమ భావజాల ప్రాతిపదికల్లోని ముఖ్యాంశంగా ''పుట్టుకకు ముందుగాని, మరణించిన తరువాత గాని సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం అనవసరం'' అని ప్రచారం చెయ్యటం నాస్తికత్వం ప్రచారంలో భాగంగా అర్థం చేసుకోవాలి.
9.  సత్యాసత్యాల విషయంలో ఎలాిం ఇష్టాఇష్టాలకు, ఉద్వేగాలకు తావివ్వకూడదు. ధర్మాధర్మాల విషయంలో వీలైనంతవరకు వాిని తమ అదుపులో ఉంచుకోవాలి. పూర్తిగా విముక్తిపొందటం అంటే కేవలం ఆదర్శంగా చెప్పుకోవడం వరకే.


Tuesday, September 1, 2015

అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికి 3వ లేఖ


అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికి
అయ్యా! మీరు హైందవ క్రైస్తవం పుస్తకం ద్వారా వెల్లడించిన భావాలలో దోషాలుంటే చూపండని 'యూట్యూబ్‌' ద్వారా చేసిన మీ ఛాలెంజ్‌ ప్రకటనకు స్పందిస్తూ, నేను ఇప్పికి రెండు రిజిష్టర్డ్‌ లేఖలు వ్రాశాను. ఈనాి వరకు మీ నుండి ప్రత్యుత్తరం రాలేదు. భారత దేశానికి నా సవాలంటూ ప్రకించిన మీలాి వారిలా మా పలుకూ లేకుండా ఊరుకోవడం సబబు కాదు. మీలో ఏమాత్రం నిజాయితీ గానీ, గుండె నిబ్బరం గానీ ఉంటే వెంటనే నా ప్రతి సవాలును స్వీకరించి ఉండాల్సింది. నా లెఖ్ఖ ప్రకారం మీ రచనలో పలు దోషాలున్నాయి. అందులో మీరు సరైనవని నిరూపించలేనివి, నేను సరికావని నిరూపించగలిగినవి కొన్ని ఉన్నాయి. కనుక చర్చకు కూర్చుంటే మీరు క్రైస్తవాన్ని విడచి నావెంట రాక తప్పదు. ఇది నా అంచనా. ఈ నిజం మీకూ తట్టే ఉంటుందనిపిస్తోంది నా తాత్వాక యోచనకు.
నాకు తెలిసి వాదనియమాలలో, ఒక పక్షం వీగిపోయిందని నిర్ధారించడానికి ఒక పద్ధతి వుంది. 'విప్రతిపత్తిరప్రతిపత్తిచ్చ నిగ్రహ స్థానం' అన్నది సూత్రం. అడిగిందొకటైతే, మరొక ప్రస్థావన చేసినా, అడిగిందానికి బదులాడక మౌనంగా ఉన్నా అి్టవారు ఓడినట్లేనన్నది ఆ సూత్రార్థం. అది వాదనియమాలెరిగిన వారందరూ అంగీకరించిందే. ఆ విధానాన్ని బ్టి చూస్తే ఇప్పికే మీరు ఓడినట్లు. అయినా అలా దీనిని ముగించడం నాకిష్టం లేదు. నిజానికి నా లక్ష్యం మిమ్ము ఓడగొట్టడం కాదు. మీరెంచుకున్న విధానం నిజాయితీతో కూడుకున్నది గానీ, నిజమనదగ్గది గాని కాదని లోకానికి తెలియజెప్పాలన్నదే నా అభిమతం. ఈ విషయంలో, ఇలాిం వైఖరిని అవలంభించిన వారందరినీ నిలువరించాలనీ, అి్ట ప్రచారపు ఎత్తుగడలను నిర్మూలించాలని నిర్ణయించుకునే మీతో మొదల్టెానాపని, ఈ పోకడ పోయిన వాళ్ళందరకూ ఈ కబురందిస్తున్నాను. వారు ఎవరికి వారుగా గాని, మీరందరూ కలసికట్టుగా గాని నాతో చర్చకు సిద్ధపడేట్లు చేయాలన్నదే నా ఉద్దేశము.
ఇప్పికైనా మీరుసిద్ధపడి విచారణకు రాకుంటే, ఈ మొత్తం కథనంతా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతాను. అవసరమైతే పదుగురి ముందు పెట్టయినా మిమ్ము చర్చకు సిద్ధం చేస్తాను. చర్చలో ఎలాగూ  మీరు వ్రాసిన వాిలో అనేక దోషాలు, ఎత్తుగడలు ఉన్నట్లు రుజువవుతుంది. కనుక మీరు క్రైస్తవాన్ని విడచి నావెంట నడవక తప్పదు. మీ నుండి వెంటనే సముచిత రీతిలో సమాధానంగానీ రాకుంటే, నేను మలి థయత్నాలనారంభిస్తాను. నాయీ యత్నం మీలాి మరెందరికోనూ గుణపాఠం కావాలనీ, కాగలదనీ తలుస్తాను.
ఈ లేఖ నకళ్ళు మరికొందరికీ పంపుతున్నాను. వివేకపథం 219లో ఎలానూ వస్తుంది. ప్రస్తుతానికి మీలా ఇతర మత గ్రంథాలలో అదీ ముఖ్యంగా వేదము, ఉపనిషత్తులు, పురాణాలలో 'యేసును గురించి' వివరాలున్నాయని, ముహమ్మదును గురించిన వివరాలున్నాయని అంటున్నవాళ్ళు కొద్దిమంది నాదృష్టికి వచ్చారు. ఈరకం వారి పోకడంతా విపరీతపు పోకడే. వారలా అనుకోవడానికి కారణం...
1. ఆయా గ్రంథాలను పొరపాటుగా - తప్పుగా - అర్థం చేసుకొని ఉండడం.
2. మత ప్రచారానికో, మత మార్పిడుల కొరకో, ఎంచుకున్న కుిలోపాయం అయ్యిండడం.
గమనిక : ఈ రకంవారి రచనలు, ప్రసంగాలు విన్నాక - గమనించాక - వారు పొరపాటుగా ఆ పనికి పూనుకోలేదని, మత వ్యాప్తి, మత మార్పిడుల కొరకే, అమాయకుల్ని త్వరగా, సులభంగా బుట్టలో వేసుకోడానికి వీలవుతుందనుకొనే, అందుకు పూనుకున్నారనీ నిర్ధారణ అయింది నావరకు నాకు.
అడిగేవారుండరులే అన్న ధీమా, అడిగినా భావప్రకటనా స్వేచ్ఛక్రిందనో, మత ప్రచార స్వేచ్ఛ క్రిందనో న్టెివేయవచ్చులే అన్న అజ్ఞానజనిత తప్పుడు సాహసము అన్నదే వారింతికి తెగబడానికి కారణం. నిజానికి ఈ రకమైన రాతలు, మాటలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)ఎ కి చెందిన భావప్రకటనా స్వేచ్ఛ క్రిందకు గాని, ఆర్టికల్‌ 25, 26, 27ల క్రిందనున్న మత ప్రచార స్వేచ్చ క్రిందకు గాని రాకపోగా ఆ ఆర్టికల్స్‌ నిషేధిస్తున్న అనైతికత మరియు ప్రలోభపెట్టడం అన్న దుర్వినియోగం క్రిందికి వస్తాయి. అంతేగాక, అి్ట మాటలు అబద్దపు ప్రచారం క్రిందకూ వస్తాయి. ఆ గ్రంథాలకు చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగనూ, వారిని ఆవేశపరిచేందుకూ కారకాలవుతాయి.
హైందవ సాహిత్యంలో నుండి క్రీస్తును నిలబ్టెాలనుకోవడం సరికాదన్న బొంకూరి జాన్‌ గారు, పి.డి.సుందర్రావు గారు, అలాి మరికొందరు క్రైస్తవ మతబోధకులు ఈ విషయంలో మీకంటే చాలా నిజాయితీతో ఉన్నారనక తప్పదు. మీరంతా ఇప్పికైనా నిజాన్నంగీకరించి సత్యంవైపుకు కదలడానికి సిద్ధపడడం కనీస విజ్ఞత. కనీస నైతికత కూడా.
1. ఎ) పరవస్తు సూర్యనారాయణ, వారి బృందం, బి) గుండాబత్తిని దేవదానం, వారి బృందం, సి) రంజిత్‌ ఓఫిర్‌, వారి బృందం, డి) ఇంకా నా దృష్టికి రాని ఈ తరహా పోకడకల వాళ్ళందరికీ నా యీలేఖ సమానంగా వర్తిస్తుంది.
2. ఖురాన్‌ పక్షంలోనూ ఇలాి వైఖరి కలవాళ్ళున్నారు. వారికీ ఈ లేఖ అంతే సమానంగా వర్తిస్తుంది.
ఎ) సత్య సందేశ కేంద్రం - కాకినాడ వారు, బి) అల్‌ ఫారూక్‌ పబ్లికేషన్స్‌ - కడప (హిందూ ధర్మ గ్రంథాలలో ముహమ్మద్‌), సి) ముస్తాక్‌ అహ్మద్‌ గారు వారి బృందం, డి) ఇంకా నా దృష్ట్గికి రాని ఇస్లాం ప్రచారకుల్లో ఈ వైఖరి కలవాళ్ళు.
గమనిక : మీ గ్రంథాలలో (వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలలో) మా యేసు, మా దేవుడు, మా ప్రవక్త అంటుండే వాళ్ళందరకూ సత్యాన్వేషణ మండలి, అలాగా! ఏదీ ఎక్కడ ఎలా ఉంది? రండి ! చూపించండి? పరిశీలిద్దాం రండి! అని ఆహ్వానం పలుకుతోంది. సత్యస్థాపనకు పెద్ద పీట వేయాలన్న దృష్టి ఉంటే మాత్రం ఈ ఆహ్వానాన్ని కాదనటం కుదరదు.
- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

Wednesday, January 1, 2014

స్పందన - ప్రతిస్పందన

మిత్రులు శ్రీ సురేంద్రబాబుగారికి,

నమస్కారములు!

''ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవన యానం'' 203 వివేకపథములో చదివాను.

మీరు చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా ప్రస్తావించారు. పెంచలయ్యగారితో సన్నిహితంగా 19 సంవత్సరాలు, అప్పుడప్పుడు కలస్తూ మరొక 9 సం||లుగా తాత్విక పరిశోధన సాగిందని, ఆయన పరిచయం సత్యాన్వేషణకు ప్రధానమైన మలుపుకు దారి తీసిందని అన్నారు. ఆయనతోటి సంపర్కం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన వారిలో ''నా పేరు ఒకటవ స్థానంలోనో లేదా రెండవ స్థానంలో ఉంటుందన్నారు.''

నిస్సంశయంగా ప్రథమ స్థానం మీదే. అన్వేషణ పరంగా మీరు పడ్డ శ్రమ, మీరు వెచ్చించిన కాలము మరెవ్వరూ పెట్టులేదన్నది వాస్తవము.

అయినా అంత దీర్ఘకాల సాహచర్యంతో ఏకాభిప్రాయము పొసగలేదని, అందుకు కారణము పెంచలయ్యగారి ఏకపక్ష వాదనా విధానమని వివరించారు. విడిపోక తప్పలేదన్నారు.

సత్యజ్ఞాన సంఘ భవిష్యత్తు విషయమై సందేహాలు వెలిబుచ్చారు. సంస్థలు, సంస్ధల పేర్లు కాలగతిలో మరుగున పడవచ్చు, మాసిపోవచ్చు సంస్థాపకుల భావాలు సమాజ శ్రేయస్సుకుపకరించగలవైనట్లైతే తాత్విక ప్రపంచములో వాటి స్థానము ఎప్పుడూ చెరిగిపోదు.

అందుకు మీరు సాగిస్తున్న నిర్విరామ కార్యక్రమమే తార్కాణం. మీలాగా మరెందరో మిత్రులు తమ జీవితాల్లో పెంచలయ్యగారి కారణంగా తాము పొందిన పెనుమలుపే వారికి వెలుగు బాటైందని నిర్ద్వందంగా ప్రకటించారు.

తాత్విక పరిశోధనలో జరిపే పరస్పర సంభాషణలు కొంతవరకే సాగుతాయి. ఆ తరువాత వాగ్వివాదాలకు అవకాశముండదు. ఉండేదల్లా ''పరిశీలన - విచారణ - నిర్థారణ అదీ స్వతంత్రంగా!'' సత్యజ్ఞాన సంఘ దృక్పథమిది. దానికి కట్టుబడే సంఘ కార్యము రూపుదిద్దుకుంటుంది.

మిత్రులు కొందరు పెంచలయ్యగారి స్యుృత్యర్థము ఒక స్మారక ప్రతిని వెలువరించాలని కోరుచున్నారు. మీకభ్యంతరము లేకుంటే మీ వ్యాసాన్ని యధాతధంగా అందులో ప్రచురించగలము. మీ అభిప్రాయాన్ని పత్రికాముఖంగా వ్యక్తపరచగలరని ఆశిస్తున్నాము.

వందనములతో - కృష్ణారావు

ప్రతిస్పందన : ముగిసిన - ముగించిన పెంచలయ్యగారి జీవనయానం గురించి 204 వివేకపథంలో కూడ మరింత సమాచారం రాగలదు. కనుక మీకు అవసరమైనంత వరకు ఈ రెండు మాసపత్రికలలో ప్రచురించిన దానిని పెంచలయ్యగారి స్మారక ప్రతిలో ముద్రించుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పత్రికాముఖంగా తెలియపర్చుచున్నాము.

గౌరవ్‌ లేఖాంశాలు

203 సంచిక చదివి గౌరవ్‌ ఫోను చేశాడు. నారెండవ లేఖ ముద్రంచాల్సింది కనీసం అందులోని నా విజ్ఞప్తి భాగాన్నేౖనా ముద్రించండి అని ఇదిగో ఆ విజ్ఞప్తి:- అది వివేకపథం పాఠకులనుద్దేశించి వ్రాశాడతడు.

''అని వార్యకారణాల వల్ల వివేకపథంలో కొనసాగుతున్న హేతువాదం గురించిన చర్చలో పాలుపంచుకోడానికి వీలుకావట్లేదు. నా భావాలకి కట్టుబడినంతలో వాటిపై విస్పష్టమైన వివరణ ఇచ్చే యత్నం వీలైనపుడు చేస్తాను. పాఠకులు అన్యధా భావించకుండా నా నిజాయితీని శంకించకుండా ఉండడానికి, నా సమస్య - దాని కారణాలు ఈసరికే సత్యాన్వేషణ మండలికి వివరంగా తెలిపాను. అనుమానాలున్న వారు సురేంద్ర గార్ని సంప్రదించగలరు. అదే లేఖలో 202లో రాజేంద్రప్రసాద్‌గారు లేవనెత్తిన సందేహంపై ఇలా స్పందించాడు గౌరవ్‌ 

మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి, మీ స్పందన చూశాను నా అభిప్రాయాలు అర్థంకాకపోయినా, లేఖ చివరిలోని గమనిక (అన్యాపదేశంగా ఉన్నా సరే) అర్థమైనందుకు సంతోషం. లేఖ నేరుగా సురేంద్రబాబుగారికే రాయెచ్చుగదా? అనే మీ ప్రశ్నకు జవాబు :- ఉత్తరాయడమేం? సరాసరి దాన్ని ముఖాముఖిగానే అందించాను. ప్రత్యేకంగా వ్యక్తుల పేర్లు ఉటంకిచడం నేను సభ్యతగా భావించనందుకే సురేంద్రగారి పేరు రాయలేదు. రెండో విషయం, నిజానికది నా వ్యాసం లేఖకాదు హేతువాది పత్రికలో సైతం యధాతధంగా అది అచ్చైంది. అందుకనే ఎవరిపేరూ అందులో వ్రాయలేదు. అందులోనే కాదు రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్‌ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతరరచనలు (1) సాంఘికతత్వం విప్లవ మార్గం 2) ఒక నాస్తికుడినామం 3) అస్థిత్వం - అరాచకత్వం 4) ప్రజాస్వామ్య ప్రస్థానం మొదలగువాటిల్లో కూడా పేర్లు పేర్కోలేదు. సమకాలికంగా జీవిస్తున్న వారిపై విమర్శ చేసేటప్పుడు సగటు విలువను పాటించడం అలా అలవాటు చేసుకున్నాను.

ప్ర.స్పం : యోచనాశీలుడవైన గౌరవ్‌కు, 201లో ప్రచురించిన నీ లేఖపై నా స్పందన కూడా అక్కడే ప్రచురించాను. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్‌ గారు అడిగింది నీ గమనిక వాక్యం గురించి కదా! అది ఇలా గుంది చూడు.

''ఈ మధ్య రాష్ట్రంలో హేతువాదానికి సిద్దాంతాన్ని, ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించడానికి యత్నిస్తున్న కొన్ని సంఘాలకు స్పష్టత చేకూర్చే ఉద్దేశంతోనే ఇది వ్రాయడమైనది'' దీనిపై అన్యాపదేశంగా చెప్పడమెందుకు నేరుగానే చెప్పవచ్చుకదా అని అన్నారాయన. నిజంగా అది అన్యాపదేశంగానే కాదు. అట్టి వారికి కనువిప్పు కలిగించేందుకు ఇంకాస్తకటువుగా చెప్పితే, బుద్ది చెప్పేందుకే ఇది రాస్తున్నాను అన్న అర్థాన్నీ ఇస్తొంది. నిజానికి ఆ నీలేఖలో హేతువాదం సిద్దాంత మెందుకు కాదో, హేతువాదమంటే ఏమో చెప్పనేలేదు. ఆ నీలేఖ సంగ్రహాన్ని రెండంశాలుగా విడకొట్టి, ఇంకా ఏమేమి అభిప్రాయాలున్నాయో దానిలో మీరూ తెల్చండని 201లోనే పాఠకులకూ సూచించాను.

దీనిపై ఇప్పుడు విమర్శ చేయబోవడం లేదనీ, అతడు విచారణకు సిద్దపడితే విచారణను మొదలెట్టుకోవచ్చిననీ చెప్పాను. ఆ లేఖ తప్పు మార్గం పట్టిన మనల్ని - ముఖ్యంగా నన్ను - సరిచేయడానికి ఉద్దేశించినట్లుగా ఉందనీ అక్కడే వ్రాశాను. అటు తరువాత రెండు మూడు సార్లు మనం ముఖాముఖి కలసి మాట్టాడుకున్నప్పుడు చెప్పాను. నీ భావాల పరిశీలనకు సిద్దపడమని. కానీ దానికి నీవంత ప్రాధాన్యత నిచ్చినట్లు అనిపించకపోవడంతో 203లో ఆ విషయాన్నే ప్రస్తావించాను. ఇప్పటికైనా నీవు వెళ్ళడించిన భావాలపై విచారణకు సిద్దం కావడం ఉచితం. 

