Showing posts with label 218. Show all posts
Showing posts with label 218. Show all posts

Monday, April 25, 2016

శాస్త్రీయ దృక్పథంపై చర్చాపత్రం - యర్రంశ్టెి జగన్‌మోహన్‌రావు

శాస్త్రీయ దృక్పథంపై చర్చాపత్రం

భారత రాజ్యాంగలోని అధికరణం 51(ఎ)హెచ్‌ ప్రకారం ''శాస్త్రీయ స్పృహను, కలిగి ఉండడంలో స్థిరత్వాన్ని (గ్టితనాన్ని) కలిగి ఉండడం. మానవవాదాన్ని, పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం ప్రతి భారత పౌరుని విధి'' అని వ్రాయబడి ఉంది. శాస్త్రీయ స్పృహను, పరిశీలనా తత్వాన్ని కలిగి ఉండడమంటేనే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం అని అర్థం. 'దృక్పథం' అంటే చూసే తీరు. 'శాస్త్రీయ' అంటే సరైన అని అర్థం. అంటే 'శాస్త్రీయ దృక్పథం' అన్నదానికి సరిగా చూసేతీరు అని అర్థము అన్నమాట. 'సరిగా' అంటే 'ఉన్నది ఉన్నట్లుగా' అనే అర్థమే కాని మంచిని చూడడం, మంచిగా చూడడం అని కాదు. సరిగా చూడడం అంటే వాస్తవాలనాధారంగా చేసుకొని చూడడం. అలా చూడడానికి, నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధపడే వైఖరినే శాస్త్రీయ దృక్పథం అనాలి. శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా తత్వము లోపించినందువలననే ప్రజలు మూఢనమ్మకాల ప్రభావానికి గురఅవుతున్నారని చాలామంది అభ్యుదయవాదుల అభిప్రాయం. నా అభిప్రాయంలో కేవలం మూఢనమ్మకాల వ్యాప్తియే కాక, సమాజంలో మనిషి తనకు తానే కొనితెచ్చి పెట్టుకుంటున్న మరియు సాి మనుషులకు కూడా కలిగిస్తున్న సమస్యలన్నింకీ కూడా సమాజంలో ఈ శాస్త్రీయ దృక్పథము  లోపించడమే కారణం. అందువలన దీనియొక్క అవసరము ఆస్తికులు, నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, సామ్యవాదులు అనే కొంతమందికే పరిమితముగా కాక మానవులందరికీ అవసరమైనదిగా చెప్పవచ్చు. ఏమతమును అనుసరిస్తున్న వాడు? అసలు ఏ మతాన్నైనా అనుసరిస్తున్న వాడా లేదా అన్న దానితో నిమిత్తమే లేకుండా ఈ శాస్త్రీయ దృక్పథము యొక్క ఆవశ్యకత విస్తృతమై ఉంది. కాని మతస్తులలోను, ఆస్తికులలోను ఈ దృక్పథము లేనందువల్లనే సమస్యలన్నింకీ మూలకారణమని అభ్యుదయ వాదుల అభిప్రాయము. కాని ఈ విషయములో సమాజ అభ్యున్నతి సాధించాలంటే అందరం కలసి పనిచేయాలని, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని ఐకమత్యంతో పెంపొందించాలనే నిర్ణయానికి రాలేకపోవడానికి ప్రధాన కారణం ఈ అభ్యుదయవాదుల్లోనూ శాస్త్రీయ దృష్టి లోపించడమే కాదా?