నీరెండో లేఖలో ప్రస్తుతం తీరు బాటు లేదనీ వీలైనప్పుడు వివరణలు ఇస్తాననీ నీ నిజాయితీని శంకించవద్దనీ వ్రాశావు. ఒక్కమాట! నీ మొదటి లేఖ ఏమీ సరళంగానూలేదు. చూసిచూడనట్లు వదిలేయాల్సిందిగానూ లేదు. అందులో అవగాహనాలోపంతో కూడిన భావాలతోపాటు, మేము మందినెత్తిన ఏదో బండ పెట్టబోతున్నట్లు ఆరోపణ చేశావు. అలాగే, హేతవాదం పై తగినంత సాహిత్యం లేదని కొందరంటున్నది నిజంకాదు. దీనిపై చాలా సాహిత్యం ఉందనీ వ్రాశావు. ఇదీ నన్ను ఉద్దేశించి వ్రాసిందే. హేతువాదానికి ప్రామాణిక గ్రంధాన్ని చేకూర్చడానికివేమైనా మత గ్రంథమా అంటూ ఎద్దేవా చేశావు. ఇదంతా అన్యాపదేశమే కనకనే రాజేంద్రప్రసాద్‌గారు నేరుగానే ప్రస్తావించవచ్చుకదా అన్నారు. దానికీ, నీవు, ప్రస్తావించడమేమిటి? నేరుగా సురేంద్రగారికే లేఖ ఇచ్చానన్నావు. ఆయనడిగిందేమిటి? నీవు చెప్పిందేమిటి? లేఖ చదివే పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా రాసుండాల్సింది అని కదా ఆయనన్నది. లేఖ సురేంద్రకిచ్చానంటావేమిటి? లేఖ అర్థం కావలసింది పాఠకులకు కదా! ఇదీ అర్థం కాలేదన్న మాట నీకు! నాకేం భయంలేదు. ఆయనకు నేరుగానే లేఖ ఇచ్చాను అన్నది ఆయన ప్రశ్నకు నీ జవాబన్నమాట! బాగుంది.

రావిపూడి వెంకటాద్రిగారి రాడికల్‌ హ్యూమనిజాన్ని విమర్శించిన నా ఇతర రచనలంటూ నీవు చెప్పిన పుస్తకాలను ఒకింత జాగ్రత్తగానే చదివాను. అందులో రాడికల్‌ హ్యూమనిజం పై విమర్శ ఎక్కడుందో చూపిస్తే మళ్ళా చూస్తాను. ఆ పుస్తకాలూ, ఈ లేఖలూ చూశాక, తెలియనివన్నీ దిట్టతనాన తప్పులటంచు... అన్న తెనాలి రామలింగని మాటలు గుర్తుకొచ్చాయి. విమర్శంటే ఏమిటో నీ కిప్పటికీ సరిగా తెలియదన్నది ఒక నిజం. మనం కలసి మాట్లాడుకున్నప్పుడూ, నీ భావాలలోనూ, నీ భాషలో కూడా చాలా ఉండగూడనితనముంది. వాటిని సరిచేసుకునే పని మొదలెట్టమని సూచించానుకూడా. కానీ నీవవేమీ గట్టిగా పట్టించుకున్నట్లులేదు.

ఒక్కమాట! పత్రికలో నీలేఖ వేసి, దానిపై నిశితమైన విమర్శ చేయాలంటే ఆ లేఖవరకే 10, 15 పేజీల స్థలం అవసరమవుతుంది. అందుకు 3000 రూపాయలపైనే ఖర్చవుతుంది. కనుకనే కలసి కూర్చుని మాట్లాడుకుందామని అన్నాను. ఇప్పటికైనా నీవు ప్రకటించిన భావాలపై పరిశీలనకు సిద్దపడడం మేలు, అవసరం కూడా.

మరొక్కమాట! వెంకటాద్రి గారు హేతువాదం సిద్దాంతంకాదన్న దృష్టికీ, నీవు హేతువాదానికి సిద్దాంతాన్ని తయారు చేయడం మంచిదికాదు అన్న దృష్టికీ చాలా తేడా ఉంది. ఆయన సిద్దాంతాలుండడమే తప్పని అనడంలేదు. సిద్దాంతాలు ఉంటాయనీ, ఉండాలనీ, క్రొత్తక్రొత్త సిద్దాంతాలు వస్తుంటాయనీ, వస్తుండాలనీ అంగీకరిచే వైఖరి కలిగున్నాయడాన రాడికల్‌ హ్యూమనిజానికి సిద్దాంతం ఉందని అంగీకరిస్తారుకదా వాళ్ళంతా. అలాగే వివిధ శాస్త్రాలన్నీ సిద్దాంతాలు కలిగి ఉంటాయనీ అంగీకరిస్తారు కదా వాళ్ళు. ఇకపోతే హేతువాదిలో ఆ నీ మొదటి లేఖ ముందూ వెనకా చూసుకోకుండా విందుకు ప్రచురించారో, రెండోలేఖ ఎందుకు ప్రచురణకు నోచుకోలేదో. మొదటి లేఖలోని భావాలవరకైనా నాతోటి వాళ్ళు ఏకీభవిస్తారో లేదో 'హేతువాది' సంపాదకులే చెప్పాలి.

నా అభిప్రాయం ప్రకారం ఆ నీమొదటి లేఖ నుండి నీ అభిప్రాయాలుగ నేను వెళ్ళడించినవన్నీ, నీ అవగాహనలో లోపాన్నీ, నీ ఆరోపణల్లో దోషాన్ని తెలిపేటివే. కానీ నీవు వాటినేమీ పట్టించుకున్నట్లుగాలేదు. తాత్వికస్థాయిలో విచారణలు చేసే పత్రికలతో చర్చ మొదలెట్టడమంటే, అది చాలా వ్యయ ప్రయాసలతో కూడి ఉంటుంది పత్రికల వాళ్ళకి. అప్పుడైనా ఇరుపక్షాలూ పాఠకులూ శ్రద్దగా పట్టించుకుంటేనే దానికి అంతో ఇంతో ఫలితముంటుంది. రాసిందేదో రాసేసి, వీలున్నప్పుడు వివరణలిస్తాను అని నీవు అనకూడదు. నిజానికాపోకడ ఎవరూ పోకూడనిది. 

ఎవరినుద్దేశించి విమర్శచేస్తున్నామో, రాస్తున్నామో వారిపేరును పేర్కొనకపోవడం సగటు విలువను పాటించడం కాదు సరికదా! అది కనీస పద్దతినైనా పాటించకపోవడం కూడా అవుతుంది. ఇప్పటికైనా నీవూ హేతువాదం సిద్దాంతం కాదంటున్న వాళ్ళు ముందుగా, హేతువాదమంటే ఏమిటి? సిద్దాంతమంటే ఏమిటి? హేతువాదం అన్న పేరుక్రింద ఏమి భావాలుంటాయి? చెప్పి హేతువాదం సిద్దాంతమెందుకు కాదో నిర్ధారించండి. నీవరకైనా ఆపని చేయగలవేమో చూడు. ఇక హేతువాదంపై విస్తృతమైన సాహిత్యం తెలుగులోనే ఉందన్నావు. ఆ వివరాలివ్వు. నా అవగాహన ప్రకారం హేతువాదాన్ని శాస్త్రీయంగా వివరించే ఒక్క గ్రంథమూ తెలుగులో లేదు. అలా అనుకునేకదా నేను ఆ పనికి సమష్టిగా పూనుకుందామని పిలుపు నిచ్చింది. ఇక నీ మొదటి లేఖలోని ఒకటిరెండంశాలు విశ్లేషిస్తాను పరిశీలించు.

1) హేతువాదం సిద్దాంతం కాదు ఎందుకంటే, సమాజహితం కోసం ప్రతిపాదింపబడిన భావాలన్నీ ప్రామాణికమైన సిద్దాంతాలు కానవసరంలేదు. ఇది నీలేఖలోని మొదటి వాక్యాం ఇందులో నీవు లేవనెత్తిన అంశమేమిటి? చెప్పినదేమిటి? హేతువాదం ఎందుకు సిద్దాంత కాదో అన్నది గదా చెపుతానన్నావు. ఎందుకది సిద్దాంతం కాదో చెప్పావా? సమాజహితం కోరే భావాలన్నీ సిద్దాంతాలు కావలసిన అవసరంలేదు కనుక అది సిద్దాంతం కాదన్నావు. అదేం సమాధానం?! చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పనేలేదన్న నిజం ఎప్పటికి గుర్తిస్తావు?

2) ఇక నీ రెండో వాక్యం ఎంత గందరగోళంగా ఉందో చూడు ! ''అలా కాకుండా ఆయా కాలమానాలకు అనుగుణంగా, సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకునే ప్రగతిగాముకులు తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించుకుని ముందుకు సాగిపోతారు. అంతమాత్రంతో వారి నిజాయితీని అనుమానించడం మనలోని నైచ్యానికి ప్రతీక అవుతుందేమోగాని ఔన్నత్యానికి కాదు ఏమిటీ వాక్యాలకర్థం? సందర్భమేమిటి? అంతటి నైత్యానికి వడగట్టిందేవరు? అలా చేయకూడదని ఎవరికి సూచిస్తున్నట్లు? ఇంతకూ ''హేతువాదం సిద్దాంతం ఎందుకు కాదు'' అన్న శీర్షికతో మొదలైన రచనలో ఈ మాటల అవసరం ఏమిటి? సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకోవడమేమిటి? తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాలను అనుసంధానించడమేమిటి? అంతమాత్రం చేత వారినిజాయితీని శంకిచడమేమిటి? ఏమీటీ సంవిధానం? అర్థమవుతోందా పాఠకుకునికి? ఎంత మందికి వక్త హృదయం అర్థమైయ్యేవీలుంది?

గమనిక : నీ రెండు లేఖల మొత్తాన్ని కలిసి చూసినా హేతువాదమంటే ఏమిటో, అదెందుకు సిద్దాంతకాదోనన్న వివరం మాత్రం దొరకదు. కనుక ఏమి చెపుతానని లేఖ మొదలెట్టావో అది చెప్పకుండానే ఆ లేఖ పూర్తి చేశావన్నమాట! మళ్ళా సందోర్భిచితం కానివి చెప్పుకోకుండా ఉచితంగా స్పందిస్తావనే ఆశిస్తాను.


Thursday, August 1, 2013

స్పందన - ప్రతి స్పందన

1) బాపట్ల నుండి మోషే ఇలా వ్రాస్తున్నాడు. మిత్రులు సురేంద్రగారికి,

గతంలో మీరు వ్రాసిన హేతువాదం మీది వ్యాసాలు, ఇప్పుడు గత మూడు నెలలుగా వివేకపథంలో వస్తున్న ''హేతువాద ఉద్యమ పునరుజ్జీవన యత్నాలు'' అన్న వ్యాసాలు జాగ్రత్తగా పరిశీలించాను. వాటి పై నాలో పుట్టిన ఆలోచనలను వివేకపథం పాఠకుల ముందు ఉంచితే బాగుంటుందనిపించి ఈ వ్యాసం పంపుతున్నాను. ఏ మాత్రం అవకాశమున్నా దీనిని వివేకపథంలో ప్రచురించండి.

హేతువాద మన్నది ఒకతప్పుడు పోకడ అన్న భావాన్నీ, హేతువాదులు తప్పుడు భావజాలాన్ని, పెడవాదనను సమాజంలోకి ప్రవేశపెడుతున్నారన్న భావాన్నీ, విశ్వాసాలమాటున ప్రజలను ఆకట్టుకుంటూ, బ్రతుకులు నెట్టుకొస్తున్న ఆస్థిక పక్షంవాళ్ళు హేతువాదంపైనా, హేతువాదులపైనా ప్రజలలో కలిగించగలిగారు. ప్రశ్నించడం, విచారించడం, నిగ్గుతేల్చుకోవడం అన్న ప్రక్రియను ప్రక్కనబెట్టి, నమ్మకమనే, ఇంకా సరిగా చెప్పాలంటే మూఢనమ్మకమనే బండను జనం నెత్తిన పెట్టారు. ఇక్కడ ఆస్థికప్రచారకులు చేసింది కుటిల పన్నాగమే అయినా, హేతువాదానికి, హేతువాదులకు జనాన్ని దూరం చేయడం విషయంలో మాత్రం వారు గొప్ప విజయమే సాధించారు. హేతుబద్దాలోచనను (తర్కాన్ని) వాడుకుంటూనే అది పనికిరానిదిగ జనాన్ని నమ్మించగలిగారు.
అహేతుకాలోచనతో కూడిన నమ్మకాలవైపు ప్రజల్ని నెట్టారు.

అయితే, దీనికి మన హేతువాద మిత్రులపోకడ కూడా కొంతవరకు కారణమనక తప్పదు. ఎందుకంటే, హేతువాదులు, ప్రజలకు విశ్వాసానికీ, వివేకానికీ ఉన్న తేడానుగానీ, నమ్మకానికీ - మూఢనమ్మకానికీ మధ్య నున్న తేడానుగానీ, అర్థమయ్యేలా ఎరుకపరచలేకపోయ్యారు. అంతేగాక, ఆస్థికులు నమ్మమని చెప్పి పరలోకం, ఆత్మవగైరాలు నిజానికి బ్రతుకుతో సంబంధంలేనివీ, ఎవరికీ తెలియనివీ, తెలియడానికి వీల్లేనివి, తెలుసుకోవలసిన అవసరం కూడా లేనివి అన్న నిజాన్నీ, జనానికి అందించలేకపోయ్యారు. కనీసం విశ్వాసం కంటే విచారణ మార్గమే విలువైనది, బలమైనది అని గానీ, నిజ జీవితంలో ప్రతి మనిషీ అవసరమైన చోట కొద్దో గోప్పో హేతుబద్దాలోచననే వాడుకుంటున్నాడనిగాని తెలుపలేకపోయారు. చేయాల్సిన ఆ పని చేయకపోగా, దేవుడు లేడన్న ఒకే ఒక బండవాదననే హేతువాదం పేరన చూపించబూనడంతో, అదే ఆపోకడే ప్రజలకు వారిని దూరం చేసింది. వివిధ విశ్వాసాలలో బడికొట్టుకుపోతున్న అమాయకజనాన్ని చూసి గేలిచేసి తృప్తిపొందే వైఖరి కొందరు హేతువాదుల్లో అలవాటుగా మారి ఉంది. అది ఆ దురలవాటు పోవాలి.

ఈ విషయాన్ని వెంకటాద్రి గారూ గమనించారు గనకనే, హేతువాదమంటే కేవలం వ్యతిరేకవాదమనే అపోహ ప్రచారంలో ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత హేతువాద మిత్రులందరి మీద ఉంది అని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాక, మతస్థులు దేవుడున్నాడని పిడివాదం చేస్తున్నట్లే, మనం కూడా దేవుడు లేడని పిడివాదం మొదలెడితే వారికీ మనకూ తేడా లేనట్లే మనది విశ్వాసం కాదు, కాకూడదు, కనుక లేడన్న నిర్ణయానికి ఎలా వచ్చామోనన్నది సరైన రీతిలో చెప్పగలగాలి, అనీ అన్నారు.

ఒక ముఖ్య విషయాన్నీ మనమంతా గుర్తుంచుకోవాలి. శాస్త్రీయరచనలకు, స్థిరమైన నిర్థిష్టార్ధ్థాలను తెలిపే పదజాలం ఉండాలి. ఈ మాటెందుకంటున్నానంటే, గతంలో హేతువాదం పేరున వచ్చిన రచనల్లో ''హేతువనేది విశ్వక్రమంలోని లయ, హేతుత్వమంటే దానియొక్క ప్రతిధ్వని అన్న వాక్యముంది. అది చదివితే మనకేమి అర్థమొస్తోంది? విశ్వంలో ఒక క్రమముందనీ, దానిలో ఉండేలయనే హేతువంటున్నాడనే కదా! అంటే లయ అన్నా హేతువన్నా ఒకటేనంటున్నట్లేనా? లేక వేరేదాంతో లయకున్న సంబంధాన్ని బట్టి దానిని హేతువంటున్నట్లా? రచయిత భావమేమిటో సూటిగా అర్థం కావడం లేదిక్కడ.

నాకు తెలిసి ఈ సందర్భంలో హేతువన్న మాట ఆలోచనకు ఆధారమైన దానిని చూపి అనాల్సిందిగా ఉంది. అంటే ఆలోచించి సరైన నిర్ణయాలకు రావడానికి సరిపడే ఆధారాన్ని హేతువంటామన్న మాట తప్పు నిర్ణయాలకు దారితీసే ఆధారాలనే హేత్వాభాస అంటాము. కనుకనే ఆధారాల బలాబలాలను బట్టే వాటిని మనం సహేతుకాలోచనలు, అహేతుకాలోచనలంటున్నాము. వెంకటాద్రిగారే అన్న మరో మాటను గమనించండి. ''హేతువాదం తప్పనేవారు కూడా హేతురీత్యానే, తర్కరీత్యానే ఆలోచిస్తుంటారు'' దీనర్థం హేతువనేది ఆలోచనతో ముడిపడి ఉన్నదనేకదా!
మరలాటప్పుడు సంగీత, నృత్య, వాయిద్యాలతో ముడిపెట్టి వాడేపదమైన లయను హేతువనడం ఎలా కుదురుతుంది? ఇక రెండో పదం హేతుత్వమంటే విశ్వక్రమం యొక్క ప్రతిధ్వని అన్నది. వెంకటాద్రి గారే మరోచోట, ఆలోచనలోని క్రమపద్దతినే హేతుత్వమంటున్నామనీ అన్నారు పదాల్ని ఇలా ఎడాపెడా వాడితే అది పాఠకుల్ని అయోమయంలోకి నెడుతుంది. కనుకనే విలువైన విషయలు చెప్పబూనినప్పుడు పదాలు నిర్థిష్టార్ద బోధకాలుగ ఉండాలంటున్నాను. కాబట్టి విశ్వంలోని క్రమమేమిటో, దాని ప్రతిధ్వని ఏమిటో, వాటికీ హేతుత్వానికీ సంబంధమేమిటో ఆయనే వివరించాలి. మామూలుగా చదివితే అర్థం కావడంలేదు.
హేతుత్వమనేది హేతువనదగిన దానికి ఉండాల్సిన లక్షణం అవుతుంది. ఆ లక్షణంలేనిది అహేతువు - హేత్వాభాస - అవుతుంది. హేతువాది నిర్థిష్టార్థాలనిచ్చే పదాలనే వాడాలి. లేకుంటే ఆస్థికులకూ, అసత్య భావాలను ప్రకటించేవారికీ, శాస్త్రీయాలోచన ఉండాలంటుండే మనకూ తేడాలేకుండ పోతుంది. అంతేకాక, ఏ ఆశయ సిద్ధికోసం హేతువాద ఉద్యమాన్ని ఆరంభించామో అది నెరవేరదు. అది నిజమో కాదో ఆలోచించండి.

మరో సందర్భంలో మానసిక వ్యాధి ఉన్న వారికి మాత్రమే లేనివి ఉన్నట్లూ, ఉన్నవి లేనట్లూ అనుభూతి కలుగుతుందనీ, అనేశారాయన, ఇది నిజమా? ఎండలో తారురోడ్డుమీద పోతున్నప్పుడు మనలో ఎవరికైనా రోడ్డు మీద నీళ్ళున్నట్లు అనిపిస్తుంది. నీటిలో సగం మునిగిన కర్ర వంగినట్లూ కనపడుతుంది. అలాటప్పుడు మనమంతా మానసిక రోగులమన్నట్లేనా? ఇలాటివి తొందరపాటు ప్రకటనల క్రిందికి రావా?