Saturday, August 1, 2015

సత్యాన్వేషి శ్రీ ఎన్‌.వి.బ్రహ్మం గారికి నివాళి

హేతువాది, మానవతావాది, సత్యాన్వేషి అయిన శ్రీ నాసిన వీరబ్రహ్మం (ఎన్‌.వి.బ్రహ్మంగా సన్నిహితులకు పరిచయం) గారు జూలై 27వ తేదీన రాత్రి చిన గంజాంలో తుదిశ్వాస విడిచారు. ఆయన జన్మస్థలం చీరాల తాలూకా గోసనపూడి. తల్లి హనుమాయమ్మ, తండ్రి వెంకటస్వామిలకు 1926లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య- సీతారావమ్మ, కుమారులు- జిగీష్‌, గవేష్‌, కుమార్తె -మనీషా ఉన్నారు.
హైస్కూలు విద్యార్థి థనుండే ఆయన తెలుగు, సంస్కృత సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు. తెలుగులో ఆయన భర్తృహరి శతకాన్ని అనువదించారు. స్వతంత్రాలోచనాపరుడుగా ఆయన ఆ థనుండే సనాతన మార్గం నుండి హేతువాద భావాలకు మళ్ళారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి ప్రభావంతో ఆయన హేతువాదిగానూ, ఎం.ఎన్‌.రాయ్‌ ప్రభావంతో మానవతావాదిగానూ, ప్టుా సురేంద్రబాబుగారి ప్రభావంతో సత్యాన్వేషకునిగానూ జీవితం గడిపారు. ప్రముఖ హేతువాది రావిపూడి వెంకాద్రి గారితో కలసి చీరాల, చుట్టుప్రక్కల గ్రామాల్లో హేతువాద ఉద్యమం వ్యాప్తికి కృషిచేశారు. ఆయన తన జీవితకాలంలో మెదడుకు మేత, రాయిస్టు దర్శనం, కలలో దేవుడు, హోమియో దర్శనం, కళాశాస్త్ర వివాదంలో హేతువాదం, హేతుబుద్ధి కలవారు హోమియోను కాదనగలరా? విం రచనలు చేశారు. 1958లో ఆయన రచించిన 'బైబిలు బండారం' (ప్రస్తుతం 'బైబిలే పలుకుతోంది' గా పునర్ముద్రించబడింది) అప్పి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే నిషేధించబడి, 1962లో సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఎం.ఎన్‌.రాయ్‌ సిద్ధాంతమైన రాడికల్‌ హ్యూమనిజంలోని 22 సూత్రాలను సమీక్షించి, మార్చుకోవలసిన అవసరం ఉందని, అంతేగాక మానవవాదంలో 'కళ'కు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఇతర మానవ వాదులతోనూ విభేదించాడు. ప్రారంభంలో 'మనీషా విద్యావిహార్‌' అనే స్కూల్‌ను విజయవంతంగా నడిపినప్పికీ, తరువాత థలో హోమియో వైద్యుడిగా స్థిరపడ్డారు. హోమియో వైద్యవిధానం శాస్త్రీయత విషయంలో ఇతర హేతువాదులు, మానవవాదులతో ఆయన విభేదించారు. 1992లో సత్యాన్వేషణ మండలికి తాను పరిచయమైనప్పినుండీ చివరి వరకూ సభ్యునిగా కొనసాగడమే గాక, అనేకమంది సభ్యుల్నీ మండలికి పరిచయం చేశారు. 'బైబిలే పలుకుతోంది' గ్రంథాన్ని పునర్ముద్రణకు సత్యాన్వేషణ మండలికి ఉచితంగా హక్కుల్ని ఇచ్చి ఆయన వారసులు కూడా సత్యాన్వేషణ మండలి పట్ల ఆయనకున్న అభిమానాన్ని వారూ చారు. బ్రహ్మంగారు లేని లోటు భర్తీచేసుకోలేనిదైనప్పికినీ, ఆయన ఆలోచనలనుండి స్ఫూర్తిని అందుకోవడమే ఆయనకు మండలి అందించే అసలైన నివాళి.
ఇట్లు
సత్యాన్వేషణ మండలి