''విశ్వంలో క్రమం లేకుండా ఉండుంటే వాటి జ్ఞానం మనకు కలిగేది కాదని'' మరో చోట అన్నారు. మరి విడివిడిగా ఉన్నవీ, క్రమంగాలేనివీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా! నిజజీవితంలో క్రమాన్నీ, క్రమరాహిత్యాన్నీ గమనించేకదా ఆ పదాలు వాడుతున్నాం? కనుక క్రమముండబట్టే అవి తెలుస్తున్నాయనడం అనుభవవిరుద్ధంగా అనిపిస్తోంది కదా!

వెంకటాద్రి గారే ఒక చోట, మొదటి సత్యంకంటే సమగ్ర సత్యాన్ని మానవుడెల్లప్పుడూ తెలుసుకుంటూ ఉంటాడనీ, మరోచోట సత్యం జ్ఞాన విషయమనీ, ఇంకొకచోటైతే ప్రయోగాల ద్వారా, ప్రమాణాల ద్వారా పునఃపరిశీలించి రుజువు చేసుకుంటూ, నిజాన్ని ధృవపరచుకుంటుండాలని హేతువాది అంటాడనీ ఇలా సత్యాన్ని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ పోయారు. ఒక రకమైన జ్ఞానాన్నే- రుజువుకు నిలబడ్డజ్ఞానాన్నే- సత్యమనాలన్నంత వరకు, అలా రుజువు చేసుకుని కలిగిన జ్ఞానాన్ని సరైందో కాదో ధృవపరచుకుంటూనే సాగాలన్నంతవరకు అందరం అంగీకరించాల్సిందేగాని, సత్యాలు మారతాయన్నది అంగీకరించదగిందిగా అనిపించడంలేదు. ఎందుకంటే సరైన పద్ధతుల ద్వారా సత్యమని నిర్థారింపబడ్డది ఎప్పటికీ మారనేమారదు.

మొత్తంగా చూస్తే హేతువాదంపై వెంకటాద్రి గారు వెళ్ళడించిన వాటిలో నా కంగీకారమైనవీ, అంగీకారం కానివీ, అర్థం కానివీ అన్న మూడు రకాల భావాలు కనపడుతున్నాయి. ఇదంతా అలా ఉంచి ముఖ్యంగా విచారించుకోవలసిందేమంటే, ఆయన హేతువాదం ఒక సిద్దాంతం కాదని అంటున్నారు. దానర్థం, హేతువాదమన్న సిద్దాంతం లేదుగనుక హేతువాదికి సిద్దాంతమేమీ లేదనే కదా! అంటే హేతువాదులు ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంటారేగాని, వారికి నిర్థిష్టమైన భావజాలం ఉండదని. ఈ ప్రకటన బాగుందంటారా?

నా అవగాహన ప్రకారం  హేతువాదమంటే, ఆలోచనా క్రమంలో ఇమిడి ఉండే అంశాలను, సక్రమాలోచనకు పాటించవలసిన మెలకువలను, లేకనియమాలను వివరించి ప్రతి మనిషీ వాటిని గురించి తెలుసుకోవలసిన, నేర్వవలసిన, ఆచరించవలసిన అవశ్యకతను, అందువల్ల కలిగే ప్రయోజనాన్ని, లేకుంటే కలిగే నష్టాన్ని గురించి వివరించే సిద్దాంతమని, మానవ జీవితం కావలసినవి తెచ్చుకోవడం, నిలిపి ఉంచుకోవడం, పోవలసినవి పోగొట్టుకోవడం, రాకుండా చూసుకోవడం అన్న పనుల రూపంలోనే ఉంటుంది. ఇదంతా మనిషి గతానుభవాలను నెమరువేసుకుని, భవిష్యత్తుకు బాట వేసుకోవడం రూపంలోనే ఉంటుంది.
ఈ పనంతా ఆలోచనా ప్రక్రియకు సంబంధించినదే.

ఆలోచనంటే మానసికంగా చూడడమనే అర్థం. సక్రమాలోచనంటే సరిగా చూడడమనే. అందిన సమాచారం లేదా కలిగిన జ్ఞానం ఆధారంగా అటు గతంలోకో, ఇటు భవిష్యత్తులోకో చూడడానికి మెదడు చేసే పనినే ఆలోచన అంటారు. సక్రమమైన ఆలోచనే సరైన నిర్ణయాలకు దారి తీస్తుంది. సరైన నిర్ణయాలననుసరించి పనులు చేస్తేనే ఫలితాలూ సరిగా ఉంటాయి. ఎట్టి జ్ఞానమో అట్టి క్రియ, ఎట్టి క్రియో అట్టి ఫలితము అన్నది సార్వత్రిక నియమం. అందుకనే హేతువాదమన్నది సక్రమాలోచన అంటే హేతుబద్దాలోచన చేయమంటూ, ఎలా చేయాలో నేర్పుతానంటుండే సామాజిక దృక్పథంకల సిద్దాంతమది అంటున్నాను.

హేతుబద్దంగా ఆలోచించ వద్దనే వాళ్ళంతా బుద్దిలేనివాళ్ళే. ఎందుకంటే గతంలోకి చూడాలన్నా, భవిష్యత్తులోకి కదలాలన్నా ఆధారసహితమైన ఆలోచనే దిక్కు మనిషికి. అది ఏ మేరకు సరిగా లేకుంటే ఆ మేరకు జీవితం ఒడిదుడుకులతోనే సాగుతుంటుంది. ఆలోచన ద్వారా సరైన నిర్ణయాలకు రావడానికి తగిన (బలమైన) ఆధారాన్నే హేతువంటాము. ఆధారంగా తీసుకున్న దానికాబలాన్నిస్తున్న లక్షణాన్నే హేతుత్వం అంటాము. అలాగే హేతువనడానికి తగని ఆధారాన్నే అహేతువు హేత్వాభాస - అంటాము. హేతువుతోకూడుకున్న ఆలోచన సహేతుకాలోచన, హేతువనడానికి తగని దానితో కూడుకున్న ఆలోచన అహేతుకాలోచన. ఆయా విషయాలను గురించి హేతుబద్దంగా ఆలోచించగలిగినవాడు అంటే హేతువనడానికి తగిన ఆధారాన్ని కలిగి ఉన్న వాడు హేతుమంతుడు. అన్ని విషయాలలో హేతుమంతుడనడానికి తగినవాడు, ఏ ఒక్క విషయంలోనూ అహేతుకంగా ఆలోచించి ఉండనివాడు ఉండడు.

ప్ర.స్పం :- 1. యోచనాశీలుడైన మోషేకు నీ లేఖ పాఠకుల్ని, హేతువాదులలో వెంకటాద్రి గారి భావాలతో ఏకీభవిస్తున్న వారినీ, విభేదిస్తున్నవారినీ కూడా ఆలోచింపజేసేదిగనే ఉంది గనుక వారి నుండి ఎలాటి స్పందన వస్తుందో చూద్దాం.

స్పందన :- ఎం.కె. గౌరవ్‌ పిఠాపురం నుండి ఇలా వ్రాస్తున్నారు.

హేతువాదం సిద్దాంతం కాదు ఎందుకంటే, సమాజహితం కోసం ప్రతిపాదింపబడిన భావాలన్నీ ప్రామాణికమైన సిద్ధాంతాలు కానవసరంలేదు. అలాకాకుండా ఆయా కాలమానాలకు అనుగుణంగా సామాజిక పరిస్థితుల్ని వ్యవస్థ స్వరూపంతో బేరీజు వేసుకునే ప్రగతి గాముకులు తమ అభిప్రాయాలతో వారు సరైనవి అనుకున్న భావాల్ని అనుసంధానించుకుని ముందుకు సాగిపోతారు. అంతమాత్రంలో వారి నిజాయితీని అనుమానించడం మనలోని నైచ్యానికి ప్రతీక అవుతుందే కాని ఔన్నత్యానికి కాదు.

హేతువాదం అనేది వ్యక్తిగత జీవన విధానానికి సంబంధించిందే తప్ప, వ్యక్తుల నిర్వచనాలకు లోబడే సిద్దాంతమని నేననుకోవడం లేదు. అటువంటి సిద్ధాంతంగా హేతువాదాన్ని గుదిగుచ్చడం మంచిదని భావించడమూ లేదు. అలా హేతువాదాన్ని కూడా ఒక సిద్దాంతంలో బంధిస్తే అదీ ఒక క్రొత్త మతమై కూర్చుంటుంది. హేతువాద ఆలోచనా రీతుల్ని పరిచయం చేసేందుకు అవసరమైన వైజ్ఞానిక దార్శనిక దృక్పధాన్ని, ప్రశ్నించే విమర్శనాత్మక దృక్కోణాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నానికి బదులు హేతువాదానికి కూడా ఒక గుదిబండ భావజాలాన్ని తగిలించడానికి  ప్రయత్నించడం సబబుకాదు.

దార్శనిక దృష్టికల భావజాల వ్యాప్తికి సూత్రీకరణల అవసరంలేదు. ఎప్పటికప్పుడు ఆధునిక విజ్ఞాన సారాన్ని అందుకుంటూ, భావజాలంలో అవసరమైన మార్పులు చేసుకుంటూ, తదనుగుణమైన ఆలోచనకు, ఆచరణకు ప్రాధాన్యతనిస్తూ, ముందుకు సాగడం హేతువాదులకుండాల్సిన లక్షణం. ఇది ముందుగానే సిద్దం చేసుకున్న సిద్దాంత చట్రంలో ఇమిడే లక్షణం కాదు. అలా బలవంతంగా భావజాలంలో ఇమడ్చబడ్డ సిద్దాంతాలన్నీ ఈ సరికే మనిషిలో మతోన్మాదానికి సమానమైన భావనియంతృత్వాన్ని ప్రవేశపెడుతున్నాయి.

హేతువాదం, ఏ వ్యక్తికావ్యక్తి నిబద్దతతో కూడిన ఆంతరిక వ్యాయామం ద్వారా స్వయంగా గ్రహించవలసిన వివేకవంతమైన ఆలోచనా సరళికి సంబంధించిన వివేచనా పూర్వక జీవన విధానమే కాని నిర్వచనాలకు పరిమితమైన భావజాలంకాదు. అందుకే మిత్రులు వెంకటాద్రి గారన్నట్లు, హేతువాదానికి మార్గదర్శక గ్రంథాలు తప్పితే ప్రామాణిక గ్రంథాలనేవి ఉండవు.

ఇక హేతువాద ప్రచారోద్యమాలకి సరిపడ సాహిత్యం మనకు అందుబాటులో లేదనే కొంత మంది వాదనకూడా నిజం కాదు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకంటే, మన దేశంలోనూ, అందునా ఇతర రాష్ట్రాలకంటె మన రాష్ట్రంలోనూ శాస్త్రీయ సాహిత్యం బాగానే అందుబాటులో ఉంది. హేతువాద భావజాలాన్ని సమర్థిస్తున్న భిన్న ఆలోచనాధోరణులకు చెందిన సంస్థలు అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని ఇతర ఆర్థిక వనరుల్నీ సమన్వయం చేసుకుని పరిమితులతో కూడిన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.

వీలయితే, అలా నిజాయితీగా పాటుపడుతున్న హేతువాద నాస్తిక సంఘాల చైతన్యయుత సాహిత్యాన్ని వారి ప్రజా ప్రచురణల్ని వ్యాప్తి చేసే నిర్మాణం పై దృష్టి పెట్టడం భావవికాసోద్యమాలకు దోహదం చేసే సమష్టి కార్యాచరణను కాంక్షించే కార్యకర్తల బాధ్యత కావాలేకాని, ఏకరూప భావజాలంతో ప్రామాణికగ్రంథాలను కూర్చడానికి హేతువాదం మత గ్రంథం కాదు.

గమనిక :- ఈ మధ్య రాష్ట్రంలో హేతువాదానికి సిద్దాంతాన్ని ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్న కొన్ని సంఘాలకు స్పష్టత చేకూర్చే ఉద్దేశంతోనే ఇది వ్రాయడమైనది.

ప్ర.స్పం :- యోచనాశీలుడవైన గౌరవ్‌కు, మరియూ అతని భావాలనంగీకరిస్తున్న, విబేధిస్తున్న పాఠకులకు :- లేఖను రెండుగా విడదీసి అర్థం చేసుకుంటే బాగుంటుందనిపిస్తోంది.

1) వ్యక్తులను, సంస్ధలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు, 2) విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పిన మాటలు
ఒకటవ అంశం  మమ్మల్ని అంటే గత మూడు నాలుగు మాసాలుగా హేతువాద సిద్ధాంత భావజాలాన్ని గుదిగుచ్చాలంటూ హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాల పేరిట ప్రయత్నాలు చేస్తున్న వారినీ, ముఖ్యంగా నన్ను ఉద్దేశించిందిగా ఉంది. అట్టివాటిని మచ్చుకు కొన్నింటిని రాస్తున్నాను. లేదా మొత్తంలోని భావాలను మీరు ఎవరికి వారుగా వ్రాయండి చూద్దాం.

1) నేను, హేతువాదం సిద్దాంతం కాదనడం సరికాదు. అది ఒక సిద్దాంతమే నంటున్నాను. అది తప్పంటున్నాడు గౌరవ్‌.

2) దానినో సిద్దాంతంగా తయారు చేయాలనుకోవడం హేతువాదానికి ఒక గుది బండను తగిలించడమే.
3) భావజాల రూపంలో సిద్దాంతాలుగ తయారు చేయబడినవన్నీ మతోన్మాదానికి సమానమైన భావనియంతృత్వాన్ని తెచ్చిపెడతాయి. కనుక అట్టి పని చేయకండి.
4) మొదటిపేరాలో ఎవరో ఎవరి నిజాయితీనో శంకించేపని చేస్తున్నట్లు, అది సరికాదన్నట్లు అర్థాన్నిచ్చే మాటలున్నాయి. అవి ఎవరిని ఉద్దేశించి అన్నవో స్పష్టంగా అర్థం కావడం లేదు.
5) హేతువాదం నిర్వచనాలకు లోబడే సిద్దాంతం కాదు. దానినో సిద్దాంతంగా తయారు చేయడం మంచిదికాదు.
6) సిద్దాంతాన్ని రూపొందించేపనినాపి, ఉన్న సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి పూనుకోవడమే హేతువాదుల బాధ్యత.
ఏక రూప భావజాలంతో సిద్దాంత - ప్రామాణిక - గ్రంధాన్ని రాయడానికి హేతువాదం ఒక మతం కాదు.

రెండవ అంశం :-

1) హేతువాదానికి సరిపడినంత సాహిత్యం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉంది.
2) హేతువాదం నిర్వచనాలకి పరిమితమైన భావజాలంకాదు. అది వ్యక్తిగత జీవనానికి సంబంధించినది మాత్రమే.
3) హేతువాదాన్ని సిద్దాంతంలో బంధిస్తే అది ఒక క్రొత్త మతమై కూర్చుంటుంది.
4) దార్శనిక దృష్టికల భావజాల వ్యాప్తికి సూత్రీకరణల అవసరంలేదు.

పాఠకమిత్రులారా !

ఇవి గౌరవ్‌లేఖలోని కొన్ని అభిప్రాయాలు. దీని పై ఇక్కడ ఇప్పుడు నేను విమర్శను ఆరంభించడం లేదు.
విమర్శకు ముందు అవసరమైన కొన్ని మాటలను చెపుతాను. అవి సరైనవో కావో అతనూ, మీరూ తేల్చండి.

1) పదపదార్ధ జ్ఞానం లేనివానికి వాక్యార్ధ జ్ఞానం కలుగదు.
2) వక్త - రచయిత - హృదయం మనకు చేరిందని నిర్ణయించుకున్నాకనే, దాని బాగోగుల గురించి ఆలోచించాలి.
3) వక్త హృదయాన్ని సరిగా గ్రహించడానికి వీలుగా, అవసరమైన లేదా ముఖ్యమైన పదాలకు అర్థాలను అన్న వారినే అడిగి తెలుసుకోవాలి. ఆ పైన అతనన్న అర్ధం భాష అంగీకరిస్తున్నదో లేదో చూసుకోవాలి.
4) ఒక అభిప్రాయాన్ని ప్రకటించిన వాడు, ఆ అభిప్రాయం సరైందేనని నిరూపించే బాధ్యత తీసుకోవాలి. అంతేగాని, నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. దానిపై చర్చ వద్దు అని అనకూడదు.
5) తాను వెలిబుచ్చిన భావం సరైందేనని నిరూపించలేకపోయినా, సరికానిదని విచారణలో తేలినా దానిని చెప్పడం మానడమో, విడిచిపెట్టడమో చేయాలి. నాది నాదేనంటూ దానినే పట్టుకుని కూర్చోరాదు.

గమనిక :- 1) గౌరవ్‌ లేఖలో ఎన్ని అభిప్రాయాలున్నాయో అతను - మీరూ తేల్చండి ముందు అటు పైన ఒక్క దానినే విచారణకు తీసుకుందాం.

2) లేఖలో ముఖ్యమైన పదాలేమిటో, వాటి అర్థాలేమిటోనూ తేల్చుకోవాలి. అర్థాలు చెప్పే బాధ్యత గౌరవ్‌ స్వీకరించాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కల అంశం. భాషా నియమాలలో మొదటిది కూడా.
3) గౌరవ్‌ లేఖ, పొరపాటున తప్పు మార్గం పట్టిన మనల్ని - నన్ను - సరిచేయడానికి ఉద్దేశించిందిగా ధ్వనిస్తోంది. అందులో మేము ఏమి చేయడానికి పూనుకున్నామో అది తప్పన్నట్లు దానివల్ల మరోబండ ప్రజలపై పడుతుందన్నట్లు చెప్పడమేగాక, ప్రత్యామ్నాయంగా ఏమి చేస్తే బాగుంటుందోనూ సూచించారతను ఆ విషయాన్నే లేఖ చివరివాక్యం ద్వారా తెలియపరిచాడు కూడాను. ఇప్పటికాగుతాను అతనూ (మరికొందరూ) సిద్దపడితే విచారణ మొదలెట్టుకోవచ్చు.

కనుక హేతువాదం విషయంలో ఏర్పడ్డ అపోహల్ని తొలగించుకోవలసిన అవసరం మనందరికీ ఉంది.


Saturday, September 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? - 7

ముందుగా : - షరా మామూలే. రిజిష్టరు పోస్టు ద్వారా పంపిన 190వ సంచిక గోడకు కొట్టిన బంతిలా తిరస్కరింపబడి తిరిగి వచ్చింది. ఆ కవరు పైన ఒక వాక్యం పి.డి గారిదే వ్రాయబడి ఉంది. నల్గొండ మీటింగ్సు పబ్లిక్‌లో ఛాలెంజ్‌ చేసినా రాని నీకు .... అన్నదే ఆ అసంపూర్తి వాక్యం. ఇక చదవండి. 