ముఖ్య ప్రకటన

1.    జూలై 31, ఆగస్టు 1 తేదీలలో జరిగిన చర్చల కొనసాగింపుగా సెప్టెంబరు 18,19 తేదీలలో రెండో సమావేశం జరుపుకుందామని నిర్ణయించుకున్నాము. ఆ వివరాలివిగో...
సెప్టెంబరు 18 : బైబిలు ఆది కాండము మొత్తం చదువుకు రావాలి. అందులో 1వ అధ్యాయంతో మొదలుప్టిె ఎంపిక చేసుకున్న అంశాల వరకు, అవి శాస్త్రీయ పరీక్షకు నిలబడతాయో లేదో విచారించుదాం అనుకున్నాం. ఈ విషయంపై విశేష పరిశోధన చేసిన మనిష్షే అన్నవారిని పిలుద్దాం అని జగదీష్‌ గారనగా అలాగేనని వారిని సంప్రదించాం, వారూ వస్తానని అంగీకరించారు.1. బైబిలు ఆదికాండములో చెప్పబడ్డ అంశాలు సత్యాలనదగ్గవేనా? శాస్త్రీయ పరిశీలనకు నిలుస్తాయా అన్నది విచారణీయాంశం.
2.    సెప్టెంబరు 19న ఖురాన్‌ ఆధారంగా
 1. ఖురాన్‌ పూర్వ గ్రంథాల విషయంలో ఏ వైఖరి కలిగి ఉంది.
 2. ఖురాన్‌, అవిశ్వాసుల పట్ల ఎలాి వైఖరినవలంభించమని ఆయా సందర్భాలలో చెప్పింది.
 3. అందులో అవిశ్వాసిని వధించు అనే సందేశమూ ఉందా? లేదా?
ఓ   ఖురాన్‌ ప్రకారం విశ్వాసి, అవిశ్వాసి అన్న మాటలకు అర్థమేమి?
యోచనాశీలురైన వివిధ థోరణులకు చెందిన మిత్రులారా! 'వాస్తవాల వెలికితీత' అనిపెట్టుకుందాం ఈ విచారణ వేదికను. అందరం ఆ వేదికకు న్యాయం చేకూర్చేందుకు అవసరమైన రీతిలో మన మన పాత్రలను శక్తివంచన లేకుండా పోషిద్దాం. అందరూ కక్షుణ్ణంగా ఎంపిక చేసుకున్న విషయాల వరకు తయారై రండి. మీరు ఏ పక్షాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉంటుంది వేదికలో.

ఒక ముఖ్య ప్రకటన

2015 జూలై 31, ఆగస్టు 1 తేదీలలో ద్వారకుంటలో ఇస్లాం, క్రైస్తవ, హిందూ, మతేతర ధోరణులనుండి ఒకింత అధ్యయనమూ, అవగాహన కల విజ్ఞులతో కూడిన బృంద చర్చారూపమైన సమావేశం జరిగింది. అందులో 
1. మత ప్రచారాలు, మత మార్పుడులు - మానవ మారణకాండకు దారితీసే ప్రమాదం ఉంది అన్న అంశంపైన.
2. మీ గ్రంథాలలో మీ దేవుడు, మీ ప్రవక్తలు అన్న థోరణి రచనలపైనా చర్చ జరిగింది.
అందులో ఎ) మొది అంశంపై మత మార్పిడులు - మత అసహనానికి, క్రమంగా హింసకూ దారితీస్తాయి. అందుకు ప్రేరణ కలిగించే వాక్యాలు ఆయా మత గ్రంథాలలోనే వున్నాయి. అని ఒక పక్షం - ముఖ్యంగా మేము - సత్యాన్వేషణ మండలి, హిందువుల పక్షం, మతేతరులూ అనగా, ప్రధానంగా అి్ట ఆధారాలు ఖురాన్‌, హదీసులలో ఎక్కడున్నాయో చూపండని ఇస్లాం పక్షంవాళ్ళన్నారు.

చేదునిజాలు / నిష్ఠుర సత్యాలు - (మతస్వేచ్చ)


యోచనాశీలురైన పాఠక మిత్రులారా! చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ, నిస్పాక్షికంగానూ, ఆవేశకావేషాలకు లోనుకాకుండగనూ విచారించాల్సిన 1) సున్నితమైన (2) అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకోబోతున్నాం.
మనం ఇక్కడ ఎంచుకున్న అంశంపై మనందరిలోనూ (1) మన మన ఇష్టాఇష్టాలననుసరించీ, (2) మన మన వివేకస్టాయి, అవగాహనా సామర్ధ్యాలననుసరించీ ఇప్పికే ఏదో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండే అవకాశాలే ఎక్కువ. మనలోని కొందరిలోనైతే ఆ అభిప్రాయాలు చాలా గ్టిగా, మార్చుకోలేనక్కరలేనివిగా దృఢ నిర్ణయ రూపాన్ని సంతరించుకునీ ఉండవచ్చు. అలాి కచ్చితమైన నిర్ణయాలకు చేరిన వారికి, ఈ విషయంపై విచారణే అనవసరమైందిగానూ, పునర్విచారణ రూపాలు, విషయాన్ని- నిజాలను - గందరగోళపరిచేవిగానూ తయారవుతాయన్న దృష్టే ఉంటుంది. ఇలాిం సందర్భాలకు చెంది, అనుభవజ్ఞులు చెప్పిన ఒకి రెండు హితవాక్కులను స్మరించుకుందాం.

సత్యం బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌, నబ్రూయాత్సత్సమప్రియం!
ప్రయంచ నా- నృతం బ్రూయాత్‌! ఏషద్దర్మ స్సనాతనః !!