Friday, June 1, 2012

బైబిలు దైవ గ్రంథమా? ... 4

యోచనాశీలురైన పాఠక మిత్రులారా! వివేకపథం 185 సంచికతో ప్రారంభించి బైబిలు ఆధారంగా క్రమంగా విచారించుకుంటూ వస్తున్న; దేవుని మనుషులం అంటున్నవారి మాటలు చేతలకథను శ్రద్ధగా చదువుతూ, అర్ధం చేసుకుంటూ వస్తున్నారనే తలుస్తాను. ఆక్రమంలో స్పందన రూపంగా కొన్ని ఉత్తరాలు వచ్చాయి. ముందుగా వాటిని పరిశీలించే పని చేస్తాను. తరవాత, క్రమంగా సాగాల్సిన కథాభాగంలోకి వస్తాను.

Tuesday, May 1, 2012

శ్రీ పి.డి. సుందర్రావు గారికి సత్యాన్వేషణ మండలి అధ్యక్షులు ఛాలెంజ్ చేస్తూ పంపిన బహిరంగ లేఖ

యోచనాశీలురైన మిత్రులారా!

మార్చి - 185 - సంచికతో మొదలైన, 'బైబిలు పక్షములతో బైబిలు పై చర్చకు మండలి సిద్దంగా ఉందన్న' ప్రకటనను మీరందరూ గమనించే ఉంటారు. ఆ సంచికలో ఎవరైనా బైబిలు జోలికివస్తే ఊరుకోను, అనేగాక దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిపై నేను నోరెత్తానంటే వాడు కుళ్ళి కుళ్ళి చస్తాడు అనీ, నేను వాణ్ణి మట్టి కరిపించేస్తాను అనీ, బహిరంగంగా తన ప్రసంగాలు, సి.డి. క్యాసెట్లు మరియు వ్రాతల మూలంగా ప్రకటించిన పి.డి సుందరావు గారితో చర్చకు బైబిలు పై విచారణకు మునుముందుగా మేము సిద్ధంగా ఉన్నామనీ, ఇక ఆయన వైపు నుండే జవాబు, కదలిక రావలసి ఉందనీ ప్రకటించాను.

Thursday, March 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? అందులో చెప్పబడ్డ దేవుడున్నాడా ?

పి.డి. సుందర్రావు అన్నాయన ప్రపంచానికి సవాలంటూ ప్రకటించిన దానికి సమాధానంగా సత్యాన్వేషణ మండలి నుండి సురేంద్ర బహిరంగ లేఖ

అనేకులను పేరుపెట్టి మరీ మొరటుగా, అసభ్యంగా, తొడగొడుతూ, మీసాలు మెలిపెడుతూ ఆయన చేసిన ప్రసంగాల సి.డిలను మూడింటిని నేను జాగ్రత్తగా విన్నాను.

ఆయన అభిమానో, అనుయాయో, శిష్యుడో, బిడ్డడో తెలియదుగాని, నేను కర్నూలుకు, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా సమావేశాలకు రాష్ట్ర బాధ్యునిగా హాజరైన సందర్భంలో, జగద్గురు అన్నాయన నన్ను కలసి బైబిలు విషయాల ప్రస్తావన తీసుకువచ్చారు. వాటి విషయంలో నాకూ ఉన్న అభిరుచికొద్దీ నాదైన శైలిలో కొద్దిసేపు ఆయనతో మాట్లాడాను. దాంతో మళ్ళా కలుస్తానని చెప్పి వెళ్ళారాయన. అటు తరువాత మరోక్రైస్తవ మిత్రున్నీ తొడ్కొనివచ్చి మళ్ళా కొంతసేపు బైబిలు విషయాలు మాట్లాడారు. ఆ సందర్భంలో భాషాపరంగా, పాత క్రొత్త నిబంధనల పరంగా నేను లేవనెత్తిన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పలేక పోవడం, కొన్నింటికి పొరపాటు సమాధానం చెప్పడం, కొన్నింటికి అరకొర సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన, ఆయన వెంట వచ్చినాయనా, వారికి వారే గమనించి మీకు ధైర్యముంటే, మాకంటే ఎంతో తెలిసినవారు, మీలాంటి బైబిలు విమర్శకులకు సవాలన్నవారు, ఎందరినో ఓడించిన వారు, ఎందరికో సింహస్వప్నం వంటివారు అయిన పి.డి. సుందర్రావు గారితో మాట్లాడవచ్చుగదా అనన్నారు. ఆ సందర్భంలోనే దమ్ముంటే, మగతనముంటే లాంటి మొరటుపదాలు కొన్ని ప్రయోగించారు. నిజానికి ఏ సిద్ధాంతవిచారణకైనా కావలసింది నిజాయితీతో కూడిన పట్టుదలేగాని దమ్ములు, కొమ్ములు, రొమ్ములు ఎందుకండీ?! అవసరం లేదు కదా! ఆమాటే ఆనాడు వారితో చెప్పాను.

Sunday, January 1, 2012

వర్ణాంతర వివాహ కుటుంబాలు సాంఘికశక్తిగా రూపొందాలి లవణం విజ్ఞప్తి


వర్ణాంతర వివాహ కుటుంబాలు సాంఘికశక్తిగా రూపొందాలి
లవణం విజ్ఞప్తి
నేడు సమాజం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. రోజురోజుకూ సాంఘిక విలువలు, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. దీనికి ఒక ప్రక్క ప్రపంచీకరణ, అంతర్జాతీయ పెట్టుబడిదారీ మార్కెట్‌ విస్తరణ వాదం కారణమైతే మరొకప్రక్క స్తానికంగా అవినీతి, సంకుచితత్వం కారణాలవుతున్నాయి. వ్యక్తికి విలువ పడిపోతోంది. రాజకీయ, ఆర్థిక సమస్యలను సాంఘిక దృక్పథముతో పరిష్కరించవలసినదిపోయి, సాంఘిక సమస్యలకు రాజకీయ, ఆర్థిక పరిష్కారాలు మాత్రమే ప్రతిపాదిస్తున్నారు. సాంఘిక, నైతిక విలువల పతనంతో సమాజంలో ఒకప్రక్క సామాజిక ఐక్యత దెబ్బతింటూ వుంటే మరొకప్రక్క అసాంఘిక శక్తులు బలపడుతున్నాయి.

Thursday, December 1, 2011

స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యంగంలోని 243 వ అధికరణకు సవరణలు



ఎ.ఎన్‌.పి.సిన్హా, ఐ.ఎ.ఎస్‌ భారత ప్రభుత్వం

కార్యదర్శి, ఫోను : 011-23074309 పంచాయతిరాజ్‌ మంత్రిత్వ శాఖ

భారతప్రభుత్వ కార్యదర్శి కృషిభవన్‌, కొత్తఢిల్లీ- 110 001.

రి.నెం. 11011/3/2009 పి.&సి (ఎ.ఆర్‌)

విషయం : స్థానికసంస్థల బలోపేతానికి, రాజ్యాంగంలోని 243వ అధికరణకు సవరణలు.

1. 73వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు ఒక స్థిరత్వాన్ని, రాజ్యాంగ హోదాను కల్పించినప్పటికీ, దానిలోని కొన్ని లోపాలు వాటి సమర్ధతను తగ్గించాయి. 1989 మేలో రాజ్యాంగసవరణ బిల్లును ప్రతిపాదించడం వెనుక తన లక్ష్యాలేమిటో అప్పటి ప్రధానమంత్రి తన ప్రసంగం ఆఖరున చక్కగా వ్యక్తం చేశారు. ''భారతదేశ ప్రజలకు, గరిష్ట స్థాయిలో ప్రజాస్వామ్యపు అమలుకు హామీనిస్తూ అధిక మొత్తంలో అధికారాల బదిలీ జరిగేటట్లు చూద్దాం. రాజకీయదళారీలకు పాలనలో స్థానం లేకుండా చేద్దాం. ప్రజలకే అధికారం ఇద్దాం''.

Wednesday, September 1, 2010

స్పందన - ప్రతిస్పందన


యోచనాశీలురైన పాఠక మిత్రులనుండి కొన్ని స్పందనలందాయి. అందుకు ప్రతిగా ఇలా స్పందించాను, గమనించండి.

స్పందన : వివేకపథం సంపాదకులు సురేంద్ర బాబు గార్కి నమస్కారం. నేను వాస్తవాన్ని, వర్తమానాన్ని బాగా ఇష్టపడతాను. అలాగని అందరూ ఇలాగే ఉండాలని నేననను... 2010 ఆగస్టు సంచిక 169లో, పాఠకులకు విూరిచ్చిన నివేదన - వేదన - నిష్టూరములను చదివాను. అందులో గత సంచికలో ''విజ్ఞతకో విజ్ఞప్తి'' అన్న పేరున మా ముందు పెట్టిన విషయాలపై విూరిచ్చిన నివేదనకు పాఠకులెవ్వరూ స్పందించక పోవడం పట్ల విూరు పొందిన వేదన, ఆ పై విూరు పాఠకులపై సంధించిన నిష్టూరము సబబే కాని, వాస్తవంలో ఆలోచించే ప్రతి వ్యక్తీ ఆచరణకు సరిపోడు. అలాగే సామాజిక స్పృహ కల వారందరూ సాహసించలేరు. అయినా సామాజిక ప్రయోజనం కొరకు పాటుపడాలనుకునే చాలామంది తాత్కాలికంగా కార్యాచరణకు కలిసి రాలేకపోయినా, కసిగా చేసేవారిని చూసి ఏదోనాటికి కార్యోన్ముఖులవుతారు. విూలాంటి విజ్ఞులు ఈ విషయం గ్రహించగలరు. ఇరవై ఏళ్ళ విూ శ్రమ భ్రమ కాదు, వృధా పోవటానికి. అది అకుంఠిత, అకళంక దీక్ష. దాని విలువలు త్వరలోనే వెల్లువెత్తుతాయి.

Sunday, November 1, 2009

స్పందన-ప్రతిస్పందన



స్పం.-1 : మిత్రులు సురేంద్రబాబుగారికి అంటూ పి.ఎస్‌.ఆర్‌. ఇలా వ్రాస్తున్నారు.
వివేకపథం సెప్టెంబరు సంచికలో మీ ప్రతిస్పందన గమనించాను. మీరు ప్రస్తావించిన అంశాలలో కొన్నింటిపై నాకు ఏకీభావం లేకున్నా, మన స్నేహ సంబంధాలపై దాని ప్రభావం ఏమాత్రం పడరాదన్న భావం నాలోనూ గాఢంగానే వుంది. అదీగాక ''పెళ్ళి వేదికలో (ప్రయోగంలో) ఏమేమి లొసుగులున్నాయో తెలుపమని ఎవరినీ అడగలా'' అని మీరు ప్రకటించాక ఈ విషయం మీద నేను సాగదియ్యడం వివేకవంతమైన చర్య అవదు. నాకున్న ఉద్యోగ, ఇతరత్రా తీరికలేని కార్యక్రమాలవల్ల సెలవుపెట్టి వచ్చి మీతో చర్చించేటంత తీరుబడి నాకులేదు. మీరు అవసరముందని భావిస్తే లేఖారూపక వ్యక్తిగత చర్చకు నాకు అభ్యంతరం లేదు.

Thursday, October 1, 2009

స్పందన-ప్రతిస్పందన



స్పం.-1 : మిత్రులు సురేంద్రబాబుగారికి అంటూ పి.ఎస్‌.ఆర్‌. ఇలా వ్రాస్తున్నారు.
వివేకపథం సెప్టెంబరు సంచికలో మీ ప్రతిస్పందన గమనించాను. మీరు ప్రస్తావించిన అంశాలలో కొన్నింటిపై నాకు ఏకీభావం లేకున్నా, మన స్నేహ సంబంధాలపై దాని ప్రభావం ఏమాత్రం పడరాదన్న భావం నాలోనూ గాఢంగానే వుంది. అదీగాక ''పెళ్ళి వేదికలో (ప్రయోగంలో) ఏమేమి లొసుగులున్నాయో తెలుపమని ఎవరినీ అడగలా'' అని మీరు ప్రకటించాక ఈ విషయం మీద నేను సాగదియ్యడం వివేకవంతమైన చర్య అవదు. నాకున్న ఉద్యోగ, ఇతరత్రా తీరికలేని కార్యక్రమాలవల్ల సెలవుపెట్టి వచ్చి మీతో చర్చించేటంత తీరుబడి నాకులేదు. మీరు అవసరముందని భావిస్తే లేఖారూపక వ్యక్తిగత చర్చకు నాకు అభ్యంతరం లేదు.

Tuesday, September 1, 2009

స్పందన ప్రతిస్పందన



ఆదిత్య ట్రైనింగ్‌ క్యాంపు నుండి వచ్చే అవకాశం లేదు. మళ్ళా మండలి సభ్యులం ఇద్దరం ముగ్గురం కూచున్నాం. ఏమి చేద్దామని? హిందూ వివాహ చట్టం క్రింద రిజిస్ట్రేషన్‌ పనిపూర్తి చేసేద్దాం అన్న నిర్ణయానికి వచ్చాం. కనుక ఆదిత్య సమతల వివాహ నమోదు కార్యక్రమం హిందూ వివాహ చట్టం క్రింద జరిగింది. ఇక్కడికిదొక నిజం.

స్పందన-ప్రతిస్పందన



యోచనాశీలురైన పి. సుబ్బరాజుగారికి,
మీ లేఖలో చోటుచేసుకునివున్న రెండు ముఖ్యమైన అంశాలను గురించి ప్రస్తావించి, అటుపై ఇతరాంశాల దగ్గరకొస్తాను.
1) ఆ రెంటిలో ఒకటి; 'సందర్భశుద్ధిని పాటించడం చాలా అవసరం' అన్నది. ఆ సూత్రం నాకు సర్వాంగీణ అంగీకారమే. అసందర్భంగా ఎవరు మాట్లాడినట్లు తేలితే వాళ్ళం ఆ మేరకు జరిగిన పొరపాటును సవరించుకునేందుకు సిద్ధపడడం వివేకవంతం. నేనందుకు సిద్ధం. మీరూ అందుకు సిద్ధపడగలరనే అనుకుంటున్నాను.

Saturday, August 1, 2009

సి.టి.ఎఫ్‌.వారు - బైబిల్‌ సృష్టివాదం



మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌గారు బాధ్యత తీసుకుని సి.టి.ఎఫ్‌.వారితో సంప్రదిం చడం, వారొక రీతిలో స్పందించడం, దానిపై నావైపునుండి కొంత విశ్లేషన రావడం గురించి జులై సంచిక ద్వారా మీ అందరకూ తెలుసు. అందులో మన ప్రస్తుత చర్చావేదిక సందర్భానికి సంబంధించిన ఒక అంశం, నాస్తికులముందు, నాస్తిక సంస్థల ముందు, మేము మా బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి సిద్ధము. అయితే అటువైపు పాల్గొంటున్నది ఎవరో మాకు ముందే తెలుపాల్సి వుంటుంది. అని సి.టి.ఎఫ్‌.వారు రహ్మాన్‌గారి ద్వారా కబురెట్టడం అన్నది.

నూతన వివాహవిధిపై మిత్రుల స్పందనలు-ఒక పరిశీలన



వివాహ విధిపై అంతో ఇంతో స్పందన రావడం ఒకింత సంతోషాన్ని కలిగించింది. అందునా ఏదోఒకటి రాద్దాంలే అనుకునే వారినుండి కాక, సరైన మార్పునాశించే వారినుండే అవి రావడంతో, ఆ వివరాలనూ నా దృష్టికోణాన్ని మీ అందరి ముందుంచుతాను. ఇక పరిశీలించ మొదలెట్టండి.
1) పి. సుబ్బరాజుగారు, జిన్నూరు నుండి :  మా నూతన వివాహ విధిని ఒకింత సాకల్యంగానే పట్టిచూసి, సవరణలు పూరణల సందర్భంగా పట్టించుకోవలసిన అంశాలంటూ ఇలా చూపెట్టారు.

Wednesday, July 1, 2009

రహ్మాన్‌గారి లేఖ యధాతథం


వివేకపథం స్పందనకంటూ ఫజులుర్‌ రహ్మాన్‌గారిలా వ్రాస్తున్నారు (రహ్మాన్‌గారి లేఖ యధాతథం).
ప్ర.స్పం. : యోచనాశీలురైన రహ్మాన్‌గారికి, మన ఇరువురి లేదా మన రెండు సంస్థల ఆధ్వర్యంలో ఆరంభమై, కొంతవరకు సాగిన ఆస్తిక, నాస్తిక పక్షాల విచారణ విషయంలో, దానినో ముగింపుకు చేరాల్సిన బాధ్యత లేదా అవసరం మన ఇరువురికీ సమానంగనే వుంది. ఆ విషయం మీకూ తెలుసు. అలాగే, వత్తిడిననుసరించి, అవకాశమున్నంతలో మీవంతు బాధ్యతను నెరవేర్చేపని చేయాలనుకునేవారే మీరన్నది మీ గురించిన నా ఒక అంచనా. వివేకపథం-155లోని నా ప్రతిస్పందన చూశాక అవసరమైన దిశగా మీవంతు కృషి మొదలెట్టడం, ఆ కృషి సారాంశాన్ని పత్రికకు అందించడం, మీ విషయంలో ఆ నా అంచనా వాస్తవ దూరం కాదన్న విషయాన్ని పట్టిస్తోంది. సంతోషం.

ఆదర్శ వివాహాలు, సంస్కరణ వివాహాలు : ఉండకూడనితనం - స్పందన-ప్రతిస్పందన



ఆదర్శ వివాహాలు, సంస్కరణ వివాహాల పేరిట జరిగిన, జరుగుతున్న పెళ్ళిళ్ళలో రెండు రకాల ఉండకూడనితనాన్ని గమనించాను నేను. ఒకటి సాంప్రదాయ పెళ్ళిళ్ళలోని కొన్ని లోపాలను, మరీ భూతద్దంలో పెట్టి చూపించడం, అది తెలియజెప్పడానికే ఈ వేదిక ఏర్పాటు చేశాం అన్నంతగా ప్రవర్తించడం, అనవసరపు, అసభ్యపు స్థాయిలో అశ్లీలమైన భాషణ, వర్ణనలనూ జోడించి మరీ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం, రెండు వివాహాలలో మామూలుగా జరిగే అట్టహాసాలకు, ఆడంబరాలకూ, హోదా ప్రదర్శనలకు, విపరీత శబ్దకాలుష్యానికి దీటుగానే దుబారా చేస్తుండడం.

Wednesday, April 1, 2009

స్పందన - ప్రతిస్పందన



స్పం. (1) : సి.టి.ఎఫ్‌. పేరున, ఒక ఇ-మెయిల్‌ వచ్చిందినాకు. అందులో వివేకపథంలోని నా వైఖరిని అభినందిస్తున్నామని, ప్రస్తుతం పనుల వత్తిడిలో వుండడంవల్ల తమ సమాధానాన్ని పంపలేకపోతున్నామనీ, దీనిని తాము బాధ్యతల్ని ఎగవేయడంగా భావించవద్దని వ్రాశారు. ప్రకాష్‌గారి తల్లిదండ్రులకు అనారోగ్యంగా వుండడంతో ప్రకాష్‌గారు వారి పనులు చూడడంలో బిజీగా వుంటున్నారనీ వ్రాశారు. చెన్నైలో ఏవో సమావేశాలు పనులున్నట్లు వ్రాశారు.